LATEST NEWS
  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు, అక్కడ కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ కూడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించాలని ప్రయత్నించిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వివిధ దేశాల్లో కీలక రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సహా అనేక దేశాల్లో తెలుగువారు ఆయా దేశాల రాజ్యాంగాల ప్రకారం సేవలందిస్తూ నాయకులుగా ఎదుగుతున్నారని చెప్పారు. ప్రజలకు మంచి సేవలు అందించే వారే నాయకులుగా గుర్తింపు పొందుతారని పేర్కొన్న ఆయన, తెలంగాణలో పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతికి నిదర్శనం కావని అన్నారు. ప్రజా చైతన్యం, అభివృద్ధి, సేవల విషయంలో పోటీ పడాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. అనవసర వ్యాఖ్యలతో లేనిపోని సమస్యలు సృష్టించడం మంచిది కాదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, రెండు రాష్ట్రాలు తమ తమ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఎవరు ఏ ప్రాంతానికి ఎంత సేవ చేశారో ప్రజలకు తెలుసని, తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.  
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని దుయ్యబట్టారు.  వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ   నినాదం రైజింగ్.. విధానం  ఫాలింగ్ అని ఎద్దేవా చేశారు.  హామీల అమలు గురించి ప్రశ్నిస్తే.. అభివృద్ధి పై నిలదీస్తే.. ఎంత పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అంటున్న సీఎం.. 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి, నపుంసకులు అనాలా అని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా ప్రభుత్వ ఆదాయం పతనమవుతోందన్నారు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని ప్రజలకు అర్థమైందన్నారు. చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు. ఇక ఫ్యూచర్ సిటీ అంటూ చేస్తున్న ఆర్భాటం అంతా ఉత్తిత్తిదేనన్నారు.  అక్కడ భూములు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములని కేటీఆర్ చెప్పారు. 
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయవాదం, హక్కుల పోరాటంపై   దుమారం రేగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు  ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడున్న నాలుగున్నర కోట్ల మంది  భూమి పుత్రుల జాగీరని ఆయన స్పష్టం చేశారు. ఈ గడ్డపై ప్రతి అంగుళం ఇక్కడి ప్రజల స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి ప్రతీక అన్న కేటీఆర్.. తెలంగాణకు ఎవరైనా రావచ్చు కానీ ఇక్కడి ప్రజల సార్వభౌమత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇటీవల పవన్ కల్యాణ్  తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్..  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ నడిబొడ్డున పవన్ కల్యాణ్ సభ పెట్టాలనుకోవడంపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ..  అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ఇక్కడి పరిపాలనకు ఎప్పటికీ  ఓజీ  అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణకు ఇంకెవ్వరి పెత్తనమూ అవసరం లేదనీ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనదిగా పవన్ కల్యాణ్ అభివర్ణించడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంధ్రుల హక్కుల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాటం కూడా ప్రాంతీయవాదమే అవుతుందా అని ప్రశ్నించారు. ప్రాంతీయ హక్కుల కోసం పోరాడటం ఉగ్రవాదమా అని నిలదీశారు. జాతీయవాదం  ముసుగు వేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రావలసిన ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలను, ప్రాజెక్టులను తన స్వరాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని 'ఆర్థిక ప్రాంతీయవాదం' అనరా అని కేటీఆర్ నిలదీశారు. దేశంలో ఎవరికైనా, ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందన్న కేటీఆర్.. జనసేన పార్టీ తెలంగాణలో కొత్తగా పోటీ చేసేదేమీ లేదనీ..  గతంలో జరిగిన 2018,  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేశారనీ గుర్తు చేశారుర.   ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌కు గౌరవం ఇస్తామనీ,  ఒక కళాకారుడిగా, సినీ నటుడిగా ఆయనకు ఉన్న అభిమానులను తాము గౌరవిస్తామనీ, అయితే.. హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్‌లోకి వచ్చి ఇక్కడి పాలనపై పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఇక్కడి నాలుగున్నర కోట్ల మంది ప్రజలు  ఊరుకోరని కేటీఆర్ హెచ్చరించారు. 
అమరావతి రైతులు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది. నిన్నమొన్నటి వరకు జగన్ ను, ఆయన మూడు రాజధానుల సిద్ధాంతాన్నీ తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకించిన వారే  నేడు తమ సమస్యల పరిష్కారం కోసం అదే గడప తొక్కడం ఏంటన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు సుదీర్ఘ కాలం పాటు రోడ్లెక్కి నిరసనలు ప్రదర్శించారు. జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.   తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం (జూన్ 2) జగన్- అమరావతి రైతుల భేటీ జరిగింది. అయితే..  గతంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా   సుదీర్ఘ  పోరాటాలు, పాదయాత్రలు చేసిన పాత అమరావతి రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ భేటీలో లేరు. వీరంతా  ‘కొత్త రైతులు’   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా భూములు కోల్పోతున్న కొందరు రైతులకు ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు అందుకున్న రైతుల్లో కొందరు  తమకు  అన్యాయం జరుగుతోందంటూ  జగన్ వద్దకు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ లోపలా, వెలుపలా గళం విప్పాలని.. తమ పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వంపై పోరాడాలని వారు జగన్ ను కోరారు.  వీరిలో అత్యధికులు నాడు భూ సమీకరణను వ్యతిరేకించిన వారే కావడం గమనార్హం. మొత్తం మీద కొత్త రైతులకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. 
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిగ కజగం (టీవీకే) రెండు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న ద్రావిడ పార్టీలను చిత్తు చేసి ఏకంగా అధికార పీఠాన్ని దక్కించుకుంది.   ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో తమిళ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న రాజకీయ పరిణామం దేశ వ్యాప్తంగా  ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. తాజాగా అప్పు డే రాబోయే 2031 అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  ఐదేళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు విజయ్ వర్సెస్ అన్నామలై గా మారతాయంటూ విశ్లేషకులు పెద్ద చర్చకు తెరలేపారు.   అయితే వాదనలు, చర్చ,  క్షేత్రస్థాయిలో ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో  భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నూతన సీఎం విజయ్ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందుగానే తన రాజకీయ పార్టీని ప్రకటించి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఆరెండేళ్లూ..  నిరంతరం ప్రజల్లోనే తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను,   ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్   సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన  రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.    మరోవైపు బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు రాజకీయ చిత్రంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది.  ఒకప్పుడు కర్ణాటక క్యాడర్ లో సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా సేవలందించిన అన్నామలై.. తన సివిల్ సర్వెంట్ పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమలం పార్టీలో చేరిన వెంటనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో దూకుడు నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. గతంలో డిఎంకె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసనలో బహిరంగంగా తనను తాను కొరడాతో కొట్టుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టి  ఆకర్షించారు. అయితే ప్రస్తుతం ఆయన బీజేపీని వీడడంతో ఆయన రాజకీయ పయనం ఎటు వైపు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అన్నామలై  సొంతంగా ముందుకు సాగినా విజయ్ స్థాయిలో ప్రజాదరణను, ఓట్లను సాధించడం దాదాపు అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఒక జాతీయ పార్టీలో పనిచేసి, దానిని వీడి తన రాజకీయ అపరిపక్వతను ఆయనంతట ఆయనే స్వయంగా  బయటపెట్టుకున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ వెనుక కోట్లాది మంది అభిమానులు, బలమైన కేడర్ ఉండి  ఓట్లు వేసి గెలిపించారు. కానీ..  అన్నామలైకి ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించే  ఓటు బ్యాంక్  లేదని అంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
తమిళనాడు రాజకీయాల్లో అలాగే సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన, అందమైన స్నేహ బంధాలు అప్పుడప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక అద్భుతమైన సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) బుధవారం నాడు ఒక ప్రత్యేకమైన పర్యటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌(CM Vijay)ని ఆయన నివాసంలో ఖుష్బూ సుందర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక భేటీ వెనుక ఒక సంతోషకరమైన కుటుంబ కారణం ఉంది.  ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి తమ కుమార్తె అవంతిక వివాహానికి ముఖ్యమంత్రి విజయ్‌ని స్వయంగా ఆహ్వానించడానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఎంతో ఆత్మీయంగా సాగిన ఈ సమావేశానికి సంబంధించిన సుందరమైన ఫోటోలను ఖుష్బూ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. ఈ హృదయపూర్వకమైన సమావేశం కేవలం ఒక రాజకీయ భేటీలా కాకుండా, రెండు కుటుంబాల మధ్య ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని, ఆత్మీయతను ప్రతిబింబించేలా సాగింది. ముఖ్యమంత్రి విజయ్‌ని ఖుష్బూ సుందర్ ఎంతో ప్రేమతో తన ‘డియరెస్ట్ బ్రదర్’ (ప్రియమైన సోదరుడు) అని సంబోధించడం విశేషం. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఒకరికొకరు ఉన్న పరిచయం, ఆప్యాయత ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ సందర్భంగా మరోసారి స్పష్టంగా కనిపించింది.  ఖుష్బూ దంపతులతో పాటు వారి పిల్లలు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. కొత్త ముఖ్యమంత్రిని, తమకు ఎంతో ఇష్టమైన హీరో విజయ్ ను కలవడంపై ఖుష్బూ పిల్లలు అవంతిక, ఆనందిత ఎంతో థ్రిల్ అయ్యారని, వారి ఆనందానికి అవధులు లేవని ఖుష్బూ తన పోస్ట్‌లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విజయ్ సైతం ఎంతో వినమ్రంగా, చిరునవ్వుతో వారి ఆహ్వానాన్ని స్వీకరించి, కాబోయే వధూవరులకు తన అభినందనలు తెలియజేశారు. రాజకీయంగా విభిన్న సిద్ధాంతాలు, వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ.. వ్యక్తిగత బంధాలకు, కుటుంబ శుభకార్యాలకు ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో ఈ భేటీ నిరూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి.    https://x.com/khushsundar/status/2062014682689585545
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ బయటకు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే తాజాగా ఆయన భార్య అన్నా లెజినోవా కొణిదెల (Anna Lezhneva) సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక అందమైన సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.  ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన అన్నా లెజినోవా, తన భర్త పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ పిక్‌లో ఇద్దరూ ఎంతో రిలాక్స్‌గా, ముఖంలో నిండుగా నవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫొటో ఇచ్చారు. ఈ అరుదైన చిత్రాన్ని చూసిన మెగా అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అన్నా లెజినోవా ఈ అందమైన ఫొటోను పోస్ట్ చేస్తూ "ఫ్యామిలీతో గడపడానికి ఇంతకంటే మంచి ఉదయం మరొకటి ఉండదు" అంటూ ఒక హార్ట్ టచింగ్ క్యాప్షన్ కూడా జోడించారు. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ ఫోటోకు ఏకంగా రెండు లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. కేవలం లైక్స్ మాత్రమే కాకుండా వేలాదిగా షేర్లు వస్తుండటంతో ఈ ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. ఈ పోస్ట్‌లో కేవలం భార్యాభర్తల సెల్ఫీ మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవికి సంబంధించిన ఫొటోను కూడా అన్నా లెజినోవా షేర్ చేశారు. ఈ ఫొటోలు వారి కుటుంబంలో ఉన్న అప్యాయతను, బలమైన బంధాలను చాటుతున్నాయి. మెగా కుటుంబంలోని ఈ ఆత్మీయతను చూసి నెటిజన్లు "బ్యూటిఫుల్ ఫ్యామిలీ" అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారు. ఇటీవలే ఆయనకు ఒక సర్జరీ జరగగా, ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని యాక్టివ్‌గా మారారు.   https://www.instagram.com/p/DZHLPDAidqM/
  స్టార్ హీరో సూర్య(Suriya)కి ప్లాప్స్ నుంచి విముక్తి కల్పించిన చిత్రం కరుప్పు(Karuppu)అలియాస్ వీరభద్రుడు.మైథలాజికల్ ఫాంటసీ కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటని  కొనసాగిస్తోంది.  మొదటి వారం 113.85 కోట్ల రూపాయల భారీ నెట్ కలెక్షన్లని  సాధించి సూర్య బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది. రెండో వారంలో కూడా అదే జోరును కొనసాగిస్తూ మరో 54.30 కోట్ల రూపాయలని  తన ఖాతాలో వేసుకుంది. అంటే  కేవలం 12 రోజులు గడిచేసరికి ప్రపంచవ్యాప్తంగా 253.26 కోట్ల రూపాయల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ వసూళ్లు 184.26 కోట్ల రూపాయలుగా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి 69 కోట్ల రూపాయల భారీ వసూళ్లు వచ్చాయి.   అంతటితో కరుప్పు ప్రభంజనం ఆగలేదు.16వ రోజు 5.15 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించడంతో, ఇండియాలో మొత్తం  204.21 కోట్ల రూపాయల గ్రాస్ కి చేరుకున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా స్థిరమైన రన్ కొనసాగిస్తూ 77.75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలోనే 16 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు 281.96 కోట్ల రూపాయల మార్కును తాకాయి. ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా 20 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 300 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టి సూర్య కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది.  Also read: Ranveersingh: డాన్ 3 వివాదం... రణవీర్ సింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్  ఏరియాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా 140 కోట్ల రూపాయల వసూళ్లు నమోదవగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 32.50 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 21.25 కోట్లు, కేరళలో 13.50 కోట్ల రూపాయలతో సౌత్ ఇండియా అంతటా ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాకపోతే ఈ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ తో పెద్ది వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతుండటంతో కరుప్పు కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.   
Actor-writer-director RJ Balaji has come under social media criticism after his latest post about Tamil Nadu Chief Minister Vijay triggered reactions from a section of Suriya fans. He is the director of Suriya's Rs.280 crore grosser biggest blockbuster comeback, Karuppu/ Veerabhadrudu. So, them trolling and abusing him became hot social media topic.  Going into the details, after meeting Vijay, RJ Balaji shared a picture and wrote: “With the man who started it all for #Karuppu! Wow… Feels unreal to meet him now as the Honourable Chief Minister of Tamil Nadu. Same love, warmth, kindness and calmness. Thank you for everything dearest Vijay sir.” The post quickly went viral, but one line in particular — “the man who started it all for #Karuppu” — became the centre of discussion online. Soon after, a section of Suriya fans began trolling RJ Balaji and posting abusive comments on social media. Many felt the statement gave excessive credit to Vijay while overlooking Suriya’s role as the lead actor and the face associated with the film’s blockbuster success. Some fans questioned why RJ Balaji publicly highlighted Vijay’s contribution without mentioning Suriya in the same context. At the same time, others defended RJ Balaji and argued that the post appeared to acknowledge Vijay’s early support or involvement in helping the project take shape rather than taking away credit from Suriya. Looks like RJB cannot avoid controversies no matter what!! Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) మరికొద్ది గంటల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అదే సినిమాలో వచ్చే పవర్‌ఫుల్ హాస్పిటల్ సీన్.  డైరెక్టర్ బుచ్చిబాబు మార్క్ ఎమోషన్, రామ్ చరణ్ నటన పీక్స్‌కి వెళ్లిన సందర్భం ఇది అని అంటున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ పవర్‌ఫుల్ సీన్‌గా నిలిచిపోతుందని కొనియాడుతున్నారు. సినిమాలో అద్భుతమైన ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నప్పటికీ, ఈ హాస్పిటల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ గుండెలను పిండేయడం ఖాయమని టాక్. దాదాపు 5 నిమిషాల పాటు సాగే ఈ హాస్పిటల్ బ్లాక్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ నటన చాలాకాలం గుర్తుండిపోతుందని చెప్పుకుంటున్నారు. ఒక నటుడిగా చరణ్ ఎంతగా ఎదిగారో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులు, కలర్‌ఫుల్ సాంగ్స్ ఆడియన్స్‌ను ఊపేస్తుంటాయి. కానీ 'పెద్ది' సినిమా విషయంలో మాత్రం ఈ ఎమోషనల్ హాస్పిటల్ సీన్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు.  మరి 'పెద్ది' మూవీలో ఈ హాస్పిటల్ సీన్ ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది.  
    ధురంధర్(Dhurandhar)సిరీస్ తో బాలీవుడ్ లో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న రణవీర్ సింగ్‌(Ranveersingh)పై డాన్ 3 వివాదం నేపథ్యంలో FWICE ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ గత మే 25వ తేదీన నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్' (సహాయ నిరాకరణ ఆదేశాలు) జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు ఆదేశాల ప్రకారం  సినీ పరిశ్రమకి చెందిన ఏ టెక్నీషియన్, కార్మికుడు రణవీర్‌తో కలిసి పనిచేయకూడదనే పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా ఇది బాలీవుడ్‌లో రణవీర్ కెరీర్‌ను ఇరకాటంలో పడేసే నిర్ణయం.  అయితే ఈ కఠిన నిర్ణయంపై రణవీర్ సింగ్ మౌనాన్ని వీడి, జూన్ 2వ తేదీన నేరుగా FWICE సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. వృత్తిపరమైన విషయాలను ఎప్పుడూ గౌరవంగా, పరిణతితో పరిష్కరించుకోవాలని భావించే రణవీర్, లీగల్ నోటీసులతో తన వాదనని  బలంగా వినిపించారు. ఈ ఊహించని పరిణామంతో పరిశ్రమలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ నిర్మాత టీపీ అగర్వాల్ కూడా FWICE నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముంబై సివిల్ కోర్టుని  ఆశ్రయించాడు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ పరిశ్రమకి  చెందిన ఇతర కీలక అసోసియేషన్లు రంగంలోకి దిగాయి. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA), ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (PGI), మరియు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సంయుక్తంగా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాయి. ఒక నటుడిపై ఇలాంటి కఠిన నిర్ణయాలు అమలు చేయడం వల్ల మొత్తం సినీ వ్యవస్థే దెబ్బతింటుందని, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని FWICE పెద్దలను కోరాయి. చిత్ర పరిశ్రమ అంతా ఒకే కుటుంబం లాంటిదని, చిన్న చిన్న గొడవలను కోర్టుల వరకు తీసుకెళ్లడం మంచిది కాదని CINTAA ప్రతినిధులు నొక్కిచెప్పారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ ,చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ బుధవారం ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేశారు. రణవీర్ సింగ్‌పై విధించిన సహాయ నిరాకరణ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎవరి గెలుపు, ఓటములు లేవని, పరిశ్రమ ప్రయోజనాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. రణవీర్ పంపిన లీగల్ నోటీసులకు తమ లీగల్ టీమ్ సమాధానం ఇస్తుందని చెబుతూనే, రణవీర్ సింగ్ ఇంకా పెద్ద స్టార్ కావాలని ఆకాంక్షించారు. హీరో, నిర్మాతలు, దర్శకులు అందరూ కలిసి ఒకే టేబుల్‌పై కూర్చుని ఈ 45 కోట్ల వివాదాన్ని సామరస్యంగా ముగించుకోవాలని FWICE పిలుపునిచ్చింది. ఈ ఉపసంహరణతో రణవీర్ సింగ్‌కు బాలీవుడ్‌లో భారీ ఊరట లభించినట్లయింది. Also read: Peddi: పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు జీవో వెనుక ఉన్న నిర్మాత ఇతనే.. జై బాలయ్య  రణవీర్ ,ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య ‘డాన్ 3’ వివాదం విషయానికి వస్తే దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి రణవీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడం, ప్రొడక్షన్ ఆలస్యం కావడం వంటి సృజనాత్మక విభేదాల వల్లే రణవీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌లో ఉందనీ, కేవలం ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసమే తాము ఏకంగా 45 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామనేది మేకర్స్ వాదన.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దండయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు రాత్రికే 'పెద్ది' అసలు పవర్ ఏంటో ప్రపంచానికి తెలియనుంది. సినిమా విడుదల కోసం నార్త్ అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రం కోసం ప్రత్యేక జీవో జారీ చేయడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. తెలంగాణలో 'పెద్ది' చిత్రానికి ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటు 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి లభించింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో తరహాలోనే తెలంగాణలోనూ సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 వరకు టికెట్ ధరల పెంపుకు క్లియరెన్స్ వచ్చింది. గతంలో కొన్ని పెద్ద సినిమాల విషయంలో జరిగిన గందరగోళానికి తావులేకుండా ఈసారి ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇవ్వడం విశేషం. సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన కమర్షియల్ హంగామా లేక వెలవెలబోయిన థియేటర్ల ఆకలిని తీర్చడానికి 'పెద్ది' సిద్ధమైంది. ఈ సినిమా కోసం సింగిల్ స్క్రీన్స్ యజమానులు థియేటర్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. చాలా చోట్ల థియేటర్లకు రంగులు వేసి, సౌండ్ సిస్టమ్స్ రిపేర్ చేయించి మరీ ప్రేక్షకుల కోసం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఎగ్జిబిటర్లకు కావలసినంత బంపర్ రెవెన్యూను ఈ ఒక్క సినిమానే తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా "ఈ సినిమా కేవలం కమర్షియల్ చిత్రం కాదు.. ఇదొక ఎమోషనల్ రైడ్.. లాస్ట్ 50 మినిట్స్ చూసి నేనే 50 సార్లు ఏడ్చాను" అని దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన మాటలు నెట్టింట మంట రాజేసాయి. ఈ మూవీ సెకండ్ హాఫ్ ఎమోషన్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో కనెక్ట్ చేస్తుందనే దానిపైనే సినిమా రేంజ్ ఆధారపడి ఉంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం 'పెద్ది' సినిమా టార్గెట్ 1000 కోట్ల క్లబ్. బుచ్చిబాబుకు ఇది రెండో సినిమానే అయినా, గతంలో రాజమౌళికి రెండో సినిమా 'సింహాద్రి' ఎలాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిందో, 'పెద్ది' కూడా చరణ్ కెరీర్‌లో అలాంటి మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నార్త్ అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ రాత్రి పడబోయే ప్రీమియర్ షోల టాక్ కోసం యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.  
Actress Trisha received a thoughtful summer surprise from the Mega family as Upasana Konidela sent her a special gift hamper from her initiative, Attamma’s Kitchen. The hamper reportedly included traditional Andhra-style avakaya pickles along with a variety of flavourful podis, bringing a nostalgic seasonal touch.  Trisha appeared delighted after receiving the gift and shared her reaction with warmth. Expressing her happiness, the actress thanked Upasana and said that the hamper truly made it feel like summer had arrived.  Her response reflected how simple regional flavours and homemade-style treats continue to create special moments even among celebrities. Upasana’s Attamma’s Kitchen has been gaining attention for celebrating traditional food culture and bringing homemade flavours to a wider audience.  This latest gesture added a personal touch and turned into a pleasant surprise for Trisha. The exchange has also caught the attention of fans, who loved seeing this warm interaction and the celebration of classic summer favourites. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ గురించిన ముచ్చట తెగ వైరల్ అవుతోంది. అద్భుతమైన నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరపలేని ముద్ర వేసుకున్న స్టార్ హీరో సూర్య, మరోసారి పవర్‌ఫుల్ సోషల్ సబ్జెక్ట్‌తో మెప్పించడానికి రెడీ అయ్యారు. గతంలో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించిన ఒక సెన్సేషనల్ కాంబో ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడంతో ఇండస్ట్రీ అంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్య కెరీర్‌లో 48వ ల్యాండ్‌మార్క్ మూవీగా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి వైవిధ్యభరిత దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను సూర్య తన సరికొత్త హోమ్ బ్యానర్ ‘అగరం స్టూడియోస్’ నిర్మించనుండటం విశేషం. సమాజంలో ఎంతో గుర్తింపు పొందిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ కథను డిజైన్ చేశారట. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, ఇది ఒక యథార్థ జీవిత గాథ ఆధారంగా రూపుదిద్దుకోబోయే బయోపిక్. కేవలం ఐదు రూపాయలకే నిరుపేదలకు వైద్య సేవలు అందించి, ఎంతోమంది గుండెల్లో దేవుడిగా నిలిచిన ప్రముఖ సామాజిక సేవా తత్పరుడు, దివంగత వైద్యుడు 'తిరువేంగడం వీరరాఘవన్' జీవితం ఆధారంగా ఈ స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ చిత్రంలో సూర్య ఎంతో పవర్‌ఫుల్ అలాగే ఎమోషనల్ డాక్టర్ పాత్రలో సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారట. గతంలో సూర్య, జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో లాయర్ చంద్రుగా సూర్య పండించిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఆ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో వెండితెరపై ఆ మ్యాజిక్ మిస్ అయ్యామని ఫీల్ అయిన అభిమానులకు, ఈ థియేట్రికల్ మూవీ ప్రకటనతో ఇప్పుడు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హీరో సూర్య కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కరుప్పు’ మూవీ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి సూర్య మార్కెట్ స్టామినాని మరోసారి నిరూపించింది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చిన ఊపుతో ఉన్న సూర్య, తన లైనప్‌లో ఉన్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో పాటు జిత్తు మాధవన్ ప్రాజెక్ట్‌లను చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ రెండు క్రేజీ చిత్రాల షూటింగ్ ముగిసిన వెంటనే, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి టి.జె. జ్ఞానవేల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. ‘జై భీమ్’ లాంటి క్లాసిక్ తర్వాత రాబోతున్న ఈ 'ఐదు రూపాయల డాక్టర్' బయోపిక్ థియేటర్లలో ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి!
  'పెద్ది'(Peddi)రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ తెలంగాణ రాష్ట్ర మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో  నైజాం ఏరియాకి సంబంధించిన టికెట్ ధరల పెంపు అదనపు షోలపై  తీవ్ర ఉత్కంఠ నెలకొంది. థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ వివాదాల వల్ల తెలంగాణ ప్రభుత్వం అసలు ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తుందా లేదా అనే సస్పెన్స్ చివరి నిమిషం వరకు కొనసాగింది. మైత్రీ మూవీస్ గతంలో నిర్మించిన కొన్ని చిత్రాలకి నైజాంలో అదనపు రేట్లు రాకపోవడంతో, 'పెద్ది' చిత్రానికి కూడా జీవో రావడం కష్టమేనని అందరూ భావించారు. కానీ చివరి గంటల్లో ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి పెద్దికి భారీ ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జీవో ప్రకారం, 'పెద్ది' కి 10 రోజుల పాటు రోజుకి 5 షోల ప్రదర్శనకి అనుమతి లభించింది. ఈ రోజు జరగబోయే స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోల కోసం  టికెట్ రేటు 600 రూపాయలు ఉండేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రిలీజ్ రోజు  సింగిల్ స్క్రీన్ లో ప్రతి టికెట్‌పై 100, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి 125 వరకు అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.  Also read: SJ Suryah: ఎస్‌జే సూర్య కిల్లర్ షూటింగ్ సెట్‌లో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ కీలకమైన జీవోని రాబట్టడం వెనుక చక్రం తిప్పిన వ్యక్తి  టాలీవుడ్ బడా నిర్మాత, షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి. ఎలాంటి హడావుడి లేకుండా, సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి జీవో వచ్చేలా కీ రోల్  పోషించారు. గతంలో కూడా మనశంకర వరప్రసాద్, అఖండ 2 వంటి భారీ చిత్రాలకి  నైజాం ఏరియాలో స్పెషల్ పర్మిషన్లు, అదనపు షోల అనుమతులు సాధించడంలోను సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' సినిమా కోసం రంగంలోకి దిగి నైజాం బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడానికి మైత్రీ మూవీస్‌కి అండగా నిలబడటంతో సాహు గారపాటిపై టాలీవుడ్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, బాలకృష్ణ భగవంత్ కేసరికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.        
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు.  కొందరు బెడ్ టీని ఇష్టపడితే, మరికొందరు రోజంతా చాలా కప్పులు తాగుతారు.  వయసుకు తగ్గట్టు ఎంత టీ తాగాలి? దీని గురించి చాలామందికి తెలియదు.  అధికంగా టీ తాగడం వల్ల క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. టీ ఆరోగ్య ప్రయోజనాలు.. టీలోని కెఫీన్ , ఇతర సమ్మేళనాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే టీని  అధికంగా తీసుకున్నప్పుడు హానికరంగా కూడా మారుతుందని వైద్యులు అంటున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా మారింది. చాలామంది పాలతో కాఫీలు, టీలు మానేసి గ్రీన్ టీ ఇష్టపడుతున్నారు.  ఈ సమ్మేళనాలకు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం  గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు  బరువు   విషయంలో పర్పెక్ట్ గా,  మొత్తం ఆరోగ్యం విషయంలో ఎంతో నిలకడగా   ఉంటారని పరిశోధనలో తేలింది.  రోజులో ఎంత టీ తాగాలి? ఎంత పరిమాణంలో టీ తాగడం సరైనది అనే విషయం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వయస్సు, ఆరోగ్య పరిస్థితి , జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టీనేజర్లు , యువకులు రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం మంచిదని  చెబుతున్నారు.  అంతకంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీ ఎక్కువగా తాగితే.. ఎక్కువగా టీ తాగడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చంచలత్వం, నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి , ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లవర్స్ ఇవి గుర్తుంచుకోవాలి.. టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం, టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం, చెడు  ఆహారపు అలవాట్లు శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ఈ కారణంగానే పదే పదే   జలుబు, అలసట, ఇన్ఫెక్షన్లు , నీరసం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చాలామంది  విటమిన్ సి , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు  తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ రోగనిరోధక శక్తికి చాలా కీలకమైనవే. అయితే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి విటమిన్-సి, విటమిన్-డి.. ఈ రెండు విటమిన్లలో ఏది ముఖ్యమైనది?  వివరంగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం.. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రక్షణ కవచం వంటిది. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించి, నిర్మూలిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తే, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వైద్య నివేదికల ప్రకారం విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది , యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో , వాపును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మాత్రమే రోగనిరోధక శక్తి బలపడదని, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, సరైన పోషకాహారం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి , డి రెండూ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ వేర్వేరు విధులు ఉన్నాయి, కాబట్టి వీటిలో దేని లోపమైనా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. విటమిన్-సి.. విటమిన్ సి ఆరోగ్యానికి అత్యవసరం, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు.   ఇది శరీరంలో నిల్వ ఉండని, నీటిలో కరిగే విటమిన్, కాబట్టి ఇది ప్రతిరోజూ అవసరం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో మరింత మెరుగ్గా పోరాడగలుగుతుంది.  విటమిన్ సి ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తగినంత మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు కాలవ్యవధిని కొంత మేరకు తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్-డి.. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా అవసరం విటమిన్ డి శరీరంలోని టి-కణాలను , ఇతర రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.  ఈ కణాలు వైరస్‌లు , బ్యాక్టీరియాలతో పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి వాపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను  బాలెన్స్ విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ , ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతూ, తక్కువ సూర్యరశ్మిని పొందే వ్యక్తులలో ఈ లోపం సర్వసాధారణం. పోషకాలను ఎలా పొందాలి? శరీరానికి అవసరమైన విటమిన్ సి , డి అందాలంటే, సరైన ఆహారం , జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.   సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. నారింజ, ఉసిరి, నిమ్మకాయలు, జామకాయలు, క్యాప్సికమ్ , స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కోసం, గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, పుట్టగొడుగులు , పాల ఉత్పత్తులను తినడం మంచిది.                             *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.