LATEST NEWS
 రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. నందినగర్ లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్.. ఈ రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాలను చూసిన ప్రజలు ఆ పార్టీకి మరో రెండు దశాబ్దాల పాటు ఓటు వేయరన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో   బీఆర్ఎస్ బ‌లోపేతం,  స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ .  స్థానిక సంస్థల ఎన్నికల్లో  మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను  ఈ సందర్భంగా అభినందించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న కేటీఆర్.. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై ఒకే సారి దాదాపు వెయ్యి రూపాలయలు పెంచడం అందులో ఒకటన్నారు. గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  
బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.   కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,  పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.   ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.   ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.   సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు.  నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.   
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నుంచి బయటకు వచ్చి సొంత రాజకీయ వేదికను టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న   కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్నిప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె..  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే   ప్రధాన ధ్యేయమన్నారు.  ఈ పోరాటంలో జెన్-జీగా పిలువబడే నేటి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత  ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పంథాను మార్చుకోబోతున్నట్లు వెల్లడించారు. కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతరం ఆలోచనలు, వారి అవసరాలు గతానికి భిన్నంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. స్క్రీన్లపై సమయం గడుపుతున్నారని యువతను విమర్శించే బదులు.. అదే డిజిటల్ వేదికలను వారి గొంతుకగా మార్చుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని..  అందుకే ఆ పార్టీని ఓడించేందుకు యువశక్తిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో యువత  కేవలం ఓటర్లుగానే కాకుండా, నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత చెప్పారు. తన పార్టీలో జెన్-జీ ప్రతినిధులకు పెద్దపీట వేస్తానని..  సమాజంలో వెనుకబడిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, విద్యా సంబంధిత సమస్యలపై పోరాటమే తన అజెండా  అన్న కవిత.. రాష్ట్రంలో  రేవంత్ సర్కార్   వైఫల్యాలను ఎండగట్టడంలో యువతే ముందువరుసలో ఉంటారని  విశ్వాసం వ్యక్తం చేశారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  జారీ చేసిన నోటిఫికేషన్లలో వయోపరిమితి సడలింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జీవో 30ని యథాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ, తెలంగాణ సెంటిమెంట్‌ను, యువత ఆకాంక్షలను కలగలిపి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది.  అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.   అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
ప్రస్తుతం టాలీవుడ్‌లో 'నందమూరి బాలకృష్ణ' (Nandamuri Balakrishna) పేరు ఒక సెన్సేషన్. వయసు పెరుగుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య కోసం.. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు, ఇతర చిత్ర పరిశ్రమల దర్శకులు, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఎనిమిది మంది దర్శకులు.. పది మంది నిర్మాతలు! ప్రస్తుతం బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. ఆయన కాల్షీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు ఎనిమిది మంది ప్రముఖ దర్శకులు బాలయ్య కోసం కథలను సిద్ధం చేసుకుని వేచి చూస్తున్నారు. వీరిలో టాలీవుడ్ దర్శకులతో పాటు ఇతర భాషల దర్శకులు ఉండటం విశేషం. కన్నడ, మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ముగ్గురు క్రేజీ దర్శకులు బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పక్కా యాక్షన్ స్క్రిప్టులతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దర్శకులే కాదు, బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయని నమ్ముతున్న పది మందికి పైగా నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ బాలయ్యతో భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారట. లైన్ లో క్రేజీ ప్రాజెక్టులు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా చేయడానికి స్క్రిప్ట్ లు రెడీ చేసే పనిలో ఉన్నారు. ఒకప్పుడు సీనియర్ హీరోల మార్కెట్ పడిపోతుందని భావించిన వారందరికీ తన సక్సెస్‌తో బాలయ్య గట్టి సమాధానం ఇచ్చారు. మాస్ పల్స్ తెలిసిన హీరో కావడంతో పాటు, అటు బుల్లితెరపై 'అన్‌స్టాపబుల్' షోతో యువతకు కూడా దగ్గరవ్వడం ఆయనకు ప్లస్ అయ్యింది. మరి గోపీచంద్ మలినేని, కొరటాల శివ ప్రాజెక్ట్ ల తర్వాత  బాలయ్య ముందుగా ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.  
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం సూర్యతేజ చిలుకూరితో నిశ్చయమైంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నిశ్చితార్థ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  అలాగే మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, కోన వెంకట్ తదితరులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. గత నెలలోనే తన కుమార్తె వివాహం నిశ్చయమైనట్లు బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.   https://x.com/Theteluguone/status/2050810560363794636
తాంత్రిక థ్రిల్లర్ 'అగధ' అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ఎందుకంటే, ఈ చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేసిన తొలి పోస్టర్‌తోనే భారీ ఉత్సుకతను రేకెత్తించగలిగారు. ఒక భారీ విగ్రహం ముందు ఒక మహిళ నిలబడి ఉన్న చిత్రం యొక్క మొట్టమొదటి పోస్టర్, ట్రేడ్, ప్రేక్షకులు మరియు వ్యాపార వర్గాలలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో, ఒక చీకటి గుహ లాంటి ప్రదేశంలో ఒక వ్యక్తి నిర్భయంగా నిలబడి, అనేక చేతులు కలిగిన ఒక భారీ తాంత్రిక విగ్రహాన్ని ఎదుర్కొంటున్నట్లుగా ఉంది. అతని చుట్టూ క్రతువుల అగ్నుల నుండి జ్వాలలు పైకి లేస్తున్నాయి. అతను ఒక చేతిలో కత్తిని, మరొక చేతిలో తెగిపోయిన తలను పట్టుకుని ఉన్నాడు. ఇది తాంత్రికత మరియు ప్రమాదంతో కూడిన ఒక శక్తివంతమైన ఘర్షణను సూచిస్తుంది. కేవలం పోస్టర్ల ద్వారానే 'అగధ' ఈ స్థాయిలో ఎలా సందడిని సృష్టించగలిగిందనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రతి డిజైన్ ఈ రహస్యానికి ఒక కొత్త కోణాన్ని జోడిస్తూ, ప్రేక్షకులను దాని తాంత్రిక ప్రపంచంలోకి మరింత లోతుగా ఆకర్షిస్తోంది. కేవలం దృశ్యాల ద్వారానే ఇలాంటి స్పందన రావడం చాలా అరుదు. ఇది సినిమా వెనుక ఉన్న బలమైన సృజనాత్మక దృక్పథాన్ని సూచిస్తుంది. ఈ ఉత్సాహానికి మరింత జోడిస్తూ, 'అగధ' టీజర్ మే 7 ఉదయం 10.20 గంటలకు విడుదల కానుందని పోస్టర్ అధికారికంగా ప్రకటించడంతో, అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. విలక్షణమైన కాన్సెప్ట్‌లను అందించడంలో పేరుగాంచిన ఎం. ఎస్. రాజు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న 'అగధ' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'అగధ', ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది.  ఈ చిత్రాన్ని భారీ సెట్‌లు మరియు వాస్తవ ప్రదేశాలలో 85 రోజుల పాటు చిత్రీకరించారు. ఇందులో దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఉపయోగించారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.  
ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను తన స్టెప్పులతో ఉర్రూతలూగించిన ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మైఖేల్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.   ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, అభిమానులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే అనేక ప్రముఖ బయోపిక్‌ల రికార్డులను అధిగమించింది. ముఖ్యంగా అమెరికాతో పాటు భారత్‌లో కూడా మైఖేల్ జాక్సన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ వసూళ్లు నిరూపిస్తున్నాయి. దాదాపు రూ. 2000 కోట్లకు పైగా గ్లోబల్ వసూళ్లతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో మైఖేల్ జాక్సన్ పాత్రను పోషించిన ఆయన మేనల్లుడు ‘జాఫర్ జాక్సన్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి సినిమాతోనే జాఫర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎం.జె. అభిమానుల మనసు గెలుచుకున్నారు. తెరపై జాఫర్ నటన చూస్తుంటే సాక్షాత్తు మైఖేల్ జాక్సనే మళ్లీ పుట్టివచ్చారా? అనేలా ఉందని ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆయన డాన్స్ మూమెంట్స్ మరియు బాడీ లాంగ్వేజ్ అచ్చు గుద్దినట్లు మైఖేల్‌ను తలపిస్తున్నాయి.   డైరెక్టర్ ఆంటోనీ ఫుక్వా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఎంజే చిన్నప్పటి నుంచి గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన తీరును ఎంతో హృద్యంగా చూపించారు. షూటింగ్ సమయంలో జాఫర్ పడిన కష్టం, ఆయన డ్యాన్స్ కోసం చేసిన ప్రాక్టీస్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో మైఖేల్ జాక్సన్ సృష్టించిన ప్రభావాన్ని ఈ సినిమా మరోసారి కళ్లముందు ఉంచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘మైఖేల్’ సినిమాపై భారీ చర్చ నడుస్తోంది. కొంతమంది విమర్శకులు కథలో లోపాలు ఉన్నాయని చెప్తున్నా, సాధారణ ప్రేక్షకులు మాత్రం ఎంజే మేజిక్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా, లాంగ్ రన్‌లో మరిన్ని బెంచ్ మార్క్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఇప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా తన సత్తా చాటుతున్నారు. 'దేవర' ఘనవిజయం తర్వాత తారక్ తన తదుపరి చిత్రాలను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో సంచలనం సృష్టించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ జతకట్టడం భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై అంచనాలు  ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కుముందు కంటే ప‌వ‌ర్‌ఫుల్ గా స్క్రిప్ట్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.  ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న రూపాల్లో కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో రెండు షేడ్స్ చూపించడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ కాగా, ఎన్టీఆర్ మేకోవర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్ట్-1లో ఎన్టీఆర్ చాలా షార్ప్‌గా, లీన్ లుక్‌లో కనిపించనున్నారు. పార్ట్-2 కోసం తారక్ ‘బీస్ట్ మోడ్’లోకి మారనున్నారు. భారీ కండలు పెంచి బల్క్ ట్రాన్స్‌ఫార్మేషన్ చూపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ రెండు భాగాల షూటింగ్‌ను ఒకే సమయంలో సమాంతరంగా ప్లాన్ చేయడంతో నిరంతరం ఫిజిక్ మార్చుకోవడం తారక్ డెడికేషన్‌కు ఒక సవాలుగా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామా యొక్క తదుపరి షెడ్యూల్ మే 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్‌లో కథానాయికతో పాటు చిత్రంలోని ఇతర కీలక నటులు కూడా జాయిన్ కాబోతున్నారు. సినిమాలోని మేజర్ యాక్షన్ బ్లాక్స్ మరియు ఎమోషనల్ సీన్లను ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. 
ఇటీవల సోషల్ మీడియాలో గెటప్ శ్రీను (Getup Srinu) ఇంటర్వ్యూ ప్రోమో ఒకటి వైరల్ అవుతూ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. నాగబాబు గారితో కలిసి ఒక కొత్త సిరీస్ చేస్తున్నానని, దాని టైటిల్ 'మేము కాపులం' అని గెటప్ శ్రీను చెప్పి షాకిచ్చాడు. దాంతో యాంకర్ "సినిమాలకు కులం పేరు పెట్టడం ఏంటి?" అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తొక్కలో ఇంటర్వ్యూ అంటూ గెటప్ శ్రీను వెళ్ళిపోయాడు. గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ వినిపించాయి. కొందరు ఆ టైటిల్ పెట్టడాన్ని తప్పుబడితే, మరికొందరు మాత్రం ఇది ప్రాంక్ అని తేలికగా తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.  నిజానికి ఆ సిరీస్ పేరు 'మేము కాపులం' కాదు, 'మేము COPలం'. ఇక్కడ 'COP' అంటే ఇంగ్లీష్ లో పోలీస్ అని అర్థం. గెటప్ శ్రీను ఈ సిరీస్‌లో ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో శ్రీను తన పోలీస్ యూనిఫామ్ చూపిస్తూ.. "మేము పోలీసులం (COPS), అందుకే మేము COPలం అని పేరు పెట్టాం" అని క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా త్వరలో విడుదల కానుంది. 'మేము COPలం' అనే విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. త్వరలోనే దీని విడుదల తేదీని జీ5 అధికారికంగా ప్రకటించనుంది.   https://x.com/Theteluguone/status/2050560252102533340
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో సినిమా వస్తోంది అనగానే ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మాస్ యాక్షన్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కలగలిపిన కథలను అందించడంలో కొరటాల దిట్ట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారు కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే అంశంపై మళ్లింది. ముఖ్యంగా బాలయ్య లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్‌లో లేరా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. థమన్ - బాలయ్య హిట్ కాంబోకు బ్రేక్? గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాలకు థమన్ వెన్నెముకగా నిలుస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా థమన్ ఇచ్చే మాస్ మ్యూజిక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. అయితే, కొరటాల శివ సినిమాలో థమన్ పేరు వినిపించకపోవడం నందమూరి అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లైన్లోకి అనిరుధ్ రవిచందర్? ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'దేవర' చిత్రానికి అనిరుధ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఆ బాండింగ్‌తోనే బాలయ్య సినిమాకు కూడా అనిరుధ్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ కనుక ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, బాలయ్య సినిమాకు సరికొత్త సౌండింగ్ లభించడం ఖాయం.  
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన  'జెట్లీ' సినిమా ప్రదర్శనను కొన్ని స్క్రీన్స్ లో నిలిపివేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.  తాజాగా జరిగిన 'జెట్లీ' (JETLEE) మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత చెర్రీ పాల్గొని, ఈ ఇష్యూపై స్పందించారు. 'పెద్ది' (Peddi) వంటి భారీ చిత్రం త్వరలో విడుదల కానున్న  నేపథ్యంతో ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదానికి అసలు కారణం ఏమిటి? సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సెంటేజ్ బేసిస్‌లో సినిమాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే టికెట్ ఆదాయంలో తమకు నిర్ణీత వాటా ఉండాలని వారి వాదన. అయితే, మే 1 నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తేనే థియేటర్లు ఇస్తామని ఎగ్జిబిటర్లు భీష్మించుకోవడంతో సమస్య మొదలైంది. దీనివల్ల 'జెట్లీ' సినిమా విడుదల రోజు ఇబ్బందులు ఎదుర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ సిస్టమ్ కి ఒప్పుకోకపోతే.. మల్టీప్లెక్స్ లోనూ ప్రదర్శించబోమని కొందరు షాకిచ్చారు. నిర్మాత చెర్రీ వివరణ: హైదరాబాద్‌లో జరిగిన 'జెట్లీ' సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చెర్రీ, ఈ సమస్యపై స్పష్టత ఇచ్చారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు ఏప్రిల్ 30 రాత్రి వరకు జరిగినా ఒక కొలిక్కి రాలేదని ఆయన తెలిపారు. "సింగిల్ స్క్రీన్లలో ఏవైనా సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరించుకోవాలి కానీ, మల్టీప్లెక్స్ స్క్రీన్లను అడ్డుపెట్టుకుని ఒత్తిడి తీసుకురావడం సరికాదు" అని డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆయన ప్రస్తావించారు. థియేటర్ల సమస్యను పరిష్కరించేందుకు మే 8న ఒక ముఖ్యమైన మీటింగ్ జరగబోతోందని ఆయన వెల్లడించారు. ఈ మీటింగ్‌లో ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చుని చర్చించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పెద్ది' విడుదలపై ప్రభావం ఉంటుందా? రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా ఈ వివాద ప్రభావం ఉంటుందా? అన్న ప్రశ్నకు చెర్రీ సమాధానమిస్తూ.. మే 8న ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక కీలక సమావేశం జరగనుందని, అప్పుడు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 'జెట్లీ' ప్రదర్శనలకు ఎగ్జిబిటర్లు అంగీకరించారని.. నిర్మాతలైనా, ఎగ్జిబిటర్లైనా ఒకే కుటుంబం వంటి వారని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నిలబడాలంటే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు సమన్వయంతో ముందుకు సాగాలి. 'జెట్లీ' వంటి చిన్న సినిమాల నుంచి 'పెద్ది' వంటి భారీ చిత్రాల వరకు అందరికీ థియేటర్ల మద్దతు అవసరం. మే 8న జరగబోయే చర్చలతో ఈ వివాదం ముగిసి, టాలీవుడ్ సాధారణ స్థితికి చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు.  
  విక్టరీ వెంకటేష్(Venkatesh),త్రివిక్రమ్(Trivikram)కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ఉరఫ్ ఏకే 47(Ak 47)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమ్మని ఆవకాయని ఎలా అయితే మర్చిపోమో, ఏకే 47   ని కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోకుండా చేయాలనే పట్టుదలతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆ పట్టుదలని నిజం చేసే బాధ్యతని థమన్(Thaman)కూడా తీసుకున్నాడు.  కొన్ని రోజుల నుంచి  ఏకే 47 కి థమన్ మ్యూజిక్ ని అందించబోతున్నాడనే న్యూస్ సినీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు ఆ న్యూస్ కి తధాస్తు దేవతలు తధాస్తు అనేసారు.త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఒక  పిక్ ని థమన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చానని  తెలిపాడు. ఏకే 47 లో మొదటి సంగీత దర్శకుడు  యానిమల్ ఫేమ్  హర్షవర్ధన్ రామేశ్వర్. also read: Bellamkonda sai sreenivas: నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్   మరి ఏకే 47 కి థమన్ అల వైకుంఠ పురం రేంజ్ లో ట్యూన్స్ ఇచ్చి త్రివిక్రమ్ ని ఖుషి చేస్తాడేమో చూడాలి. వెంకటేష్  తో మాత్రం మూడో మూవీ. షాడో, వెంకీ మామకి థమనే.    
The Tollywood circles are buzzing with a sudden and unexpected change in the music department of director Trivikram Srinivas's highly anticipated family entertainer with Venkatesh Daggubati, tentatively titled Adarsha Kutumbam House No: 47 (AK47). In a surprising twist, music composer Thaman S has officially stepped in to take over the project, replacing Harshavardhan Rameshwar.   What makes this development pure gossip gold is the abrupt nature of the switch. Just days ago, Harshavardhan, who recently caught everyone's attention with his sensational score for Animal, confidently denied any rumors of his exit from the film. However, insiders whisper that the young composer was completely kept in the dark about the change. Word on the street is that without any formal intimation or discussion with Harshavardhan, Trivikram went ahead and roped in his trusted collaborator, Thaman.   Thaman even took to social media to share a picture with the director, confirming the start of their new musical journey together. The exact reasons for this unceremonious exit remain a closely guarded secret, though industry murmurs hint at sudden creative differences. Whatever the actual truth may be, this quiet but drastic replacement has definitely set tongues wagging across the Telugu film industry.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!