Read more!

English | Telugu

నన్ను క్షమించండి... హీరో విశాల్ లేఖ 

ప్లీజ్ దయ చేసి నన్ను క్షమించండి.. ఇలా జరుగుతుందని అనుకోలేదు..మీలాగే నేను కూడా ఎంతో ఆశపడ్డాను.కానీ ఏం చేస్తాం. ఇప్పుడు ఈ మాటలన్నీ హీరో విశాల్ చెప్తున్నాడు. అసలు అలా ఎందుకు చెప్తున్నాడో చూద్దాం.

విశాల్ అప్ కమింగ్ మూవీ రత్నం. ఈ నెల 26 న వరల్డ్ వైడ్ గా విడుదల  అవుతుంది. తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. దీంతో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 19 న హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరపాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందుకు వేదికగా నగరంలోని నరసింహరెడ్డి కాలేజ్ ని ఎంపిక చేసారు. కాకపోతే ఏం జరిగిందో తెలియదు గాని ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో విశాల్ అభిమానులు తెలుగు ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందర్నీ క్షమాపణ కోరుతూ విశాల్ ఒక లేఖ విడుదల చేసాడు. తాను కూడా అభిమానులని మిస్ అయ్యాయని అందులో రాసాడు.అలాగే  త్వరలోనే ఈవెంట్ ని జరుపుతామని కూడా చెప్పాడు.  

ఇక రత్నం కి సింగం ఫేమ్ హరి దర్శకుడు కావడంతో అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.ఇటీవల రిలీజైన టీజర్ కూడా అందరి అంచనాలు మించి ఉంది. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి అందరిలో ఉంది. విశాల్ తో ప్రియా భవాని శంకర్ జోడి కడుతుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందించాడు..స్టోన్ బెంజ్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ లు నిర్మిస్తున్నాయి. సముధ్రఖని ,గౌతమ్ వాసుదేవమీనన్ లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.  గతంలో విశాల్ అండ్ హరి కాంబోలో భరణి, పూజ లాంటి చిత్రాలు కూడా వచ్చి విజయాన్ని సాధించాయి.