Read more!

English | Telugu

గురువులానే శిష్యుడు కూడా విజయం సాధిస్తాడా!?

ప్రస్తుతమున్న ఇంటెలిజెంట్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. నేటి తరం దర్శకులలో ఎక్కువమంది సత్తా ఉన్న దర్శకులను తన అసిస్టెంట్ నుంచి దర్శకులుగా ప్రమోట్ చేసిన ఘనత సుకుమారుకు లభిస్తుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం సుకుమార్ శిష్యులు దర్శకులుగా వ‌ర‌స  చిత్రాలు చేస్తున్నారు. తాజాగా  సుకుమార్ ప్రియ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల నానితో దసరా చిత్రం చేస్తున్నారు.  ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన టీజర్ సినిమాలపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నాని ఇందులో పూర్తిస్థాయి మాస్ అవతారంలో కనిపిస్తున్నారు.

తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు.  దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. టీజర్ లో కీర్తి సురేష్ ని చూపించలేదు. అది కాస్త నిరాశ పరుస్తోంది. ఆమె కోసమే ఏమైనా స్పెషల్ టీజర్ ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు. తాజాగా ఒక విషయం తెరపైకి వచ్చింది. రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ శ్రీ‌కాంత్ ఓదెల‌ను  మెచ్చుకున్నారు.  1000 మందికి కూడా కాస్ట్యూమ్స్ రెడీగా పెట్టగల సామర్థ్యం శ్రీకాంత్ ఓదెల‌కు ఉంది. నేను  వచ్చి నేరుగా డైరెక్షన్ విషయాల మీదనే దృష్టి పెట్టే వాడిని.... అని ఆయన అప్పట్లో చెప్పుకొచ్చారు. అంత నమ్మకం ఉండబట్టే సుకుమార్ శిష్యుడి మీద నాని  కూడా నమ్మకం పెట్టుకున్నారు. నాని అయితే ఏకంగా  దసరా చిత్రం గురించి మాట్లాడుతూ,  గత ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్ట‌ర్ ల మాదిరిగా ద‌స‌రా ఈ ఏడాది ఆస్థాయిలో నిలుస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు.  

ఈ సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు బడ్జెట్ పెట్టించాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.  నాని కెరీర్ లోనే ఇది మరుపురాని చిత్రంగా మిగులుతుందని భావిస్తున్నారు. నాని అభిమానులు ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మొత్తం మీద సుకుమార్ శిష్యుడు కూడా పుష్పాలాంటి ఒక కథతో రా అండ్ ర‌గ్గ్‌డ్ చిత్రంతో  ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నాడో వేచి  చూడాలి.