LATEST NEWS
ఒక‌ప్ప‌టి కోమ‌టిరెడ్డికి ఇప్ప‌టి కోమ‌టిరెడ్డికి చాలానే తేడా ఉన్న‌ట్టుంది చూస్తుంటే. ఆయ‌నకు ఇచ్చిన శాఖ‌ల్లో సినిమాటోగ్ర‌ఫీ శాఖ కూడా ఉంది. ఒక ప‌క్క అక్క‌డ సినీ  కార్మిక లోకం వ‌ర్సెస్ నిర్మాత‌లుగా బీభ‌త్సమైన యుద్ధం జ‌రుగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు సంధించు కుంటున్నారు.  మూడేళ్ల‌య్యింది మాకు జీతం పెంచి  అని కార్మికులు అంటుంటే, మీక‌స‌లు టాలెంటే లేదు. మేం ఐటీ  ఎంప్లాయిస్ క‌న్నా ఎక్కువ వేత‌నాలిస్తున్నాం అని నిర్మాత‌లంటున్నారు. తొలి నుంచి సినీ ప‌రిశ్ర‌మ అవినీతి అడ్డా, అక్ర‌మాల పుట్ట అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ కి  చెంద‌ని నిర్మాత విశ్వ ప్ర‌సాద్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు .  ఒక వేళ కోమ‌టిరెడ్డి ఏదైనా స‌మ‌స్య తీస్కుని పోరాడాల్సి ఉంటే..  సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అంశం ఏదైనా తీస్కుని దాన్ని సాల్వ్ చేయాలిగానీ.. ఎస్ఎల్ బీసీ కూల‌డానికి క్షుద్ర పూజ‌లు చేశారంటూ ఆరోపణలేంటో అర్ధం కావ‌డం లేదంటారు కొంద‌రు. ఒక వేళ కేసీఆర్ అండ్ కో కోరుకున్నారన్నదే ఆ ఆరోపణల అయితే అందులో హేతువు కనిపించదు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కో కూలాలని కోరుకోవడం అంటూ జరిగితే ఎస్ ఎల్ బీసీ కాదు.. ఏకంగా రేవంత్ సర్కారే ప్ర‌భుత్వ‌మే కూలాల‌ని కోరుకుంటారు కానీ ఎక్క‌డో ఉన్న ఎస్ఎల్బీసీ కూలితే వారికేమి వ‌స్తుంది? అర్ధం కావ‌డం లేదని అంటారు కొంద‌రు.  మొన్న కూడా ఇలాగే రేవంతే సీఎంగా ప‌దికాలాల పాటు ఉండాల‌ని గ‌ణ‌ప‌తి పూజ చేయించానంటారు కోమ‌టిరెడ్డి. కంటి ముందున్న ప‌ని ప‌క్క‌న పెట్టి.. ఈ పూజ‌ల పిచ్చేంద‌ని పరిశీలకులు సైతం బుర్రలు గొక్కుంటున్నారు.  ఒక ప‌క్క త‌మ్ముడు చూస్తే మంత్రి ప‌ద‌వి కావాలంటూ మారాం చేస్తున్న చిన్న పిల్లాడిలా క‌నిపిస్తుంటే. మ‌రో ప‌క్క అన్న చూస్తే ప్ర‌తిదానికీ పూజ‌ల‌కు లింకుబెట్టి మాట్లాడ్డం క‌నిపిస్తోంది.. ఏంటిదంతా? ఎందుకిలా  జ‌రుగుతోంది. ఉన్న స‌మ‌స్య‌ను ప‌క్క‌న బెట్టి ఈ టాపిక్ డైవ‌ర్ష‌నేంట‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ ఎస్ఎల్బీసీకి చెందిన ఇరిగేష‌న్ శాఖ కూడా ఆయ‌న‌ది కాదు. ప్ర‌స్తుతం త‌న శాఖ‌కు సంబంధించిన శాఖ సినిమాటోగ్రఫి. సినీ పరిశ్రమలో ఇంత లొల్లి జ‌రుగుతుంటే అది పట్టకుండా  కోమ‌టిరెడ్డి ధోర‌ణి ఇలా ఉందేమిటన్నది  ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.
 రేవంత్ కు పొగ పెడుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెగ పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా   రోజుకో ట్వీట్ పెడుతూ కాకరేపుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాని ఇప్పడు మోసం చేశారని రగిలిపోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలను తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ పై అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఆయనకు అంతర్గతంగా మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన తరువాత తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రాజగోపాలరెడ్డి కి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు  తెలిపారు. ఇంతకాలం మౌనంగా ఉన్న భట్టి తాజాగా రాజగోపాల్ కు అనుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ లో తొలి నుంచి ఉన్న తమను కాదని రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడం,  ఆ తరువాత ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం  సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని వివిధ సందర్భాల్లో  పరోక్షంగా తమ విముఖతను, వ్యతిరేకతనూ వ్యక్తం చేస్తూ వస్తున్నారు.  ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి ఏకంగా ఒకడుగు ముందుకేసి నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. వరంగల్ జిల్లాకు చెందిన  కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కమిటీ వెంటనే స్పందించింది. అటువంటిది నేరుగా ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేసినా కనీసం క్రమశిక్షణ కమిటీ నుంచి చర్యలు లేకపోవడం చూస్తే రేవంత్ కు పొగ పెడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ లో తొలి నుంచీ ఉన్నదే.. అయితే సోనియా గాంధీ ఎఐసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతికి దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తారా అనే అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 
వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ల మార్పుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల ఓటర్లు సమీపంలోని బూత్ లలో కాకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలోని బూత్ కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తున్నదని పేర్కొంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి  హైకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.   ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఎన్నికల అధికారుల, వైసీపీ తరఫు న్యాయవాదుల వాదనలు నమోదు చేసింది. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం ఈ దశలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.  ఓటర్లు అంతా మీకు అనుకూలమనీ, మీకే ఓట్లు వేస్తారనీ ఎలా నిర్ధారిస్తారని వైసీపీని నిలదీసింది. దీనిపై   వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్న ఈ దశలో పోలింగ్ బూత్ ల మార్పుపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చి చెబుతూ వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చింది.   
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది. మంగళవారం (ఆగస్టు 12) ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏరపాటు చేశారు. పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులున్నారు. అయితే పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.   ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఎర్రిపల్లిలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. కాగా పోలింగ్ ప్రారంభానికి కొద్ది సేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడప తరలించారు. అలాగే తెలుగుదేశం, వైసీపీలకు చెందిన కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మొత్తం మీద పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందా అన్నట్లుగా టెన్షన్ వాతావరణం ఉంది.  
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) హౌస్ అరెస్ట్ చేశారు. అసలింతకీ రామచందర్ రావును పోలీసులు ఎందుకు హౌస్ అరెస్టు చేశారంటే.. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కూల్చివేతలపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఆగస్టు 12) పెద్దమ్మగుడి వద్ద కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెచ్చరిల్లే అవకాశం ఉందన్న భావనతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఇలా ఉండగా రామచందర్ రావు హౌస్ అరెస్టును బీజేపీ నేతలు ఖండించారు.ఇలా ఉండగా పెద్దమ్మగుడి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.  
ALSO ON TELUGUONE N E W S
  కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట బాలీవుడ్ లో ఎక్కువగా వింటుంటాం. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ సౌత్ ఇండియాకు కూడా పాకిందని అంటున్నారు. 'కూలీ' సినిమా కోసం పెద్ద ఎత్తున కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Coolie Bookings)   ఆగస్టు 14న ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ చూడబోతుంది. ఆరోజు 'వార్-2', 'కూలీ' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే 'వార్-2' బుకింగ్స్ స్లో అండ్ స్టడీ అన్నట్టుగా ఉండగా.. 'కూలీ' బుకింగ్స్ మాత్రం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచే రేంజ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. కూలీకి కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని కంపెనీలు ఎంప్లాయిస్ కోసమని మొత్తం థియేటర్లనే బుక్ చేస్తున్నట్లు ఒక థియేటర్ యజమాని చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. (Coolie vs War 2)   కార్పొరేట్ బుకింగ్స్ అంశం తెరపైకి రావడంతో ఇతర హీరోల అభిమానులు 'కూలీ' సినిమాని టార్గెట్ చేస్తున్నారు. హైప్ ని క్రియేట్ చేయడానికి కార్పొరేట్ బుకింగ్స్ ని నమ్ముకున్నారని లేదంటే ఈ రేంజ్ బుకింగ్స్ అసలు సాధ్యం కాదని కొందరు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.   
భారతీయ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నబిగ్గెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ షో 'బిగ్ బాస్'(Big Boss). తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ ఇలా అన్ని భాషల్లోను ఇప్పటికే కొన్ని సీజన్స్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆయా భాషల్లో కొత్త సీజన్స్ ప్రారంభం కానున్నాయి. తెలుగుకి సంబంధించి నాగార్జున(Nagarjuna)హోస్ట్ గా సెప్టెంబర్ 7 నుంచి సీజన్ 9 టెలికాస్ట్ కానుండగా, ఈ నెల 24 నుంచి హిందీలో సల్మాన్ ఖాన్(Salman Khan)హోస్ట్ గా 19వ సీజన్ మొదలుకానుంది. బిగ్ బాస్ 19 వ సీజన్(Big Boss 19)లో ఎవరు ఊహించని విధంగా  కొత్త కంటెస్ట్ లు పాల్గొనబోతున్నారని, నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగా కొత్త కంటెస్ట్ గా ఏప్రిల్ 22 న 'పహల్ గామ్'(Pahalgam)లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన  'వినయ్ నర్వాల్'(VInay Narwal)భార్య హిమాన్షి నర్వాల్(Himanshi Narwal)పేరు వినిపిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media)లో పోస్టర్స్ హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్‌ కి  హిమాన్షి కాలేజీలో స్నేహితురాలు. ఈ కారణంతో కూడా హిమాన్షి ని బిగ్ బాస్ లోకి తీసుకురాబోతున్నట్టుగా వినిపిస్తోంది ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తు 'బిగ్ బాస్ షో అనేది పక్కా ఎంటర్ టైన్ మెంట్  షో. ప్రేక్షకులు ప్రతి ఒక్క కంటెస్ట్ ని ఎంటర్ టైన్ మెంట్ కోణంలోనే చూస్తారు. కానీ హిమాన్షి కంటెస్ట్ గా ఉంటే ఆ విధంగా చూడలేరు.  విజయ్ నర్వాల్ చనిపోయాక, ఆయన బాడీ ముందు కూర్చొని హిమాన్షి విలపించిన వీడియో,ప్రతి ఒక్క భారతీయుడిని కంటతడి పెట్టించింది. పైగా పహల్ గామ్ ఘటన భారతీయుల జీవితాల్లో చాలా సన్నితమైన అంశంగా ముడిపడి ఉండటంతో, షో లో హిమాన్షి పాల్గొంటే అందరిలో మళ్ళీ భావోద్వేగాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో  షో ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమని, సోషల్ మీడియా మీడియా వేదికగా కామెంట్స్ వినపడుతున్నాయి.  సీజన్ 19 లో హిమాన్షి కంటెస్ట్ గా ఉండబోతోందనే న్యూస్, ఫేక్ న్యూస్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు.      పహల్గామ్‌లో పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఆరు మంది చనిపోయారు. ఆ తర్వాత మన సైనికులు ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)ని నిర్వహించి దాడి చేసిన ఉగ్రవాదులని తుదముట్టించారు.        
  కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్ లో భాగంగా ఇప్పటిదాకా 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' సినిమాలు వచ్చాయి. ఆగస్టు 14న విడుదల కానున్న 'కూలీ' సినిమా LCUలో భాగమా కాదా? అనేది త్వరలోనే తేలిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రోలెక్స్ తరహా పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.   'విక్రమ్'లో కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించినప్పటికీ.. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ పాత్రలకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రతో సూర్య సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. సినిమా అంతా ఒకెత్తయితే.. రోలెక్స్ పాత్ర మరో ఎత్తు అన్నట్టుగా నిలిచింది. ఇప్పుడు 'కూలీ' మూవీలో కూడా రోలెక్స్ తరహా పాత్రను లోకేష్ డిజైన్ చేసినట్లు సమాచారం.   రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'కూలీ'లో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఆమిర్ పాత్ర కూడా రోలెక్స్ తరహాలోనే క్లైమాక్స్ లో వచ్చి, అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుందట. విక్రమ్ లో సూర్య మ్యాజిక్ చేసిన స్థాయిలో.. కూలీలో ఆమిర్ కూడా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.  
స్టార్ డైరెక్టర్ 'త్రివిక్రమ్'(Trivikram)2024 సంక్రాంతికి 'సూపర్ స్టార్ మహేష్ బాబు'(Mahesh Babu)తో 'గుంటూరుకారం'(Guntur Kaaram)ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)తో మైథలాజికల్(Mythological)మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఇటీవల జరిగిన వార్ 2(War 2)ప్రీ రిలీజ్  ఈవెంట్ కి హాజరై, ఎన్టీఆర్ అంటే తనకి ఎంత అభిమానమో తన స్పీచ్ ద్వారా తెలియచేసాడు. త్రివిక్రమ్ రీసెంట్ గా 'పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి'(R Narayanamurthy)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూనివర్సిటీ పేపర్ లీక్'(University paper leak) చిత్రాన్ని నారాయణమూర్తితో కలిసి వీక్షించడం జరిగింది. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతు యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా నిడివి చూసి ముందు భయపడ్డాను. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేగంగా సాగింది. ఇలాంటి చిత్రాలు మనల్ని వెంటనే ఉత్తేజపరచవు. కానీ నారాయణమూర్తి గారు పట్టువదలకుండా నడిపించారు. ఆయన చిత్రాల్లో నారాయణమూర్తి గారే రాజు,సైన్యాధిపతి . తన ప్రతి సినిమాలోను ఏదో ఒక ప్రయోజనం ఉండాలనుకుంటారు. అణిచివేతకి గురైన వాళ్ళ తరుపున నారాయణమూర్తి ఒక గొంతుక. అలాంటి వ్యక్తి ఉండాలి. లేదంటే సమాజంలో ఏకపక్ష ధోరణి ఉంటుంది. నా సినిమాలో ఒక క్యారక్టర్ కి నారాయణమూర్తి గారిని అనుకున్నాను. పారితోషకంతో ఆయన్ని కొనలేమని తెలిసిందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. 'యూనివర్సిటీ పేపర్ లీక్' చిత్రం విషయానికి వస్తే..తమ భవిష్యత్తు బాగుండాలని విద్యార్థులు రేయింపగళ్లు ఎన్నో ఇబ్బందులని, ఆర్ధిక ఇబ్బందులని సైతం ఎదుర్కొని, పరీక్షలకి ప్రీపేర్ అవుతున్నారు. కానీ కొంత మంది స్వార్ధపరులు ఎగ్జామ్స్ పేపర్స్ ని లీక్ చేసి, విద్యార్థుల జీవితాలని ఏ విధంగా నాశనం చేస్తున్నారనే పాయింట్ తో 'యూనివర్సిటీ పేపర్ లీక్' చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 22 రిలీజ్ డేట్.      
  థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, తామే ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నామనే విషయాన్ని మాత్రం చాలామంది నిర్మాతలు గ్రహించలేకపోతున్నారు.   ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి ఓటీటీ, రెండు అధిక టికెట్ ధరలు. హిట్-ఫ్లాప్, చిన్న-పెద్ద అనే తేడా లేకుండా.. మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇది చాలదు అన్నట్టు.. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టికెట్ ధరలు పెంచేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన 'బాహుబలి' లాంటి సినిమాకి టికెట్ ధరలు పెంచారంటే ఒక అర్థముంది. కానీ, అదే పనిగా స్టార్ హీరోలు నటించిన అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకుంటూ పోవడం ప్రేక్షకుల అసహనానికి కారణమవుతోంది.   ఇది చాలదు అన్నట్టు.. డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్స్ హైక్ ఇస్తున్నారు. 'కేజీఎఫ్-2' నుంచి ఈ తంతు మొదలైంది. అధిక ధరకు తెలుగు రైట్స్ దక్కించుకొని.. ఆ మొత్తం రాబట్టడానికి ప్రభుత్వాల నుంచి హైక్ కోసం పర్మిషన్ తీసుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు 'కూలీ', 'వార్-2' వంటి సినిమాలు పయనిస్తున్నాయి. వాటిలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ నటించడం.. ఎక్కువ మొత్తం చెల్లించి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోవడం.. వంటి కారణాలతో టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు కోరారు. దీంతో తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.   తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి భారీ సినిమాలకు ఏపీలో హైక్ కి అప్లై చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, కొందరు నిర్మాతలు మీడియం రేంజ్ సినిమాలకు కూడా హైక్ కోరుతున్నారు. ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. పెద్ద సినిమా అయితే చాలు హైక్ అడుగుతున్నారు. ఆఖరికి డబ్బింగ్ సినిమాలకు కూడా ఈ తంతు కొనసాగుతోంది. 'కూలీ', 'వార్-2' సినిమాలనే తీసుకుంటే.. తమిళ్, హిందీలో కంటే ఇక్కడే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి.    భాషాభేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారనే ఒకే ఒక్క కారణంతో.. ఇలా ధరలు పెంచుకుంటూ పోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కొనసాగితే.. ప్రేక్షకులు థియేటర్లకు మరింతగా దూరమయ్యే ప్రమాదముంది. మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్ ధర దాదాపు రూ.500 ఉంటే.. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది?. అంతంత పెట్టి సినిమాకి వెళ్ళే కంటే.. నాలుగు వారాలు వెయిట్ చేస్తే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే మొదటికే మోసం వస్తుంది.    సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ.. సాధారణ టికెట్ ధరలతో కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించవచ్చు. ఇటీవల విడుదలైన 'మహావతార్ నరసింహ'నే తీసుకుంటే.. యానిమేషన్ ఫిల్మ్ అయినప్పటికీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుట్ ఫాల్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. అదే టికెట్ రేట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే.. ఫుట్ ఫాల్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని చాలామంది నిర్మాతలు గ్రహించట్లేదు. భారీ సినిమాల సంగతి అటుంచితే.. కనీసం మీడియా రేంజ్ మూవీలు, డబ్బింగ్ సినిమాల విషయంలోనైనా టికెట్ ధరల పెంపుకి అనుమతి కొరకపోవడం మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలా కాకుండా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం.. తెలుగు ప్రేక్షకుల అసహనం మరింత పెరిగే అవకాశముంది.  
'దేవర'(Devara)తో 2024 ని 'దేవర నామ సంవత్సరంగా' మార్చిన ఎన్టీఆర్(Ntr)అభిమానులు, ఇప్పుడు 'వార్ 2'(War 2)తో 2025 ని 'హృతిక్ రామారావు' నామ సంవత్సరంగా మార్చడనికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హృతిక్ మాట్లాడుతు వార్ 2 తో ఒక కొత్త ఎన్టీఆర్ ని చూడబోతున్నారు. ,ఎన్టీఆర్ నటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా నెక్స్ట్  సినిమాలకి ఆ తరహాని అప్లై చేస్తానని చెప్పడం జరిగింది. దీంతో  వార్ 2 లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి  అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించాడనే టాక్ కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. వార్ 2 తెలుగు, హిందీతో పాటు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఎన్టీఆర్, హృతిక్ లాంటి బిగ్ స్టార్స్ కావడంతో, వార్ 2 ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని తమిళ ప్రేక్షకులు   ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు వార్ 2 కి తమిళనాట థియేటర్స్ తక్కువ దొరుకుతున్నట్టుగా  సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 రిలీజ్ రోజైన ఆగస్టు 14 న 'సూపర్ స్టార్ రజనీకాంత్'(Rajinikanth)సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున(King Nagarjuna)ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో చేస్తుండటం, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకుడు కావడంతో, కూలీపై తమిళ నాట భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో కూలీ కి ఎక్కువ థియేటర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.  ఇక వార్ 2 ఏపి, తెలంగాణ తో పాటు నార్త్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. దీంతో తొలి రోజు రికార్డు కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉన్నట్టుగా సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  ఓవర్ సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పింది. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2 ని అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee)దర్శకత్వం వహించగా, నాలుగు దశాబ్దాల పై నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని నిర్మిస్తు వస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించింది. కియారా అద్వానీ(Kiara Advani)కథానాయిక.  సితార ఎంటర్ టైన్ మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తుంది.    
Superstar Mahesh Babu is working with SS Rajamouli and from past 15 years both of them have been waiting to collaborate. Now, the movie shoot has started but the update about story or the kind of project has not been announced. While makers state it as Globe Trottling adventure, they did not confirm the story.  Now, on Mahesh's birthday, a sample of his look has been released by the makers. Mahesh Babu made sure that his fans get at least a small update from the movie, as originally the makers have decided to only release any update in November, only.  For this small glimpse of his look, Mahesh fans have poured in their love on a special website. Mahesh looked at the wishes and felt very happy. SS Karthikeya, son of Rajamouli and executive producer, shared the photo of Mahesh enjoying the wishes.  He wrote on X, "Our #GlobeTrotter witnessed love pouring in from every corner of the globe… cheers to whoever came up with the cool idea of http://WishSSMB.com. Just felt like sharing this with you all…" Mahesh with curly hair looks very different from his other films. 
  జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించడంతో 'వార్-2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయిన ఖర్చు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (War 2)   'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఎన్టీఆర్, హృతిక్ సందడి చేశారు. 'వార్-2' రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. కాలర్ ఎగరేసి మరీ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ కి అయిన ఖర్చు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వేడుకకు ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయొచ్చు అని చర్చించుకుంటున్నారు.   భారీగా ఖర్చు అయినప్పటికీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల 'వార్-2'పై మరింత బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. దాని వల్ల ఓపెనింగ్స్ పెరిగే అవకాశముంది. ఆ తర్వాత చూస్తే మాత్రం.. ఈవెంట్ కోసం రూ.1.7 కోట్లు ఖర్చు చేయడం వల్ల నష్టమేమీ లేదని చెప్పవచ్చు.  
Prabhas is one of the most eligible bachelors and is amongst the biggest stars of Indian Cinema. Post Baahubali, his craze have grown Pan-india and he delivered a big hits with Salaar and Kalki. He is shooting for The Raja Saab and Prabhas-Hanu project, currently.  While he is busy with his continuous film projects, reports about his romantic link-ups have been going around. But he did not react to any of them and many are waiting for his marriage. Prabhas has been silent about his possible matrimony and been showing reluctance to commit about it soon.  Shyamala Devi, wife of late Krishnam Raju, and his relative, talked to media briefly after her visit to Daksharamam Temple. She stated that she did special offerings and pooja to Lord Shiva and Goddess Parvati, for Prabhas well-being and marriage. She remarked that only God can give clear answer about Prabhas impending nuptials.  She candidly remarked that while she doesn't know about the possible bride but she hopes that he would get married soon. On the other hand, Prabhas is happy to be busy with his film commitments and he is locked till 2028 with projects like Spirit, Salaar Part 2, Kalki 2 and few others in the pipeline.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళి కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది కానీ.. ఇంతవరకు ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కలేదు. మధ్య మధ్యలో ప్రభాస్ పెళ్ళి అంటూ వార్తలొస్తున్నాయి కానీ.. అవేవీ నిజం అవ్వట్లేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్ళి గురించి తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Prabhas)   అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని తాజాగా శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసినట్లు తెలిపారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. శివుడు అనుగ్రహిస్తే త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అన్నారు. అమ్మాయి ఎవరు, పెళ్ళి ఎప్పుడు అనేవి తెలియవని.. కానీ, పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు.    శ్యామలాదేవి మాటలు విని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆమె కోరుకున్నట్టుగా త్వరలోనే ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కుతారేమో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశం చక్కగా వివరించబడింది. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, విద్య, వ్యాపారం మొదలైన అన్ని విషయాలపై నైతిక పాఠాలను అందించాడు. ఇదిలా ఉంటే పెళ్లి గురించి ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. అది జీవితాంతం ఉండే అనుబంధం. వైవాహిక జీవితం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలంటే ఇరువైపులా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరస్పర సామరస్యం,  ప్రేమపై ఆధారపడిన సంబంధం మాత్రమే బలపడుతుంది. కాబట్టి చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఏ అంశాలు దారితీస్తాయో ఇక్కడ వివరాలు ఉన్నాయి. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు సహచరులు, పోటీదారులు కాదు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భార్యాభర్తలిద్దరూ కలిసి ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే రెండు సమస్యలనూ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చేసి పరిష్కరించుకోవాలి. ఆచార్య చాణక్య ప్రకారం ప్రతి సంబంధానికి వారి వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. అదేవిధంగా, భార్యాభర్తల మధ్య కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ మూడవ వ్యక్తికి చెప్పకూడదు, లేకుంటే వారి పరస్పర సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను ఒకరు చూసుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మనం ఒకరి భావాలను గౌరవించుకోవాలి. మద్దతు ఇవ్వాలి.  మీ వైవాహిక జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే , భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఓపిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మీ సంబంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక దృక్పథం ఉండాలి. సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్నేహితులలా ఉండాలి. ఇద్దరి మధ్య సమానత్వ భావన ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
రక్షా బంధన్ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు కోసం కొందరు  ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటారు. కొందరు అక్కాచెల్లెళ్ళు  ఇప్పటికే కొత్త ఆలోచనలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. కొత్త బట్టలు, రాఖీ  సిద్ధం చేసుకోవడం పరిపాటి. ప్రతిసారీ  పండుగను ఇంకాస్త మెరుగ్గా చేసుకోవాలని అనుకుంటారు.  కానీ ఇంకా మెరుగ్గా అంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు.  మెరుగ్గా చేసుకోవడం అంటే కాస్త ఖరీదైన రాఖీ కట్టడం,  ఖరీదైన స్వీట్లు తెచ్చి పంచుకుని తినడం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది తప్పు.. చాలామంది చేసేది కూడా రాఖీ కట్టడం, స్వీట్లు తినడం.. దీంతో రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ రాఖీ పండుగ ఏడాది మొత్తం గుర్తుండిపోవాలి అంటే.. కాస్త డిఫరెంట్ గా ఆలోచించాలి.  ప్రణాళిక మార్చాలి.  ఇందుకోసం ఏమేమి చేయవచ్చు తెలుసుకుంటే.. సరదా రోజు.. రక్షా బంధన్ ను స్పెషల్ గా  చేసుకోవాలనుకుంటే  ఆ రోజును సరదాగా మార్చేయాలి. ఇందులో భాగంగా   సినిమా చూడటానికి వెళ్ళవచ్చు. ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు,   తోబుట్టువులందరితో కలిసి సినిమా వెళ్లడం చాలా మంచి అనుభూతి ఇస్తుంది.  అందరూ కలసి ఇంట్లో అయినా ఒక మంచి సినిమా చూసేయవచ్చు.  సినిమా చూస్తూ ఆస్వాదించడానికి  అందరూ కలసి స్నాక్స్ రెఢీ చేసుకోవడం,  లేదా ఆర్డర్ చేసుకుని అయినా సరే.. అందరూ కలిసి కాసింత సమయం గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది. అట్లాగే గేమ్స్ ఆడటం,  సరదాగా గడపడం ద్వారా రోజును గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. ఫ్యామిలీ టూర్.. కుటుంబం మొత్తం ఒకే చోట కలవడం చాలా మంచి జ్ఞాపకం అవుతుంది.  కుటుంబంతో కలిసి పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు.  కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు. కుటుంబం అంతా ఒకే చోట కలిసేలా మీరు ఒక గొప్ప రోజును ప్లాన్ చేసుకున్నట్లుగా ఉంటుంది.  అందమైన గార్డెన్ లో  లేదా మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం స్నాక్స్, స్వీట్లు, పానీయాలు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా టూర్ ఎంజాయ్ చేయవచ్చు. అందరూ కలసి గేమ్స్ ఆడుకోవడం లాంటివి కూడా భలే మజా ఇస్తాయి. కలిసి వంట చేయడం.. రక్షా బంధన్ రోజు  అన్నా చెల్లెళ్లు కలిసి ఇష్టమైన ఆహారాన్ని వండటం, దాన్ని ఇంటిల్లిపాదికి వడ్డించడం చేయవచ్చు. ఇది చాలా మంచి మెమరీ గా మిగులుతుంది.    మంచిగా మాట్లాడాలి.. సాధారణంగా అన్నా చెల్లెళ్లు అంటే గొడవ పడటం,  కొట్టుకోవడం, అల్లరి చేయడం.. ఇదే ఎక్కువ ఉంటుంది.  కానీ రాఖీ పండుగ రోజు ఇద్దరూ ఆప్యాయంగా ఉండటం, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడటం, ఒకరికి మరొకరు ధైర్యం ఇచ్చుకోవడం వంటివి చేయాలి.  ఇదే వారి జీవితాంతం కొనసాగితే  వారి జీవితం ఎంత అదంగా, ఎంత ధైర్యవంతంగా ఉంటుందో అర్థమైతే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం పదికాలాల పాటు ఆనందమయంగా ఉంటుంది.                                  *రూపశ్రీ.  
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
   నేటి బిజీ జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఆహారపు అలవాట్లు,  అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా  ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు మధుమేహం,  గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతోంది. మధుమేహం గురించి చెప్పాలంటే నేటి కాలంలో ఇది ఒక సాధారణ వ్యాధిగా మారింది. గతంలో ఈ వ్యాధి వృద్ధులలో కనిపించేది, కానీ ఇప్పుడు మధుమేహం చిన్నవారిని కూడా ప్రభావితం చేస్తోంది. సాధారణంగా చాలామందికి టైప్ 1, 2,  3 డయాబెటిస్ గురించి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు టైప్ 5 డయాబెటిస్ కూడా  పెద్ద ముప్పుగా మారింది.  అధిక శాతం మందికి అసలు ఇన్ని టైప్ ల డయాబెటిస్ ఉంటుందని కూడా తెలియదు. అయితే టైప్-5 డయాబెటిస్ ఇతర రకాల డయాబెటిస్ కంటే చాలా ప్రమాదకరమైనది అంటున్నారు వైద్యులు. ఇతర రకాల డయాబెటిస్ లాగానే టైప్ 5 డయాబెటిస్ రాకముందే  శరీరంలో అనేక లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.  ఈ లక్షణాలను గుర్తించినట్టైతే సకాలంలో చికిత్స పొందవచ్చు.  ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. టైప్-5 డయాబెటిస్ అంటే ఏమిటి?  బాల్యంలో పోషకాహారం లేకపోవడం వల్ల క్లోమం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు టైప్ 5 డయాబెటిస్ వస్తుంది. దీని కారణంగా శరీరం తగినంత మొత్తంలో ఇన్సులిన్ (హార్మోన్) ఉత్పత్తి చేయలేకపోతుంది. దీనిని పోషకాహార లోపానికి సంబంధించిన డయాబెటిస్ మెల్లిటస్ (MRDM) అని కూడా అంటారు. ఇన్సులిన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.  అంటే డయాబెటిస్ వస్తుంది. 30 ఏళ్లలోపు వారికి ఎక్కువ ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లలోపు వారిలో కనిపిస్తుంది. 2025 సంవత్సరంలో అంతర్జాతీయ డయాబెటిస్ సమాఖ్య దీనిని టైప్ 5  డయాబెటిస్‌గా అధికారికంగా ప్రకటించింది . ప్రపంచవ్యాప్తంగా 2 నుండి 2.5 కోట్ల మంది దీని బారిన పడవచ్చని అంచనా. పోషకాహార లోపం సాధారణంగా ఉన్న ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఆసియా,  ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో  వంటి దేశాలలో ఇది రావచ్చు.  దీనికి ఇంకా చికిత్స కనుగొనబడలేదు. టైప్ 5 డయాబెటిస్ లక్షణాలు? ఎక్కువ దాహం వేస్తున్నట్లు అనిపిస్తుంది తరచుగా మూత్రవిసర్జన తలనొప్పి మసక దృష్టి అలసిపోయినట్లు అనిపిస్తుంది  గాయం నెమ్మదిగా నయం కావడం. బరువు తగ్గడం  ఎముక పెరుగుదల నెమ్మదిగా ఉండటం లాలాజల గ్రంథుల విస్తరణ చర్మం,  జుట్టులో మార్పులు. టైప్ 5 డయాబెటిస్ రావడానికి కారణాలు ఏమిటి? బాల్యంలో లేదా గర్భధారణ సమయంలో ఎక్కువ కాలం పోషకాహారం లేకపోవడం వల్ల క్లోమం పూర్తిగా అభివృద్ధి చెందలేకపోతుందని వైద్యులు ఊహిస్తున్నారు. పోషకాలు లేకపోవడం శరీరంలోని అనేక భాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇందులో క్లోమం కూడా ఉంటుంది.  రక్తంలో చక్కెరను అదుపులో  ఉంచడానికి అవసరమైన ఇన్సులిన్‌ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. టైప్ 5 డయాబెటిస్‌కు ప్రమాద కారకాలు? గుండె జబ్బులు మూత్రపిండాల నష్టం కంటి (రెటీనా) సమస్యలు నరాలకు నష్టం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ  డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు.  ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు.  సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. డిటాక్స్ జ్యూస్లు  కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్  తయారీలో ఉపయోగించే పదార్థాలు,  వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి.. నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్,  క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి  డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన,  కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి.  వీటికి బదులు  ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి.  లేదా వీటిని  పరిమితం చేయాలి.  మాంసాహారం తినాలని ఉంటే   లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. ధూమపానం,  అధికంగా  మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం,  కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.  కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన,  పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా.  రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన,  సురక్షితమైన విధానం.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.