![]() |
![]() |

'ఓజి'(OG)సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైట్ తొమ్మిది గంటల నుంచే ఫ్యాన్స్ కేరింతల మధ్య,బెనిఫిట్ షోస్ ప్రారంభంకానున్నాయి. బెనిఫిట్ షోస్ కి సంబంధించి ఎక్కువ థియేటర్స్ లో, రిలీజ్ అవుతుండంటం, ఆన్ లైన్ వేదికగా టికెట్స్ కూడా అయిపోవడంతో, బెనిఫిట్ షోస్ కి సంబంధించి పవన్ సంచలన రికార్డు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
తొలి రోజు కూడా వరల్డ్ వైడ్ గా రికార్డు థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హయ్యస్ట్ థియేటర్స్ లో 'ఓజాస్ గంబీర్' కాలుమోపనున్నాడు. ఈ విషయంలో 'మిరాయ్' చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ 'ఓజి' మేకర్స్ కి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 12 న విడుదలైన 'మిరాయ్'(Mirai)సూపర్ హిట్ టాక్ ని పొందిన విషయం తెలిసిందే. అశేష ప్రేక్షకాదరణతో ఇప్పటికే 120 కోట్ల గ్రాస్ ని రాబట్టి, సిల్వర్ స్క్రీన్ వద్ద తన సత్తా చాటుతుంది. చాలా చోట్ల ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. అలాంటిది 'మిరాయ్' ఆడుతున్న థియేటర్స్ లో కొన్నింటిని విశ్వప్రసాద్ 'ఓజి' కోసం ఇచ్చేసాడు. కాకపోతే ఆ థియేటర్స్ లో 'ఓజి' ఇరవై ఐదవ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే నుంచి, అంటే 26 వ తేదీ నుంచి యధావిధిగా 'మిరాయ్' ఆడుతుంది. దీంతో పవన్ అభిమానులు విశ్వప్రసాద్ కి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పవన్, విశ్వప్రసాద్(TG Vishwaprasad)కాంబోలో 'బ్రో' మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక పవన్ కెరీర్ తో పాటు తెలుగు చిత్ర సీమలోనే 'ఓజి' హయ్యస్ట్ థియేటర్స్ లో విడుదల కాబోతున్నమూవీగా నిలిచింది. బుకింగ్స్ కూడా తొలి రోజు వరల్డ్ వైడ్ గా క్లోజ్ అయ్యాయి. దీంతో తొలి రోజు ఓజి వరల్డ్ వైడ్ గా రికార్డు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సుజీత్(Sujeeth)దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ దానయ్య ఓజి ని నిర్మించిన విషయం తెలిసిందే. పవన్(Pawan Kalyan) సరసన ప్రియాంక మోహన్(Priyanka Mohan)జత కట్టింది.
.webp)
![]() |
![]() |