మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. అందులో యాంకర్ అనసూయ కనువిందు చేయనుందని సమాచారం.
బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం తో పాటు పలు చిత్రాల్లో కీలక పాత్రలలో నటించడమే కాకుండా.. స్పెషల్ సాంగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఇప్పటికే విన్నర్, చావు కబురు చల్లగా వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించిన అనసూయ.. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ- త్రినాథరావు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం అనసూయను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందని సమాచారం.
అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక రవితేజ విషయానికి వస్తే రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖిలాడి' సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నారు.