LATEST NEWS
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని, అతనికి సంబంధించిన కేసును మూసివేస్తున్నామని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల దళితుడు అని చెప్పడానికి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. దళితుడు కాకపోయినప్పటికీ రోహిత్ వేముల తన కుల ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేశాడని, తాను దళితుడు కాదని బయటపడే పరిస్థితులు రావడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పోలీసులు కేసు మూసివేత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏవైనా అభ్యంతరాలు వున్నట్టయితే రోహిత్ వేముల కుటుంబ సభ్యులు కింది కోర్టులో సవాల్ చేసుకోవచ్చని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, అప్పటి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు ఏబీవీపీ నేతలకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. అయితే తెలంగాణ పోలీసులు కోర్టుకు సంబంధించిన వివరాలు అవాస్తవాలని రోహిత్ వేముల కుటుంబ సభ్యులు అంటున్నారు.
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.  తెలంగాణలో లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. రెండు రాష్ట్రాల్లో వేల కోట్లకు అధిపతులతో పాటు సామాన్యులు కూడా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత శ్రీమంతులు ఎవరనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం.  తెలంగాణ విషయానికి వస్తే... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత సంపన్న వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన తాతగారి పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. కెవి రంగా రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.  విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ. 4,568 కోట్లు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ లో చూపించారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతరెడ్డిని ఆయన పెళ్లాడారు.  ఏపీ విషయానికి వస్తే... గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనిక అభ్యర్థి. 2014లోనే ఆయన టీడీపీ తరపున నర్సరావుపేట లోక్ సభ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండటంతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవడంతో చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది. చంద్రశేఖర్ కుటుంబ ఆస్తులు రూ. 5,705 కోట్లు. మన దేశంలో పోటీ చేస్తున్న అత్యంత ధనిక వ్యక్తుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.  ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన చంద్రశేఖర్ కష్టపడి డాక్టర్ పట్టా తీసుకున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. యూఎస్ లో 'యూ వరల్డ్ ఆన్ లైన్ ట్రైనింగ్' పేరుతో నర్సింగ్, న్యాయ, వాణిజ్య, అకౌంటింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థను ప్రారంభించారు. బిజినెస్ మెన్ గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ వేల కోట్లు సంపాదించారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఒక వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. కోటిన్నర విలువ చేసే తన వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న శుక్రవారం నాడు నల్గొండలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నల్గొండలో తీన్మార్ మల్లన్న భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. చీఫ్ సెక్రటరీ ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి వెళ్ళి ఆస్తుల పేపర్లను అప్పగిస్తానని తీన్మార్  మల్లన్న చెప్పారు. క్లీన్ రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. తీన్మార్ మల్లన్న చేసినట్టుగా ఎలక్షన్లలో పోటీ చేసేవాళ్ళందరూ వాళ్ళ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తే భలే వుంటుంది కదూ!
ALSO ON TELUGUONE N E W S
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుకుమార్. లాజిక్స్ తో మ్యాజిక్ చేసే ఈ జీనియస్ డైరెక్టర్.. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇండియన్ టాప్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తారు అనడంలో సందేహం లేదు. అయితే సుకుమార్ మాత్రమే కాదు.. ఆయన శిష్యులు సైతం సినీ పరిశ్రమలో దర్శకులుగా సత్తా చాటుతున్నారు. ఇతర టాప్ డైరెక్టర్ల అసిస్టెంట్స్ తో పోలిస్తే.. సుకుమార్ అసిస్టెంట్స్ టాలీవుడ్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. 'కుమారి 21ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు.. ఇలా ఎందరో సుకుమార్ శిష్యులు దర్శకులుగా తమ మార్క్ చూపించారు. ఇప్పుడు ఈ లిస్టులో అర్జున్ వై.కె అనే మరో దర్శకుడు చేరాడు. ఈయన సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్రసన్న వదనం'కి దర్శకత్వం వహించాడు. శుక్రవారం(మే 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ తెచ్చుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి తమ మార్క్ చూపిస్తున్నారు.
Actor Vishnu Manchu is working ambitiously for his dream project Kannappa. The first look of the movie unveiled on the auspicious day of Mahashivaratri received a thumping response. The presence of several Pan India stars make this one of the most anticipated movies. It is known that, Akshay Kumar who is playing an important role joined the shoot a few days ago. Meanwhile, the actor wrapped up his part of shoot. Vishnu disclosed the news and also shared a pic with the Bollywood Superstar. "Kannappa" is poised to be a cinematic spectacle, delving into the story of a courageous warrior turned devout follower of Lord Shiva, Kannappa, whose unwavering faith continues to inspire across generations. Vishnu Manchu, renowned for his versatility and dedication, embodies this legendary character with fervor and reverence. Produced by Mohan Babu and directed by Mukesh Kumar Singh the movie has a stellar cast featuring Mohan Lal, Prabhas, and Sarathkumar in pivotal roles. The shoot of this Pan India project reached final stages.
Mass Maharaja Ravi Teja, who was last seen in Eagle, disappointed his fans and audiences big time. Hits or flops do not change the way Ravi Teja signs films in his career. He has three films on floors already. If this was not enough, the mass Maharaja has also signed a film in the direction of KV Anudeep, who gave the blockbuster hit Jathi Ratnalu and made Prince with Siva Karthikeyan. Prince became below average film in both Tamil and Telugu. According to our close sources, Raviteja wanted to act in an out-and-out comedy entertainer to entertain his ardent fans. Anudeep is re writing the same. The film is going to be full fun entertainer in vintage Raviteja's style. Makers considering the title Donga - Police for the film. Currently, the film's pre production work is going on, shoot begins by year end. Now, the film's production changed. Sithara Entertainments planned to produce the film, but dropped as they are busy with Raviteja 75. Now, People Media Factory which produced Dhamaka and Eagle. We hear is that the story will explore the fun relationship between a thief and police. Sandalwood beauties Shraddha Srinath and Rukmini Vasanth are in consideration for female lead roles. The word is also Raviteja will be playing thief character while heroine will be the Police.
సినిమా పేరు: శబరి తారాగణం: వరలక్ష్మీ శరత్ కుమార్, మైమ్ గోపి, గణేష్ వెంకట్రామన్, నివేక్ష, శశాంక్, మధునందన్ తదితరులు సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల రచన, దర్శకత్వం: అనిల్‌ కాట్జ్ నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల బ్యానర్: మహా మూవీస్ విడుదల తేదీ: మే 3, 2024 'క్రాక్', 'నాంది', 'వీరసింహారెడ్డి', 'హనుమాన్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'శబరి'. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్(గణేష్ వెంకట్రామన్)ని కాదనుకొని.. తన కూతురు రియా(నివేక్ష)ను తీసుకొని ముంబై నుంచి వైజాగ్ వస్తుంది సంజన(వరలక్ష్మీ శరత్ కుమార్). తన స్నేహితుడు, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్ గా ఉద్యోగంలో చేరుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో సంజనకు ఊహించని సమస్య ఎదురవుతుంది. సైకోగా మారిన సూర్యం(మైమ్ గోపి) అనే వ్యక్తి.. రియా తన బిడ్డని, తనకి అప్పగించకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగుతాడు. మరోవైపు సంజన భర్త అరవింద్ కూడా తన కూతురిని తనకి అప్పగించాలంటూ కోర్టుని ఆశ్రయిస్తాడు. అసలు రియా ఎవరి కూతురు? అరవింద్ కి, సూర్యంకి ఏమైనా సంబంధం ఉందా? అరవింద్ కి సంజన దూరం కావడానికి కారణమేంటి? తన కూతురు రియాని దక్కించుకోవడం కోసం సంజన ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: ఈ సృష్టిలో తల్లి ప్రేమని మించింది లేదు. అన్ని ప్రేమల్లోనూ తల్లి ప్రేమే గొప్పది. తన బిడ్డ కోసం తల్లి ఎవరినైనా వదులుకుంటుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, ప్రపంచాన్ని అయినా ఎదిరిస్తుంది. అలాంటి ఓ తల్లి కథే ఈ 'శబరి'. అయితే దర్శకుడు దీనిని సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు. ఈ తరహా సినిమాలలో బలమైన భావోద్వేగాలతో పాటు, ఊహించని మలుపులు కూడా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమైన సంజనగా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర పరిచయం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరమై ఒంటరిగా కూతురిని చూసుకోవడం.. వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. సంజన పాత్రని, అందులోని ఎమోషన్ ని పరిచయం చేస్తూ.. నెమ్మదిగా కథలోకి వెళ్తుంది. సైకో సూర్యం పాత్ర రాకతో కథలో వేగం పెరుగుతుంది. తరువాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు కట్టి పడేశాయి. సెకండాఫ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. సెకండాఫ్ లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మొత్తానికి ఓ వైపు బిడ్డ కోసం తల్లి చేసే పోరాటం, మరోవైపు ఊహించని ట్విస్ట్ లతో సినిమా మెప్పించింది. అయితే సినిమాలో ప్రతిదీ డిటైల్డ్ గా చూపించే ప్రయత్నం చేయడంతో.. కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఆ విషయంపై దృష్టి పెట్టినట్లయితే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. గోపిసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా ఆయన నేపథ్యం సంగీతం ఉంది. రాహుల్, నాని కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: బిడ్డను కాపాడుకోవడం కోసం పోరాడే సింగిల్ మదర్ సంజన పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. తన సహజమైన నటనతో మెప్పించింది. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి కూడా మ్యాజిక్ చేశాడు. అరవింద్ గా గణేష్ వెంకట్రామన్, రియాగా నివేక్ష ఆకట్టుకున్నారు. శశాంక్, మధునందన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి చేసే పోరాటమే ఈ 'శబరి' చిత్రం. కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. బలమైన భావోద్వేగాలు, ఊహించని మలుపులు సినిమాని నిలబెట్టాయి. హత్తుకునే మదర్ సెంటిమెంట్, థ్రిల్ ఇచ్చే ట్విస్ట్ ల కోసం ఈ సినిమాని హ్యాపీగా చూసేయొచ్చు. రేటింగ్: 2.75/5 
నిర్మాతలు మాములు వాళ్ళు కాదు. వాళ్ళని అసలు నమ్మకూడదు. తమ సినిమా ప్రమోషన్స్ కోసమే అదంతా సృష్టించే వాళ్ళు. ఇపుడు ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరో కాదు. 2000 వ సంవత్సరంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల భామ  సోనాలి బింద్రే సోనాలి బింద్రే కి  2002 లో గోల్డి బెహ్ల్ తో వివాహం జరిగింది. ఇక అప్పటినుంచి సినిమాల్లో చెయ్యడం తగ్గించింది. మళ్ళీ  2022 లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 అనే వెబ్ మూవీలో నటిస్తుంది.  అందుకు సంబంధించిన  ప్రమోషన్స్ లో సోనాలి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. 1994 లో ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితులు కొంచం భిన్నంగా ఉండేవి . నా సహనటులతో నాకు ఎఫైర్ ఉందనే రూమర్స్ వచ్చేవి. పైగా ఆ రూమర్స్ సృష్టించేది ఎవరో కాదు నా  నిర్మాతలే. సినిమా ప్రమోషన్స్ కోసమే వాళ్ళు అలా సృష్టించే వాళ్ళు. పైగా మీడియాకి కూడా వెల్లడించేవాళ్లు. మొదట్లో ఈ విషయం నాకు తెలిసేది కాదు. తర్వాత అర్ధమయ్యి షాక్ కి గురయ్యాను.అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లల్లో సన్నగా ఉండే దాన్ని. దాంతో  చాలా మంది నన్ను అవహేళన చేసేవారు. మిగతా హీరోయిన్లు  బొద్దుగా  ఉన్నారని నిర్మాతలు కూడా కామెంట్స్ చేసే వాళ్ళని చెప్పుకొచ్చింది .అలాగే ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు. డాన్స్ అండ్ యాక్టింగ్ కి ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. సినిమాల్లోకి వచ్చాకే నేర్చుకున్నానని కూడా చెప్పింది. 1994 లో వచ్చిన ఆగ్ ఆమె మొదటి సినిమా. నిజానికి ఆ సినిమాలో హీరోయిన్ దివ్య భారతి. ఆమె ఆకస్మిక మరణంతో సోనాలికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది.చిరంజీవి, మహేష్ బాబు ,నాగార్జున,బాలకృష్ణ  వంటి టాప్ స్టార్ తో కలిసి నటించిన సోనాలి ఆల్ లాంగ్వేజెస్ కలుపుకొని 45 చిత్రాలకి పైనే చేసింది   
సినిమా పేరు: ఆ ఒక్కటీ అడక్కు  తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, జామీ లివర్, హరితేజ, అరియానా తదితరులు  దర్శకత్వం: మల్లి అంకం  సంగీతం: గోపి సుందర్  నిర్మాత:  రాజీవ్ చిలక  మాటలు: అబ్బూరి రవి  ఎడిటర్: చోట కె ప్రసాద్  కెమెరా: సూర్య  విడుదల తేదీ: మే 3  2024 అప్పట్లో కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. కొంతకాలంగా సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లరి నరేష్ మునుపటిలా కామెడీతో మ్యాజిక్ చేశాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: గణపతి(అల్లరి నరేష్) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేస్తుంటాడు. అతని తమ్ముడుకి పెళ్ళయ్యి, ఒక పాప కూడా ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగమున్నా, పెళ్లి వయసు దాటిపోతున్నా గణకి మాత్రం వివాహం జరగదు. 50 సంబంధాలు చూసినా ఏదీ సెట్ అవ్వదు. బంధువులు, తెలిసినవాళ్లంతా "పెళ్ళెప్పుడు", "పప్పన్నం ఎప్పుడు పెడతావు" అని అడుగుతూనే ఉంటారు. అలాంటి గణ, అనుకోకుండా వివాహాలు కుదిర్చే హ్యాపీ మాట్రిమోనీని సంప్రదిస్తాడు. అక్కడ వచ్చిన వధువుల ప్రొఫైల్స్ ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. అప్పటికే సిద్ధిని బయట చూసి, ఆమెపై సదాభిప్రాయమున్న గణ.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ సిద్ధి మాత్రం గణని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. గణకి సిద్ధి నో చెప్పడానికి కారణమేంటి? అసలు సిద్ధి ఎవరు? ఆమె గణ జీవితంలోకి ఎలా వచ్చింది? అసలు గణకి పెళ్లి ఆలస్యం అవ్వడానికి కారణమేంటి? చివరికి తాను ఇష్టపడిన సిద్ధిని పెళ్లి చేసుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: మాట్రిమోనీ పేరుతో బయట ఎన్నో మోసాలు జరగడం చూస్తున్నాం. దానిని కథా వస్తువుగా ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ సీరియస్ పాయింట్ ని తీసుకొని, ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లీడు దాటిపోతున్నా, ఇంకా సింగిల్ గా ఉండే యువకులకు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలిసిందే. తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నతో ఇబ్బంది పెడతారు. అలా ఇబ్బంది పడే ఓ యువకుడి పాత్రే ఈ సినిమాలోని కథానాయకుడిది.  ఓ వైపు పెళ్లికాని ప్రసాద్ లాంటి హీరో పాత్ర, మరోవైపు మాట్రిమోనీ పేరుతో మోసాలు.. ఈ రెండింటిని కలుపుతూ కథని అల్లుకున్నారు. కథ ఆలోచన బాగున్నప్పటికీ, దానిని ఆసక్తికరంగా మలిచి, ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. అల్లరి నరేష్ కొంచెం గ్యాప్ తరువాత చేసిన కామెడీ సినిమా కావడంతో.. ప్రేక్షకులు కామెడీ ఓ రేంజ్ లో ఆశిస్తారు. అలా ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అక్కడక్కడా మాత్రమే కొన్ని నవ్వులు ఉన్నాయి. మునుపటి అల్లరి నరేష్ సినిమాలతో పోలిస్తే కామెడీ డోస్ బాగా తగ్గిపోయింది. హీరో పెళ్లి గోల, హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని హీరో అనుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ పరవాలేదు అన్నట్టుగా సాగింది. ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అవకాశముంది. ఓ రకంగా సినిమాలో అదే హైలైట్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ లో కామెడీ డోస్ మరింత తగ్గింది. ముఖ్యంగా చివరి 30 నిమిషాల ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఒకట్రెండు సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. మొత్తానికి కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు అన్నట్టుగా సినిమా సాగింది. సన్నివేశాలను కొత్తగా రాసుకొని, కామెడీ డోస్ పెంచినట్లయితే.. సినిమా అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది. నటీనటుల పనితీరు: అల్లరి నరేష్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. సిద్ధి పాత్రకు ఫరియా అబ్దుల్లా పూర్తి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ మరదలు పాత్రలో నటించిన జామీ లివర్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. తనదైన కామెడీతో కట్టిపడేసింది. తెలుగులో ఆమెకి ఇంకా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్, హరితేజ, అరియానా తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. చాలారోజుల తర్వాత అల్లరి నరేష్ కామెడీ సినిమా చేశాడు.. ఓ రేంజ్ లో నవ్వుకోవచ్చు అనే అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ చెందుతారు. కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో పరవాలేదు అనేలా ఉంది. పెళ్లికాని యువకుల బాధని, మాట్రిమోనీ పేరుతో బయట జరుగుతున్న మోసాలను చూపించిన ఈ సినిమాను.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5  - గంగసాని
క్యారక్టర్ ఆర్టిస్ట్ కి కూడా స్టార్ డం తెచ్చిన నటి  వరలక్ష్మి శరత్ కుమార్. పాత్ర ఏదైనా సరే రఫ్ ఆడించడం ఆమె నైజం. తను ఉన్న సినిమా  ఖచ్చితంగా  బాగుంటుందనే ఆలోచనని కూడా ప్రేక్షకుల్లో కలిగించింది.పేరుకే తమిళ నటి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెలుగు నటే అని అంటారు. అంతలా అభిమానాన్ని పొందింది. తాజాగా తనకి ఎదురైన క్యాస్టింగ్ అనుభవం గురించి చెప్పింది ఇండస్ట్రీలో ఏ చిన్న సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చాలు. ఆ తర్వాత  దూసుకుపోవచ్చని అంటారు. అలాంటిది వరలక్ష్మిది  మాములు బ్యాక్ గ్రౌండా. తండ్రి శరత్ కుమార్ తమిళనాట బడా స్టార్. కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక పొలిటికల్ పార్టీని  కూడా స్థాపించాడంటే ఆయన రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ వరలక్ష్మి కూడా  క్యాస్టింగ్  కౌచ్ ని ఎదుర్కొంది. ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్ హెడ్ ఒక సినిమా విషయమై తనతో  మాట్లాడేందుకు వచ్చాడు.డిస్కర్షన్  ముగిశాక మనం మళ్లీ బయట కలుద్దామని చెప్పాడు.ఎందుకని  అడిగితే వేరే పని కోసం అన్నాడు. రూం కూడా  బుక్ చేస్తానని చెప్పాడు. అప్పుడు గాని  వరలక్ష్మి కి విషయం అర్ధం కాలేదు. పైగా అతను వరలక్ష్మి ఇంటిలోనే ఆ విధంగా మాట్లాడాడు.దాంతో  సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.ఆ  తర్వాత  ఛానల్ కూడా అతన్ని   తీసేసింది ఇండస్ట్రీలో తనకు ఇదొక్కటే చేదు అనుభవం కాదు. కమిట్ మెంట్ కి ఒప్పుకోలేదని  కొన్ని సినిమాల నుంచి కూడా  తప్పించారు. అయినా సరే క్యారెక్టరే ముఖ్యం అని భావించి నేడు టాప్ స్టార్ గా వెలుగొందుతుంది.పైగా  వేరే అమ్మాయిలతో ఇండస్ట్రీ జనాలు ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకొని  శక్తి పేరుతో ఒక ఎన్జీవో పెట్టి ఇండస్ట్రీలో మహిళలకు అండగా నిలుస్తుంది. ప్రస్తుతం శబరి అనే మూవీ తో థియేటర్ లలో ఉంది. ఇటీవలే ముంబైకి చెందిన నీకొలాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పిఎస్, హనుమాన్ లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.   
భారతీయుల జీవన విధానంలో సినిమా అనేది నిత్యకృత్యమయిపోయింది. రోజుకి ఒక సినిమా అయినా చూడందే నిద్రపోనీ వాళ్ళు కోట్లల్లోనే ఉంటారు. ఇక సినిమా విడుదల రోజు చూడాలి. థియేటర్ ల దగ్గర  డాన్స్ లు,మేళతాళాల చప్పుళ్ళు   బాణాసంచా మోతలతో పెద్ద హడావిడే  చేస్తారు. మరీ ఇంతలా ఆనందాన్ని ఇస్తున్న సినిమా ఎప్పుడు విడుదలయింది. ఆ సినిమా ఏంటి మొట్టమొదటి భారతీయ సినిమా రాజా హరిచంద్ర. మే 3  1913 సంవత్సరం విడుదలైంది. అంటే నేటికీ  నూట పదకొండు సంవత్సరాలు అవుతుంది. అసేతు హిమాచలం సాక్షిగా  వెండి తెరపై సగర్వంగా ప్రదర్శితమయ్యింది. కాకపోతే  సైలెన్స్ చిత్రంగా తెరకెక్కింది. అంటే ఎలాంటి మాటలు, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండవు. కేవలం పాత్రలు మాత్రమే కనపడతాయి. పురాణాల్లోని రాజా హరిచంద్ర జీవిత కథ ఆధారంగా నిర్మాణం జరుపుకుంది.మరాఠీ నటులు ఎక్కువ భాగం  నటించారు. ఇరవై వేలరూపాయిల బడ్జట్ తో  నలభై నిమిషాల నిడివితో తెరకెక్కింది దాదాసాహెబ్ ఫాల్కే ఈ చిత్రానికి  దర్శకత్వం వహించారు. దాంతో  ఇండియన్ సినిమా పితామహుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. నేటికీ కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద అవార్డుల్ని ఇస్తుంది. ఆ అవార్డు అందుకోవడాన్ని సినీ ప్రముఖులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక రాజా హరిచంద్ర ప్రీమియర్ షో ని కూడా జరుపుకుంది ఏప్రిల్ ఇరవై ఒకటిన ముంబైలో ని ఒలింపిక్ థియేటర్ లో ప్రదర్శితమయ్యింది. ఏది ఏమైనా తింటే గారెలు తినాలి..వింటే భారతం వినాలి.. చూస్తే సినిమా చూడాలి  
ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద. 
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.                                                  *రూపశ్రీ.