LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లో విలువల పతనం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ నేతలు అంశాల వారీ విమర్శలు కాకుండా హీరోయిన్లపై అనుచిత,  దిగజారుడు వ్యాఖ్యలూ చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు.   ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ,  వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.   తాజాగా  ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల రాష్ట్ర ప్రజల కలల గురించి ప్రస్తావించగా.. ఎంపి షణ్ముగం షణ్ముగం మాట్లాడుతూ..  నాకు నయనతార కావాలి, నా కలను నెరవేరుస్తారా? అంటూ తీచౌకబారు వ్యాఖ్యలు చేశారు.   బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా  ఒక నటిని ఉద్దేశించి ఇంతటి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే మరో అగ్రనటి   త్రిషపై  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్‌ను విమర్శించే క్రమంలో  ఆయన అసందర్బంగా, అనుచితంగా త్రిష పేరు  ప్రస్తావించారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలంటూ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.  సినిమా రంగంలో తమకంటూ  గుర్తింపును, గౌరవాన్న, అశేష ప్రేక్షకాభిమానాన్నీ సంపాదించుకున్న నటీమణులపై ఇటువంటి అసభ్య, అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థుల వారి విధానాలను ఎండగడుతూ విమర్శలు చేయాలి కానీ,   సంబంధం లేని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం  సరికాదని అంటున్నాయి.  కాగా ఎంపీ  షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్   సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ప్రచార పర్వంలో ఇంకా ఎలాంటి విమర్శలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రముఖంగా ఉండటం తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.  డగ్స్   ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై తెలుగుదేశం  అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ క్రమశిక్షణ , ప్రతిష్ట   భంగం కలిగేలా వ్యవహరిస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రశ్నే లేదని స్పష్ఠం చేశారు. మంగళవారం (మార్చి 17)  రాత్రి తిరుపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ప్రస్తావించారు. గత ఎన్నికలలో   రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  పోరుగు రాష్ట్రంలో ఫామ్ హౌస్ పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? వెళ్లినా అక్కడ డ్రగ్స్ తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడటమేంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.   ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎంపీ పుట్టా మహేష్ కి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిదే.   అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. సాధారణంగా నేతల పట్ల సౌమ్యంగా ఉండే చంద్రబాబు, ఈ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా  తిరపతి నియోజకవర్గ నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో పుట్టా మహేష్ యాదవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తెలుస్తోంది.  డ్రగ్స్ పరీక్షల్లో మహేష్ యాదవ్‌కు పాజిటివ్ రావడంతో  వైసీపీ విమర్శలకు పదును పెట్టింది. ఈ నేపథ్యంలోనే  పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లే వారిని మోయాల్సిన అవసరం లేదని చంద్రబాబు బాహాటంగానే ప్రకటించారని అంటున్నారు.  పార్టీ షోకాజ్ కు మహేష్ ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే.. ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ పై తీసుకునే చర్య  ఇతర యువ నేతలకు ఒక హెచ్చరికలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 
సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, రాష్ట్రాలను ఏలారు. తమిళనాడులో ఎంజీఆర్, తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లో తమదైన ముద్ర వేశారు. వారి బాటలోనే తమిళ, తెలుగు హీరోయిన్లు పొలిటికల్ స్క్రీన్‌పై   మెరిసారు. ఎంజీఆర్ సన్నిహితురాలు జయలలిత ఆయన తదనంతరం ఏఐడీఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎం పీఠం అధిరోహించి చక్రం తిప్పారు.  తాజాగా  స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారన్న ప్రచారం జోరందుకుంటోంది.  జయలలిత, ఎం.జే.ఆర్ తరహాలో తమిళనాట రాజకీయాల్లో రాణించాలని త్రిష చూస్తున్నారని తెలుస్తోంది.  తెలుగు, తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నది. ఇక ఇప్పుడు త్రిష రాజకీయ ప్రవేశం వెనక టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ ఉన్నారంటున్నారు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని  ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి.  ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు  టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.  త్రిష కారణంగానే వారి పెళ్లి పెటాకులవ్వబోతోందన్నది ఓపెన్ సీక్రెట్టే.  విషయం ఓపెన్ అయి పోవడంతో..  నిండా మునిగాక చలేముందిలే అన్నట్లుగా విజయ్ కూడా చాలా ఓపెన్ అయ్యాడు. భార్య బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదని ప్రజలకు స్పష్టం చేయడానికా అన్నట్లు... ఇటీవల ఓ పెళ్లి వేడుకకు త్రిషతో కలిసి హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతో త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ పై వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది.   హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది.  సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో  చెన్నై పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది.  చెన్నై నార్త్, సెంట్రల్, సౌత్ అసెంబ్లీ స్థానాల నుండి పలువురు నటీనటులు విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఎంజీఆర్,  తర్వాత జయలలిత,   మరో మాజీ సీఎం కరుణానిధి చెన్నై నగరం నుంచే గెలిచారు  ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలోనే అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయించాలని భావిస్తున్నారని తమిళ పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ ఇవ్వని త్రిష, రానున్న ఎన్నికల్లో చెన్నైలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఏదిఏమైనా తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందని వార్తలొస్తున్నాయి. ఇటీవల అమిత్ షాతోనూ త్రిష భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏఐడీఎంకే నేతలూ త్రిష‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళ రాజకీయాల్లో సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి త్రిష తమిళనాడు రాజకీయాల్లో మరో జయలలిత అనిపిం చుకుం టారో? లేకపోతే శశికళలా మిగిలిపోతారో చూడాలి.
హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్  రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ   షోకాజ్ నోటీసు జారీ చేసింది.   పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని  పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.   ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.   పార్టీ ప్రధాన కార్యదర్శి  సోమ భరత్ కుమార్ సంతకంతో.... బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ చేసిన  ఈ నోటీసులో వారం రోజులలో పైలట్ రోహిత్ రెడ్డి తనపై  వచ్చిన డ్రగ్స్ ఆరోపణ లపై పూర్తి వివరాలతో కూడిన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.  అలాగే, ఈ విషయంలో పార్టీ  తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు,  అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు.  బీఆర్ఎస్ బాధ్యతా యుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు,  నైతిక విలువలను  పాటిస్తుందని, మాదకద్రవ్యాల వినియోగం వంటి అక్రమ కార్యకలాపా లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ షోకాజ్ నోటీసు పేర్కొంది.   పైలట్ రోహిత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా భావించి కఠిన వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, నోటీసులో పేర్కొన్న గడువులోపు సంతృప్తికర మైన వివరణ ఇవ్వకపోతే..  ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుం టామని కూడా పైలట్ రోహిత్ రెడ్డిని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి తనకు అందిన షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ, ఆ పై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఆయన   పిటిషన్ దాఖలు చేశారు.  ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద  విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.   ఇంతకు ముందే  కేజ్రీవాల్ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను విచారణను వేరే బెంచ్ కు మార్చాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వినతిని తోసిపుచ్చారు. రోస్టర్ నిబంధనల ప్రకారం కేసు కేటాయింపు జరిగిందనీ, విచారణ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది   న్యాయమూర్తి విచక్షణకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే తిరస్కరణను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపై విచారణ జరపాలంటూ గతంలో ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని కూడా కేజ్రీవాల్ తన పిటిషన్‌లో సవాల్ చేశారు.   
ALSO ON TELUGUONE N E W S
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం సినిమా థియేటర్ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు పాత ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఏషియన్ కోనార్క్ మినహా అన్ని థియేటర్లలో పార్కింగ్ ఫీజు తెలంగాణలోని సినీ ప్రియులకు హైకోర్టు షాకింగ్ న్యూస్ చెప్పింది. సింగిల్ స్క్రీన్స్/ స్టాండ్ అలోన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదంటూ ఉన్న నిబంధనపై తాజాగా ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో థియేటర్ యజమానుల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి వాదనలను వినిపించారు. థియేటర్లను ప్రభావితం చేసే ఈ ఆదేశాన్ని, థియేటర్ యజమానుల వాదనలు వినకుండా జారీ చేశారని వారు కోర్టుకు తెలిపారు. దీనివల్ల థియేటర్ల నిర్వహణ భారమవుతుందని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు, ఈ వివాదంలో ఒక కీలకమైన సాంకేతిక అంశాన్ని లేవనెత్తింది. అసలు పిటిషనర్ ఒక నిర్దిష్ట థియేటర్ (ఏషియన్ కోనార్క్) లో వసూలు చేస్తున్న ఫీజుపై మాత్రమే కేసు వేశారని, కానీ ఆ ఉత్తర్వును రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తింపజేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ ఆదేశం కూడా ఆ ఒక్క థియేటర్‌కే పరిమితం కావాలని పేర్కొంది. ప్రస్తుత తీర్పు ప్రకారం, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న ఏషియన్ కోనార్క్ థియేటర్ మినహా, తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఇది థియేటర్ యజమానులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ, సామాన్య ప్రేక్షకులకు మాత్రం అదనపు భారంగా మారనుంది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే టికెట్ ధరలు, క్యాంటీన్ రేట్లు పెరిగిపోయాయని, ఇప్పుడు మళ్లీ పార్కింగ్ ఫీజు కూడా తోడైతే సామాన్యుడు థియేటర్‌కు రావడం కష్టమని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మరోవైపు థియేటర్ యజమానులు మాత్రం నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇది తప్పనిసరి అని వాదిస్తున్నారు.
హరికృష్ణతో కలిసి సిగరెట్ తాగుతూ ఎన్టీఆర్‌కు దొరికిపోయిన చిట్టిబాబు! హరికృష్ణ అంటే ఎన్టీఆర్ తండ్రికి ఎందుకు అంత ప్రాణం?  చిట్టిబాబు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు! నందమూరి తారకరామారావు క్రమశిక్షణకు మారుపేరు. తన లాగే తన చుట్టూ ఉన్న వారు కూడా క్రమశిక్షణతో ఉండాలి అనుకుంటారు. తాజాగా సీనియర్ నటుడు చిట్టిబాబు(Chitti Babu) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హరికృష్ణతో కలిసి చేసిన అల్లరి, ఎన్టీఆర్ కి దొరికిపోయిన సందర్భాలను ఆయన మనసు విప్పి మాట్లాడారు. షూటింగ్ సమయంలో హరికృష్ణ, చిట్టిబాబు మంచి స్నేహితులు. ఒకసారి 'బ్రహ్మంగారి చరిత్ర' షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు వెనుక సిగరెట్ తాగుతున్నారట. అయితే, అటుగా వచ్చిన ఎన్టీఆర్ చెట్టు వెనుక నుంచి పొగ రావడం చూసి, "ఏమిటి ఆ చెట్టు పక్కన పొగ వస్తోంది.. ఏదో అంటుకున్నట్లుంది చూడండి" అని గట్టిగా అరిచారట. ఆ గంభీరమైన స్వరం వినగానే హరికృష్ణ తో సహా చిట్టిబాబు భయంతో సిగరెట్ పారేసి అక్కడి నుంచి పరుగులు తీశారట. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ చిట్టిబాబు నవ్వుకున్నారు. కేవలం సరదా ముచ్చట్లే కాదు, ఎన్టీఆర్ కి తన కొడుకుల పట్ల ఉన్న డెడికేషన్ గురించి కూడా చిట్టిబాబు ఆసక్తికర విషయాలు చెప్పారు. హరికృష్ణకి డ్రైవింగ్ అంటే ప్రాణం అని, ఎంతటి క్లిష్టమైన కొండ ప్రాంతాల్లోనైనా జీపును అవలీలగా తోలేవారని కొనియాడారు. డ్రైవర్లు ఎక్కించలేని కొండ మీదకు కూడా హరికృష్ణ జీపును అని తీసుకువెళ్లేవారని, అది చూసి ఎన్టీఆర్ కూడా మురిసిపోయేవారని తెలిపారు. ఎన్టీఆర్ గారి తండ్రికి (హరికృష్ణ తాతగారికి) కూడా మనవళ్లందరిలోకి హరికృష్ణ అంటేనే అమితమైన ప్రాణమని చిట్టిబాబు వెల్లడించారు. షూటింగ్ సెట్‌కి వచ్చినప్పుడు బాలకృష్ణ కంటే హరికృష్ణకే ఎక్కువ ఫైట్ సీన్లు ఇవ్వమని డైరెక్టర్‌తో సరదాగా అనేవారట. నందమూరి కుటుంబంలో ఉన్న అనుబంధాలు, వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలను చిట్టిబాబు ఈ ఇంటర్వ్యూలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. అలాగే బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. 'బ్రహ్మంగారి చరిత్ర' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను వివరించారు. ఒక సీన్ కోసం బాలయ్య చెప్పులు లేకుండా ముళ్ళ పొదల్లో పరిగెత్తాల్సి వచ్చిందట. ఆ సమయంలో కాలికి ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నా, ఎన్టీఆర్ మాత్రం "ఏం బాలా.. రెడీనా?" అని అడిగారట. తండ్రి క్రమశిక్షణకు తలవంచి బాలయ్య అలాగే రక్తసిక్తమైన పాదాలతో షూటింగ్ పూర్తి చేశారని, ఆ తర్వాతే ఎన్టీఆర్ ప్యాకప్ చెప్పి కొడుకును హాస్పిటల్ కి తీసుకెళ్లారని చిట్టిబాబు చెప్పారు. చిట్టిబాబు చేసిన ఈ వైరల్ కామెంట్స్ చూస్తుంటే, అప్పట్లో షూటింగ్ సెట్స్ ఎంత సందడిగా ఉండేవో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట హల్చల్ చేస్తోంది. నందమూరి అభిమానులు ఈ పాత జ్ఞాపకాలను చూసి మురిసిపోతున్నారు.  చిట్టిబాబు పూర్తి ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినిమా అప్డేట్స్ కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.  
తెలుగులోకి ఇంటర్నేషనల్ రియాలిటీ షో 'ది ట్రెయిటర్స్'  సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తెలుగు వెర్షన్! టాలీవుడ్ టాప్ హీరోతో అమెజాన్ ప్రైమ్ భారీ స్కెచ్! తెలుగులో సరికొత్త రియాలిటీ షో రాబోతుంది. ఇప్పటివరకు మనం చూసిన రియాలిటీ షోలకు భిన్నంగా, అత్యంత ఉత్కంఠభరితమైన అంతర్జాతీయ షో "ది ట్రెయిటర్స్" (The Traitors) తెలుగులో అడుగుపెట్టబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ షోను ఒక టాలీవుడ్ టాప్ స్టార్ హీరో హోస్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'ది ట్రెయిటర్స్' అనేది నెదర్లాండ్స్‌లో పుట్టిన ఒక మైండ్ గేమ్ రియాలిటీ షో. ఇందులో సుమారు 20 మంది సెలబ్రిటీలు ఒక కోటలో నివసిస్తారు. వారిలో కొందరిని హోస్ట్ రహస్యంగా 'ట్రెయిటర్స్' (నమ్మక ద్రోహులు)గా ఎంపిక చేస్తారు. మిగిలిన వారు 'ఫెయిత్ ఫుల్స్' (నమ్మకస్తులు). ప్రతి రాత్రి ట్రెయిటర్స్ ఒకరిని 'మర్డర్' చేస్తారు, అంటే షో నుండి పంపించేస్తారు. పగలు అందరూ కలిసి చర్చించి ఎవరైతే ట్రెయిటర్ అనుకుంటారో వారిని ఓటింగ్ ద్వారా బయటకు పంపిస్తారు. ఈ షోలో నమ్మకం, వెన్నుపోటు, మైండ్ గేమ్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇప్పటికే యూకే, యూఎస్ వంటి దేశాల్లో ఇది సూపర్ హిట్ అయ్యింది. ఇండియాలోనూ అడుగుపెట్టింది. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు తెలుగు వెర్షన్‌ కోసం అమెజాన్ ప్రైమ్ ఒక స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ స్టార్ హీరో హోస్టింగ్ చేస్తే షో రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. బిగ్ బాస్ వంటి షోల కంటే ఇది మరింత పకడ్బందీగా, విభిన్నంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి, భారీ బడ్జెట్‌తో ఈ షోను నిర్మించబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలను కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  ఈ షోపై సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ ఎవరైనా ఈ షోను హోస్ట్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  మరి ఈ గ్రాండ్ రియాలిటీ షోకు హోస్ట్ ఎవరు అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉంది. 
Jio Studios and B62 Studios’ much-anticipated film about the unknown men, Dhurandhar The Revenge, releases into cinemas tomorrow, 19th March, with paid previews kicking off today and igniting a storm with early screenings! Ahead of the film’s massive release, director Aditya Dhar has earnestly requested the audience not to share spoilers after watching the high-stakes spy action thriller. Recalling the storm that Dhurandhar was, and one that’s about to unleash tomorrow, Aditya Dhar wrote in his latest social media post, “We've put our hearts into Dhurandhar The Revenge so you can experience every twist, every emotion, exactly the way it's meant to be felt. In a theatre, in the dark, surrounded by friends, family, and even strangers, everyone feeling the same emotions,” he wrote. “That's how films should be experienced. Not on someone's phone in blurry image. Hence, here is my one, heartfelt, earnest request...PLEASE DON'T SHARE SPOILERS! Let every single fan walk in clueless but curious and walk our with their own deeply personal version of what they felt,” he added. What adds to the sky-high curiosity is Aditya Dhar’s caption that certainly states You’re still NOT READY FOR THIS!  “Oh, and one more thing. Don’t leave your seats until the credits have stopped rolling 😉” https://www.instagram.com/p/DWBAY5xkcbO/
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం భారీ బడ్జెట్  విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్న మేకర్స్ రోజుకు కోటి నుండి కోటిన్నర వరకు ఖర్చు టికెట్ ధరల పెంపు లేకపోతే ఎలా? జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్'(Dragon) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా మేకింగ్, బడ్జెట్ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడటం లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ ఉగాది కానుకగా రేపు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యెర్నేని టికెట్ ధరల పెంపు అంశంపై మాట్లాడుతూ 'డ్రాగన్' మూవీ అప్డేట్ ఇచ్చారు. విజువల్స్ విషయంలో 'డ్రాగన్' ఒక అద్భుతంలా ఉండబోతోందని నవీన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతిరోజూ దాదాపు కోటి నుండి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ప్రశాంత్ నీల్ విజన్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. టికెట్ ధరల విషయంలో కూడా నవీన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఫ్లెక్సిబుల్ రేట్లు అందుబాటులో ఉన్నాయని, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అమలు కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాంబే, ఢిల్లీ వంటి నగరాల్లో సినిమాను బట్టి టికెట్ ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఉందని గుర్తు చేశారు. సంవత్సరానికి వచ్చే ఐదారు భారీ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు అవసరమని, చిన్న సినిమాలకు రేట్లు పెంచాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. వారణాసి, పెద్ది, అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ, ఫౌజీ మరియు ఎన్టీఆర్ డ్రాగన్ వంటి భారీ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు, ఆ మేరకు రిటర్న్స్ రావాలంటే టికెట్ రేట్లలో మార్పులు ఉండాలని కోరారు. త్వరలోనే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించనున్నట్లు నవీన్ తెలిపారు. టికెట్ ధరలపై ఒక శాశ్వత పరిష్కారం వస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వెసులుబాటు కల్పిస్తే ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.  
- ఆ విష‌యంలో నాకు బాధ‌లేదు - నేను ప్రెస్టీజియ‌స్‌గా తీసుకున్న సినిమా ఇది - ఆ నిర్ణ‌యం రెండేళ్ల క్రిత‌మే తీసుకున్నాను టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న శ్రీలీల, తన కెరీర్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి మనసు విప్పి మాట్లాడింది. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌తోనే ప్రయాణం చేస్తున్నాననీ, ఈ క్రమంలో కొన్ని పెద్ద సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం నేను రెండేళ్ల క్రితమే కమిట్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ చేసే క్రమంలో కొన్ని ఇతర అవకాశాలను వదులుకున్నాను. కానీ దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు" అని శ్రీలీల స్పష్టం చేసింది.  పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరైనా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారని, అలాగే తాను కూడా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని ఆమె తెలిపింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కిందని ఆమె చెప్పింది. శ్రీలీల చేసిన ఈ వైరల్ అవుతున్న వ్యాఖ్యలు విన్న అభిమానులు, ఆమె డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.  ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి, కేవలం ఒకే ప్రాజెక్ట్ కోసం ఇతర ఆఫర్లను వదులుకోవడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై శ్రీలీల పెట్టుకున్న నమ్మకం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ఆమె పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). 'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉగాది కానుకగా రేపు(మార్చి 19) థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్(Harish Shankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  'ఉస్తాద్' లాంటి సినిమా వచ్చిన చాలా కాలమైంది అన్ని కమర్షియల్ హంగులతో నిండిన 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమా వచ్చి చాలా కాలమైందని హరీష్ శంకర్ అభిప్రాయపడ్డారు. చాలా కాలం తర్వాత ఒక బిగ్ స్టార్ నుంచి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ రాబోతోందని పేర్కొన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా, సామాన్య ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ పీక్ స్టేజ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. సినిమా నిడివి  ఎడిటింగ్ వర్క్ చాలా తక్కువగా ఉండేలా పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశామని హరీష్ చెప్పారు. ఫస్ట్ హాఫ్ సుమారు 1 గంట 12 నిమిషాలు, అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే కాంపాక్ట్‌గా ఉంటుందని వివరించారు. సినిమా మొత్తం రెండున్నర గంటల లోపే ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలనిపించేలా స్క్రీన్ ప్లే సెట్ చేసినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్  పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ తో బిజీ ఉన్నప్పటికీ, ఆయన షూటింగ్‌కు అద్భుతమైన సహకారాన్ని అందించారని హరీష్ కొనియాడారు. సమయపాలన విషయంలో పవన్ చాలా కచ్చితంగా ఉండేవారని, దానివల్ల షూటింగ్ వేగంగా పూర్తయ్యిందని చెప్పారు. 7 గంటలకు షూటింగ్ అంటే అంతకంటే ముందే సిద్ధంగా ఉండేవారు. ఆయన ఇచ్చిన సహకారం వల్లే సినిమాను ఎక్కడా వేస్టేజ్ లేకుండా, చాలా ప్లాన్డ్ గా పూర్తి చేయగలిగామన్నారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం అదృష్టం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా, తాను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారని ప్రశంసించారు. మా నిర్మాతల మద్దతు వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇలాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్ళు మరిన్ని సినిమాలు తీస్తూ, పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి అన్నారు. బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2' తో పోటీ ఆదిత్య ధర్ చాలా సమర్థుడైన డైరెక్టర్ అని, అయితే వారి జోనర్ వేరు, మన జోనర్ వేరని అన్నారు. ఉగాది నుండి 'ఉస్తాద్' హవా మొదలవుతుందని, ఇది కేవలం సినిమా రిలీజ్ మాత్రమే కాదు, ఒక సెలబ్రేషన్ అని ఆయన వ్యాఖ్యానించారు. రికార్డులు, కలెక్షన్ల నంబర్ గేమ్ గురించి పక్కన పెడితే, థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు "చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చూశాం" అనే తృప్తితో బయటకు వస్తారని హరీష్ శంకర్ బల్లగుద్ది చెప్తున్నారు. మొత్తానికి హరీష్ శంకర్ మాటలు వింటుంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' తో బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.   
  ఇటీవ‌లి కాలంలో సినిమాల‌కు సంబంధించి జ‌రిగే ఈవెంట్స్‌లో ర‌క‌ర‌కాల వివాదాలు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు సెల‌బ్రిటీల నుంచి వింటున్నాం. వారికి సంబంధించి ఏ చిన్న క్లిప్పింగ్ బ‌య‌టికి వ‌చ్చినా అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఈవెంట్‌లో శ్రీ‌లీల‌, న‌టుడు మ‌హేష్‌కి సంబంధించిన ఒక వీడియో వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి మీడియా నుంచి ఎదురైన ప్ర‌శ్న‌కు శ్రీ‌లీల వివ‌ర‌ణ ఇచ్చారు.  నేను ఈవెంట్‌లో ఉన్న‌ప్పుడు వెన‌క నుంచి ఏదో సౌండ్ వినిపించింది. అందుకే వెన‌క్కి తిరిగి చూశాను. నా ఫోన్ మ‌హేష్‌గారి ద‌గ్గ‌ర ఉంది. నేను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఆయన నా ఫోన్ పట్టుకుని నాకు హెల్ప్ చేశారు. నేను కేవలం నా ఫోన్ కోసమే వెనక్కి తిరిగాను తప్ప, ఆయనను వేరే ఉద్దేశంతో చూడలేదు. సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న క్లిప్పింగ్స్‌ను చూసి ఎవరినీ తప్పుగా అంచనా వేయకండి. అక్కడ ఏదో సీరియస్ స్పీచ్ జరుగుతుండటంతో నేను కూడా చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉన్నాను. నా గురించి వచ్చే 'అహంకారం', 'మిస్ బిహేవియర్' అనే పెద్ద పెద్ద మాటలు విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా అందరి ముందు ధైర్యంగా చెప్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలు అప్పుడప్పుడు అపార్థాలకు దారితీస్తాయి. మేము స్వయంగా నోటితో చెప్పే వరకు దేన్నీ నమ్మకండి అంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క్ల‌ప్పింగ్ గురించి క్లారిటీ ఇచ్చారు శ్రీ‌లీల‌.
    -అభిమానులకి షాక్ ఇచ్చిన ధురంధర్ 2  -ఎందుకు ఇలా చేసారు -మరి ఎప్పుడు  ధురంధర్ 2(Dhurandhar 2)తెలుగు లాంగ్వేజ్ రిలీజ్  కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారంటే తెలుగులో తమ అభిమాన హీరో సినిమా కోసం అయితే ఎంతగా ఎదురుచూస్తారో అంతగా. పైగా రెగ్యులర్ సినీ ధరలకే మూడుగంటల నలభై తొమ్మిది నిమిషాల ఆరు సెకన్ల నిడివి కావడంతో ధురంధర్ 2 తో ఉగాది ముందే వచ్చిందనే ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనందం ఆవిరయ్యే న్యూస్ వాళ్ళని పలకరించింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ధురంధర్ తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ వాయిదా పడింది. సదరు వాయిదాకి టెక్నీకల్ ఇష్యు కారణమని టీం ప్రకటించింది. ఈ న్యూస్ ధురంధర్ 2 ని తెలుగులోనే చూడాలని కోరుకున్న వారికి షాక్ . టికెట్స్ బుక్ చేసిన వారికి అమౌంట్ రిఫండ్ చేశామని చెప్తున్నా  ఇంకా చాలా మందికి బుక్ మై షో యాప్ లాంటి వాటి నుంచి అమౌంట్ రావాల్సి ఉంది.  హిందీ లాంగ్వేజ్ లో మాత్రం యధావిధిగా షోస్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల  నుంచి పడనున్నాయి.     Also read: UStaad Bhagath singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ రివ్యూ!. దేఖ్ లేంగే సాలా... చూసినాము చాలా ధురంధర్ తెలుగు అభిమానులు, మూవీ లవర్స్ అయితే టెక్నీకల్ ఇష్యుకి కారణమైన వాళ్ళని తిట్టుకుంటున్నారు. ఎవరి బాధ వాళ్ళది మరి   
    - పవన్ కళ్యాణ్ మాస్ డైలాగ్‌తో శ్రీలీల కొత్త స్టైల్ - ‘ఇచ్చిపడేసే గోత్రం..’ శ్రీలీల కోటుపై పవర్ స్టార్ క్రేజీ డైలాగ్! - ఉస్తాద్ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన టీమ్.. శ్రీలీల నయా లుక్ కేక! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సిద్ధమైంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం హీరోయిన్ శ్రీలీల ఎంచుకున్న సరికొత్త స్టైల్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో శ్రీలీల ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన ఒక ప్రత్యేకమైన బ్లాక్ కోటు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ కోటుపై ఈ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ముద్రించి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చెప్పిన "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం" అనే పవర్‌ఫుల్ డైలాగ్ ఈ కోటు వెనుక భాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ మేనరిజం, ఆ డైలాగ్ డెలివరీకి ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అవ్వగా, ఇప్పుడు శ్రీలీల ఆ డైలాగ్‌ను తన దుస్తులపై ధరించి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. తనదైన స్టైల్‌తో సినిమాను ప్రమోట్ చేస్తున్న శ్రీలీల ఐడియాకు నెటిజన్లు మార్కులు వేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, నటనతో ప్రేక్షకులను అలరించనుంది. ఈమెతో పాటు మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నా కూడా నటిస్తోంది. అయితే రాశీ ఖన్నాకు, శ్రీలీలకు మధ్య ఈ సినిమాలో కాంబినేషన్ సీన్లు ఉండవని ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో వెల్లడైంది. అయినప్పటికీ వీరిద్దరూ తమ పాత్రలతో సినిమాకు గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ, ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఆమె మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో శ్రీలీల లేటెస్ట్ ఫోటోలపై పవన్ అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. "అచ్చం భగత్ సింగ్ స్టైల్‌లోనే ఉంది" అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఉగాది పండుగ ముందే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ సినిమాతో అసలైన పూనకాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.  ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది. తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది. తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.                                          *రూపశ్రీ.
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.   
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...