Read more!

English | Telugu

ఆసక్తికరంగా నింద మూవీ పోస్టర్.. ఈ మిస్టరీ థ్రిల్లర్ ఎప్పుడంటే!

ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ సినిమాలకి క్రేజ్ పెరిగింది. అందుకేనేమో ఆ మధ్య నాగచైతన్య చేసిన 'దూత' వెబ్ సిరీస్ అంత హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ' ఇన్ స్పెక్టర్ రిషి' భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. 

అందుకేనేమో దర్శక, నిర్మాతలు కామెడీ, డ్రామా జానర్ సినిమాలకంటే థ్రిల్లర్ జానర్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఆ కోవలోకి చెందిందే ' నింద ' మూవీ. తాజాగా ఈ మూవీలో వరుణ్ సందేశ్ హీరోగా చేస్తున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ 'నింద' మూవీని తెరకెక్కించారు. రాజేష్ జగన్నాథం దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో వస్తోన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

కొత్త బంగారులోకం, హ్యాపీ డేస్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న వరుణ్  సందేశ్ ..  ఆ తర్వాత సరైన హిట్ లు లేక కామ్ అయ్యాడు. అయితే తన భార్య వితికతో కలిసి బిగ్ బాస్ లోకి వెళ్ళాక వారిద్దరి మీద తెగ ట్రోల్స్ వచ్చాయి. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక వారిద్దరికి కాస్త క్రేజ్ పెరిగింది‌ కానీ సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ మిస్టరీ థ్రిల్లర్ ' నింద ' తో వరుణ్ సందేశ్ రాబోతున్నాడు. కాగా ఈ మూవీ పోస్టర్ ఆసక్తిని కలుగజేస్తుంది. చీకటి గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి, ఊరి వాతావరణం, కత్తి పట్టుకున్న న్యాయ దేవత విగ్రహం  ఇంట్రస్టింగ్ ని కలుగజేస్తున్నాయి. అయితే ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ మూవీ థియేటర్లలో కంటే ఓటీటీలో రిలీజ్ అవుతే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.