Read more!

English | Telugu

ఓటీటీలోకి రానున్న హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

కొన్ని సినిమాలు ఏ అంచనాలు లేకుండా విడుదలై అత్యధిక వసూళ్ళని సాధిస్తాయి. మరికొన్ని భారీ తారాగణం ఉన్నా పెద్దగా హిట్ కాదు కదా యావరేజ్ టాక్ ని కూడా తెచ్చుకోలేకపోతాయి. అయితే హిందీ యాక్టర్ అజయ్ దేవ్ గణ్, తమిళ యాక్టర్స్ జ్యోతిక, మాధవన్ కలిసి చేసిన ఓ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ హారర్ థ్రిల్లర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఆ సినిమా గురించి తెలుసుకుందాం...

అజయ్ దేవ్ గణ్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ' సైతాన్'. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మార్చి 8 న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకి పైగా కలెక్షన్లని వసూలు చేసింది. అయితే సైతాన్ మూవీ ఓటీటీలో చూడటానికి ఓటీటీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్స్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్లాక్ బస్టర్ ని ఓటీటీలోకి మే నెల మొదటి వారంలో గానీ రెండవ వారంలో గానీ ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాకి వివేక్ బహ్ల్ దర్శకుడు. ఈ మూవీని వివేక్ బహ్ల్, అజయ్ దేవ్ గణ్, జ్యోతి దేశ్ పాండే, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో జానకీ జోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం వహించారు. 

హారర్ ఎలిమెంట్స్ తో ఈ మధ్య కొన్ని సినిమాలు విడుదలైనా అవి పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమాలోని ట్విస్ట్ లు, యాక్టర్స్ అజయ్ దేవ్ గణ్, మాధవన్, జ్యోతక నటన కట్టిపడేసాయి. మరి థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధి‌ంచిన ఈ సినిమా కోసం‌ ఎంతమంది ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.