LATEST NEWS
బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.
  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.
తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే. 
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది.  ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26  ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.   దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది. ఈ వేగం ఇలాగే సాగితే  ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం  పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే  ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047    ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.  పథకాల అమలులో వేగం,  అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.    సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది. 
దేశంలో ఇప్పటికే స‌వాల‌క్ష పార్టీలు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ గా ఉన్న‌వి కొన్నే. వాటిలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల‌తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణ‌మూల్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు వీటికి అద‌నం. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే తెలుగుదేశం, వైసీపీ,  జ‌న‌సేన‌,  డీఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలనూ కలిపితే దాదాపు ఓ పాతిక పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.  అలాంటి యాక్టీవ్ పార్టీల‌న్నిటినీ  ప‌క్క‌న పెడితే..   దేశంలో ఉన్న పార్టీల సంఖ్య సుమారు రెండున్న‌వేల వ‌ర‌కూ ఉంటాయి. రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న  తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ  కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   ఆ పార్టీ పేరు ఇంకా  ఖరారు కాలేదు కానీ, పార్టీ ఏర్పాటైతే పక్కా అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నది ఎవరయ్యా అని చూస్తే.. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈయ‌న జ‌గ‌న్ జ‌మానాలో ఎన్నేసి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారో  తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌వీణ్ ప్ర‌కాష్ చెప్పిన అపాల‌జీ వీడియోనే ప్ర‌త్య‌క్ష  సాక్షి. అదలా ఉంచితే..  ఏబీవీకి ఇంకా ప్ర‌భుత్వ ప‌రంగా రావ‌ల్సిన బ‌కాయిలు ఇప్పటికీ  రాలేదు. వాస్తవానికి ఏబీవీ   జ‌గ‌న్ పై పోరాడిన విధానికి కూట‌మి ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించాల్సి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఏబీవీకి ఎటువంటి మద్దతూ లభించలేదు.  అప్ర‌ధాన్య‌మైన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించి మమ అనేశారు. అయితే ఆయనా పోస్టు తీసుకోలేదనుకోండి అది వేరే సంగతి. అయితే   ఏబీవీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు మీద ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.   అంతే కాదు వైసీపీ వారికి య‌ధేచ్చ‌గా దోచి పెడుతున్నార‌న్న సంచ‌ల‌న కామెంట్లు కూడా చేశారు. ఆమాట‌కొస్తే మొన్న‌టికి మొన్న కందుకూరు క‌మ్మ  కాపు ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం  ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారంపై కూడా రియాక్టయ్యారు ఏబీవీ. ఇలా తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వ నిర్ణయాలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏబీ వెంకటేశ్వరరావు.   ఇలా ఖండనలు, ప్రకటనలతో కాదని తానే స్వయంగా ఒక కొత్త  పార్టీ  పెట్టి  సత్తా చాటాలన్న నిర్ణయానికి ఏబీవీ వచ్చినట్లు కనిపిస్తోంది.   దేశంలోనే అత్యంత అవినీతి ప‌రుడిగా  వేల కోట్ల‌ను సంపాదించిన పేరు సాధించిన  జ‌గ‌నే పార్టీ న‌డ‌ప‌డానికి  డ‌బ్బుల్లేవు కాబ‌ట్టి తాను  కార్యాల‌యాన్ని తీసేశాన‌ని బాహ‌టంగా చెప్పుకున్నారు. అలాంటిది ఏబీవీ లాంటి ఒక రిటైర్డ్ ప్ర‌భుత్వోద్యోగి వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? అని సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే  జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ లోక్ స‌త్తా  అరవింద్ కేజ్రీవాల్  ఆమ్ ఆద్మీ పార్టీ,  సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ కూడా సేమ్ టు సేమ్  ఈయ‌న‌లాగానే ఐఏఎస్ ఐపీఎస్ కేడ‌ర్ కి సంబంధించిన వారే. వారిలో అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ క్లిక్ అయిన‌ట్టు మిగిలిన వారు పెట్టిన పార్టీలు రాణించ‌లేదు.  ఆ  కోవ‌లోకి వ‌చ్చే ఏబీవీ అంత‌గా మాస్ జ‌నాల్లోకి దూసుకెళ్ల‌గ‌ల‌రా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా  మారింది.  ఇక పార్టీ పేరు ఏమిటని చూస్తూ.. ఈయన ఏపీకి పరిమితమై రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు కనుక ఆంధ్ర శ‌బ్ధం వ‌చ్చేలా ఆయన పార్టీ పేరు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఏబీవీ పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు ఆరంభం కానుంది? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.  
ALSO ON TELUGUONE N E W S
  ఎనిమిదేళ్ల క్రితం మలయాళ నటిపై లైంగిక దాడి కేసు కేరళలో సంచలనం సృష్టించింది. 2017 లో ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసికుంది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది.    సౌత్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఓ ప్రముఖ నటి.. 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌ కి గురైంది. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడినుంచి పారిపోయారు.    నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో పది మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. 2017 జులైలో అరెస్టయిన దిలీప్‌.. నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.    ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ మొదటినుంచి వాదిస్తున్నాడు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా.. సీబీఐ దర్యాప్తుకి కూడా దిలీప్‌ డిమాండ్ చేశాడు. అయితే ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది.   అయితే ఇన్నేళ్ళకు ఈ కేసులో దిలీప్‌ ను ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. తాజా కోర్టు తీర్పుపై దిలీప్ స్పందించాడు. ఇది తనపై జరిగిన కుట్ర అని, ఇన్నేళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.   
‘సలార్‌’, ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ది రాజా సాబ్‌’. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్‌ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. మారుతి కాంబినేషన్‌లో తొలిసారి నటిస్తున్న ప్రభాస్‌కి హారర్‌ కామెడీ జోనర్‌లో సినిమా చేయడం కూడా మొదటి సారే.  తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, రెబల్‌సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా రిలీజ్‌కి నెలరోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. జనవరి 8న ఓవర్సీస్‌లో ‘రాజాసాబ్‌’ ప్రీమియర్స్‌ పడబోతున్నాయి. ప్రభాస్‌ సినిమాల కలెక్షన్స్‌లో ఓవర్సీస్‌ పార్ట్‌ చాలా ఉంటోంది. గతంలో ఓవర్సీస్‌ మార్కెట్‌పై హీరోలు దృష్టి పెట్టినా ఆశించిన స్థాయిలో వచ్చేవి కాదు. బాహుబలి తర్వాత ఆ లెక్కలన్నీ మారిపోయాయి.  ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాలకు సంబంధించి ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ కీలకంగా మారాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన సలార్‌, కల్కి కూడా అక్కడ మంచి కలెక్షన్స్‌ రాబట్టాయి. దీంతో రాజాసాబ్‌ ఓవర్సీస్‌ కలెక్షన్లపై భారీ హోప్స్‌ పెట్టుకున్నారు. కానీ, ఈసారి ప్రభాస్‌ సినిమా ఓవర్సీస్‌ కలెక్షన్లు తారుమారయ్యేలా కనిపిస్తోంది. రాజాసాబ్‌ సినిమా హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాను ఐమాక్స్‌ ఫార్మాట్‌లో చూస్తే ఆ థ్రిల్‌ వేరేలా ఉంటుంది.  ప్రభాస్‌ చేసిన ప్రతి సినిమా ఓవర్సీస్‌లో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో రిలీజ్‌ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఐమాక్స్‌ థియేటర్లలో ప్రభాస్‌ సినిమా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. దీంతో ఐమాక్స్‌ ద్వారా వచ్చే కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉంది. డిసెంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతున్న ‘అవతార్‌3’ దానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అవతార్‌, అవతార్‌2 చిత్రాలు విజువల్‌గా ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఐమాక్స్‌లో మాత్రమే ఎక్స్‌పీరియన్స్‌ చెయ్యాలని ప్రతి ఆడియన్‌ అనుకుంటాడు. దానికి తగ్గట్టుగానే అవతార్‌3 చిత్రాన్ని నాలుగు వారాలపాటు ఐమాక్స్‌ థియేటర్లలో ప్రదర్శించేందుకు ఒప్పందం జరిగింది.  ఆ కారణంగా ‘రాజాసాబ్‌’ చిత్రాన్ని ఈసారి ఓవర్సీస్‌లో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ప్రదర్శించడం లేదు. మరి దీని తాలూకు ఎఫెక్ట్‌ కలెక్షన్లపై ఏమేరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఐమాక్స్‌ ఫార్మాట్‌ అందుబాటులో లేకపోయినా ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మాట్‌తోపాటు ఇతర ఫార్మాట్లలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని థియేటర్లు అవతార్‌3కి వెళ్లిపోయాయి. అయితే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో స్పెషల్‌ ఫార్మాట్‌లో సినిమాను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. 
  The upcoming horror thriller Isha features Thrigun and Hebah Patel in lead roles with Akhil Raj, Siri Hanmanth and Prithveeraj also playing significant roles. The team has just released a chilling new trailer that instantly grabs attention. It opens with four friends who set out to uncover the truth behind fraudulent spiritual gurus.   However, Babloo Prithveeraj steps in, determined to prove the existence of ghosts, pulling them and the audience - into a dark, unsettling realm filled with terrifying moments. The friends soon find themselves overwhelmed by fear. As the trailer unfolds, it reveals a creepy, deserted house inhabited by hidden spirits, with the four friends trapped inside.    Their struggle for survival becomes the central focus, leaving viewers curious about their fate. What happened to them inside that haunted structure? What is the dark history of the abandoned building? These glimpses raise numerous compelling questions. Did the friends make it out alive? What secrets do the ghosts hold?   The trailer successfully builds suspense and intrigue, and the creators promise a gripping, edge-of-the-seat horror experience for audiences. RR Dhruvan’s background score heightens the tension, and the visuals along with the production quality stand out impressively. Backed by Pothula Hema Venkateswara Rao under HVR Productions, the movie brings together a skilled technical team including Santosh Sanamoni for cinematography, RR Dhruvan for music and Vinai handling the editing.   Following their impressive success with Little Hearts and Raju Weds Rambai, producers Bunny Vas and Vamsi Nandipati are now gearing up to deliver another gripping project. Known for their strong judgment in selecting content-driven stories, the duo is presenting Isha under their respective banners. Their association has significantly boosted the buzz around the film, raising expectations for another compelling cinematic experience.   https://x.com/Theteluguone/status/1997919793417171399?s=20  
  సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సినీ రంగంలో పవర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్.. రాజకీయ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఓ అరుదైన గౌరవం దక్కింది.    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి 'అభినవ కృష్ణ దేవరాయ' అనే గొప్ప బిరుదు లభించింది. కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ.. ఆయనకు ఈ బిరుదుని ప్రదానం చేశారు.   Also Read: ఓటీటీలోకి కాంత.. రిజల్ట్ రివర్స్ అవుతుందా..?   ఆదివారం సాయంత్రం ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన 'బృహత్ గీతోత్సవ' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం చేశారు.   'బృహత్ గీతోత్సవ'లో పవన్ మాట్లాడుతూ.. భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు.. భగవద్గీత మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి అన్నారు. భగవద్గీత ఒకసారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజ గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.   https://x.com/JanaSenaParty/status/1997882890093515003?s=20  
    -మూవీ లవర్స్ లో పండుగ జోష్  -భిన్నమైన జోనర్స్ తో తెరకెక్కాయి -ఏంటి ఆ చిత్రాలు      క్యాలెండర్ లో ఎన్ని పండగలు ఉన్నా అభిమానులకి మూవీ లవర్స్ కి  సినీ పండుగ ఇచ్చే కిక్ వేరు. పైగా ఒకే రోజు రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయితేనే పండగ వచ్చినట్టుగా వాళ్లంతా భావిస్తారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఎనిమిది సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై మెరిస్తే పండగ జాతర ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.     'కార్తీ'(Karthi)కి తెలుగు నాట ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని మరోసారి తన నటనతో మెస్మరైజ్ చెయ్యడానికి 'అన్నగారు వస్తారు'(Annagaru Vastharu)అనే చిత్రంతో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెల 12 న కార్తీ కెరీర్ లోనే హయ్యస్ట్ థియేటర్స్ లో విడుదల కానుంది. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కడం ఈ చిత్రం స్పెషాలిటీ. ఇక ఇదే రోజు రాజీవ్ కనకాల నట వారసుడు రోషన్ కనకాల 'మోగ్లీ 2025'(Mowgli 2025)తో సందడి చేయనున్నాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగాప్రచార చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించడం మోగ్లీ ప్రత్యేకత. ఇక పాటల ప్రపంచంలో రారాజు, అమరజీవి 'ఘంటసాల'(Ghantasala)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఘంటసాల' చిత్రం కూడా 12 నే  అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి ముస్తాబవుతుంది.      Also Read:  akhanda 2 :  తగ్గేదేలే      దీంతో 'ఘంటసాల' నామధేయంతో థియేటర్స్ మారుమోగనున్నాయి. ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య టైటిల్ రోల్ పోషించాడు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్న నందు హీరోగా తెరకెక్కిన సైక్ సిద్దార్ధ్ కూడా 12 నే సందడి చేయనుంది.  ఈషా, నా తెలుగోడు, ఇట్స్ ఓకే గురు, మిస్ టీరియస్ అనే మరో నాలుగు చిత్రాలు కూడా ఇదే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించనున్నాయి. ఈ నాలుగు చిత్రాలు భిన్నమైన జోనర్స్ లో తెరకెక్కడం మూవీ లవర్స్ కి కలిసొచ్చే అంశం. దీంతో ఒకే రోజు ఎనిమిది చిత్రాలు రావడంతో సినీ సర్కిల్స్ లో కూడా పండగ వాతావరణం వచ్చినట్లయ్యింది.        
  విభిన్న చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన రీసెంట్ మూవీ 'కాంత'(Kaantha). తమిళ్ లో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. నవంబర్ 14న థియేటర్లలో అడుగుపెట్టిన కాంత సినిమా.. ప్రశంసలు అయితే అందుకుంది కానీ, కాసులు కురిపించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.   'కాంత' సినిమా పీరియడ్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కింది. 1950 సమయంలో గురు శిష్యులైన డైరెక్టర్, హీరో మధ్య ఇగో క్లాష్ గా మొదలై.. మర్డర్ మిస్టరీగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. 1950 నాటి సినీ ప్రపంచం నేపథ్యంలో రూపొందిన 'కాంత'.. నటీనటుల అద్భుత పర్ఫార్మెన్స్, కథలో మలుపులతో ఆకట్టుకుంది. అయితే కమర్షియల్ గా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.   'కాంత' చిత్రం త్వరలో ఓటీటీలో అడుగుపెట్టనుంది. డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటలోకి రానుంది.   మరి 'కాంత' మూవీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.    
      అసలు ఏం జరుగుతుంది! సినీ ప్రముఖులు, విశ్లేషకులు ఏమంటున్నారు తగ్గేదేలే అనే విధంగా పరిస్థితి  ఫ్యాన్స్ ఏమంటున్నారు     ఫుల్ మాస్ ప్లెడ్జెడ్ మూవీలో గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపం తాలూకు రేంజ్ ని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది. అందుకే నట సింహం బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గా రూపాంతరం చెందాడు. అప్ కమింగ్ మూవీ 'అఖండ 2'(Akhanda 2)అనుకోని కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 12 గాని 25 గాని విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సినీ సర్కిల్స్ లో చాలా బలంగానే టాక్ రన్ అవుతుంది.     ఇక అఖండ 2 రిజల్ట్ పై పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు పలు మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతు అఘోర గా బాలయ్య తగ్గేదేలే అనే రీతిలో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు. అఖండ 2 ఎప్పుడు రిలీజైనా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది. హిట్ గా నిలవడమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అభిమానులు, ప్రేక్షకులు మూవీ చూసిన తర్వాత ఇది మా భారతీయ సినిమా అని గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరి చెప్తారని అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు  రిలీజ్ వాయిదాతో నిరుత్సాహంతో ఉన్న అభిమానులు,మూవీ లవర్స్ లో జోష్ ని నింపుతున్నాయి. జై బాలయ్య అంటు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.     also read:  100 కోట్లు అంట.. హిట్ అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి        రీసెంట్ గా అఖండ 2 నిర్మాతల్లో ఒకరైన రామ్ తన పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పాడు. అనిల్ రావిపూడి ట్వీట్ కి రామ్ రిప్లై ఇస్తు అఖండ 2 ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అవుతుందని కూడా బదులివ్వడం జరిగింది. 
  యమలీల మూవీతో ఇంద్రజ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆ పేరు అలాగే ఇప్పటికీ స్థిరపడిపోయింది. ఐతే ఇంద్రజ అసలు తన ఒరిజినల్ నేమ్ కాదంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.    రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "రాజాతి అనేది నా రియల్ నేమ్. అది కూడా ముద్దు పేరు. ఇక్కడ కన్నా, బుజ్జి అని ఎలా పిలుస్తారో అలా రాజాతి అని ముద్దుగా పిలిచేవారు. నేను చేసిన ఫస్ట్ మూవీ జంతర్ - మంతర్. భరత్ గారి డైరెక్షన్ లో ఆ మూవీ చేసాను. హీరోయిన్ గా ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. ఫస్ట్ డే పూజ రోజున ఆయన క్యారెక్టర్స్ ని నేరేట్ చేస్తూ ఇంద్రజ పాత్రలో ఈ అమ్మాయి నటిస్తుంది అని చెప్పారు. దాంతో ఆ పేపర్ మీద ఇంద్రజ - శ్రీకాంత్ అని పేరు పడిపోయింది. అప్పుడు మా నాన్న ఒక మాట అన్నారు. పేరు మార్చడం ఎందుకు అలా ఫాలో ఇపోదాం" అని చెప్పారు.    "మీ నవ్వుకు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాన్స్ ఉన్నారు" అని హోస్ట్ చెప్పింది. "అది నాకే తెలీదు జబర్దస్త్ వచ్చేవరకు. నన్ను నాకు తెలియజేసింది జబర్దస్త్ అనే ప్రతీ ఇంటర్వ్యూలో చెప్తాను. ఈటీవీ షోస్ చేస్తున్న దగ్గర నుంచి నన్ను ఇలా ఇష్టపడుతున్నారు అని తెలిసింది. సినిమాలో క్యారెక్టర్స్ లో నటిస్తాం కానీ ఇక్కడ షోస్ లో మనం మనలా ఉండొచ్చు. ఇప్పుడు నేను నాలుగు మూవీస్ లో నటిస్తున్నా. ఇంకా రెండు సినిమాలకి టైటిల్ ఫిక్స్ అవలేదు. చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్టులు నా వరకు వస్తున్నాయి. ఐతే ఈటీవీ, మల్లెమాల వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా ఏదైనా సబ్జెక్టు చేయాలనీ ఈ ఒక్క షోతో స్టిక్ అయ్యి ఉన్నాను." అని చెప్పింది ఇంద్రజ.  
  జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ కి 'డ్రాగన్'(Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బక్కగా అయ్యాడు. దీంతో ఆయన లుక్ పై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఒకే ఒక్క ఫోటోతో.. ఆ ట్రోల్స్ అన్నింటికీ చెక్ పెట్టాడు ఎన్టీఆర్. (NTR Neel)   సినిమా సినిమాకి లుక్ పరంగా వేరియేషన్ చూపించే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈ క్రమంలోనే డ్రాగన్ కోసం బక్కగా అయ్యాడు. దీంతో కొందరు.. ఎన్టీఆర్ బాగా బక్కగా అయిపోయాడని, ఫేస్ లో కళ కూడా పోయిందంటూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఫేస్ లో కూడా మునుపటి కళ కనిపిస్తోంది. డ్రాగన్ లో ఎన్టీఆర్ ని నీల్ అదిరిపోయే లుక్ లో చూపించబోతున్నాడని, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక అందరూ సర్ ప్రైజ్ అవ్వడం ఖాయమని.. ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది.    కాగా, డ్రాగన్ సినిమాని 2026 జూన్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ డేట్ మారనుంది. 2026 చివర్లో లేదా 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.    
  తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటి ప్రగతి. ఈమెలో నటన మాత్రమే కాదు బరువులు ఎత్తే కళ కూడా ఉంది. పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి దుమ్ము రేపుతున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ లెవెల్ లో గోల్డ్ మెడల్ ని సొంతం చేసుకున్నారు.    టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాష్టర్స్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్ షిప్ లో ఆమె భారత్ ని రిప్రెజెంట్ చేశారు. అలాగే నాలుగు పథకాలను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్నీ ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఓవర్ ఆల్ గా సిల్వర్ మెడల్,  డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ మెడల్, బెంచ్ అండ్ స్క్వాట్ లిఫ్టింగ్ లో రెండు సిల్వర్ మెడల్స్ ని సాధించారు.    ఇక సెలబ్రిటీస్ ఆమెను అభినందిస్తున్నారు. సింగర్స్ శ్రావణ భార్గవి, శ్రీరామచంద్ర, యాంకర్స్ స్రవంతి, అష్షు రెడ్డి, అరవింద్ కృష్ణా, జ్యోతక్క, మధుశాలిని, యాంకర్ ఝాన్సీ, నిఖిల్ విజయేంద్ర సింహ, నేహా చౌదరి, తేజస్విని గౌడ, రెజీనా కసాండ్ర వంటి వాళ్లంతా అభినందనలు చెప్తున్నారు.    ప్రగతి ఎప్పుడూ జిమ్ లో ఫిట్నెస్ లో రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఆమె 2023 నుంచి పవర్ లిఫ్టింగ్ లో ఎంట్రీ ఇచ్చి ఆమె రెండేళ్లలోనే ఎన్నో మెడల్స్ ని కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్, తెలంగాణ స్టేట్ లెవెల్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. తెనాలిలో జరిగిన నేషనల్ లెవెల్ పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచారు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ అలాగే  కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు.   ఇక 2024 లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో బ్రోన్జ్ మెడల్ ని సాధించగా ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఒక గోల్డ్ మూడు సిల్వర్ మెడల్స్ ని కైవసం చేసుకుని దేశ ప్రతిష్టను, ఇండస్ట్రీ ప్రతిష్టను మరింత పెంచారు ప్రగతి.  
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి. అయితే గొడవలు కూడా ఆరోగ్యంగా  ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ నేటి కాలంలో చాలా వరకు భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేసే విదంగా గొడవలు జరగడం చూస్తుంటాం.  అసలు భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? తెలుసుకుంటే.. భార్యాభర్తల మధ్య వాదనలు, గొడవలు జరుగుతూ ఉంటాయి.  అవన్నీ నిజంగా బంధాన్ని బలపరుస్తున్నాయా లేదా అనే విషయాన్ని గమనించుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది ఆరోగ్యకరంగా ఉండాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ అబిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకోవాలి.  అది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా సమస్యపై దృష్టి పెట్టేలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య బంధం విచ్చిన్నం కాకుండా బంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ వాదించుకున్న తర్వాత జరిగిన విషయం గురించి ఇద్దరూ లోతుగా  ఆలోచించాలి.  ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి గొడవ తర్వాత భార్యాభర్తలు తమ భాగస్వాములను మరింత అర్థం చేసుకోగలిగితే,  సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ బంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. భార్యాభర్తల మద్య గొడవ ఏదైనా అనుమానం, హింస,  కోపం, నియంత్రించడం,  భయపెట్టడం వంటి విషయాల ద్వారా చోటు చేసుకుంటే అది బార్యాభర్తల మద్య బంధాన్ని నాశనం చేస్తుంది. భార్యాభర్తల మధ్య  ఎన్ని గొడవలు జరిగినా అది చివరికి పరిష్కారం అవ్వాలి.  అలా ఉన్నప్పుడే ఆ బందం అందంగా, ఆనందంగా ఉంటుంది.  భార్యాభర్తలు కూడా ఇలాంటి గొడవల వల్ల దూరం కాకుండా ఉంటారు.  కానీ గొడవలు నిరంతరం జరుగుతూ పరిష్కారం మాత్రం జరగకపోతే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవవు.                                  *రూపశ్రీ.
  అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది.  దీనికి కారణం కేవలం బయట సమాజంలో కాదు.. ఇద్దరు వ్యక్తుల మద్య అభద్రతాభావం.  తమ స్థానం ఎక్కడ బలహీనం అవుతుందో అని అత్తగారు,  తనకు తన మాటకు ఎక్కడ విలువ లేకుండా పోతుందో అని కోడలు ఇద్దరూ తమ తమ పంతాలకు పోవడం వల్ల అత్తాకోడళ్ల మధ్య విభేదాలు వస్తుంటాయి. అయితే కొన్ని మ్యాజిక్ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల అత్తాకోడళ్ల బంధం ఎంతో పదిలంగా,  బలంగా,  సంతోషంగా ఉంటుంది.  ఆ  మ్యాజిక్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. నేటి కోడలే రేపటి అత్తగారు, ఇప్పటి అత్తగారు ఒకప్పుడు కోడలు  అనే మాట వినే ఉంటారు. అత్తగారి జీవితంలో అంచనాలు ఉంటాయి,  అనుభవాలు ఉంటాయి. కానీ కోడలి జీవితంలో ఆధునికత,  కలలు,  భవిష్యత్తు గురించి ఆశలు ఉంటాయి.  ఇవి రెండూ విరుద్దంగా అనిపిస్తాయి. అందుకే అత్తాకోడళ్ల మధ్య వ్యతిరేకత తలెత్తుతూ ఉంటుంది. అంచనాల గురించి ఓపెన్ గా.. కోడలి మీద అత్తకు, అత్త గురించి కోడలికి కొన్ని అంచనాలు ఉంటాయి.  అయితే విషయాన్ని మనసులో పెట్టుకుని ఎదుటి వారు,  వారికి వారే అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం పిచ్చితనం. ఇంటి బాధ్యతలు కోడలితో ఏవి పంచుకోవాలని అనుకుంటారో అత్తగారు ఓపెన్ గా చెప్పాలి. అలాగే కోడలు కూడా తన కెరీర్,  ప్రాధాన్యాల గురించి ఓపెన్ గా తన అత్తగారితో చెప్పాలి.  ఎందుకంటే అంచనాలు నెరవేరకపోతే అత్తాకోడళ్ల బంధం దెబ్బతింటుంది. అందుకే ముందే ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటే మంచిది. ప్రేమతోనే సరిహద్దులు.. అత్తాకోడళ్లు ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం వల్ల చాలా గొడవలు జరుగుతుంటాయి.  చాలా సార్లు అత్తలు తమ ఆధిపత్యం చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ అత్తాకోడళ్లు ప్రేమగానే మాట్లాడుకుని తమ సరిహద్దులు విధించుకుంటే చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. కానీ ఇద్దరూ ఒకరి విషయాలలో మరొకరు ఎక్కువ జోక్యం చేసుకుంటే పెద్ద గొడవలు జరుగుతాయి. గతం, అనుభవాలు... అత్త జీవితంలో అనుభవాలు చాలా ఉంటాయి. అలాగే కోడలి జీవితంలో అనుభవాలు ఉంటాయి. అత్తగారు తాను జీవితంలో ఎదుర్కున్న సమస్యలు, కుటుంబ పరంగా ఎదుర్కున్న కష్టాలు, చేసిన పోరాటాలు కోడలితో చెప్పుకుంటూ ఉండాలి, కోడలు తన చిన్నతనం తను పెరిగిన విధానం,  తన కష్టం,  భవిష్యత్తు గురించి తన ఆశలు చెప్పుకోవాలి. ఇవి ఇద్దరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి. అంతేకాదు.. అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటారు.  ఆ ఇల్లు సంతోషంగా, ఎంతో బాగా అబివృద్ది చెందాలంటే అత్తాకోడళ్లు ఇద్దరూ అవగాహనతో ఉండటం ముఖ్యం.   నిర్ణయాలు.. అత్తాకోఢల్లు ఇద్దరూ ఒక్కమాట మీద ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది.  అందుకే ఏ విషయం గురించి అయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.  కోడలు ఇలాగే ఉండాలనే నియమాలు విధించడం అత్తగారి గొప్పతనం అనిపించుకోదు, అత్తగారు చెప్పే ఏ విషయం గురించైనా ఆలోచించకుండా వ్యతిరేకత చూపడం కోడలి తెలివి అనిపించుకోదు. అత్తాకోడళ్లు ఇద్దరూ మాట్లాడుకుని వారి ఇగో సాటిసిపై అయ్యే దిశగా కాకుండా జీవితం గురించి, ఇంచి అబివృద్ది గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొగడ్తలు.. గొప్ప మెడిసిన్.. బంధం ఆరోగ్యంగా ఉండటంలో పొగడ్తలు చాలా గొప్పగా పనిచేస్తాయి.   అత్తగారు ఏదైనా బాగా చేసినప్పుడు కోడలు,  కోడలు ఏదైనా పనిని బాగా చేసినప్పుడు అత్తగారు.. ఒకరిని ఒకరు మెచ్చుకోవడం చేయాలి.  ఇలా మెచ్చుకోవడం ఇద్దరి మద్య బందాన్ని బలంగా మార్చుతుంది. అంతేకాదు.. ఒకరి మంచి అలవాట్లను మరొకరు మెచ్చుకోవడం, ఒకరికి ఒకరు మంచి స్నేహితురాలిగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల బందం పదిలంగా ఉంటుంది.                              *రూపశ్రీ.
జ్ఞాపకం అంటే జరిగిపోయిన ఒక సంఘటన తాలుకూ సందర్భాలు, మాటలు,  మనుషులు గుర్తుండిపోవడం.   ఇవి సంతోషం కలిగించేవి అయితే గుర్తు వచ్చిన ప్రతిసారీ సంతోషాన్నే కలిగిస్తాయి. కానీ.. అవి బాధపెట్టే విషయాలు అయితే మాత్రం వాటి ప్రభావం మామూలుగా ఉండదు. కొన్నిసార్లు గత సంఘటనలు,  జ్ఞాపకాలు హృదయంలో లోతైన గాయాన్ని మిగిల్చుతాయి. అలాంటి సమయాల్లో లోలోపలే నలిగిపోతాడు.  చాలా నరకం అనుభవిస్తాడు.  ఒంటరితనం ఫీలవుతాడు. కానీ  ఒంటరిగా అనిపించడం అంటే జీవితంలో చాలా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.  దీన్నుండి బయటకు రావడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. అంగీకారం.. బాధాకరమైన జ్ఞాపకాల నుండి బయటపడటానికి వాటిని అణచివేయడం కంటే అంగీకరించడం చాలా ముఖ్యం. సత్యాన్ని అంగీకరించడం ముందుకు సాగడానికి మొదటి అడుగు. కాబట్టి జరిగినవి ఏవైనా సరే.. వాటిని అంగీకరించాలి.  ఒకరు మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా,  నష్టం కలిగినా.. ఇలా ఏదైనా సరే..  దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి.  ఇలా చేస్తే జ్ఞాపకాలు బాధపెట్టవు. షేరింగ్.. జ్ఞాపకాలు బాధపెట్టినప్పుడు బాధను అందరితో పంచుకోవడం తప్పు. కుటుంబ సభ్యులు,  అర్థం చేసుకునే స్నేహితులు, లేదా కౌన్సిలర్ లతో జరిగింది చెప్పుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను విశ్లేషణ చేసుకుని ఆలోచించే సామర్థ్యం ఉండదు. అదే ఇలా అర్థం చేసుకోగలిగే వారు ఉంటే .. జరిగిన విషయం గురించి మంచి వివరణ, సలహా, ఊరట కలిగే విధంగా మాట్లాడటం వంటివి చేయగలుగుతారు. వ్యక్తీకరణ.. బాధను వ్యక్తీకరించడం కూడా ఒక కళే.. డైరీ రాయడం లేదా కళ-సృజనాత్మకత ద్వారా  భావాలను వ్యక్తపరచడం కూడా ఉపశమనం కలిగిస్తుంది. మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మంచి చికిత్స. అంతే కాదు.. బాధ నుండి బయటకు రావడానికి ఆ అక్షరాలే సహాయం చేస్తాయి. ధ్యానం, యోగ.. ధ్యానం,  యోగా సహాయం తీసుకోవడం కూడా జ్ఞాపకాల మిగుల్చే బాధ నుండి బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును ప్రశాంతపరచడమే కాకుండా వర్తమానంలో జీవించడం కూడా నేర్పుతుంది. బాధకు సమయం ఇవ్వవద్దు.. బిజీగా ఉండటం,  కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం,  ఏదో ఒక కొత్త పనిని చేయడం లేదా నేర్చుకోవడం  వలన జ్ఞాపకాల నుండి దూరం కావడానికి సహాయపడుతుంది.  కొత్త వాటిలో మునిగిపోయినప్పుడు బాధాకరమైన విషయాలు మసకబారుతాయి. అసలు వాటి గురించి ఆలోచించే అంత సమయం ఉండకుండా చూసుకోవాలి. జీవనశైలి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. బాగా తినడం, తగినంత నిద్రపోవడం,  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు.                                      *రూపశ్రీ.  
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. కల్తీ లేదా నకిలీ లవంగాలు.. మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి. కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు.. పుఢ్ పాయిజన్.. సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో వాపు, తలనొప్పి.. నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి మటాష్.. నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. లివర్ నాశనమే.. చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది. నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా.. ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది. నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి. నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...