![]() |
![]() |

ఎంపికచేసిన కొద్దిమంది ప్రముఖులకే శుభలేఖలు పంపినప్పటికీ నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతూ, సహ జీవనం చేస్తూ వస్తోన్న ఈ జంట మహాబలిపురంలోని ఒక పాపులర్ రిసార్ట్లో జూన్ 9న పెళ్లి చేసుకోవడం ద్వారా అధికారికంగా దంపతులుగా మారబోతున్నారు.
సన్నిహిత కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన సన్నిహిత స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం. అంతే కాదు, వేదిక దగ్గర తగినంత భద్రత కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక దగ్గర నిజంగా భద్రతను పటిష్టం చేస్తున్నారు. "ఆహ్వానం అందుకున్న అతిథులకు పెళ్లిముందు ఒక ప్రత్యేక కోడ్ను పంపిస్తారు. ఆ కోడ్ చూపించాకే పెళ్లి వేదిక వద్దకు అతిథులను అనుమతిస్తారు" అని ఆ సన్నిహితులు తెలిపారు.
ఈ పెళ్లికి డ్రస్ కోడ్ కూడా నిర్దేశించినట్లు తెలుస్తోంది. బుధవారం సంగీత్ వేడుక జరుపనున్నారు. ఇటీవలే నయన్, విఘ్నేశ్ ఇద్దరూ జంటగా వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ను ఆహ్వానించారు. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ లాంటి కొంతమంది సెలబ్రిటీలను కూడా వారు ఆహ్వానించినట్లు సమాచారం.
![]() |
![]() |