Read more!

English | Telugu

ఆరంభం అంటున్న రకుల్ ప్రీత్..హోటల్ లో అవి మాత్రమే దొరుకుతాయి 

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh)గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు.ఎన్టీఆర్ ,రామ్ చరణ్, మహేష్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్స్ తో నటించి అనతి కాలంలోనే మంచి గుర్తింపుని పొందింది. ఒక దశలో అగ్ర హీరోయిన్ గా కూడా చెలామణి అయ్యింది. కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా బాలీవుడ్ కి వెళ్లిపోయింది.ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనపడలేదు. లేటెస్ట్ గా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది.

హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో రకుల్ కి ఎప్పట్నుంచో  F 45 పేరుతో జిమ్ లు ఉన్నాయి. ఎంతో మంది సినీ సెలబ్రటీస్, విఐపి లు ఆ జిమ్ కి వెళ్తుంటారు.ఆదాయాన్ని కూడా బాగానే సంపాదిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఆరంభం పేరుతో హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ని ప్రారంభించింది.ఇందులో కేవలం మిలెట్స్ తో చేసిన వంటకాలు మాత్రమే లభిస్తాయి. కస్టమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హోటల్ ని ప్రారంభించినట్టుగా  తెలుస్తుంది. 

అంతే కాకుండా వెల్ బీయింగ్ న్యూట్రీషియన్, వెల్నెస్ న్యూట్రిషన్ లాంటి బ్రాండ్స్ లో  పార్టనర్ షిప్ కూడా ఉంది. ఇక ఆమె వివాహం ఇటీవలే జరిగింది. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్నఇండియన్  2  లో చేస్తుంది. మేరీ హస్బెండ్ కి బివి అనే హిందీ మూవీలోను చేస్తుంది.