LATEST NEWS
రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఏ మూలైనా సరే ఏదైనా ఒక ఘోరం జరిగితే, ఒక నేరం జరిగితే.. వాటి మూలాలు ఏపీలోని వైసీపీ పార్టీలో ఉంటాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నవే. ఇప్పుడు తాజాగా నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి.  కాకినాడ జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన  కుటుంబ  ఆత్మహత్య ఉదంతం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యకు  పాల్పడటం వెనుక లవ్ జిహాద్, మతమార్పిడి ఒత్తిళ్లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్  ఉన్నాయన్న ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. ఈ కుటుంబం ఆత్మహత్యకు  కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ అనే వ్యక్తికి  వైసీపీతో సంబంధాలున్నాయన్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ  నాయకుడు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే   ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సాధిక్ అనుచరుడన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  సాధిక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో  సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు  నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  సాధిక్,  వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.   సాధిక్ మాజీ ఎమ్మెల్యే   అనుచరుడేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  వైసీపీ హయాంలో సాధిక్ కు  రాజకీయ అండదండలు పుష్కలంగా లభించాయని, ఆ అండదండలతోనే సాధిక్   ఇటువంటి అరాచకాలకు ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  భాధిత  నూకరాజు కుటుంబాన్ని లవ్ జిహాద్ పేరుతో వేధింపులకు గురిచేసి, బలవంతపు మతమార్పిడికి ఒత్తిడి తీసుకురావడంతో ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు.  గతంలో సాధిక్ ప్రారంభించిన ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్  ప్రారంభోత్సవానికి కూడా మాజీ ఎమ్మెల్యే హాజరైనట్లు చెబుతున్నారు.  దీనిపై కాకినాడ ఎంపీ, జనసేన నాయకుడు   తంగెళ్ల శ్రీనివాస్ నూకరాజు కుటుంబానికి   న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను   ఈ ఉదంతం వెనుక ఏకపక్ష వేధింపులే కాకుండా ఒక పెద్ద వ్యవస్థాగత రాకెట్ పనిచేస్తోందని ఎంపీ ఆరోపించారు. అమాయక కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.   Kakinada Family Suicide, Sadiq Controversy, Dwarampudi Chandrasekhar Reddy Link , Kakinada Love Jihad Case
  తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కొండా మురళి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్న వివాదాల వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా మురళి పలు విషయాలపై ఓపెన్ అయ్యారు. గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంలోనే తాము ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు. ఇటీవల తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సైతం ఆయన స్పందించారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆమె కేవలం 'ప్లాన్-ఎ' ప్రకారమే మాట్లాడిందని, అసలు ఆమె మనసులో ఉన్న 'ప్లాన్-బి' ఏంటో తనకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖ కార్యకలాపాలపై మాట్లాడుతూ.. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని గుర్తుచేశారు. మంగళవారం జరిగిన వనమహోత్సవంతో పాటు బుధవారం నిర్వహించిన ఇతర అధికారిక సమావేశాల్లోనూ సురేఖ పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఉన్న అంశాలపై తాను స్పందించబోనని మురళి తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం వెలువరించేంత వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగానే ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కొండా సురేఖ వైఖరిపై పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ముందుకు కూడా ఈ అంశం వెళ్లడంతో అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ భేటీలు, సీనియర్ నేతల సంప్రదింపుల నేపథ్యంలో త్వరలోనే ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపించాయి. అధిష్టానం నిర్ణయం ఆధారంగా తదుపరి రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది. Konda Murali, Konda Surekha, Telangana Congress News, Deputy cm Bhatti Vikramarka,TeluguOne News, CM Revanth reddy, Congress party, Minister Uttam Kumar Reddy,  MLA Komatireddy Rajagopal Reddy  
ఏపీలో   స్థానిక  ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే కడప జిల్లా అందులోనూ పులివెందుల మరో ఎత్తు అన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ అధినేత   జగన్  అడ్డా అయిన   పులివెందుల మున్సిపాలిటీని  తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నది. అన్నిటికీ మించి ఈ సారి మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిన జరుగుతుండటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇక సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.  గతంలో  వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా అలాగే పులివెందులలో జగన్ పునాదులు కదిలించాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో తన పట్టు నిలుపుకోవడానికి మజీ సీఎం, వైసీపీధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటికే పులివెందుల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ   యువ నేత దుష్యంత్ రెడ్డిని బరిలోకి దింపనుంది. దుష్యంత్ రెడ్డి జగన్ కు సమీపబంధువు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో అనధికారికంగా ఎలక్షన్ క్యాంపెయి ప్రారంభించేసినట్ల తెలుస్తోంది.  అయితే అదే సమయంలో తెలుగుదేశం కూటమి కూడా పులివెందులలో జగన్ పట్టుకు చెక్ పెట్టి మునిసిపాలిటీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. పులివెందులతో బీటెక్ రవి తెలుగుదేశం కూటమి తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు.  గతంలో పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో బీటెక్ రవీ పకడ్బందీగా వ్యవహరించి.. తెలుగుదేశం అభ్యర్థిని మట్టి కరిపించి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. అంతకు ముందు..  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి తన వ్యూహాలతో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన బీటెక్ రవి, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పులివెందులలో  సత్తా చాటుతున్నారంటున్నారు. పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా సాధిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంటే.. వైసీపీ పట్టు నిలుపుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది.    AP localbody Elections, Pulivendula Municipal Elections, YCP Candidate Dushyant Reddy, BTech Ravi TDP,Pulivendula Politics, Telugu News, TeluguOne
  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్‌ మండలం నల్లంపల్లి వద్ద నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయదుర్గం ప్రజలకు ప్రేమ, పౌరుషం, అభిమానం ఎక్కువే..! “విజయనగరం రాజుల మూడో రాజధాని రాయదుర్గం. రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో.. ఇక్కడి ప్రజల్లోనూ అంతే పౌరుషం ఉంది. ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ ఎంత ఫేమసో.. మీ ప్రేమ, అభిమానం, స్టైల్ కూడా అంతే ఫేమస్. అవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. గత 11 ఎన్నికల్లో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచినా.. గెలిచినా, ఓడినా రాయదుర్గం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓబుళాపురం గనుల పేరుతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు కమిటీ వేసి ప్రజల తరఫున పోరాడింది టీడీపీ. నాడు మనం చేసిన పోరాటానికి ఫలితంగా తాజాగా తీర్పు వచ్చింది. ప్రజల కోసం పోరాడింది.  కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. దేశంలో మరే రాజకీయ పార్టీ కల్పించని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశాం. కష్టపడి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు. మైటీడీపీ యాప్‌లో మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. నేను పరిష్కరిస్తాను..! “యువగళం పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు.. “పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. మమ్మల్ని గుర్తించండి” అని చాలామంది కోరారు. అందుకే మైటీడీపీ యాప్‌ను తీసుకొచ్చాం. మీరు పాల్గొనే ప్రతి పార్టీ కార్యక్రమం, మీరు సొంతంగా చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మైటీడీపీ యాప్‌లో ఫీడ్ చేయండి. క్లస్టర్, యూనిట్, బూత్ సమావేశాల్లో మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మేము చదువుతున్నాం. మీరు చెప్పే సమస్యలు, సూచనలు మాకు చేరడం లేదనే అపోహ వద్దు. కొత్త పెన్షన్లు, ఇళ్లు ఇవ్వాలని కార్యకర్తలే ఫీడ్‌బ్యాక్‌లో కోరారు. కొత్త పెన్షన్ లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది.  ఇలా మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నేను నిర్ణయాలు తీసుకుంటాను. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.. మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. కోటి మంది సభ్యులతో కూడిన కుటుంబం మనది. సముద్రం లాంటి ఈ కుటుంబంలో సమస్యలు సహజం. మనలో మనమే చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడైనా మీ సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి. మీకు అండగా నేను ఉంటాను. కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాం” అని హామీ ఇచ్చారు. టీడీపీలో కార్యకర్తే అధినేత..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అనంతరం కార్యకర్తలను కలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడి, ఫొటో దిగి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే విలువకు ఇదే నిదర్శనం. 2025 మహానాడులో ప్రవేశపెట్టుకున్న ఆరు శాసనాల్లో “కార్యకర్తే అధినేత” అనేది అత్యంత ముఖ్యమైనది. టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే మహానాడు, అసెంబ్లీ, మండలి సహా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి వేదికను పంచుకుంటున్నారు.  కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడం టీడీపీ బాధ్యత. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలు వదిలిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టాన్ని సవరించి బిల్లు తీసుకొచ్చాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బిల్లును చట్టంగా చేసి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి ఇదే నిదర్శనం. పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి..! “జగన్ ప్రెస్‌మీట్ పెడితే మనందరికీ పండగే. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పే విషయం ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనంటారు. జగన్ రెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చేయి.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీలోనూ ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నా సవాల్‌ను స్వీకరించి ఎందుకు రావడం లేదు? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదనే వాస్తవం బయటపడుతుందనే భయమా?  ప్రెస్‌మీట్లు ఎందుకు.. అసెంబ్లీకి రా! పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదు? రెండేళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అది కూడా ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. జగన్‌లా నేను కంచుకోటలో గెలిచిన వ్యక్తిని కాదు. 1988 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడినా వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించాను. కుప్పంలో పోటీ చేయమని చెప్పినా మంగళగిరిలోనే నిలబడి 91 వేల మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే.. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా..!” అని సవాల్ విసిరారు. కూటమి ఐక్యతను కాపాడండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం“కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల ప్రచారాన్ని నమ్మి ఆవేశపడకుండా కూటమి ఐక్యతను కాపాడాలి. మనమంతా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి కూటమి బలాన్ని మరింత పెంచాలి” అని పిలుపునిచ్చారు. కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది..! “మీ అభిమానానికి నేను ధన్యుడిని. యువగళం పాదయాత్రలో కణేకల్‌కు రాలేకపోయిన లోటు నేడు తీరిపోయింది. మీరు ఇచ్చిన ఘన స్వాగతం, చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. పట్టణ అధ్యక్షుడి ఆత్మీయ పలకరింపు నా గుండెను హత్తుకుంది. వీలైతే మీ ఇంటికి భోజనానికి వస్తాను. గతంలో కణేకల్‌కు సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కానీ కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది. నిధులు సమకూర్చే బాధ్యత మంత్రి కేశవ్ గారిది. రెండు సంవత్సరాల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ.లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు బి. గురప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu Desam Party, Rayadurgam, Anantapur, Local Body Elections, TDP Cadre, Party Workers, My TDP App, TDP Alliance, CM Chandrababu Naidu, Andhra Pradesh Development, TDP Welfare, Kalyan Yojana, Political Alliance, Jana Sena, BJP, AP Politics  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వానికి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు, క్షేత్రస్థాయి పరిణామాలపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ కార్యక్రమం నిర్వహించారు.  ఈ విశ్లేషణలో ప్రధాంశాలు..రాజకీయ పరిస్థితులు.. పట్టణ ఓటర్లు  క్షేత్రస్థాయి అసంతృప్తిగ్రామీణ ప్రాంతాల ఎన్నికలతో పోలిస్తే పట్టణ ప్రాంత ఎన్నికలు పూర్తి భిన్నమైనవి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు స్థానిక నాయకత్వం  వ్యక్తుల ప్రాతిపదికన సాగుతాయి. కానీ, మున్సిపాలిటీలు  కార్పొరేషన్లలో పార్టీ గుర్తులపై నేరుగా పోరు జరుగుతుంది. పట్టణాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలపై పూర్తిగా ఆధారపడరు. వారు ప్రభుత్వ పాలనాతీరు, మౌలిక వసతులు, పారదర్శకతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులలో అవినీతి విచ్చలవిడిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతుల నుంచి ఇతర చిన్న పనుల వరకు స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం, వేధింపులు పెరిగాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో అవినీతి రహిత పాలన అని ప్రకటించినా, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. చంద్రబాబు వ్యూహం మౌలిక లోపాలుకూటమి ప్రభుత్వం తన ప్రధాన ఘనతలుగా పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం, పరిశ్రమల రాకను ప్రచారం చేసుకుంటోంది.  అయితే ఈ వ్యూహంలో పలు రాజకీయ లోపాలు కనిపిస్తున్నాయి:అమరావతి కేంద్రీకరణ: అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం ప్రాధాన్యమే అయినప్పటికీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఇది అంతగా భావోద్వేగాన్ని కలిగించడం లేదు. సొంత నియోజకవర్గాల్లో రోడ్ల గుంతలు, మౌలిక వసతులు లేని స్థితిలో రాజధానిపైనే కోట్లు ఖర్చు చేయడం పట్ల కొంత వ్యతిరేకత వస్తోంది. పోలవరం పరిశ్రమలు: పోలవరం పనులు నెమ్మదించడం, పరిశ్రమల ఒప్పందాలు కేవలం ప్రకటనలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాలుగా మారకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోంది. సంక్షేమం – ప్రచార లోపం: ప్రభుత్వం భారీ స్థాయిలో పెన్షన్లు (రూ. 4,000) ఇస్తున్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా పథకాల సమర్థవంతమైన ప్రచారం, కచ్చితమైన అమల్లో లోపాలు కనిపిస్తున్నాయి. రైతాంగ సమస్యలు : కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల గురించి స్పష్టత ఇవ్వకపోవడం, పంట కొనుగోళ్లలో వ్యత్యాసాలు రైతుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావంరాబోయే మున్సిపల్ ఎన్నికలు కూటమి ప్రభుత్వ పాలనకు తొలి ప్రాక్సీ టెస్ట్‌గా మారనున్నాయి.  గతం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని నిరూపించుకోవడంలో వైఫల్యం చెందితే, పట్టణ ప్రాంతాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పుంజుకునే అవకాశం ఉంది.శాసనసభ్యుల అవినీతిని అరికట్టడం, నిత్యావసరాలు మరియు మౌలిక వసతులపై దృష్టి సారించడం, పరిశ్రమలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడంపై చంద్రబాబు నాయుడు తక్షణమే దృష్టి సారించాల్సి ఉంది. లేనిపక్షంలో, పట్టణ ఓటర్లు ఇచ్చే తీర్పు రాబోయే సాధారణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.   AP Municipal Elections, CM Chandrababu Naidu Strategy, AP Politics Telugu, Amaravati Development, TDP vs YSRCP, AP Local Body Elections, AP Corruption Issues, AP Urban Elections, Polavaram Project Update, AP Welfare Schemes  
ALSO ON TELUGUONE N E W S
ఒకప్పుడు ఇండియన్ సినిమాలో కథానాయికల పాత్ర అంటే కేవలం గ్లామర్ ప్రదర్శన, కొన్ని రొమాంటిక్ సీన్స్, రెండు పాటలకు డ్యాన్స్ చేయడానికే పరిమితమయ్యేది. కానీ, మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కథానాయికల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నటనలోనే కాదు, చిత్ర నిర్మాణంలోనూ తమదైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ పరిశ్రమలో పవర్ ఫుల్ ఉమెన్ పవర్ చాటుతున్నారు. దక్షిణాది చిత్రసీమలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఈ ట్రెండ్‌కు ప్రధాన నిదర్శనం. తన భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్‌తో కలిసి 'రౌడీ పిక్చర్స్' బ్యానర్‌ను స్థాపించి వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాకుండా కథ బలంగా ఉంటే గుజరాతీ సినిమా 'శుభయాత్ర' వంటి ఇతర ప్రాంతీయ భాషల చిత్రాలను కూడా నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ విషయానికి వస్తే, అగ్ర కథానాయిక అలియా భట్ నటిగా ఎంతటి విజయాన్ని అందుకుందో, నిర్మాతగానూ అంతటి ముద్ర వేసింది. 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' పేరుతో స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభించి 'డార్లింగ్స్', 'జిగ్రా' వంటి వైవిధ్యమైన కంటెంట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. తాజాగా 'డోంట్ బి షై' అనే సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించి నిర్మాతగా తన పయనాన్ని మరింత వేగవంతం చేసింది.అలాగే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్వీన్స్ కృతి సనన్, సమంత కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నారు. కృతి సనన్ కంటెంట్ ఆధారిత కథలతో తన ప్రొడక్షన్ హౌస్‌ను ముందుకు నడిపిస్తుండగా, సమంత 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌ను నెలకొల్పి భావోద్వేగమైన, బలమైన కథాంశాలను ఎంచుకుంటూ నిర్మాణ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకుంటోంది. సాధారణంగా మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే ఫిల్మ్ ప్రొడక్షన్ రంగంలోకి ఈ నటీమణులు అడుగుపెట్టడం కేవలం బిజినెస్ పరమైన ఆలోచన మాత్రమే కాదు. తమకు నచ్చిన, సమాజానికి మంచి సందేశాన్నిచ్చే కథలను ప్రేక్షకులకు అందించాలనే నిబద్ధతే దీనికి కారణం. మహిళా ప్రాధాన్యత ఉన్న కథలకు పెద్దపీట వేసేందుకు ఈ స్టార్ హీరోయిన్ల నిర్మాణ సంస్థలు ఎంతగానో దోహదపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోనూ, సినీ విశ్లేషకులలోనూ వీరి ఈ సాహసోపేత నిర్ణయాలపై విశేషమైన చర్చ జరుగుతోంది. తెరపై తమ నటనా వైభవంతో అలరిస్తూనే, తెరవెనుక సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్లుగా రాణిస్తున్న ఈ భామల అడుగులు రాబోయే తరం యువ నటీమణులకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.       [Heroines Turned Producers, Samantha Tralala Moving Pictures, Nayanthara Rowdy Pictures, Alia Bhatt Eternal Sunshine Productions, Women Producers Indian Cinema]
  పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రకింగ్ స్టార్ యశ్ తన పవర్‌ను మరోసారి నిరూపించుకున్నారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ‘టాక్సిక్’ చిత్రం తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు వచ్చిన ట్రోల్స్, విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా తొలిరోజు భారతీయ నెట్ కలెక్షన్లను ‘టాక్సిక్’ కేవలం బుధవారం మధ్యాహ్నానికే అధిగమించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఓనం పండుగ సెలవును పురస్కరించుకుని విడుదలైన ఈ చిత్రానికి ఉదయం ఆటల నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మధ్యాహ్నం సమయానికే భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 31.76 కోట్ల నెట్ వసూళ్లను సాధించి అదరగొట్టింది. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే సుమారు రూ. 37.48 కోట్లకు పైగా నమోదయ్యాయి. కన్నడ వెర్షన్ ఏకంగా 77 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేయగా, తెలుగు వెర్షన్ కూడా 57 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. కాగా, గతంలో విడుదలైన రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం తొలిరోజు భారత్‌లో రూ. 28.60 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించగా, యశ్ క్రేజ్ ముందు ఆ మార్కు మధ్యాహ్నానికే తుడిచిపెట్టుకుపోయింది. గ్లోబల్ వైడ్‌గా 12 వేలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపు రూ. 85 కోట్ల ప్రీ-సేల్స్ నమోదు కావడం విశేషం. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి సంచలన విజయం తర్వాత యశ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో యశ్ తన మాస్ అండ్ స్టైలిష్ లుక్‌తో అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్, మేకింగ్ వాల్యూస్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను అందిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ ‘టాక్సిక్’ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. యశ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తూ రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట హోరెత్తిస్తున్నారు. మొదటి రోజు టాక్ చూస్తుంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల మధ్య ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అదే కనుక నిజమైతే ‘కేజీఎఫ్ 2’ తర్వాత వంద కోట్ల ఓపెనింగ్ సాధించిన రెండో కన్నడ చిత్రంగా ‘టాక్సిక్’ నిలవనుంది.        [Yash Toxic Box Office Collection, Toxic Movie First Day Collections, Yash Toxic vs Dhurandhar Ranveer Singh, Yash Next Movie Collections, TeluguOne Entertainment News]
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న మూవీ 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. గ్లింప్స్‌తో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా, ఇప్పుడు ట్రైలర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో తడబడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా అనే బ్రాండ్ చాలు.. 'రోమాంచకం'పై అంచనాలు ఏర్పడటానికి. పైగా, గ్లింప్స్ బాగుండటంతో, ట్రైలర్ అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్, సినీ ప్రియులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ట్రైలర్ బయటకు రాగానే సీన్ మారిపోయింది. గ్లింప్స్‌లో కనిపించిన ఆ స్పార్క్, ఎనర్జీ ట్రైలర్‌కి వచ్చేసరికి మిస్ అయ్యాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్లింప్స్‌తో హయ్యెస్ట్ హైప్ ఇచ్చి, ఆ తర్వాత వచ్చే ట్రైలర్ కట్ కన్ఫ్యూజింగ్‌గా ఉంటే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో 'రోమాంచకం' విషయంలో అదే జరుగుతోంది. "ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ.." అంటూ ట్రైలర్‌లో అన్ని ఎలిమెంట్స్ చూపించినప్పటికీ.. లవ్ లో ఫ్రెష్ నెస్ లేదని, కామెడీ పంచ్‌లు అంతగా పేలలేదని, ఎడిటింగ్ అండ్ పేసింగ్ గందరగోళంగా ఉందనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. 'రోమాంచకం'లో విషయముందని అర్థమవుతుందని, కానీ ట్రైలర్ కట్ అందుకు తగ్గట్టుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సినిమా విడుదలకు ముందు.. రిలీజ్ ట్రైలర్ తో సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి.       Sandeep Reddy Vanga, Romanchakam Trailer, Sumanth Prabhas  
Nivin Pauly has done it again, but this time the speed of the achievement makes the success even more significant. Bethlehem Kudumba Unit has crossed the Rs 100 crore worldwide mark, becoming his second film to enter the elite club after Sarvam Maya. However, unlike his previous blockbuster, the Girish A.D. directorial has reached the milestone much faster, underlining the extraordinary theatrical momentum it has generated during the Onam season. Sarvam Maya had become Nivin's first Rs 100 crore grosser earlier this year. The bigger surprise has been the film's weekday performance. Instead of slowing down after the opening weekend, Bethlehem Kudumba Unit actually jumped on Tuesday. The film reportedly collected ₹7.9 crore net in India on Day 5, a 14.49% increase over Monday and more than 60% higher than its opening day. That is now being reported as the biggest Tuesday collection for a Malayalam film in 2026, surpassing Drishyam 3. This is where the Onam factor becomes crucial. The film has already established strong word-of-mouth among family audiences, and the remaining holiday period gives it an opportunity to accumulate a huge number before the festive window closes. With the Raksha Bandhan weekend also coming up, trade expectations are now reportedly in the range of Rs 225-250 crore worldwide for the full run if the present momentum holds. While Toxic is releasing on Wednesday, the movie is expected to continue its record breaking run. As Toxic seems to be receiving bad word-of-mouth, theatres might continue to show Bethlehem Kudumba Unit replacing the Pan-India film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    నా పేరు మాస్ మహారాజా రవితేజ, నా సినిమా ఇరుముడి అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ దూసుకుపోతున్నాడు. కేవలం నాలుగురోజులకే వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఇరుముడి ఫామ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయం   తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఉన్న స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి ప్రకటన చేయకుండా థియేటర్ యాజమాన్యం 'ఇరుముడి' సినిమా ప్రదర్శనని  అకస్మాత్తుగా నిలిపివేసిందని   అభిమానులు, పక్క గ్రామాల నుంచి వచ్చిన ప్రేక్షకులు మరియు అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలకే లోనయ్యారు. ఇరుముడి చూడాలనే ఆశతో  గత రెండు  రోజులుగా చుట్టుపక్కల మండలాల నుంచి వందలాది మంది జనం మక్తల్ వెంకటరమణ థియేటర్‌కు పోటెత్తుతున్నారు. తమ దైనందిన పనులను, వ్యక్తిగత పనులను సైతం పక్కన పెట్టి థియేటర్‌ వద్దకు వస్తున్నప్పటికీ, టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని ప్రేక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: నాగార్జున 100 వ చిత్రం గ్లింప్స్‌ రిలీజ్.. టైటిల్ ఇదేనా!  కనీసం బుధవారం అయినా సినిమా చూసే అవకాశం లభిస్తుందని ఎంతో ఆశతో థియేటర్‌కు వస్తే, ఉన్నపళంగా షో రద్దు చేశారన్న వార్త వారిని తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురిచేసింది.  దీంతో సహనం కోల్పోయిన ప్రేక్షకులు థియేటర్ మెయిన్ గేటు ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. సినిమా ప్రదర్శనను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎంతటి రద్దీనైనా తట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, సీట్లు లభించకపోతే నేలపై కూర్చుని లేదా నిలబడి అయినా సినిమా తిలకిస్తామని అభిమానులు స్పష్టం చేయడం అక్కడ ఉన్న వారిని కదిలించింది.  గత 2 రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల భారాన్ని గుర్తించి థియేటర్ యాజమాన్యం మరియు నిర్వాహకులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే ప్రదర్శన ప్రారంభించి పరిస్థితిని సమీక్షించాలని, ప్రేక్షకుల డిమాండ్లను తీర్చాలని స్థానికులు స్పష్టం చేశారు. ఈ ఊహించని ఘటనతో మక్తల్ వెంకటరమణ థియేటర్ ప్రాంగణంలో కొంతసేపు ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులు తమ మేనరిజమ్స్ ని ప్రదర్శించాయి.  Raviteja, Irumudi, Nakshthra, Priya Bhavani Shankar
రాకింగ్ స్టార్ యశ్ అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే పాన్ ఇండియా సూపర్ స్టార్. కానీ ఆయన సక్సెస్ వెనుక ఉన్న అసలైన పోరాటం చాలామందికి తెలియదు. ఈ పాన్ ఇండియా స్టార్ ఒకప్పుడు టీలు కూడా అందించాడు. యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. నాన్న అరుణ్ కుమార్ బెంగళూరులో BMTC బస్సు డ్రైవర్‌గా పనిచేసేవారు. అమ్మ పుష్ప గృహిణి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నవీన్‌కి చిన్నప్పటి నుంచే నటన అంటే పిచ్చి. డిగ్రీ మధ్యలోనే ఆపేసి, సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొదట్లో అవకాశాలు రాకపోవడంతో రంగస్థల నటుల దగ్గర టీలు అందించే పనిలో చేరాడు. రోజుకి వచ్చే 50 రూపాయల సంపాదనతో కడుపు నింపుకుంటూ.. నాటకాల వెనుక ఉండే కష్టాలను పాఠాలుగా నేర్చుకున్నాడు. ఒకానొక దశలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరితే రెండు రోజులకే ఆ సినిమా ఆగిపోయింది. అయినా వెనుకాడలేదు. చిన్న చిన్న నాటకాల్లో నటుడిగా అవకాశాలు దక్కించుకుంటూ తన టాలెంట్ నిరూపించుకున్నాడు. 2004లో 'ఉత్తరాయణ', 'నంద గోకుల' లాంటి టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. ఆ సమయంలో టీవీ నటులకు సినిమాల్లో పెద్దగా స్కోప్ ఉండదనే ముద్రను యశ్ తన కష్టంతో చెరిపివేశాడు. 2007లో 'జంబద హుడుగి' సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి, 'మొగ్గిన మనసు' చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 'గూగ్లీ', 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' లాంటి బ్లాక్‌బస్టర్‌లతో కన్నడ నాట స్టార్ గా ఎదిగాడు. ఇక అక్కడ నుంచి మొదలైంది అసలైన విశ్వరూపం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల సునామీ సృష్టించి, కన్నడ ఇండస్ట్రీ రేంజ్‌ను పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లాడు. ఒకప్పుడు సెట్స్‌లో టీలు మోసిన అదే చేతులతో, ఈరోజు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు యశ్.  కలలు కనడానికి పేదరికం అడ్డుకాదని, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన యశ్ లైఫ్ జర్నీ ప్రతి ఒక్కరికీ ఓ గ్రేట్ ఇన్స్పిరేషన్.       Rocking Star Yash, Life Story, Toxic Movie  
  కింగ్ నాగార్జున తన వందవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ముప్పై ఏళ్ళ క్రితమే తెలుగు సినిమాకి పాన్ ఇండియా సువాసనాలని అద్దిన నాగార్జున తన వందవ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడో చెప్పక్కర్లేదు.  ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్, సినిమా అధికారిక టైటిల్, గ్లింప్స్‌ ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కానుకగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం పక్కాగా సన్నాహాలు చేస్తోంది.  ఇప్పటివరకు సినిమా నుంచి ఒక్క పోస్టర్ కానీ, పిక్చర్ కానీ బయటకి రాకపోవడంతో ఈ ప్రచార అప్‌డేట్‌పై అక్కినేని అభిమానులలో అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కి  చేరుకున్నాయి.  ఈ భారీ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌కు తమిళ సినీ పరిశ్రమకి చెందిన రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున తన సొంత బ్యానర్  అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక అరుదైన విశేషం ఏమిటంటే.. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటి టబు, నాగార్జున కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది.  వీరితో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్ మరియు విజయేంద్ర కీలక పాత్రలలో మెప్పించనున్నారు.  సాంకేతికంగా కూడా ఈ 100వ సినిమా టాలీవుడ్‌లో ఒక విజువల్ వండర్‌గా నిలవబోతోంది.  Also Read: కారణం ఇదే  కథలో భాగంగా నాగార్జున క్యారక్టర్  25 ఏళ్ల నవ యువకుడి నుండి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి వరకు రకరకాల గెటప్స్‌లో కనిపిస్తుంది. ఇందుకోసం అధునాతన 'డీ-ఏజింగ్'  హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వర్కింగ్ టైటిల్‌గా '#King100' ప్రచారంలో ఉన్నప్పటికీ, ఈ చిత్రానికి 'నెక్ట్స్ లెవెల్' లేదా 'లాటరీ కింగ్' అనే టైటిల్స్‌ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టుగా టాక్.   Nagarjuna, Raa karthik, Tabu
Megastar Chiranjeevi has rejoined the sets of Vishwambhara for a short reshoot, giving the long-pending fantasy spectacle another push towards completion. The film has been in production for a considerable period, with its extensive VFX work being the primary reason behind the repeated delays. The team is now determined to finish the remaining work without compromising on the visual quality. Interestingly, Vishwambhara is currently looking at two possible release windows. The makers are hopeful of completing the entire post-production by December and are considering a Christmas 2026 release if the work progresses as planned. However, they are also keeping Summer 2027 as a safer alternative. The background score is another important component currently taking shape. While MM Keeravani has composed the songs, Gowra Hari has taken charge of the background score and has already begun working on the film. His recently released OST glimpse has also given audiences an idea about the grand, spiritual world being created for the film. The Summer 2027 option, however, will depend heavily on the market scenario. The makers are keen about Sandeep Reddy Vanga's Spirit and SS Rajamouli's Varanasi progress and if they look at other dates than planned March and April dates. If they come on planned dates, Vishwambhara could look at May release, if not they might take April date.  For now, the priority is clear — complete the VFX, finish the background score and get the film ready by December. If everything falls into place, Chiranjeevi could return to theatres with Vishwambhara during Christmas. Otherwise, the makers have the Summer 2027 window as a backup, giving them enough breathing space to present the film on the scale they have promised. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'ప్రేమ ఇష్క్ కాదల్' (2013), 'సావిత్రి' (2016), 'సేనాపతి' (2021) వంటి వైవిధ్యమైన సినిమాలతో పాటు 'పిల్లా', 'ఈ ఆఫీస్‌లో', 'దయ్యా' (2023) వంటి హిట్ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు పవన్ సాదినేని. ప్రస్తుతం  దుల్కర్ సల్మాన్ తో  'ఆకాశంలో ఒక తార' చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పవన్ పై  ఒక నటి చేసిన తీవ్రమైన లైంగిక వేధింపులు, మోసం ఆరోపణల నేపథ్యంలో పోలీసుల అదుపులోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.   పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను నమ్మించి, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి సుదీర్ఘకాలం పాటు తనతో సహజీవనం చేశాడని, అనంతరం తనను మోసం చేసి లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలైన సదరు నటి తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా అవసరం తీరిపోయాక ముఖం చాటేశాడని సదరు ఆర్టిస్ట్ తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి పవన్ ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.   Also Read: Toxic: నెగిటివ్ టాక్పై ఫ్యాన్స్ ఫైర్ సినిమా పరిశ్రమలో 10 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్న ఒక పేరున్న దర్శకుడిపై ఇలాంటి తీవ్రమైన కేసులు నమోదు కావడం, అది కూడా నేరుగా అరెస్టే కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే 'ఆకాశంలో ఒక తార' ప్రాజెక్ట్ కీలక దశలో ఉండగా, గతంలో కూడా ఈ సినిమాకు చెందిన కాస్టింగ్ ప్రాసెస్ సందర్భంగా తొంబై వేల రూపాయల బకాయిల చెల్లింపు విషయంలో నటిపై వేధింపుల వివాదం బయటకు వచ్చింది. . ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తూ తదుపరి విచారణను వేగవంతం చేశారు. ఈ అరెస్ట్ వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.    Pavan Sadineni, Tollywood 
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మళ్లీ లైంగిక వేధింపుల అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్‌పై చర్చలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా, వెలుగులోకి వస్తున్న ఘటనలు మాత్రం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ యువ తెలుగు దర్శకుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లడం టాలీవుడ్‌ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధిత నటి అందించిన ఆధారాలు మరియు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు తక్షణమే స్పందించి సదరు ఫిల్మ్ మేకర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ సదరు దర్శకుడిపై సంచలన ఆరోపణలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈసారి బాధిత నటి తగిన ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అధికారులు కేసును సీరియస్‌గా తీసుకొని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఒక మలయాళ నటుడితో సినిమా రూపొందించే పనిలో ఉన్నాడని, అయితే ఆయనపై ఉన్న పాత వివాదాలు మరియు వివాదాస్పద వ్యవహారశైలి మళ్లీ ఆయనను చిక్కుల్లో పడేసిందని విశ్లేషిస్తున్నారు. మహిళా భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు ఎంతో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. చిత్రసీమలో అవకాశాల పేరుతో జరిగే అక్రమాలు, వేధింపులపై గతంలో కూడా అనేకమంది కథానాయికలు బహిరంగంగానే పెదవి విప్పిన సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా హేమ కమిటీ నివేదిక వంటి పరిణామాలు సినీ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అరెస్ట్ వార్త వైరల్‌గా మారడంతో సినీ అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. పోలీసులు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసి కేసు వివరాలను వెల్లడించే చాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన నీతి సూత్రాల్లో రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు అనేది ఒకటి. మన జీవితంలో కొన్ని విషయాలు మనకే పరిమితం కావాలి. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, బలహీనతలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి వాటిని జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే ఒకసారి రహస్యం బయటకు వెళ్లిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. మనం ఎంతో నమ్మిన వ్యక్తి కూడా పరిస్థితులు మారినప్పుడు అదే రహస్యాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. శత్రువులకు మన బలహీనతలు తెలిస్తే, వాటినే మనపై ఆయుధాలుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరిని నమ్మినా, ఏ విషయాన్ని ఎంతవరకు చెప్పాలో ఆలోచించాలి. నమ్మకం ఉండటం వేరు, మన జీవితంలోని ప్రతి రహస్యాన్ని చెప్పడం వేరు. అలాగే మనం సాధించాలనుకున్న లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను ముందుగానే అందరికీ చెప్పకుండా, వాటిని సాధించిన తర్వాత ఫలితాల ద్వారా చూపించడం మంచిది. అవసరానికి మించి మాట్లాడటం కంటే, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం తెలివైన వ్యక్తి లక్షణం. ఒక చిన్న మాట కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యకు కారణమవుతుంది. అందుకే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాణక్య నీతి ప్రకారం మన రహస్యాలను మనమే కాపాడుకోవడం ఒక గొప్ప తెలివి. మన నిశ్శబ్దం మన బలంగా మారినప్పుడు, ఇతరులు మన బలహీనతలను తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి జీవితంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి — అవసరం లేని చోట మాట్లాడకండి, మీ రహస్యాలను ఎవరికీ అప్పగించకండి, మీ లక్ష్యాలను మాటల్లో కాకుండా విజయంతో చూపించండి.
  కోడి మాంసం (చికెన్) ప్రియులు మనదేశంలో కోకొల్లలు. సాధారణంగా చాలామంది చికెన్ షాప్‌కు వెళ్లినప్పుడు బోన్‌లెస్ ముక్కలు లేదా లెగ్ పీస్‌లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. కానీ చికెన్ లివర్ (కోడి కాలేయం) అనగానే కొంతమంది పక్కన పెట్టేస్తుంటారు లేదా తినడానికి అంతగా ఆసక్తి చూపరు. అయితే, మనం సాధారణంగా తినే చికెన్ బ్రెస్ట్ లేదా థైస్ ముక్కల కంటే కూడా చికెన్ లివర్‌లోనే అత్యధిక పోషక విలువలు దాగి ఉన్నాయని ప్రముఖ పోషకాహార నిపుణులు మరియు వైద్య పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ ధరలోనే లభించే ఈ చికెన్ లివర్ ఒక రకమైన  న్యూట్రిషనల్ పవర్‌హౌస్  (Nutritional Powerhouse) అని, దీనిని క్రమం తప్పకుండా పరిమితంగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చికెన్ లివర్ ముఖ్యంగా రక్తహీనత (అనీమియా)తో బాధపడేవారికి ఒక శక్తివంతమైన సహజసిద్ధ ఔషధంగా పనిచేస్తుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తికి మరియు హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి  హెమ్ ఐరన్  (Heme Iron) అత్యంత ఆవశ్యకం. 100 గ్రాముల చికెన్ లివర్‌లో దాదాపు 9 నుండి 13 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇది ఒక మనిషికి రోజువారీగా కావలసిన ఐరన్ అవసరంలో 50 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఒంటరిగానే పూరిస్తుంది. ఐరన్‌తో పాటు దీనిలో విటమిన్ బి12 (Vitamin B12) అమితంగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లివర్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన రోజువారీ విటమిన్ బి12 అవసరంలో ఏకంగా 200 శాతానికి పైగా లభించడం విశేషం. ఇది నరాల బలహీనతను నివారించి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ, శరీరంలో నిరంతర ఉత్సాహాన్ని నింపడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో విటమిన్ ఏ (Vitamin A) పాత్ర ఎంతో ప్రసిద్ధమైనది. చికెన్ లివర్ విటమిన్ ఏ కి బలమైన వనరుగా నిలుస్తుంది. కేవలం 100 గ్రాముల చికెన్ లివర్ తింటే శరీరానికి రోజుకు కావలసిన విటమిన్ ఏ పరిమాణంలో దాదాపు 300 శాతానికి పైగా అందుతుంది. ఇది రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నుండి రక్షణ కల్పించడమే కాకుండా, చర్మాన్ని కాంతివంతంగా ఉంచి అకాల ముడతలను నివారిస్తుంది. అలాగే, ఇందులో లభించే విటమిన్ బి9 (ఫోలేట్) గర్భధారణ సమయంలో పిండం యొక్క ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది, కాబట్టి మహిళలు దీనిని సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.       Health benefits of eating chicken liver,chicken liver for anemia and eye health.  
మానవ శరీరానికి కావలసిన అత్యంత విలువైన పోషకాలను అందించే ప్రకృతి సిద్ధమైన ఆహారాలలో చేపలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. నేటి వేగవంతమైన ఆధునిక జీవనశైలిలో అనేక రకాల గుండె జబ్బులు, కంటి చూపు లోపాలు మరియు మానసిక ఒత్తిడి తీవ్రమైన సవాళ్లుగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో వారానికి కనీసం 2 నుండి 3 సార్లు ఆహారంలో చేపలను భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ప్రముఖ పోషకాహార నిపుణులు మరియు వైద్య పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. చేపల్లో ఉండే అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మరియు ముఖ్యంగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు (Omega 3 Fatty Acids) మన శరీరంలోని ప్రధాన అవయవాలైన గుండె, మెదడు మరియు కళ్ళ పనితీరును మెరుగుపరచడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. చేపలలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు హృదయ సంబంధిత సమస్యలను నివారించడంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, క్రమం తప్పకుండా చేపలను తినే వ్యక్తులలో గుండెపోటు (Heart Attack) మరియు పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదం దాదాపు 15 నుండి 20 శాతం వరకు తగ్గుతుందని తేలింది. చేపలు తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు సుమారు 20 నుండి 30 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును (Blood Pressure) క్రమబద్ధీకరిస్తుంది. హృదయ స్పందనలను సరిగ్గా ఉంచడం ద్వారా రక్తనాళాలు పూడుకుపోయే ముప్పును నామరూపాలు లేకుండా చేస్తుంది. మెదడు చురుకుదనం మరియు జ్ఞాపకశక్తి పెంపొందించడంలోనూ చేపల పాత్ర గణనీయమైనది. మన మెదడులోని 60 శాతం భాగం కొవ్వుతో నిర్మితమై ఉంటుంది, అందులో అధిక భాగం ఓమేగా 3 రకానికి చెందిన డిహెచ్‌ఎ (DHA) రూపంలో ఉంటుంది. చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల వయస్సు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి లోపం, ఆల్జీమర్స్ మరియు డిమెన్షియా వంటి మానసిక క్షీణత సమస్యల ప్రమాదం దాదాపు 40 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులోని ‘గ్రే మేటర్’ (Grey Matter) పరిమాణాన్ని పెంచి, ఆలోచనా శక్తిని మరియు సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని ఇది రెట్టింపు చేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత మరియు అభ్యాస నైపుణ్యాలు పెరగడానికి రోజూ లేదా వారంలో కొన్ని రోజులు చేపలు తినిపించడం ఎంతో శ్రేయస్కరం.       Vitamin D and protein rich fish health guide,how fish helps improve eyesight and memory.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ మందులకు బదులుగా పెద్దవాళ్లు తమ సాంప్రదాయ వైద్యాన్ని, పెద్దలు నేర్పించిన ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. నిజానికి ఈ చిట్కాలు చాలా వరకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి కూడా.  అలాంటి అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుంటే.. కడుపునొప్పికి వేడి ఉప్పు ప్యాక్.. కడుపు నొప్పికి ఒక సాంప్రదాయ  ఇంటి చికిత్స ఉంది. గోరువెచ్చని ఉప్పు కాపడాన్ని పెట్టడం చాలా ప్రబావవంతంగా పనిచేస్తుంది. దొంతర ఉప్పు లేదా దొడ్డు ఉప్పును ఒక గుడ్డలో చుట్టి, కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత కడుపుపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఉదర కండరాలలోని తిమ్మిర్లు లేదా బిగువు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. గ్యాస్ లేదా తేలికపాటి తిమ్మిర్ల వంటి సమస్యలు ఉన్నవారికి  గోరువెచ్చని కాపడాలు చాలా బాగా  సహాయపడతాయి. అయితే కడుపు నొప్పి వేరే ఏదైనా సమస్యల వల్ల వచ్చి ఉంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటే..  ఆ కడుపు నొప్పి కూడా వాంతులు,  జ్వరం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, లేదా కడుపులో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే అలాంటి సమస్యలకు ఈ ఉప్పు కాపడం అనేది సరైనది కాదు.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వేడి ఉప్పు కాపడం వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉప్పు ప్యాకె ను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. దీనిని నేరుగా చర్మం మీద పెట్టడానికి బదులుగా ఒక సన్నని క్లాత్ ను పొట్ట మీద ఉంచి ఆ తర్వాత కాపడం పెట్టాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, కాబట్టి వారి విషయంలో ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రపోతున్నప్పుడు వెచ్చని ప్యాక్‌ను  అలాగే పెట్టుకుని పడుకోకూడదు. ఒకవేళ ఎరుపు, మంట లేదా నొప్పి వంటివి కలిగితే ఉప్పు కాపడం ఆపెయ్యాలి. కఫ సమస్యలకు ఉప్పు కాపడం.. దగ్గు, కఫం లేదా ఛాతిలో భారంగా అనిపించడం వంటి వాటికి చాలా ఇళ్లలో వేడి ఉప్పు కాపడం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. ఉప్పును వేడి చేసి, ఒక గుడ్డలో లేదా టవల్‌లో ఉంచి, కొద్దిసేపు ఛాతిపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఛాతి పట్టేసినట్టు ఉండటం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.  ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దీని ఫలితం ఉండవచ్చు.  వేడి ఉప్పు టవల్ దగ్గుకు పూర్తీ చికిత్స కాదు. . వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, అలర్జీలు, ఆస్తమా లేదా ఇతర కారణాల వల్ల కూడా దగ్గు రావచ్చు. అందువల్ల, కేవలం ఈ ఇంటి చిట్కాపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.                                                                                                                                                   *రూపశ్రీ.
పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష నోటి మరియు దంత ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, పిప్పిపంటి వంటి సమస్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే నోటి క్యాన్సర్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు, నోటి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి కూడా ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. దంతాలు లేదా చిగుళ్లకు సంబంధించిన సమస్యలు కొనసాగితే అర్హత కలిగిన డెంటిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)