English | Telugu
"అందం పోతుందని డబ్బా పాలు పడుతున్నారా?".. నెటిజన్ ప్రశ్నకు హరితేజ ఆన్సర్ ఇదే!
Updated : May 25, 2021
బుల్లితెరపై సీరియల్స్ లో నటించి, ఆ తరువాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కనిపించింది హరితేజ. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని తనదైన ఆటతో జనాలను ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ పెరిగింది. ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు కూడా పెరిగాయి. రీసెంట్ గా హరితేజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో తాను పడ్డ కష్టాల గురించి ఇటీవల చెప్పుకొచ్చింది.
తనకు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని.. కానీ ఫైనల్ గా అంతా బాగానే జరిగిందని.. తమ పాప ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా హరితేజ తన ఫాలోవర్లతో ముచ్చట పెట్టింది. చాలా రోజుల తరువాత ఆన్లైన్ లోకి వచ్చినా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. చాలా మంది పాప యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు.
"అందం పోతుందని డబ్బా పాలు పడుతున్నారా..? లేక మీరే ఇస్తున్నారా..?" అని ప్రశ్నించాడు ఒకతను. ఇది చూసిన హరితేజ.. ఒకింత వ్యంగ్యంగా నవ్వుతూ.. "ఏమిటో మీ అనుమానాలు?" అంటూ కౌంటర్ ఇచ్చింది. "వ్యాక్సిన్ వేసుకున్నారా..?" అని మరో నెటిజన్ అడగగా.. పాపకు పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ వేసుకోవాలో లేదో అనే విషయంలో తనకు కన్ఫ్యూజన్ ఉందని అసలు విషయం చెప్పింది.