LATEST NEWS
  వేములవాడ దేవాలయంలో కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్‌కి  కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి.మేం కాపాడుకుంటాం.. అంటూ హారీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.  రోజూ కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదంటూ ఫఐర్ అయ్యారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 18 వేల రూపాయలు రైతులకు బకాయి పడిందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తాని సీఎం రేవంత్ హామీ అయిందని హరీష్ రావు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి తెచ్చిన 3000 కోట్లను బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని తెలిపారు.ఆర్‌ఆర్‌ఆర్  భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్  ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
  ఐపీఎల్-2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ హోం సిటీ బెంగళూరులో అడుగుపెట్టింది. వేలాది మంది అభిమానులు నడుమ ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో ర్యాలీగా వచ్చి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముండటంతో పరేడ్‌ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఓపెన్‌ బస్‌ పరేడ్ రద్దయింది. అయితే, సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంట్రీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ విజేతగా  నిలిచిన విషయం తెలిసిందే.నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ మైదానంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే.. ఈ విజయాన్ని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. బెంగళూరులో విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జట్టు బెంగళూరు నగరానికి చేరుకుంది.
వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, ఆయన జైలు ములాఖత్ లు జగన్ అరెస్టైతే పార్టీ పగ్గాలు చేపట్టేది తానేనని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉందని వైసీపీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ సాగుతోంది.  తొలి నుంచీ కూడా ఒక వేళ జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి భారతి చేపడతారన్న భావన పార్టీ వర్గాల్లో కనిపించేది. అయితే భారతి పెద్దగా జనంలోకి రాకపోవడం, వైసీపీ నేతల అరెస్టులపై ఆమె ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారని అవగతమౌతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల పేరు తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే సజ్జల ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో ఒకింత చురుకుగా, చొరవగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలకు సంబంధించిన బాధ్యతలు సజ్జలే చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో తరచుగా ఆయన జైలు ములాఖత్ లు జరుపుతున్నారు. గతంలో ఈ పని జగన్ చేసేవారు. అయితే కారణాలేమైతేనేం.. జగన్ జైలు పరామర్శలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆయన స్థానంలో ఆ పని సజ్జల చేస్తున్నారు. ఇటీవలే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గుంటూరు జైల్లో సజ్జల కలిసి పరామర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా నందిగం సురేష్ అరాచకాలు, దౌర్జన్యాలూ ఓ రేంజ్ లో ఉండేవి.  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడిలో పాల్గొన్న వారిలో అత్యధికులు నందిగం అనుచరవర్గమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు.. నందిగం సురేష్ పై పలు కేసులు కూడా ఉన్నాయి.  ఈ క్రమంలోనే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నందిగం సురేష్ పై ఉన్న కేసుల బూజు దులిపింది. దీంతో ఆయన అరెస్టయ్యారు. ఆ తరువాత బెయిలు వచ్చింది. కానీ మరో  కేసులో ఆయన ఇటీవల మళ్లీ అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో   గుంటూరు జైల్లో ఉన్న  నందిగం సురేష్ తో సజ్జల సోమవారం (జూన్ 2)న. సజ్జల ములాఖత్ అయ్యారు.  నందిగం సురేష్ బాగోగులు, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన సజ్జల ఆయనకు ధైర్యం చెప్పారు,  దీంతో ఇప్పుడు సజ్జల జైల్లో ములాఖత్ లకు సంకేతమేంటన్న చర్చ పార్టీలో ప్రారంభమైంది. గతంలో చలా మంది వైసీపీయులు అరెస్టైనా జైలుకెళ్లి వారితో ములాఖత్ కాని సజ్జల ఇటీవలి కాలంలో వరుసగా జైలు పర్యటనలు చేయడం వెనుక గట్టి వ్యూహమే ఉందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు,   నందిగం కంటే ముందు సజ్జల విజయవాడ సబ్ జైలులో  మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న   సీఎంఓ మాజీ   కార్యదర్శి   ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ  కృష్ణమోహన్ రెడ్డిలను సజ్జల నేరుగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ కలిశారు.  ఆ తరువాత   నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డినీ కలిశారు. ఇప్పుడు తాజాగా నందిగం సురేష్ తో గుంటూరు జైలులో ములాఖత్ అయ్యారు. దీంతో ఒక వేళ జగన్ జైలుకు వెడితే ఆయన ఆబ్సెన్స్ లో సజ్జలే పార్టీని నడిపిస్తారన్న సంకేతాలను ఆయన తన ములాఖత్ భేటీల ద్వారా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో  పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణలో అమెరికా జోక్యం తదితర అంశలపై కేంద్రాన్ని విపక్షాలు ప్రశ్నించనున్నాయి.'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా లోక్ సభ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.    
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ముగింపు.. తెలుగుదేశం పాలనకు ఆరంభం జరిగి బుధవారం (జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింద. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీలు ఏడాది పాలన సంబరాలకు సమాయత్తమయ్యాయి. ఈ రెండు కార్యక్రమాలలో ఒక కార్యక్రమం వెలవెల బోతే.. రెండోది కళకళలాడింది. అవును జగన్ పార్టీ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలవెలబోయాయి. అదే సమయంలో కూటమి పార్టీల ఏడాది పాలన సంబరాలు కళకళలాడాయి. కూటమి సంబరాలలో వైసీపీ నిరసనలు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమిలోని మూడు పార్టీల కీలక నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.    జూన్ 4 ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు స్ఫూర్తిదాయకంగా ఉంది.  ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజుగా ఆయన ఆ పోస్టులో జూన్ 4ను అభివర్ణించారు.  అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన చారిత్రాత్మకమైన రోజన్నారు.  సైకో పాలనకు ప్రజా చైతన్యం అంతం పలికిన రోజనా, రాష్ట్రంలో  ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజంటూ చంద్రబాబు పేర్కోన్నారు. సమస్యల పరిష్కారం కోసం జనం ఉద్యమించడం చూశాం.. అయితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, రాక్షస పాలనను అంతం చేయడం కోసం ఓటు వేయడానికి ఉద్యమంగా కదిలిన జనాలను చూడటం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.   ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కు సరిగ్గా ఏడాది కిందట ఈ రోజు జనం నాంది పలికారన్నారు.   ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అయితే ప్రజా తీర్పునకు ఏడాది అంటూ ఆరంభించి ప్రజా చైతన్యానికి కూడా ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకూ ఏడాది అని, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది అని ఉద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో సాధించిన  విజయానికి  డాది అని పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచకపాలనను తరిమికొట్టి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన ప్రజల పరిణితి చరిత్రలో నిలిచిపోయిన రోజని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.   అటు కేంద్రం లోని నరేంంద్ర మోదీ సర్కారు విజయాలను గుర్తు చేస్తూనే…మోదీ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
అల్లు అర్జున్,(Allu arjun)మంచు మనోజ్(Manchu Manoj),అనుష్క(Anushka)ముఖ్య పాత్రల్లో క్రిష్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'వేదం'(Vedam). 2010 జూన్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించగా, మంచి విజయాన్ని నమోదు చేసింది. నటుడుగా అల్లుఅర్జున్ కెరీర్ ని ఒక మలుపు తిప్పి ఒక కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసింది. నేటితో ఈ మూవీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్(X)వేదికగా వేదం షూటింగ్ అప్పటి ఫోటోలని షేర్ చేస్తూ 'వేదం నా కెరీర్  లో ఒక విభిన్నమైన చిత్రం. ఎంతో నిజాయితితో తెరకెక్కించిన క్రిష్(Krish)కి నా కృతజ్ఞతలు. అనుష్క, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పేయి లాంటి నటులతో పని చెయ్యడం నాకు ఎంతో ప్రత్యేకం. సినిమాని నిర్మించిన నిర్మాతలతో పాటు సంగీతాన్ని అందించిన కీరవాణి(Keeravani)కి నా హృదయ పూర్వక అభినందనలు. ఈ సినిమాని ఆదరించి, ఎప్పటికి నిలిచిపోయే చిత్రంగా మలిచిన అభిమానులకి నా కృతజ్ఞతలని ట్వీట్ చేసాడు.   విభిన్న పద్ధతులని, జీవన శైలిని కొనసాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రవాదుల నుంచి ప్రజలని కాపాడుకోవడానికి  తమ ప్రాణాలని తృణప్రాయంగా త్యాగం చేసే క్యారక్టర్ లలో అల్లు అర్జున్, మంచు మనోజ్ ఒదిగిపోయి నటించారు. మంచి మనసున్న, నిజాయితీతో కూడుకున్న వేశ్య క్యారక్టర్ లో అనుష్క జీవించిందని చెప్పవచ్చు.        
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hari Hara veeramallu)ఈ నెల 12 న విడుదల కాబోతున్న నేపథ్యంలో  ప్రమోషన్స్ కూడా మొదలైన విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున జరపడానికి ప్లాన్ చేసారు. దీంతో పవన్ స్పీచ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కానీ  వీరమల్లు  పన్నెండవ తారీకు నుంచి కూడా వాయిదా పడనుందనే వార్తలు  సోషల్ మీడియా వేదికగా గత  రెండు రోజుల నుంచి  వినిపిస్తున్నాయి. వీరమల్లు ని నిర్మించిన ఏఏం రత్నం కి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయని, అందుకే  వీరమల్లు  వాయిదా పడనుందని అంటున్నారు. రీసెంట్ గా  పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వీరమల్లు కోసం తాను తీసుకున్న 11 కోట్ల రూపాయిల అడ్వాన్స్ ని ఏ ఎం రత్నం కి వెనక్కి ఇచ్చాడని, ఆ డబ్బుతో  రిలీజ్  కి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోమని చెప్పినట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇక వీరమల్లు లో నిధి అగర్వాల్, బాబీ డియోల్, జిష్ణు సేన్ గుప్తా, అనసూయ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కీరవాణి సంగీత సారధ్యంలో క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.    
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్వరలో 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ తర్వాత 'ఓజీ' లైన్ లో ఉంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. ఇలాంటి సమయంలో షూటింగ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఆసక్తికరంగా మారింది.   'ఓజీ' షూటింగ్ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. నిన్నటితో ముంబై షెడ్యూలు పూర్తయింది. రేపటి నుంచి విజయవాడ షెడ్యూలు మొదలు కానుంది. తాడేపల్లిలో 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూలులో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ తో మొత్తం షూట్ పూర్తి అవుతుందని సమాచారం.   నిజానికి 'ఓజీ' షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని అందరూ భావించారు. కానీ, పది రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తి కానుందన్న వార్త ఆశ్చర్యం కలిగించేదే. ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  
మంచు విష్ణు(Vishnu), మోహన్ బాబు(Mohanbabu)ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప'(Kannappa). 'పరమేశ్వరుడి' పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. 24ఫ్రేమ్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్ పై  విష్ణు,మోహన్ బాబు లే నిర్మిస్తుండగా జూన్ 27 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన కన్నప్ప కి సంబంధించిన 'హార్డ్ డిస్క్' ని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలో పని చేసే రఘు, చరిత అనే ఇద్దరు తీసుకొని పారిపోయారు. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదయ్యింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతు 'ముంబైలో ఉన్న నాలుగు విఎఫ్ఎక్స్ కంపెనీలు కన్నప్ప కోసం పని చేస్తున్నాయి. వాటిల్లో ఒక కంపెనీ  ఆన్ లైన్ లో కొంత భాగాన్ని పంపింది. క్లారిటీ లేకపోవడంతో  రెండో సారి అప్ లోడ్ చేసి, ముందు జాగ్రత్త కోసం ఒక హార్డ్ డిస్క్ ని పంపింది. నాన్నగారి ముగ్గురి పిల్లలకి సంబంధించి ఎలాంటి పార్సిల్ వచ్చినా కూడా, ఇప్పుడు వెళ్లిన అడ్రస్స్ కే వెళ్తుంది. మేనేజర్లు ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి  అందచేస్తారు. కన్నప్ప పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే అమ్మాయికి  వ్వమని చెప్పాడంట. ఆ తర్వాత ఆమె తో పాటు ఇద్దరు కనపడకుండా వెళ్లిపోయారు. మాకు తెలిసిన నిజం ఏంటంటే ఆ ఇద్దరు మనోజ్ తో ఉంటారు. ఇప్పటికి హార్డ్ డిస్క్ మనోజ్ దగ్గరే ఉంది. మధ్యవర్తి ద్వారా కూడా పంపించినా ఇవ్వనున్నారు.పోలీసులకి అన్ని విషయాలు చెప్పాం కాబట్టి వాళ్లే ఎంక్వరీ చేసి తేలుస్తారు. నా చేతికైతే ఇంకా హార్డ్ డిస్క్ రాలేదు. పాస్ వర్డ్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు.  విఎఫ్ ఎక్స్ కి భారీ ఖర్చు అయ్యింది. ఒక ఖరీదైన తప్పు చెయ్యడం వల్ల 15 కోట్లు లాస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. కన్నప్ప లో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal)అక్షయ్ కుమార్(Akshay Kumar)కాజల్, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. స్టీఫెన్ సంగీతాన్ని అందించగా ఇప్పుడికే విడుదలైన పాటలు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కన్నప్ప పై అంచనాలు పెంచాయి.   
  ప్రముఖ నటుడు ఆనందరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో 'గ్యాంగ్ లీడర్', 'పెదరాయుడు', 'సూర్యవంశం', 'చెన్నకేశవ రెడ్డి' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఆనందరాజ్ గురించి.. ఆయన తమ్ముడు, డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నారు.   అలనాటి గాయని స్వర్ణలత కుమారులే ఈ ఆనందరాజ్, అనిల్ రాజు. అయితే ఈ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో దూరం పెరిగిందట. తాము పుట్టినప్పుడు అన్నదమ్ములం, పెరిగాక దాయాదులం అని అనిల్ రాజు అన్నారు.    "నేను మా అమ్మకి చిన్న కొడుకుని. నన్ను ఎంతో ప్రేమించేది. అయితే నాకు యుక్త వయసులో అమ్మాయి లక్షణాలు వచ్చాయి. జుట్టు పెంచుకోవాలని, చీర కట్టుకోవాలని అనిపించేది. దాంతో మా అన్నయ్య పాలల్లో విషం పెట్టి నన్ను చంపేద్దామని చెప్తే.. దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. నాకు నచ్చినట్టు ఉండమని చెప్పింది." అని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.   "నేను అమ్మ మాట వినేవాడిని. మా అన్నయ్య మాత్రం తన భార్య మాట వినేవాడు. మా వదిన మాట విని అమ్మను వృద్ధాశ్రమంలో కూడా వేయాలనుకున్నాడు మా అన్నయ్య. దాంతో మా ఇద్దరి మధ్య వాదనలు జరిగి, బాగా దూరం పెరిగిపోయింది." అని అనిల్ రాజు తెలిపారు.   "మా అమ్మ రాయలసీమ అమ్మాయి. వాళ్ళది ధనవంతుల కుటుంబం. గాయనిగానూ బాగా సంపాదించింది. పొలాలు, బంగారం బాగా ఉన్నాయి. 1997 మార్చి 5న కారులో డ్రైవర్ తో కలిసి నేను, అమ్మ వెళ్తుండగా.. మాపై దాడి చేశారు. అప్పుడు కారులో 4 లక్షల డబ్బు, కొంత బంగారం ఉంది. ఆ దాడిలో గాయపడిన అమ్మ.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, ఆమె పుట్టినరోజు నాడే మార్చి 10న చనిపోయారు." అని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.    
డిజె టిల్లు, టిల్లుస్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హీరో సిద్దు జొన్నలగడ్డ.(Siddu Jonnalagadda)ముఖ్యంగా ఆ రెండు చిత్రాల ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. అది  ఎంతలా అంటే సిద్దు అనే పేరుని మర్చిపోయి 'టిల్లు' అని పిలుచుకునేంతలా. టిల్లు స్క్వేర్ తో తొలి సారి  వంద కోట్ల క్లబ్ లోకి  చేరి తన కంటు ఒక ప్రత్యేకమైన బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక 'టిల్లుస్క్వేర్' తర్వాత ఏప్రిల్ 10 న 'జాక్'(Jack)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎన్టీఆర్(Ntr)తో పాటు గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర జాక్ ని నిర్మించింది. బేబీ మూవీ ఫేమ్ 'వైష్ణవి చైతన్య'(Vaishnavi chaitanya) హీరోయిన్ గా చెయ్యగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడుగా వ్యవహరించాడు. దీంతో రిలీజ్ కి ముందు నుంచే జాక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఎవరు ఊహించని విధంగా తొలి షో నుంచే ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది. డిజాస్టర్ గా నిలిచినా, టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన సిద్దు మూవీ కాబట్టి, ఒక మాదిరి కలెక్షన్స్ అయినా, రాబడుతుందేమో అని అందరు అనుకున్నారు. కానీ పది కోట్ల రూపాయిల వసూళ్ళని కూడా రాబట్టలేకపోయింది. దీంతో చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కి భారీ నష్టాలూ వచ్చాయనే టాక్ సినీ సర్కిల్స్ లో  వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా జాక్ మూవీకి సిద్దు తాను తీసుకున్న ఎనిమిది కోట్ల రూపాయిల  రెమ్యునరేషన్ లో నాలుగు కోట్ల రూపాయిలని  వెనక్కి ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సిద్దు అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'తెలుసు కదా'(Telusu Kada)అనే మూవీ చేస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి  నీరజ కోన దర్శకత్వం వహిస్తుంది. రాశిఖన్నా, శ్రీనిధి హీరోయిన్ లుగా చేస్తుండగా దీపావళి కానుకగా అక్టోబర్ 17 న విడుదల కానుంది.           
'ఛలో' మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన 'రష్మిక'(Rashmika Mandanna)ఆ తర్వాత గీత గోవిందం, పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 ,యానిమల్, చావా, వారిసు' వంటి బహు బాషా చిత్రాలతో అనతి కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది. ప్రస్తుతం 'కుబేర, ది గర్ల్ ఫ్రెండ్  వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఐపిఎల్ 18(IPL 18)వ సీజన్ కి సంబంధించిన ట్రోఫీని 'రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు'(Rcb)గెలుచుకున్న విషయం తెలిసిందే. పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బెంగుళూరు జట్టు ఫైనల్లో గెలిచి కప్పు అందుకోవడంతో కన్నడ నటీనటులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తు ట్వీట్ లు చేస్తున్నారు. ఈ  కోవలోనే  రష్మిక తన ట్వీట్ లో 'ఇక్కడ గెలుపు సువాసనలు విరజిమ్ముతున్నాయి అని పేర్కొంది.  కొన్ని నెలల క్రితం రష్మిక ఒక ఈవెంట్ లో మాట్లాడుతు' తాను హైదరాబాద్(Hyderabad)కి చెందిన అమ్మాయిని అని చెప్పుకొచ్చింది. దీంతో కన్నడ సంఘాలు రష్మిక పై మండి పడుతు ' కన్నడ నాట పుట్టి పెరిగి, కన్నడ సినిమాతో  గుర్తింపు తెచ్చుకున్న నువ్వు , కన్నడ రాష్టానికి చెందిన అమ్మాయిని అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు. కన్నడ ద్రోహివి అంటు  ఘాటుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో 'ఆర్ సి బి' ని అభినందిస్తు రష్మిక చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రష్మిక స్వస్థలం కర్ణాటక లోని విరాజ్ పేట్. ఇక ఆర్ సి బి గెలవడంపై వెంకటేష్,(venkatesh),అల్లు అర్జున్(Allu Arjun)విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, సాయి దర్గా తేజ్, సుధీర్ బాబు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తు ట్వీట్స్ చేసారు.      
కమల్ హాసన్(Kamal Haasan)ఈ నెల 5 న విడుదల కాబోతున్న 'థగ్ లైఫ్'(Thug Life)ఆడియో ఫంక్షన్ లో, తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కన్నడ భాషా సంఘాలతో పాటు, కన్నడ ఫిలిం ఛాంబర్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసాయి. కమల్ క్షమాపణ చెప్పకపోతే కన్నడ నాట 'థగ్ లైఫ్' రిలీజ్ ని అడ్డుకుంటామని తేల్చి చెప్పాయి. దీంతో  థగ్ లైఫ్ రిలీజ్ ఆగకుండా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్ట్(Karnataka Highcourt)లో కమల్ పిటిషన్ వేసాడు. ఈ పిటిషన్ పై హైకోర్ట్ మాట్లాడుతు 'తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పే హక్కు మీకు ఎవరు ఇచ్చారు. మీరేమైనా చరిత్రకారులా, లేక భాషావేత్తలా. ఏ భాష కూడా ఇతర బాషల నుంచి పుట్టదు.  నీరు, నేల, భాష ప్రజలకి పవిత్రమైనవి. ప్రతి వ్యక్తి యొక్క సాంస్కృతిక, భావోద్వేగ గుర్తింపులో భాగం. భాషా ప్రాతిప్రదికనే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మీరు చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాల్ని దెబ్బతీశాయి. క్షమాపణ చెబితే సమస్య పరిష్కార మవుతుంది. మీరు కమల్ హాసన్ కావచ్చు. మరెవరైనా కావచ్చు. మీ సినిమా ద్వారా కర్ణాటకలో కోట్ల రూపాయలని సంపాదించాలని చూస్తున్నారు. అలాంటప్పుడు మీరు కన్నడ ప్రజలకి క్షమాపణ చెప్తే మీ స్థాయి ఏం తగ్గదనే ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినా సరే  కమల్ క్షమాపణ చెప్పకపోయే సరికి కోర్టు తన తదుపరి విచారణ ఈ నెల 10 కి వాయిదా వేసింది. దీంతో రేపు విడుదల కాబోతున్న 'థగ్ లైఫ్' కన్నడ నాట వాయిదా పడే అవకాశం ఉంది. ఇక రిలీజ్ విషయంలో తమిళనాడు ఫిలిం చాంబర్, కర్ణాటక ఫిలిం ఛాంబర్ కి లేఖ రాసింది. సదరు లేఖలో 'ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ ఫిలిం ఇండస్ట్రీ కలిసి పని చేస్తున్నాయి. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, విజయ్ దునియా, సుదీప్ ఎందరో కన్నడ నటులు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళ నిర్మాతలు, డైరెక్టర్లు కూడా కన్నడంలో చిత్రాలని రూపొందిస్తున్నారు. థగ్ లైఫ్ ని వాయిదా వేసినా, బ్యాన్ చేసినా, ఆ నిర్ణయం భవిష్యత్తులో రెండు ఇండస్ట్రీలపై  తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకి ఒక చరిత్ర ఉంది. కమల్ హాసన్ ప్రేమతోనే ఆ విధంగా మాట్లాడారు. ఈ విషయాన్నీ గుర్తించి 'థగ్ లైఫ్' రిలీజ్ కి సహకరించాలని లేఖలో పేర్కొంది.    
The Raja Saab movie starring Prabhas has been in production from October 2022. The movie directed by Maruthi Dasari has been shooting in short schedules from so long and the reports have suggested that it did undergo many re-shoots as well. The makers have originally planned for a 2024 release but due to delays locked 2025 date.  But they had to postpone indefinitely, when they saw the VFX output and reports stated that again they did some re-shoots. Prabhas went to Europe for rehabilition of his knee which had been troubling him since Baahubali days. Now, the makers have announced 5th December 2025 release date.  Many are wondering why did they select Pushpa 2 release date. Well, the makers have gone through plans of Mythri Movie Makers, who are producing Prabhas other film, Fauji (working title) in the direction of Hanu Raghavapudi. As they have plans to release it for Summer next year, Raja Saab makers saw about Sankranti release.  While they would have loved a festival release, OTT streaming partners have pushed for this year release, it seems. So, they have decided to go with 5th December release, and speed up VFX works. Also, the re-shoots will be completed by August to give Prabhas time to join Kalki 2 as well, say reports.  Few did feel like Allu Arjun's Pushpa 2 magnamous success might have played a key role in this decision but People Media Factory went with this date to please their OTT partners, say reports. T.G. Vishwa Prasad and Krithi Prasad are producing the film on a massive scale with Niddhi Agerwal, Malavika Mohanan and Riddhi Kumar in leading lady roles. S Thaman is scoring music for the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Pawan Kalyan, AP Deputy CM, delayed his film commitments for political and now, he finished his portion for Hari Hara Veera Mallu. He is currently working to complete OG and the shoot is happening in Mumbai. His HHVM is gearing up for release on 12th June but the movie could not complete the censor on 3rd June.  While few reports stated that the film censor could be completed on 4th June, new reports have made assumptions that movie is postponed. Further reports are suggesting that even Vijay Deverakonda's Kingdom re-shoots have started in Goa and the movie might not make the 4th July deadline.  So, the speculations are ripe that HHVM could take 4th July release date and Kingdom might go to a later date in July as August is locked. OG makers have already booked 25th September date alongside Akhanda 2. So, OG makers might not give way to HHVM as their OTT and Satellite deals could crash.  Already few reports suggest that HHVM is struggling to find buyers and the movie OTT deal could be re-negotiated in case of delay. Kingdom makers also have similar issue but the director Gautam Tinnanuri does not want to give a second rated movie. Also, producer Naga Vamsi wants this to work big time.  So, they went with re-shoots and even Vijay Deverakonda is betting on the movie huge, so he gave dates to complete it seems. Well, so if all the reports are to be believed, HHVM postponement could push for re-scheduling of all other biggies in Telugu Cinema.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పిల్లల పెంపకం ఒక కళ.  చాలామంది పిల్లలకు ఆహారం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు సమకూర్చడం,  చదువు చెప్పించడం మొదలైనవి చేయడమే పిల్లల పెంపకం అనుకుంటారు. కానీ ఇవన్నీ పిల్లలకు అవసరమైనవి.. ఇవి మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. కొన్ని పద్దతులు,  విలువలు అలవాటు చెయ్యాలి.  5ఏళ్ల లూపే పిల్లలకు పిల్లలకు 5 విషయాలు తప్పక నేర్పిస్తే పిల్లలు వాటిని  జీవితాంతం వాటిని వదిలిపెట్టరు. అది వారి జీవితాన్ని బంగారంలా మారుస్తుంది. పిల్లలు దుఃఖం, బాధ, కోపం, సంతోషం మొదలైన భావోద్వేగాలను చాలా తొందరగా వ్యక్తం చేస్తారు. అయితే వీటిని వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది.  ఆ విధానంలో వ్యక్తం చేయడం నేర్పిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు.  దీన్ని 5 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాలి. ఇతరులను గౌరవించడం గొప్ప గుణం.  దీన్ని చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలి.  భావోద్వేగాలు ఎంత ఉన్నా, ఎంత కోపం,  అసహనం ఉన్నా   ఇతరులను అవమానించి మాట్లాడకూడదని,  ఒకచోట కోపాన్ని ఇంకొక చోట తీసుకురాకూడదని చెప్పాలి.  తప్పులు ఎప్పుడూ అనుభవాలుగా,  గొప్ప పాఠాలుగా సహాయపడతాయి.  అయితే పిల్లలు మాత్రం తప్పు చేస్తే తప్పించుకోవడం, దాచిపెట్టడం చేస్తారు. కానీ పిల్లలు తాము చేసిన తప్పుల నుండి తప్పించుకోకుండా, దాచిపెట్టకుండా  వాటిని ఒప్పుకునేలా అలవాటు చెయ్యాలి. తాము తప్పు చేసినా, ఇతరులను నొప్పించినా పరిస్థితులకు అనుగుణంగా సారీ చెప్పడం, కృతజ్ఞత వెలిబుచ్చడానికి  థ్యాంక్స్ చెప్పడం  వంటివి పిల్లలకు నేర్పించాలి. ఎవరైనా తమను బాధపెడితే వారిని  క్షమించే తత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. సమస్యలు అందరికీ వస్తాయి.  వయసుకు తగిన సమస్యలు ఉండనే ఉంటాయి.  అయితే  పిల్లలకు ఏ సమస్య వస్తుందో అని పెద్దలు ఎప్పుడూ గాభరా పడుతూ ఉంటారు.కానీ ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం పిల్లలే ఆలోచించేలా వారికి అలవాటు చెయ్యాలి.  ఇది వారి భవిష్యత్తును అందంగా మారుస్తుంది. ఒకరి మీద ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరగడానికి దోహదం చేస్తుంది.                                                      *రూపశ్రీ.
  రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా  ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే  వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా  పంపవచ్చు. బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు  భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి.  భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి  పంపకూడదు. అవేంటంటే.. రెస్పాండ్ కావడం.. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది.  ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో  రిప్లే ఇస్తుంటారు.  ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి. కోపం.. కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది.  భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు.  భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు.  భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు.  ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి. పదే పదే.. భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.  భార్య భర్తకు అయినా,  భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు.  ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.   ముఖ్యంగా మహిళలు     ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు.  భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ  అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది. గొడవలు వద్దు.. మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు,  బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది.  దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు.  ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది.  లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి.                                                              *రూపశ్రీ.
  ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, అందుకే ఏదైనా ఒక భాగంలో సమస్య తలెత్తితే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గుండె-ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఏర్పడే సమస్యల గురించి మనమందరం  అప్రమత్తంగా ఉంటాము. ఆ సమస్యల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కళ్ళు,  చెవులు వంటి అవయవాల ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపం. ఆరోగ్య నిపుణులు  కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ ఈ అవయవాలలో సమస్యలు  తీవ్రమైన దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి. చాలామంది చెవులలో ఒకరకమైన శబ్ధం రావడం గమనిస్తుంటారు. ఇదొక టోన్ లాను, సముద్రపు హోరు లానూ, బీప్ వంటి శబ్ధం లాను ఉంటుంది. చాలామంది ఇదేమి చేస్తుందిలే.. తగ్గిపోతుంది. మనకు బాగా వినిపిస్తోంది కదా అనే నిర్లక్ష్యంతో పట్టించుకోరు. కానీ ఈ చెవి సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది  దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగి ఉండే ప్రమాదముంది. ఇలా శబ్ధం వినిపించడాన్ని టిన్నిటస్ అని అంటారు.  టిన్నిటస్ సమస్య..  టిన్నిటస్ సమస్యలో  చెవులలో ఒకటి లేదా రెండింటిలో రింగింగ్ లేదా ఇతర శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇవి బయట నుండి వినిపించేవి కాదు. ఈ శబ్దాలు కేవలం ఈ సమస్య ఉన్నవ్యక్తులకే వినిపిస్తుంది . ఇతరులు దీన్ని వినలేదు. టిన్నిటస్ అనేది చాలా సాధారణ సమస్య  15% నుండి 20% మంది వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో ఇది వస్తుంటుంది. సాధారణంగా టిన్నిటస్ అనేది అంతర్లీన సమస్య వల్ల వస్తుందని, దానిని గమనించి చికిత్స చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు.. ఆరోగ్య నిపుణులు, టిన్నిటస్ ను సాధారణంగా వయస్సు-సంబంధిత వినికిడి లోపం, చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్  వంటి అంతర్లీన సమస్య వల్ల సంభవించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే లేదా చికిత్స చేయకపోతే, దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  టిన్నిటస్ సమస్యకు  జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, దీని గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు  సమయానికి చికిత్స చేయకపోతే, ఇది చెవికి సంబంధించి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది, చెవుడు కూడా వ్వచే అవకాశం ఉంటుంది.  వినికిడి సమస్య శాశ్వతంగా తగ్గిపోవచ్చు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు, మన చెవి లోపలి భాగంలో చిన్న, సున్నితమైన కణాలు ఉంటాయి, అవి ధ్వని తరంగాలను స్వీకరించినప్పుడు కంపిస్తాయి. లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే, అది టిన్నిటస్‌కు కూడా కారణమవుతుంది.  సమయానికి చికిత్స చేయకపోతే, చెవుల శక్తి  తగ్గిపోతుంది. ఇది కాకుండా, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో ఏవైనా అడ్డుపడటం వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు. చెవి ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, మెదడు మాత్రమే కాకుండా ఇతర భాగాలపై కూడా దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.                              *నిశ్శబ్ద.
  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’. ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌! మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్. ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే! ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది. మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట. - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి. - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి. - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి. - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది. - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...