దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఇరు కుటుంబాల సంప్రదాయం ప్రకారం జరిగింది. మార్చి 4న హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ వివాహ రిసెప్షన్కు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రామ్చరణ్, అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, నవీన్ పొలిశెట్టి, నాని, రవితేజ, శ్రీకాంత్, కార్తీ, నాగచైతన్య, నమ్రత శిరోద్కర్, సితార, హీరోయిన్లు అశికా రంగనాథ్, వర్ష బొల్లమ్మ, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, అశ్వినీదత్, దిల్రాజు, నవీన్ ఎర్నేని, కరణ్ జోహర్, దర్శకులు సుకుమార్, నాగ్ అశ్విన్, బాబీ, బోయపాటి శ్రీను తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.