LATEST NEWS
  అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక్కడి ప్రాంతీయ సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత చరిష్మా పార్టీల జయాపజయాలను శాసిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి రాజకీయ అడుగులపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తుండగా, టోన్ న్యూస్‌ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి.  పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకుంటూనే, తన భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. రాజకీయ వ్యూహం మరియు అంతరార్థాలు ప్రభాకర్ చౌదరి సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ, జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవులను నిర్వహించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ మరియు ప్రజాదరణ ఉన్నాయి. తాజా పరిణామాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న శాసనమండలి (MLC) స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.  గతంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఇది ఒక రకంగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని చెబుతూనే, తన సీనియారిటీకి మరియు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తగిన గుర్తింపు దక్కాలనే ఆకాంక్షను ఆయన బలంగా వినిపించారు. ఒకవేళ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తే చట్టసభల్లో ప్రజా సమస్యలపై గళమెత్తడానికి సిద్ధంగా ఉన్నానని, ఇవ్వకపోయినా ఒక సాధారణ కార్యకర్తలా పార్టీలోనే కొనసాగుతానని చెప్పడం వెనుక రాజకీయ పరిణతి కనిపిస్తుంది. రాజకీయ పరిణామాలు మరియు అంతస్సూత్రాలురాయలసీమ రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్న ఫ్యాక్షనిజం తీరుపై, ప్రస్తుత స్వార్థపూరిత రాజకీయాలపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గతంలో ఫ్యాక్షనిజానికి కులం, మతం లేవని, గ్రూపుల మధ్య మాత్రమే వైషమ్యాలు ఉండేవని పేర్కొన్నారు. కానీ నేడు రాజకీయం కలుషితమై ఫ్యాక్షన్‌ను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తులు ఎదిగే అవకాశం కనుచూపు మేరలో లేదని, సంప్రదాయ వారసత్వ పార్టీలే రాజ్యమేలుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు రావడానికి మరింత సమయం పడుతుందనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు.  ఈ పరిణామాలు అనంతపురం జిల్లాలో టిడిపి అంతర్గత గ్రూపు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభాకర్ చౌదరికి తగిన ప్రాధాన్యత దక్కకుంటే జిల్లాలో పార్టీ క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంరానున్న రోజుల్లో ప్రభాకర్ చౌదరి భవిష్యత్తు పూర్తిగా టిడిపి అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే, అనంతపురం జిల్లాలో పార్టీ మరింత పుంజుకుంటుంది. ఒకవేళ అధిష్టానం ఆయనను విస్మరిస్తే, స్థానిక సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఆయన పార్టీ మారే యోచనలో లేనప్పటికీ, ద్వితీయ శ్రేణి నాయకులు మరియు అనుచరుల ఒత్తిడి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయానికైనా దారితీయవచ్చు. పూర్తి చర్చను టోన్ న్యూస్‌లో తప్పక వీక్షించండి.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.  సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్..  2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా  రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే..  2019 ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.  2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి  కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత  వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు.   దీంతో   2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్  వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది.  దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు.   ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆ దిశగా ఇప్పటికే  జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.   Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone
  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం, నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి చేరి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. రెండు దశాబ్దాల తన ప్రజా జీవితం మరుపురాని మధుర జ్ఞాపకం అని ఆయన కొనియాడారు. కేవలం రేవంత్ రెడ్డి అనే పేరుతో ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణాన్ని, ప్రజలు ఆదరించి 'రేవంతన్న'గా తమ గుండెల్లో నిలిపిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభమైన తన తొలి రాజకీయ అడుగులను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా మిడ్జిల్ లో మొదలైన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో సందర్భాలు, మరెన్నో రాజకీయ పరిణామాలు, తీవ్రమైన సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అయితే ప్రతి కష్టకాలంలోనూ, ప్రతి మలుపులోనూ ప్రజలు తనకు అండగా నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సుదీర్ఘ ప్రస్థానం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాదరణ, స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలనేదే తన ఏకైక సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను ఒక సామాన్య శ్రామికుడిగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే ఒక నమ్మకమైన సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార గర్వం లేకుండా, కేవలం ప్రజల మనిషిగా, అందరి 'రేవంతన్న'గా ప్రజా హృదయాల్లో మరింత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడమే తన ఆశయమని ఆయన ఈ మైలురాయి సందర్భంగా ఉద్ఘాటించారు. 2006 నుంచి 2026 వరకు సాగిన ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒంటరి పోరాటాలు చేసి, చివరకు ప్రజా బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రయాణం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం.  
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది.  ఈసీ ఆదేశాల మేరకు   కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.   తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ..  రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే..  ఈ పేరుపై  వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను  కు సర్పించాలని ఈసీ  కవితకు లేఖ రాసింది.   కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత..  ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ..  ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు.  గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి  పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా  ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును  తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది.  తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..  ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది.  ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics
వైసీపీ వచ్చే ఎన్నికలలోనూ ఓటమి ఖరారని ఇప్పుడే మానసికంగా ఫిక్సైపోయిదా? వచ్చే ఎన్నికలలో కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు తాజాగాకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో   చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) విషయంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలను ఎత్తి చూపుతూ పరిశీలకులు ఔననే అంటున్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.   కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను గత నెల 15 నుండి ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా  విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిశాక, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను   ప్రకటిస్తారు. అయితే ఈ 3 నెలల సుదీర్ఘ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ విమర్శిస్తోంది.  ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే..  క్షేత్రస్థాయిలో  తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ  మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.    బూత్‌కు 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందనీ సర్ గడువు నెల రోజులు పెంచాలంటూ వైసీపీ  వినతిపత్రాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతోందా? అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందన్న విషయంలో రహస్యమేదీ ఉండదు.. రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది.  కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు  ప్రతి ఇంటికీ వెళ్లి..  నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ   పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిశీలనలో  అర్హులైన ఏ  పౌరుడి ఓటు పోయే అవకాశమే ఉండదు.   పోతే గీతే..  ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు..  చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఇదే వైసీపీని భయపెడుతోంది. అలా తొలగిపోయే ఓట్లన్నీ తమవేనని చెప్పుకుంటోంది. అలా చెప్పుకోవడం ద్వారా.. ప్రతి బూత్ కూ తమవి దాదాపు 50 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పకనే చెప్పుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో..    వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి బూత్‌లోనూ భారీగా  దొంగ ఓట్లను చేర్పించారన్న బలమైన ఆరోపణలను చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ దొంగ ఓట్లు తొలగిపోతుండటంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందంటున్నారు.     YSRCP Allegations on ECI, Voter Verification Process AP, Special Intensive Revision
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వివాదం రాజుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా రాజకీయాలు, సినీ రంగానికి సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగే మాటల యుద్ధాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక పెద్ద వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను తీవ్రంగా ఊపేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలకు, బండ్ల గణేష్ అంతే ఘాటుగా సమాధానమిస్తూ వేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ తీవ్రమైన చర్చ ఇండస్ట్రీలోనూ, సాధారణ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఒక వివాదాస్పద కేసులో యూట్యూబర్ 'రావణ్' అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ అరెస్ట్, కోర్టు బెయిల్ అంశాలపై నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏంటీ నాటకం, దౌర్జన్యం? ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, కోర్టు బెయిల్ ఇస్తుంది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు, మళ్లీ కోర్టు బెయిల్ ఇస్తుంది. ఇలా వరుసగా అరెస్ట్ చేయడం, కోర్టులు బెయిల్ ఇవ్వడం చూస్తుంటే కోర్టు ఏం చెబుతోందో మీకు అర్థం కావడం లేదా? మీరు పెడుతున్నవి తప్పుడు కేసులు, అరెస్ట్ చేయొద్దని కోర్టులు చెబుతున్నా వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం ఇందుకేనా అధికారంలోకి వచ్చింది? ఏంటీ కక్ష సాధింపు? ఇంత ఓపెన్‌గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? దేశం మొత్తం ఈ పరిణామాలను చూస్తోంది. మీరు చేస్తోంది ముమ్మాటికీ తప్పు. మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కు మద్దతుగా నిలబడతాం’’ అంటూ ఏపీ ప్రభుత్వంపై అత్యంత తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యల వీడియోపై నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్ ప్రవర్తనను పూర్తిగా తప్పుబడుతూ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి.. జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది. కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది’’ అంటూ బండ్ల గణేష్ అత్యంత కఠినమైన పదాలతో హితవు పలికారు. బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. చాలా మంది నెటిజన్లు బండ్ల గణేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో సమాజంలో ఎన్నో పెద్ద సంఘటనలు, ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేవని ప్రకాష్ రాజ్ నోరు, ఇప్పుడు కేవలం ఈ ‘రావణ్’ అనే వివాదాస్పద వ్యక్తి విషయంలో మాత్రమే ఎందుకు లేస్తుంది? అంటూ ప్రజలు కూడా ప్రకాష్ రాజ్‌ను సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అభివ్యక్తి స్వేచ్ఛ పేరుతో తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు, బండ్ల గణేష్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త రాజకీయ, సినీ వివాదానికి తెరలేపింది. ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.       Bandla Ganesh, Prakash Raj, AP Government, Youtuber Raavan, Bandla Ganesh Twitter, Prakash Raj Comments, Tollywood Controversies
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'. జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా 1.40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్‌లో 1.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీంతో కేవలం ఒకే ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా 3.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నైట్ షోలలో ఏకంగా 38.08 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌కు నిదర్శనంగా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో సత్యదేవ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సక్సెస్ మీట్ వేదికగా సత్యదేవ్ మాట్లాడుతూ, "అది నాకు కొత్త కాదు.. నేను ఎప్పుడూ సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేస్తుంటాను" అంటూ ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సత్యదేవ్ నోట ఈ మాట వినగానే ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. అయితే ఆయన అన్న మాటల వెనుక ఉన్న అసలు అర్థాన్ని ఆ తర్వాత ఆయనే స్వయంగా వివరించారు. తాను నిజ జీవితంలో ఎంచుకునే విభిన్నమైన పాత్రల గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం చేశారు. ఒక నటుడిగా తాను చేసే ప్రతి క్యారెక్టర్‌తోనూ మానసికంగా ప్రయాణం చేస్తానని, ఆ పాత్రలోనే లీనమై జీవిస్తానని చెప్పారు. 'రావు బహదూర్' సినిమాలో తాను పోషించిన భువనరామప్ప రావు బహదూర్ పాత్ర కూడా తన గుండెకు అంతగా హత్తుకుపోయిందని, అందుకే ఆ క్యారెక్టర్‌తో తాను సహజీవనం చేశానని ఎమోషనల్‌గా వివరించారు. ఈ చిత్రంలో సత్యదేవ్ 1968 నుండి 1991 వరకు సాగే విభిన్న కాలక్రమాల్లో, యువకుడి నుండి లివర్ క్యాన్సర్ చివరి దశలో ఉన్న వృద్ధుడి వరకు రకరకాల మేకోవర్లలో కనిపించి అద్భుతమైన నటనను కనబరిచారు. 169 నిమిషాల నిడివి గల ఈ క్లిష్టమైన సైకలాజికల్ డ్రామాలో ఒకే గదికి పరిమితమైన రాజుగా, భ్రమలు, అనుమానాలతో సతమతమయ్యే వ్యసనపరుడిగా సత్యదేవ్ నటన కెరీర్ బెస్ట్ అనిపించుకుంటోంది. ఈ పాత్ర తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని, అందుకే షూటింగ్ పూర్తయినా ఆ మూడ్ నుండి బయటకు రావడానికి సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. కేవలం సంచలనం కోసమే కాకుండా, ఒక నటుడిగా పాత్రలపై తనకు ఉండే అంకితభావాన్ని చాటిచెప్పడానికే సత్యదేవ్ ఈ రకమైన పోలికను ఉపయోగించారు. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, రంగు, రక్తసంబంధాల పిచ్చిని బలంగా ప్రశ్నిస్తోంది. వికాస్ ముప్పాల, దీపా థామస్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు సినిమా సరిహద్దులను విస్తరిస్తోందని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా, సక్సెస్ మీట్‌లో సత్యదేవ్ ప్లే చేసిన ఈ 'సహజీవనం' వర్డ్ ట్రిక్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.     Satyadev, Rao Bahadur, Rao Bahadur Box Office Collections, Venkatesh Maha, Satyadev Live In Relationship Comments, Rao Bahadur Success Meet
బాలీవుడ్ ప్రముఖ నటి సెలీనా జైట్లీ తన వైవాహిక జీవితంలోని అత్యంత చీకటి కోణాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది. మంచు విష్ణు సరసన 'సూర్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార, 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. అందరూ ఆమె జీవితం చాలా అందంగా సాగిపోతోందని అనుకున్నారు, కానీ ఆమె అంతరంగంలో ఒక పెద్ద పీడకలను అనుభవించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో, ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న నరకాన్ని గుర్తుచేసుకుని ఒక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. తన 15వ వెడ్డింగ్ యానివర్సరీకి కొన్ని రోజుల ముందు జరిగిన ఒక దారుణమైన సంఘటనను సెలీనా గుర్తుచేసుకుంది. ఒకరోజు ఆమె భర్త పీటర్ హాగ్ ఆమెను కొండ కింద రోడ్డుపైనే కార్లో నుంచి దించేసి వెళ్ళిపోయాడు. సెలీనా నడుచుకుంటూ కొండపై ఉన్న తన ఇంటికి చేరుకునే సరికి, ఆమె కవల పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆస్ట్రియా మునిసిపాలిటీ లేదా రెసిడెన్స్ స్టేటస్‌కి సంబంధించిన ఏదో లేఖ వచ్చిందని ఆమె భావించింది. దాన్ని అనువదించి చదివే ఓపిక లేక, తన కవల పిల్లల చేతికి ఇచ్చి చదవమని చెప్పింది. కానీ ఆ లేఖలో ఉన్నది పెళ్లి రోజు బహుమతి నెపంతో పంపిన విడాకుల నోటీసు అని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. తన చిన్న పిల్లల నోటి నుంచే ఆ ఘోరమైన విడాకుల నోటీసును వినాల్సి రావడం ఆమె జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గాయంగా మిగిలిపోయింది. ఆ నోటీసులో ఆమెపై ఎన్నో అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ, పెళ్లి బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. కోర్టు మొదటి విచారణ తర్వాత, నవంబర్ వరకు ఇద్దరూ సామరస్యంగా విడిపోయేందుకు ప్రయత్నించాలని జడ్జి సూచించారు. ఆ సమయంలో సెలీనా బ్యాంక్ ఖాతాలో చాలా తక్కువ డబ్బు ఉంది. భర్త మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా వేధిస్తున్న ఆ రోజులు ఆమెకు ఒక నరకంలా అనిపించాయి. అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె స్నేహపూర్వకంగానే విడిపోవడానికి అంగీకరించింది. తనకు భర్త ఆస్తి వద్దు, కేవలం తాను కష్టపడి సంపాదించి పెట్టుబడిగా పెట్టిన డబ్బు, తన సొంత ఆస్తులు వెనక్కి ఇస్తే చాలని, పిల్లల ఉమ్మడి సంరక్షణ బాధ్యత ఇస్తే చాలని కోరింది. కానీ ఆస్ట్రియాలోని ఆ ఇంట్లో భర్త పై అంతస్తులో ఉంటే, సెలీనా పిల్లలతో కలిసి మధ్య అంతస్తులో చాలా కాలం ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చింది. పిల్లల కోసం అక్కడే ఉండాలంటే ఉద్యోగం చేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా "నీకు సూపర్ మార్కెట్‌లో క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తాను" అంటూ అవమానించాడు. ఏ ఉద్యోగమూ తక్కువ కాదు కానీ, ఒక స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఆమెను అలా అనడం వెనుక ఆమెను మానసికంగా దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉంది. ఇవన్నీ భరిస్తున్న సమయంలోనే, ఇండియాలో ఆమె కష్టపడి కొనుక్కున్న ఆస్తులను కూడా విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తనకు ఏమీ మిగల్చకుండా రోడ్డున పడేయాలని చూస్తున్నారని గ్రహించి, 2025 అక్టోబర్ 11న అర్ధరాత్రి 1 గంటకు ఆస్ట్రియా నుంచి పిల్లలను వదిలి ఒంటరిగా ఇండియాకు పారిపోయి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు ఆమెకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. దాదాపు 10 రోజుల పాటు ఒక హోటల్‌లోనే గడపాల్సి వచ్చింది. ఆ తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందుల సమయంలో బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో పాటు మరికొందరు నమ్మకమైన స్నేహితులు అందించిన మద్దతుతోనే ఆమె మళ్లీ తన జీవితాన్ని సున్నా నుంచి ప్రారంభించగలిగింది. 2010 లో పెళ్లయ్యాక 2012 లో విన్‌స్టన్, విరాజ్ అనే కవలలు, ఆ తర్వాత 2017 లో ఆర్థర్ జన్మించారు. గతంలో షంషేర్ అనే మరో కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో చనిపోవడం ఆమెను మరింత కుంగదీసింది. 2025 నవంబర్‌లో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో గృహహింస, క్రూరత్వం కింద కేసు నమోదు చేసిన సెలీనా, ప్రస్తుతం తన ముగ్గురు పిల్లల కోసం న్యాయపోరాటం చేస్తోంది. ఆస్ట్రియా కోర్టు జాయింట్ కస్టడీ ఇచ్చినప్పటికీ, పిల్లలకు తల్లిపై విషం నూరిపోస్తూ కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని సెలీనా జైట్లీ ఆవేదన వ్యక్తం చేసింది.       Celina Jaitly, Celina Jaitly divorce, Peter Haag domestic violence, Celina Jaitly children, Bollywood celebrity divorce, Celina Jaitly interview
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకే నటుడు బహుళ పాత్రలు పోషించడం ఎప్పుడూ ఒక పెద్ద సంచలనమే. గతంలో నటనకు నిలువెత్తు రూపం లాంటి దివంగత మహానటుడు శివాజీ గణేశన్ 'నవరాత్రి' సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించి అప్పట్లో ఒక అరుదైన మైలురాయిని సృష్టించారు. ఆ తర్వాత లోకనాయకుడు, విశ్వనటుడు కమల్ హాసన్ 'దశావతారం' చిత్రంలో ఏకంగా 10 విభిన్న పాత్రల్లో ఒదిగిపోయి యావత్ సినీ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేశారు. ఎన్నో  సంవ‌త్స‌రాలుగా చెక్కుచెదరకుండా ఉన్న కమల్ హాసన్ 10 పాత్రల రికార్డును బ్రేక్ చేసేందుకు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ కమెడియన్‌గా దూసుకుపోతున్న యోగి బాబు సరికొత్త సాహసానికి తెరలేపారు. ఊహించని విధంగా ఒకే సినిమాలో ఏకంగా 11 విభిన్న పాత్రలతో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఆయన సిద్ధమయ్యారు. తనదైన మేనరిజం, డిఫరెంట్ హెయిర్ స్టైల్, టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే యోగి బాబు.. ఈసారి కేవలం నవ్వించడమే కాదు, తనలోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా యోగి బాబు కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా.. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా అంటే హీరోగా మరియు విలన్‌గా రెండు ప్రధాన పాత్రలతో పాటు మరో తొమ్మిది ఇతర విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. మొత్తం 11 పాత్రల్లోనూ వేర్వేరు బాడీ లాంగ్వేజ్, విభిన్నమైన లుక్స్ మరియు ప్రత్యేకమైన యాసలతో మాట్లాడటం ఈ సినిమా యొక్క ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందులో కొన్ని కవల పిల్లల క్యారెక్టర్లు కూడా ఉండటం విశేషం. ఒకే నటుడు 11 పాత్రల్లో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు, కానీ యోగి బాబు ఈ భారీ ఛాలెంజ్‌ను స్వీకరించి ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది హై-ఎనర్జీతో సాగే యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అని తెలిపారు. ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని, ఆ హెలికాప్టర్‌లోని అత్యంత కీలకమైన 'బ్లాక్ బాక్స్'ను కనుగొనే ప్రయత్నంలో సాగే ప్రయాణమే ఈ సినిమా అని వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి బయలుదేరిన హీరో ఎదుర్కొనే సవాళ్లను వినోదం మరియు యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానున్న ఈ భారీ చిత్రంలో మలయాళ నటి అదితి రవి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రెడిన్ కింగ్స్లీ, విటివి గణేష్, పంజు సుబ్బు, ఎ. వెంకటేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు జి. బాలమురుగన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, 'తని ఒరువన్' ఫేమ్ గోపి కృష్ణ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్ షూటింగ్‌ను యునైటెడ్ కింగ్‌డమ్ (ఇంగ్లాండ్) మరియు కెన్యా దేశాల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ధర్మప్రభు, గూర్ఖా, మండేలా వంటి సినిమాలతో మెప్పించిన యోగి బాబు.. ఇప్పుడు 11 పాత్రలతో కమల్ హాసన్ రికార్డును దాటబోతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.       Yogi Babu 11 roles, Yogi Babu breaks Kamal Haasan record, Dasavathaaram record broken, Yogi Babu new movie, Kollywood movie updates, Yogi Babu hero and villain
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అద్భుతమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. జూన్ 19న విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా ప్రయాణం, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంటూ సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 'మా ఇంటి బంగారం' చిత్రం ఒక అరుదైన సంచలనాన్ని నమోదు చేసింది. అక్కడ ఈ సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్ల వసూళ్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఉత్తర అమెరికాలో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసిన ప్రముఖ పంపిణీ సంస్థ 'ప్రత్యాంగిర సినిమాస్‌' ఈ అఫీషియల్ రికార్డ్‌ను తమ ఎక్స్ (ట్విటర్) వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఒక తెలుగు సోలో ఫీమేల్ లీడ్ (కథానాయిక ప్రాధాన్యత ఉన్న) సినిమాకు ఉత్తర అమెరికా మార్కెట్‌లో 2 మిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ రికార్డుతో సమంత ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని లేడీ సూపర్‌స్టార్ స్టామినాను మరోసారి నిరూపించుకుంది. ఈ సినిమా కేవలం ఓవర్సీస్ మార్కెట్‌కే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న భారీ ఆదరణతో 'మా ఇంటి బంగారం' ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రూ. 100 కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. నందిని రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సమంత పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నాయి. ఒక వైపు కంటెంట్ బలంగా ఉంటూ, మరోవైపు కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా కుదరడంతో వీకెండ్స్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ ఈ సినిమాకు థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ చిత్రంలో సమంత నటనతో పాటు, చిత్రంలోని ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. విలక్షణ నటుడు గుల్షన్ దేవయ్య, దిగంత్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, ప్రియదర్శి వంటి ప్రతిభావంతులు కీలక పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణల కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తుంటే, ప్రియదర్శి పాత్ర కథను మరో మలుపు తిప్పుతుంది. ఇలాంటి బలమైన తారాగణం మరియు నందిని రెడ్డి స్క్రీన్ ప్లే మ్యాజిక్ తోడవ్వడంతో 'మా ఇంటి బంగారం' ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, లాంగ్ రన్‌లో మరిన్ని భారీ రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది.       Maa Inti Bangaram, Samantha Maa Inti Bangaram, Maa Inti Bangaram Box Office, Samantha US Records, Nandini Reddy, Telugu Movie News
డిజిటల్ విప్లవం మన జీవితాలను ఎంతగా సులభతరం చేసిందో, అంతే స్థాయిలో సరికొత్త సవాళ్లను కూడా విసురుతోంది. నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి ఉనికిని శాసించేది కేవలం శారీరక జీవనం మాత్రమే కాదు, డిజిటల్ వ్యవస్థల్లో నమోదయ్యే డేటా కూడా. ఒకవేళ ఆ డిజిటల్ వ్యవస్థలోనే ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి, బతికున్న ఒక వ్యక్తిని అధికారికంగా మరణించినట్లు ప్రకటిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే వినూత్నమైన, ఉత్కంఠభరితమైన పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది సరికొత్త తెలుగు చిత్రం 'డిజిటల్ డెత్'. ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ ప్రతి ఆదివారం తన వీక్షకులకు ‘కథాసుధ’ పేరుతో వైవిధ్యమైన కథలను అందిస్తూ వస్తోంది. ఈ ఆదివారం డిజిటల్ నేరాల నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో మన ముందుకు వచ్చేసింది. 'లైఫ్ అప్‌లోడింగ్...' అనే ఆసక్తికరమైన ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రం, నేటి తరం ఆలోచనలకు అద్దం పడుతోంది. ఈ కథలో ప్రధాన పాత్రధారి అయిన ఒక సాధారణ అమ్మాయి జీవితం డిజిటల్ డేటా లోపం కారణంగా ఒక్క రాత్రిలోనే తలకిందులైపోతుంది. బతికుండగానే ఆమె డిజిటల్ పరంగా మరణించినట్లు రికార్డుల్లో నమోదవుతుంది. ఈ ఒక్క పొరపాటు ఆమె వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తుంది. కళ్లముందే తిరుగుతున్నా సమాజం, ప్రభుత్వ వ్యవస్థలు ఆమె ఉనికిని గుర్తించడానికి నిరాకరిస్తాయి. ఒక మనిషి తన సొంత గుర్తింపును, అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎంతటి మానసిక సంఘర్షణకు లోనవ్వాల్సి వస్తుంది? ఆ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఊహించని సవాళ్లు మరియు ట్విస్టులు ఏంటి అనే అంశాలను దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో ఒదిగిపోయారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న చాందినీ చౌదరి, ఈ చిత్రంలో ఒక భావోద్వేగపూరితమైన ప్రయాణాన్ని స్క్రీన్‌పై ఆవిష్కరించారు. ఆమెతో పాటు ఆదిత్య, సనా వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించి కథకు మరింత బలాన్ని చేకూర్చారు. టెక్నాలజీ యుగంలో డేటా భద్రత ఎంత ముఖ్యమో, ఒక చిన్న పొరపాటు సామాన్యుల ప్రాణాల మీదకు ఎలా తెస్తుందో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ విలక్షణమైన సస్పెన్స్ డ్రామా చిత్రానికి రామ్ మన్నార్ దర్శకత్వం వహించగా, ప్రవీణ కడియాల మరియు అనిల్ కడియాల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సరికొత్త ఓటీటీ ట్రెండ్‌కు అనుగుణంగా, నేటి డిజిటల్ క్రైమ్స్ మరియు టెక్నికల్ గ్లిచెస్ ఆధారంగా రూపొందిన ఈ 'డిజిటల్ డెత్' మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. టెక్నాలజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు, వీకెండ్ వినోదంగా ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీ వీకెండ్ వాచ్ లిస్ట్‌లో ఈ సరికొత్త మూవీని చేర్చుకుని, ఈ వింత డిజిటల్ ప్రయాణాన్ని చూసి ఆస్వాదించండి.       Digital Death Movie, Chandini Chowdary, ETV Win Telugu, Digital Death OTT, Latest Telugu Movies, Ram Mannar
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నందమూరి వారసుడు, వైవిధ్యమైన సినిమాల కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్‌లో ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఊపందుకుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ల స్పెషలిస్ట్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారం నాడు సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసి నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పాత్రకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్‌లుక్‌ను అనిల్ రావిపూడి తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ సరికొత్త పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ పక్కా తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ పంచెకట్టుతో దర్శనమిచ్చారు. అంతేకాకుండా ఆయన మెడలో ఒక పెద్ద పూలహారం కూడా ఉండటం విశేషం. ఈ ఊరమాస్, క్లాసిక్ లుక్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి, సినీ ప్రియుల నుంచి చాలా అద్భుతమైన స్పందన లభిస్తోంది. కళ్యాణ్ రామ్‌ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఒక కొత్త కోణంలో చూపించబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ లుక్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా అకాశానికి చేర్చింది. ఈ అద్భుతమైన పోస్టర్‌ను షేర్ చేయడంతో పాటు, అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ నోట్‌ను కూడా జోడించారు. తన కెరీర్ ఆరంభాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిన అనిల్.. "నా తొలి హీరో, నా బెస్ట్ బడ్డీలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను డెబ్యూ డైరెక్టర్‌గా పరిశ్రమకు పరిచయమైనప్పుడు నా టాలెంట్ నమ్మి నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని" అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసింది కళ్యాణ్ రామ్ అన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం #VenkyAnil5 మరియు #NKRAR2 వర్కింగ్ టైటిల్స్‌తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ గురించి అనిల్ రావిపూడి మరింత సమాచారం ఇస్తూ.. "ఈ క్రేజీ చిత్రంతో మిమ్మల్ని ఒక సరికొత్త బ్రాండ్ న్యూ లుక్‌లో థియేటర్లలో చూపించడానికి నేను చాలా ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను సర్. వచ్చే సంక్రాంతి 2027 పండుగను బాక్సాఫీస్ వద్ద మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం" అంటూ మాస్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడం అలవాటుగా మార్చుకున్న అనిల్ రావిపూడి, వచ్చే ఏడాది కూడా ఈ భారీ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి 2027 రేసులో నిలిచిన ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.       Kalyan Ram Birthday, Anil Ravipudi, Kalyan Ram First Look, VenkyAnil5 Movie, Kalyan Ram New Movie Poster, Sankranthi 2027 Releases
టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. 'గీత గోవిందం' చిత్రంతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన టాలెంట్డ్ దర్శకుడు పరశురామ్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా కొత్త సినిమా ప్రకటన ఏదీ చేయకుండా సైలెంట్‌గా ఉన్న ఆయన, ఈసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఒక భారీ ప్లాన్‌తో వస్తున్నారు. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కోసం పరశురామ్ ఒక అద్భుతమైన పాన్ ఇండియా కథను సిద్ధం చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దర్శకుడు పరశురామ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎన్నో ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. 2008లో 'యువత' సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన, ఆ తర్వాత 'ఆంజనేయులు', 'సోలో' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన మైల్‌స్టోన్ చిత్రం మాత్రం 2018లో వచ్చిన 'గీత గోవిందం'. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఆ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించి ఘన విజయం సాధించింది. ఆ దెబ్బతో పరశురామ్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఆ తర్వాత అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ 'గీత గోవిందం' తర్వాత పరిస్థితులు ఆయన అనుకున్నట్లుగా వేగంగా సాగలేదు. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత, 2022లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా మంచి వసూళ్లను సాధించినప్పటికీ, విమర్శకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ఆ తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండతో జతకట్టి చేసిన 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో పరశురామ్ తన తదుపరి అడుగుల విషయంలో మరింత జాగ్రత్త పడ్డారు. గత రెండేళ్లుగా ఏ సినిమాను లైన్‌లో పెట్టకుండా కేవలం కథల అభివృద్ధిపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పరశురామ్ హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ యాక్షన్-ఎమోషనల్ డ్రామా కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే ఒక యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. ఇప్పటికే హృతిక్ రోషన్‌కు పరశురామ్ లైన్ వినిపించగా, కథలోని కొత్తదనం నచ్చి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సినిమాను కేవలం హిందీ మార్కెట్ కోసమే కాకుండా, దక్షిణాది మార్కెట్‌ను కూడా కొల్లగొట్టేలా భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ మెగా ప్రాజెక్ట్ వెనుక టాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో తిరుగులేని ఇమేజ్ ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన హోంబాలే ఫిల్మ్స్, ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలను ప్రకటిస్తూ దూసుకుపోతోంది. ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్యతో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన ఈ ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు పరశురామ్-హృతిక్ రోషన్ కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా సెట్ చేసే పనిలో బిజీగా ఉందట. ఈ ప్రాజెక్ట్ గనుక అధికారికంగా పట్టాలెక్కితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇదొక బిగ్గెస్ట్ కొల్లాబరేషన్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.       Hrithik Roshan, Director Parasuram, Hombale Films, Parasuram Hrithik Movie, Geetha Govindam Director, Bollywood Tollywood Collaboration
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన నటి సుకన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సుకన్య, కెరీర్ పరంగా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అయితే, సినిమా ఇండస్ట్రీలో ఎంతటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయో, కొన్నిసార్లు అంతే స్థాయిలో ఊహించని వివాదాలు కూడా చుట్టుముడుతుంటాయి. నటి సుకన్య జీవితంలో కూడా సరిగ్గా అలాంటి ఒక వివాదమే తెరపైకి వచ్చింది. ఒకానొక దశలో ఆమె దేశ రాజకీయాల్లోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమారుడితో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారంటూ అప్పట్లో వచ్చిన ఒక వార్త యావత్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు, ఆ కాలంలో దేశాన్ని గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో వీరప్పన్ చేసిన ఈ ఆరోపణలు నటి సుకన్య వ్యక్తిగత జీవితాన్ని, ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా అతలాకుతలం చేశాయి. ఏ తప్పూ చేయకుండానే సమాజం ముందు నిందితురాలిగా నిలబడాల్సి వ‌చ్చింది. ఈ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ఏడాదిలోనే భ‌ర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఇది ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. అయితే, ఆ ఆరోపణలను చూసి ఆమె భయపడి వెనకడుగు వేయలేదు. తనపై పడిన ఆ నిందను ఎలాగైనా తుడిచేసుకోవాలని, సమాజంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నారు. వీరప్పన్ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన ప్రైవేట్ మీడియా ఛానల్, పత్రికలపై ఆమె చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. అలా మొదలైన సుకన్య న్యాయపోరాటం అంత సులభంగా సాగలేదు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆమె ఏకంగా 30 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. మూడు దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసులో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. కాలం మారుతున్నా, ఓపిక నశిస్తున్నా సుకన్య మాత్రం న్యాయంపై నమ్మకంతో పట్టుదలతో పోరాడుతూనే వచ్చారు. ఎట్టకేలకు ఇటీవలే ఈ కేసులో ఆమెకు పూర్తి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. వీరప్పన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని, నటి సుకన్య నిర్దోషి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ ఆ మీడియా సంస్థ భారీ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ విజయంతో సుకన్య 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు, మానసిక సంఘర్షణకు తెరపడింది. ఒక మహిళగా, నటిగా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసిన ఈ పోరాటం ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.       Actress Sukanya, Veerappan allegations Sukanya, Sukanya court case victory, Senior actress Sukanya news, Sukanya PV Narasimha Rao son, Tollywood old heroine Sukanya
Narne Nithiin has officially begun work on his next film, tentatively titled #NN5, marking his first collaboration with producer Venkat K Narayana's KVN Productions. Directed by Radha Krishna Reddy, the film was launched on Sunday with a traditional pooja ceremony attended by members of the cast and crew. The project is being described as a youthful romantic entertainer with an emotional core. Narne Nithiin will be seen alongside Anikha Surendran and Megha Shetty, making for a fresh lead pairing. The film also marks another significant production for KVN Productions, a banner that has been expanding its presence across multiple film industries with big-budget ventures. The launch ceremony featured several prominent names from the industry. Producer Venkat K Narayana sounded the clapboard and handed over the script to the director, while acclaimed cinematographer Senthil Kumar switched on the camera. MAD director Kalyan Shankar directed the inaugural shot, officially setting the film in motion. On the technical front, the film has music by composer duo Vivek & Mervin. While the makers are yet to reveal more details about the storyline or the rest of the cast, the combination of Narne Nithiin, Radha Krishna Reddy and KVN Productions has already generated curiosity. With principal photography now underway, more updates about the film are expected in the coming weeks.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)