Read more!

English | Telugu

రజనీకాంత్,నాగార్జున కలిసి ఏం చెప్పబోతున్నారు.. లోకేష్ నాగ్ ని కలిసింది నిజం 

సూపర్ స్టార్ రజనీకాంత్( rajini kanth) యువసామ్రాట్ నాగార్జున( nagarjuna)తమ పవర్ ఫుల్ యాక్టింగ్ తో కొన్ని లక్షల మంది అభిమానులని కొన్ని తరాలుగా అలరించుకుంటు వస్తున్నారు. ఆ ఇద్దరు చూడని రికార్డు లేదు. అసలు ఆ  రెండు పేర్లు పక్క పక్కన వింటేనే ఒక కొత్త రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాంటిది ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే.  ఆల్ ఓవర్ ఇండియా షేక్ అయిపోదు.  ప్రస్తుత సినీ వాతావరణాన్ని చూస్తుంటే అందుకు  ముహూర్తం దగ్గర పడేలా ఉంది. 


రజనీ ప్రస్తుతం వెట్టియాన్ అనే మూవీ చేస్తున్నాడు. కంటిన్యూ షెడ్యూల్స్ తో   శరవేగంగా షూటింగ్ ని  జరుపుకుంటుంది. దీని తర్వాత  లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj)తో మూవీకి కమిట్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూవీలో నాగార్జున కూడా నటించబోతున్నాడనే వార్తలు వినపడుతున్నాయి.మన తెలుగు నాట అధికారప్రకటన రాకపోయినప్పటికీ తమిళనాడులో మాత్రం నాగ్ ,రజనీ కాంబో స్క్రీన్ మీద మెరవడం ఖాయమనే చర్చ నడుస్తుంది. పైగా లోకేష్ ఇటీవలే  నాగార్జునని ని కూడా కలిసాడు.ఏది ఏమైనా  సోషల్ మీడియాలో ఆ న్యూస్ చూసిన ఇరువురి ఫ్యాన్స్  ఆనందానికి అయితే  అవధులు లేవు. ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ ఎలా ఉంటుందో అనే చర్చ కూడా  మొదలయ్యింది.

లోకేష్ ఇటీవలే విజయ్ (vijay) తో లియో  తీసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. రజనీ  జైలర్ విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు. నాగార్జున నా సామి రంగ తో ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు కలయికలో సినిమా రావడం ప్రేక్షకుల అదృష్టమే అని చెప్పాలి.  ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతవరకు ఎవరు టచ్ చెయ్యని పాయింట్ తో  ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కమల్ హాసన్ కూతురు ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ రజనీకి కూతురుగా నటిస్తుండటం విశేషం.ఇక అతి తక్కువ వ్యవధిలోనే  నాగ్ చెయ్యబోయే మరో భారీ మల్టీస్టారర్ ఇది. ఆల్రెడీ  ధనుష్ తో  కుబేర చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దానికి దర్శకుడు