English | Telugu
Karthika Deepam 2 : అసలైన వారసురాలు దాస్ కి తెలుసు.. సాక్ష్యాలని కాల్చేసిన జ్యోత్స్న!
Updated : May 4, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -348 లో... దాస్ ని చూడడానికి పారిజాతం వస్తుంది. ఏంట్రా రమ్మని చెప్పావ్.. నువ్వు అలా రమ్మంటే దాస్ కి గతం గుర్తు వచ్చిందేమో అనుకున్నానని కాశీతో పారిజాతం అంటుంది. అప్పుడే అక్కడున్న దాస్.. నేనేం మర్చిపోలేదని అంటాడు. అయితే నిన్ను కొట్టింది ఎవరో చెప్పమని దాస్ ని పారిజాతం అడుగుతుంది. ఏమో అని దాస్ అంటాడు.
ఆ తర్వాత దాస్ లోపలికి వెళ్ళాక.. నాన్న గుర్తు వచ్చినప్పుడు ఏదో రాస్తున్నాడని కాశీ చెప్తాడు. ఆ పేపర్స్ తీసుకొని వచ్చి పారిజాతం కి చూపిస్తాడు. ఆ పేపర్ లో ఉంది చదివి పారిజాతం షాక్ అవుతుంది. అసలైన వారసురాలు అంటూ పేపర్ లో ఉంటుంది. అంటే అసలైన వారసురాలు గురించి దాస్ కి తెలిసిందా అని పారిజాతం అనుకుంటుంది. ఈ పేపర్స్ అన్ని తీసుకొని వెళ్తాను. అర్ధం చేసుకొని చెప్తానని పారిజాతం తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత పారిజాతం ఇంటికి వెళ్లి పేపర్స్ లో ఉన్న వాటిని భూతదం పెట్టి చూస్తుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి అదేంటని అడుగుతుంది. దాస్ గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో రాస్తున్నాడని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న ఆ పేపర్స్ తీసుకొని చదువుతుంది. అది చూసి షాక్ అవుతుంది. అంటే దాస్ కి అసలైన వారసురాలు తెలిసింది.. అదే విషయం దశరథ్ కి చెప్పాలనుకుంటున్నాడు.. ఒకవేళ దాస్ నిజం చెప్తే నీకు నష్టం.. నాకు నష్టం.. నా కొడుకు కాబట్టి నేను వాడిని ఏం చెయ్యను.. ఇక నువ్వే కొట్టించుంటావని పారిజాతం అంటుంది. నేనెందుకు కొడుతానంటూ పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేసి పేపర్స్ తీసుకొని పంపిస్తుంది.
ఈ పేపర్స్ ఎవరన్నా చూస్తే ప్రాబ్లమ్ అని జ్యోత్స్న వాటిని కాల్చేస్తుంది. అలా జ్యోత్స్న కాల్చేయడం పారిజాతం చూసి షాక్ అవుతుంది. నువ్వేదో దాస్తున్నావ్.. అది కనిపెట్టాలి.. నా కొడుకుని గాని నువ్వు కొట్టి ఉంటే నిన్ను వదిలి పెట్టనని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు అసలు అలా ఎలా షూట్ చేసారని కార్తీక్, దీప ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
