Read more!

English | Telugu

'మంజుమ్మల్ బాయ్స్'కి బిగ్ షాక్.. వివాదం ఎక్కడికి వెళ్తుందో!

మలయాళంలో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'మంజుమ్మల్ బాయ్స్'.. తెలుగులోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుదల చేసింది. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదలై  మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే చిత్ర ప్రదర్శనలను నిలిపివేసినట్లు పీవీఆర్ తెలిపింది. 

కాగా పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న సమయంలో ఇలా అర్థాంతరంగా ప్రదర్శనలు ఆపేయడం అన్యాయమన్న ఆయన.. ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు శశిధర్ రెడ్డి. మరి దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.