హరిహరసుతుడు అయ్యప్పస్వామి !

కలియుగంలో మనిష్యులను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్పస్వామి.

అయ్యప్పస్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల పాటు ఆ దీక్షను కొనసాగించి,తర్వాత ఇంట్లో పూజచేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం కోసం ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష (48 రోజులదీక్ష) ఎందుకు? ఒకరోజు, ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగడమే కాదు, ఆ పద్దతుల్లో దీక్షలు చేపట్టి జ్యోతి దర్శనానికి బయలుదేరుతారు. ఆ వాదప్రతివాదనలను అలా వుంచితే, మండలదీక్షలో ఓ గూఢార్థం ఉంది. మనిషి పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశిస్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టితో చూసినప్పుడు

నక్షత్రాలు  - 27
రాశులు   - 12
గ్రహాలు    - 09
మొత్తం    -  48

వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు దీక్ష.


More Ayyappa Swami