Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : పెళ్ళి చేసుకొని వచ్చిన రామలక్ష్మి, సీతాకాంత్.. మాణిక్యం నమ్మగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -53 లో.. నువ్వు అభిని ప్రేమించిన కూడా ఈ తండ్రి కోసం నీ ప్రేమని త్యాగం చేసావ్.. నువ్వు చాలా మారిపోయావని రామలక్ష్మితో మాణిక్యం అంటాడు. నువ్వు పట్టుచీర కుట్టుకొని గుడికి రా అని రామలక్ష్మితో, మీరంతా త్వరగా రెడీ అయి గుడికి రమ్మని సుజాతతో మాణిక్యం చెప్తాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ల పెళ్లి చెయ్యడానికి మాణిక్యం పూలదండలు పట్టుకొని సీతాకాంత్ ఇంటికి వెళ్లి.. అల్లుడు అల్లుడు అంటూ పిలుస్తుంటే అందరూ హాల్లోకి వస్తారు. అన్నయ్య ఇంట్లో లేడని సందీప్ చెప్తాడు. ఎక్కడికి వెళ్ళాడంటు మాణిక్యం టెన్షన్ పడతాడు. ఇప్పుడే తేలుస్తానంటూ మాణిక్యం బయటకు వచ్చి.. సుజాతకు ఫోన్ చేసి బయలుదేరారా అంటూ అడుగుతాడు.. ఇంకా లేదు రామలక్ష్మి బయటకు వెళ్ళింది వచ్చాక వస్తామని అనగానే.. రామలక్ష్మిని ఎందుకు బయటకు పంపించావ్? అంతా అయిపోయిందంటూ మాణిక్యం అంటాడు. మాణిక్యం ఏం అంటున్నాడో సుజాతకి అర్థం కాదు. ఆ తర్వాత మాణిక్యం ఇంట్లోకి వచ్చి.. అల్లుడు ఇలా ప్లాన్ సర్వ నాశనం చేస్తాడనుకులేదని  మాణిక్యం అంటాడు.

ఆ తర్వాత మీ అన్నయ్య నీకు చెప్పినవన్ని అబద్ధాలే.. నీకు నా కొడుకుకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు కానీ మాట తప్పాడు.. అసలు నీకు ధనకి పెళ్లి కాదని మాణిక్యం అనగానే.. జరిగి తీరుతుందంటూ సీతాకాంత్ అంటాడు. అటుగా చూస్తే రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు పెళ్లి చేసుకొని వస్తారు. వాళ్ళని చూసి అందరు షాక్ అవుతారు. మీరు నిజంగానే పెళ్ళి చేసుకున్నారా అంటు మాణిక్యం డౌట్ పడుతుంటే.. నిజంగానే పెళ్లి చేసుకున్నామంటు సీతాకాంత్ క్లారిటీ ఇస్తాడు. కానీ శ్రీలత తనకి చెప్పకుండా సీతాకాంత్ పెళ్లి చేసుకున్నందుకు కోపంగా ఉంటుంది. గుమ్మంలో ఉన్న సీతాకాంత్, రామలక్ష్మి వాళ్లకి సిరి హారతిచ్చి లోపలకి ఆహ్వానిస్తుంది. మామా.. నువు చెప్పినట్టు రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నా ఇక సిరి, ధనల పెళ్లి జరగాలని సీతాకాంత్ అనగానే.. జరగదని మాణిక్యం అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.