LATEST NEWS
  ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో పలు లెక్చరర్ పోస్టుల పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, టీటీడీ కళాశాలలు కోసం జూన్ 16 నుండి 26 మధ్య జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది.  కొత్త తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు. నోటిఫికేషన్‌లు 13/2023, 16/2023, 17/2023 కింద 99 పాలిటెక్నిక్, 47 జూనియర్, 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, టీటీడీ పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. తాజాగా అవన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను (https://psc.ap.gov.in) పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.  
  బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్ రావు  నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు పార్టీ మారతారంటూ ప్రత్యర్థులు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారిద్దరూ సుమారు  2 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. హరీశ్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్ రావు తండ్రి ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు.  ఈ క్రమంలో హరీశ్ రావు ఇంటికి వచ్చిన కేటీఆర్ అక్కడ సుమారు 2 గంటల పాటు హరీశ్ రావుతో సమావేశమయ్యారు. ఈ సుదీర్ఘ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, గులాబీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత పరిస్తితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల హరీశ్ రావుపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ రావు క్లారీటీ ఇచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానిని స్వాగతిస్తానని ఇటీవలే హరీశ్ రావు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.  మరోవైపు మరికాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్ళనున్నారు. ఇటువంటి సమయంలో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కావడం పార్టీ వర్గాల్లో గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇటీవల కవిత సైతం సొంత పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని  కవిత  హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, కేటీఆర్ భేటీ కావడం పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఒక వైపు సిట్ వేగం పెంచింది. వరుస అరెస్టులతో కేసు దర్యాప్తును ఫుల్ స్పీడ్ తో సాగిస్తోంది. అదే సమయంలో మరో పక్క నుంచి ఈడీ కూడా వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ కేసులో కింగ్పిన్ గా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డిని విచారణకు అనుమ తించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారుల నుంచి వివరాలు సేకరించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇక నేరుగా రంగంలోకి దిగుతోంది. అందులో భాగంగానే  ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు సిద్ధమౌతోంది. ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు  అనుమతి ఇవ్వాల్సిందిగా విజయవాడ ఏసీపీ కోర్టులో ఈబీ పిటిషన్ దాఖలు చేసింది.   మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్ కేశినెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం (మే 16) విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన న్యాయవాది ఏకంగా కోర్టులోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అసలు సూత్రధారులు తప్పించుకుని రాజ్ కేసిరెడ్డిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కోర్టులోనే రాజ్ కేశిరెడ్డి తరఫు న్యాయవాది వ్యాఖ్యానించడంతో రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారన్న అభిప్రాయం పరిశీలకులలో  వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ కేసులో ఈడీ కూడా రాజ్ కేశిరెడ్డిని విచారించేందుకు రెడీ అవుతుండటంతో  ఇక ఈ కేసులో ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టు కావడం ఖాయమని అంటున్నారు. అలాగే ఈ కేసులో ఈడీ కూడా దూకుడు పెంచుతున్న నేపథ్యంలో  ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనీ, సంచలన అరెస్టులు జరుగుతాయనీ అంటున్నారు.  
  తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇవాళ ఉదయం  సంజీవ్ గోయెంకా తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి  శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామి వారి శేష వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు
ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని  నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లు గుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తను  తల నుంచి కాళ్ల వరకూ వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు మైనింగ్ అక్రమాల కేసులో దోషిగా చంచల్ గూడ జైల్లో కటకటాలు లెక్కిస్తున్నారు.   మాజీమంత్రి గాలి జనార్థన్‌ రెడ్డి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణై చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇదే కేసులో ఇప్పటికే  నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించినందున దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి కోర్టును కోరినా ఫలితం లేకపోయింది. అదలా ఉంటే.. గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆటోమేటిగ్గా ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దైపోయింది.  ఇక ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి జైలులో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ కోర్టు ఆయన అభ్యర్థనను తోసి పుచ్చింది. నేరం రుజువై, దోషిగా నిర్ధారణ అయ్యి శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలూ కల్పించడం కుదరదని సీబీఐ కోర్టు స్ఫష్టం చేసింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి చెంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగా మాత్రమే పరిగణించబడతారు. అంటే మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డిని చెంచల్ గూడ జైలులోని ఇతర సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తారు. సాధారణ ఖైదీ మాదిరిగానే ఆయన జైలు ఖైదీ యూనిఫారంనే ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివారెడ్డి, రాజ్ గోపాల్, అలీఖాన్ ను కూడా అదే జైలులో, అదే బ్యారక్ లో ఉన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన హృతిక్ రోషన్(Hrithik Roshan)ట్వీట్ చేస్తు 'ఎన్టీఆర్ పుట్టిన రోజుకి సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టుగా తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి  మొదలైంది. రీసెంట్ గా ఈ ట్వీట్ కి ఎన్టీఆర్ రిప్లై ఇస్తు 'కబీర్ నిన్ను వేటాడి, నీకు ప్రత్యేక బహుమతి ఇచ్చేందుకు వేచి  చూస్తున్నాను  అని ట్వీట్ చేసాడు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ ఇద్దరు కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న అతి పెద్ద మల్టిస్టారర్ గా వార్ 2(War 2)తెరకెక్కుతుంది.దీంతో వార్ 2 నుంచి ఎన్టీఆర్ లుక్ ని రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ వార్ 2 ని నిర్మిస్తుండగా  కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. అయాన్ ముఖర్జీ  దర్శకుడు కాగా  ఆగస్టు  14 న  వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. 2019 లో హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ నటించిన వార్ కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కింది.    
  ఈ ఏడాది 'తండేల్'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య.. తన తదుపరి సినిమాని 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. 'NC24' అనేది వర్కింగ్ టైటిల్. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఎస్.వి.సి.సి. బ్యానర్ లో మైథలాజికల్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'NC24' నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను పెరిగేలా చేస్తోంది.   'NC24' కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ గుహ సెట్ వేశారు. ఈ సెట్ చూడటానికి ఎంత సహజంగా ఉందో, అంతే అద్భుతంగా ఉంది. ఈమధ్య ఈ తరహా సినిమాలన్నీ ఎక్కువగా గ్రాఫిక్స్ ని ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. కానీ, 'NC24' టీం మాత్రం సహజత్వం కోసం ఇంత భారీ సెట్ ని ఏర్పాటు చేశామని చెబుతోంది. ఈ సెట్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా చిత్రీకరణ 18 రోజుల పాటు జరగగా, 10 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.   'విరూపాక్ష' నిర్మాణంలో భాగమైనట్లుగానే.. 'NC24' నిర్మాణంలోనూ సుకుమార్ భాగమయ్యారు. స్క్రిప్ట్ పరంగా ఆయన పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, 'విరూపాక్ష'ను మించిన మ్యాజిక్ చేయడం ఖాయమని చెబుతున్నారు.    ఇందులో చైతన్య ట్రెజర్ హంటర్ గా కనిపించనుండగా, దక్ష అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో మీనాక్షి కనిపించనుంది. 'NC24'లో హీరో పాత్రకి సమానంగా హీరోయిన్ పాత్ర ఉంటుందట. స్క్రీన్ టైం పరంగా చూస్తే హీరో కంటే మీనాక్షి పాత్ర కొద్ది నిమిషాలు ఎక్కువ కనిపిస్తుందని అంటున్నారు.    ఇప్పటిదాకా చైతన్య కెరీర్ లో తండేల్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాగా, ఇప్పుడు అంతకుమించిన బడ్జెట్ తో 'NC24' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో అప్పుడే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ ఆఫర్స్ భారీగా వస్తున్నట్లు తెలుస్తోంది.  
The songs released so far have struck a chord with the audience, generating significant buzz and appreciation. Riding on this growing excitement, the team is now gearing up to unveil the much-anticipated third single along with the official trailer of the film. With the trailer’s release, anticipation is expected to soar to new heights, setting the stage perfectly for what's to come. Crafted on an epic scale, Hari Hara Veera Mallu is now racing toward its final stages, with post-production in full swing. From intense VFX work to immersive sound design and dubbing, the film is undergoing its finishing touches at lightning speed. Director A.M. Jyothi Krishna, who took over the reins amidst delays, has been tirelessly steering the ship across departments, ensuring that every moment on screen lives up to the film’s legendary ambition. Backed by a dream crew, Oscar-winner M.M. Keeravani’s powerful score, Manoj Paramahamsa’s breathtaking visuals, and Thota Tharani’s majestic production design, this film is built to leave audiences awestruck.   An epic cast including Bobby Deol as the fearsome Mughal ruler, Nidhhi Agerwal in a striking lead, and seasoned actors like Satyaraj and Jisshu Sengupta who bring gravity and charisma to this saga. With a massive worldwide release across Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam, Hari Hara Veera Mallu is poised to conquer hearts and box offices alike. Produced by A. Dayakar Rao. Presented by A.M. Rathnam under Mega Surya Productions. Mark your calendars, This June 12th, 2025. The legend arrives.
  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం 'గుంటూరు కారం' విడుదలై ఏడాది దాటిపోయింది. ఇంతవరకు కొత్త సినిమా పట్టాలెక్కలేదు. నిజానికి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీని చేయాల్సి ఉంది. దీంతో పాన్ ఇండియా డైరెక్టర్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, అట్లీ ప్రాజెక్ట్ తో అల్లు అర్జున్ బిజీ కావడంతో.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కి జరిగింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. వెంకటేష్, శివకార్తికేయన్ వంటి హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ (Ram Charan) పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. (Pawan Kalyan)   పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలు వచ్చాయి. పవన్ నటించిన పలు సినిమాలకు త్రివిక్రమ్ రచయితగానూ వ్యవహరించారు. సినిమాల పరంగానే కాకుండా, పర్సనల్ గానూ వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తన మిత్రుడు పవన్ కోసం త్రివిక్రమ్ ఓ మంచి కథని సిద్ధం చేశాడట. అయితే ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్.. కొత్త సినిమాలను కమిట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఆ కథను చరణ్ తో చేయమని సూచించాడట. ప్రస్తుతం త్రివిక్రమ్-చరణ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.   రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఓ మూవీ కమిటై ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే.. సుకుమార్ సినిమా వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చరణ్ తో సుకుమార్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చరణ్ చూస్తున్నాడట. అది త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. దీనిని త్రివిక్రమ్ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే అవకాశముంది.  
సూర్య(Suriya)పూజాహెగ్డే(Pooja hegde)జతగా ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రెట్రో(Retro). తొంభైవ దశకానికి చెందిన కథనాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ రొమాంటిక్ మూవీ తెలుగు నాట పెద్దగా ప్రేక్షాదరణ పొందకపోయినా తమిళనాట మంచి విజయాన్నే అందుకుంది. 100 కోట్ల రూపాయిల వసూళ్ళని తమిళనాట అందుకోవడమే ఇందుకు నిదర్శనం.   ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటిటి హక్కులని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో సదరు సంస్థ ఈ మూవీని జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకువస్తుందనే టాక్ సినీ సర్కిల్స్ లో  చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందనే వార్తలు వస్తున్నాయి.జూన్ 5 ఖాయమైతే కనుక     అతి తక్కువ వ్యవధిలోనే ఓటిటిలోకి అడుగుపెట్టిన సూర్య మూవీ రెట్రోనే  కావచ్చు.  కార్తీక్ సుబ్బరాజ్(Karthik SUbbaraj)దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో కి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా జాజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, శ్వాసిక, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.  జ్యోతిక, సూర్య, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ సుమారు 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.    
Cast: Naveen Chandra, Reyaa Hari, Shashank, Abirami, Dileepan, Riythvika, Aadukalam Naren, Ravi Varma, Arjai, Kireeti Damaraju Crew:  Cinematography by Karthik Ashokan Music Direction by D.Imman Edited by Srikanth N.B Written & Directed by Lokkesh Ajjls Produced by Ajmal Khan, Reyaa Hari   Naveen Chandra has been starring in interesting films from time to time. The actor does leading roles and even supporting roles mixing them all up according to the script requirements. With his versatlity, he is able to deliver some memorable performances creating a good name for himself in Telugu Cinema. Now, his intense thriller Eleven released in theatres and let's discuss about it in detail.    Plot:  ACP Aravind (Naveen Chandra) keeps growing in stature as a police officer all over. On the other hand, another ACP Ranjith (Shashank) gets the serial killer case. The killer keeps burning the bodies without any evidence. Why is he doing so? Ranjith fails to get closer but still he gets severely injured in a car accident. Now, Aravind takes over the case and he has to solve the mystery behind these killings. He finds out that killer is going after twins. Why? Watch the movie to know more.   Analysis:  Naveen Chandra is good in his role. As a person who doesn't smile much and highly career-oriented Naveen did a very good job. His performance holds the key for the entire plot to work and he did justice. Reyaa Hari, also the producer, played dual role and she needs to get more training. Her character had the scope but she could not deliver what it needed. All others did okay and no one really could deliver anything special to write about.    The film director Lokesh Ajjls followed many template cliches in building the screenplay and narrative is flat throughout without the moments that really catch our attention. Even the story feels too jaded and outdated with call backs to films like Memories, Rakshasudu and few others. While Abirami character had much more potential, the makers did not really explore her character or dynamic with the main leads perfectly.    Also, the writing doesn't really go into the depth of the characters. Each and every frame feels like we have seen it before and doesn't really inspire to give our attention fully. The mystery has not been constructed well enough to grab our attention at all places. It feels like a mishmash of all the previous mystery and investigative thrillers assembled into one. While the orginality and novelty is the biggest asset of such thrillers, Eleven feels too convoluted.    Rather than trying to connect us with the characters, director handles the narrative superficially and hence, the mystery seems predictable and twists never create the interest that the makers wanted to. On the whole, Eleven could have been a much better thriller with more onus of screenplay and script writing.    Bottomline:  Eleven falls short of being a good thriller.    Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.  
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కెరీర్ లోనే ప్రెస్టేజియస్ట్ మూవీగా 'పెద్ది'(Peddi)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చరణ్ ఈ మూవీలోపలు రకాల ఆటల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. మేకర్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్ లో చరణ్ క్రికెట్ ఆడినా కూడా చరణ్ చెప్పిన డైలాగ్స్ తో రక  రకాల ఆటలు ఆడతాడని అనుకుంటున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor)జత కడుతుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Sivarajkumar)కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా బుచ్చిబాబు(Buchibabu)దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఉత్తరాంధ్ర నేపథ్యంలో పెద్ది తెరకెక్కుతుంది. ఈ సినిమాలో క్రికెట్ కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఎమోషన్ చాలా బలంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు క్రితమే ఈ కథని సిద్ధం చేసుకున్నాను. చరణ్ గారు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతు లుక్ విషయంలో ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నారు. రెహ్మాన్ గారు సైతం ఒక్కో సాంగ్ కి 20 నుంచి 30 దాకా ట్యూన్స్ ఇస్తున్నారు.  చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. దీంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తు లైఫ్ లో సెటిల్ అయితే చూడాలనేది వాళ్ళ కోరిక. అందుకే హైదరాబాద్ లో ఎంబిఏ కోసం చేరాను. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్లాస్ లు వినేవాడిని. ఆ తర్వాత నా అభిరుచిపై దృష్టి పెట్టి సుకుమార్ వద్ద 100 %లవ్, ఆర్య 2 , రంగస్థలం చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసానని చెప్పుకొచ్చాడు. బుచ్చిబాబు ఫస్ట్ మూవీ 'ఉప్పెన' అనే విషయం తెలిసిందే.          
మూవీ: జాలీ ఓ జింఖానా నటీనటులు: ప్రభుదేవా, మడోన్నా సెబాస్టియన్, పూజిత పొన్నాడా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, యాషికా ఆనంద్ తదితరులు ఎడిటింగ్:  రమర్ సినిమాటోగ్రఫీ: ఎమ్ సి గణేశ్ చంద్ర మ్యూజిక్: అశ్విన్ వినయగమూర్తి నిర్మాతలు: రాజేంద్ర ఎమ్ రాజన్ రచన, దర్శకత్వం: శక్తి చిదంబరం ఓటీటీ: ఆహా ప్రభుదేవా ప్రధాన పాత్రలో మడోన్నా సెబాస్టియన్, పూజిత పొన్నాడ, అభిరామి, యోగిబాబు కలిసి నటించిన 'జాలీ ఓ జింఖానా' గతేడాది డిసెంబర్ లో తమిళంలో రిలీజైంది. నిన్నటి నుండి ప్రముఖ ఓటీటీ 'ఆహా' లో రిలీజైంది.  కథ:  చెన్నైలోని ఓ చర్చికి భవాని వెళ్తుంది. అక్కడి ఫాదర్ కి తను చేసిన తప్పుకి ప్రయాశ్చితం కావాలని కోరుకుంటుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవాని, శివాని, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్తో హోటల్లో లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు. తంగసామి ఆపరేషన్ కోసం దాదాపు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని భవాని అక్కచెల్లెళ్లతో డాక్టర్ చెప్తాడు. అనూహ్యంగా ఆ డబ్బు భవాని అకౌంట్లో డిపాజిట్ అయి, ఆపరేషన్ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్ ఓ కేస్ విషయమై న్యాయవాది పూన్జుండ్రన్తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్ విషయమై పూన్జుండ్రన్ని కలవమని భవానీ వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్ గదిలో పడి ఉంటాడు. పూన్జుండ్రన్ని చంపిందెవరు? అతని బాడీతో భవాని అక్కచెల్లెళ్ళు తమ సమస్యని పరిష్కరించుకున్నారా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: దర్శకుడు సినిమా ప్రారంభంలోనే ఓ హింట్ ఇచ్చాడు. లాజిక్స్ ఏమీ పట్టించుకోకుండా కడుపుబ్బా నవ్వుకోవాలంటే మా సినిమా చూడండి అని చెప్పాడు. అన్నట్టుగానే కథ సాగుతుంది. హీరో ఎలా చనిపోయాడో, ఎవరు చంపారో తెలియదు.. మరోవైపు భవాని తన చెల్లెళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తూ పడే ఇబ్బందులు, మధ్యలో ఎదురయ్యే పాత్రలు కాస్త నవ్వు తెప్పించేలా ఉన్నాయి. రఘుబాబు, యోగిబాబు పాత్రలని సరిగ్గా వాడుకుంటే బాగుండేది. ఇక సినిమా చివర్లో అసలెందుకు ఆ ఇరవై లక్షలు అకౌంట్ లో ఉన్నాయో చెప్తూ కాస్త డ్రాగ్ చేశారు. అది కాస్త మైనస్ అనే చెప్పాలి. సినిమా చూస్తున్నంతవరకు నవ్వుకోవాలని దర్శకుడు అనుకున్నాడో ఏమో కానీ ఆడియన్స్ కి మాత్రం నరకమే. క్రింజ్ కామెడీలా అనిపిస్తుంది. బలవంతంగా నవ్వు తెప్పించే సీన్లు చాలానే ఉన్నాయి. ఓ‌ ఇరవై ఏళ్ళ క్రితమే కమల్ హసన్, రమ్యకృష్ణ కలిసి పంచతంత్రం సినిమాలో ఈ కామెడీని పండించారు. అయితే ఇది దానిలో సగం కూడా లేదు. పైగా కామెడీ సీన్లు తేలిపోయాయి. ఇక పాటలైతే అంతగా సెట్ గా కాలేదు. అసలు బిజిఎమ్ ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేదు. ఇండివిడ్యువల్ గా ఒక్కో క్యారెక్టర్ బాగనే చేసిన కథపరంగా సెట్ అవ్వలేదు. కామెడీ అని ల్యాగ్ చేసి చుక్కలు చూపించారు. సినిమా మొత్తంలో ఇది బాగుంది అనేలా ఏదీ లేదు. అడల్ట్ సీన్లు లేవు. ‌అశ్లీల పదాలు వాడలేదు. ఫ్యామిలీ కలిసి చూసేలా ఉంది. రమర్ ఎడిటింగ్ ఒకే.‌ ఎమ్ సి  గణేశ్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. అశ్విన్ వినయగమూర్తి మ్యూజిక్ అంతగా సెట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు:  ఫాదర్ గా యోగిబాబు, పూన్జుండ్రన్ గా ప్రభుదేవా, భవానీగా మడోన్నా సెబాస్టియన్ అభిరామి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : జస్ట్ ఒకే విత్ క్రింజ్ కామెడీ రేటింగ్ : 2.25 / 5  ✍️. దాసరి మల్లేష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hari Hara veeramallu).ఫస్ట్ టైం పవన్ చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడం, పైగా పోరాట యోధుడుగా కనిపిస్తుండటంతో, ఎప్పుడెప్పుడు వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుందా అని  ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తు వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి పోస్ట్ పోన్ చెయ్యడంతో వాళ్ళల్లో ఒకింత నిరుత్సాహం కూడా ఏర్పడింది. ఇప్పుడు వాళ్ల నిరుత్సాహాన్ని పోగొట్టడానికి వీరమల్లు జూన్ 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు రీసెంట్ గా చిత్ర యూనిట్  అధికార ప్రకటన  చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ లోసరికొత్త జోష్ వచ్చినట్లయింది. పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా చేస్తుండగా, మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు క్యారక్టర్ ని బాబీడియోల్ పోషిస్తున్నాడు. మిగతా ఇతర పాత్రల్లో సత్యరాజ్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, జిష్ణుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, నాజర్, సచిన్ కెడ్కర్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.   పవన్ కి  ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన మెగా ప్రొడ్యూసర్ ఏఎంరత్నం వీరమల్లుని అత్యంత భారీ వ్యయంతో  నిర్మించాడు. క్రిష్(Krish)జ్యోతికృష్ణ(Jyothi Krishna) ద్వయం దర్శకత్వం వహించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, సాంగ్స్  హైలెట్ గా నిలిచాయి.ట్రైలర్ కూడా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. సుమారు 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు.      
మంచు విష్ణు(Vishnu)మోహన్ బాబు(Mohanbabu)ల ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప(kannappa). పరమేశ్వరుడి' పరమ భక్తుడైన 'కన్నప్ప' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ (prabhas)మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. కన్నప్ప భార్యగా ప్రీతి ముకుందన్ చేస్తుండగా మహాభారతాన్ని తెరకెక్కించిన  ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar singh)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. జూన్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక మంచు మోహన్ బాబుకి చెందిన ఎంబియు(మోహన్ బాబు యూనివర్సిటీ) బాధ్యతల్ని విష్ణు చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీ ద్వారా ఇండియాకి ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకు వచ్చేందుకు విష్ణు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తు వస్తున్నాడు. ఈ క్రమంలో 'పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టై అప్ అయ్యింది. ఈ విషయాన్నీ 'ఎక్స్' వేదికగా తెలియచేసిన విష్ణు 'ఇండియాలో ఫారిన్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకురాబోతోన్నాం,పెన్ యూనివర్సిటీతో ఎంబీయూ టై అప్ అయింది.. ఇది ఇండియాలోనే మొదటి సారి, చరిత్ర సృష్టించామని ట్వీట్ వేశాడు.      
   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.  ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  వివాహం తరువాత సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలి అంటే  మగవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇంతకీ అవేంటో ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పురుషులు చేయకూడని పనులు.. వివాహం అయిన మగవాళ్లు ఎక్కడికైనా వెళ్ళేముందు ఆలోచించాలి.  తొందర పడి సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకోవడం వల్ల అతని జీవితంలో నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోకుండా ఇతరులతో వెళ్లడం చాలా నష్టాలకు దారి తీస్తుంది. వివాహం అయిన తరువాత మగవాళ్లు బయటి మహిళల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయ్యే మగవాళ్లకు వారి వైవాహిక జీవితంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.  ఇది అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది.  అలాంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం అంతా ప్రభావితమవుతుంది. మనిషికి సంతృప్తి అనేది లభించడం చాలా కష్టం.  ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని అనుకుంటూనే ఉంటాడు. వివాహం అయిన మగవాళ్లు ఉన్న వాటితో తృప్తి చెందలేకపోతే  ఆ వ్యక్తి అశాంతికి లోనవుతాడు. ఈ అసంతృప్తి వైవాహిక జీవితంలో కూడా చాలా నష్టాలు,  సమస్యలకు కారణం అవుతుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ వివాహం అయిన మగవాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది.  భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు భార్యకు తప్పకుండా చెప్పాలి.                                 *రూపశ్రీ.  
  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు.  అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా?  నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే.. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు.  అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి. నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది.  ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది.  తద్వారా  రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..  నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.  ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర,  చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది.  ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్,  అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు. నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది.                                     *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..