Read more!

English | Telugu

పుష్పరాజ్ దెబ్బకి వణికిపోతున్న బాలీవుడ్!

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ హైప్డ్ సినిమాలలో 'పుష్ప 2: ది రూల్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప: ది రైజ్' మూవీ.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రెండో భాగంగా 'పుష్ప: ది రూల్' రూపుదిద్దుకుంటోంది. 'పుష్ప-2'పై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి. 'పుష్ప-2' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించిన సంచలనాలు సృష్టించడం ఖాయమని.. రూ.1000 నుంచి1500 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశముందనే అభిప్రాయాలున్నాయి. అందుకే ఆ తేదీకి రావాలంటే ఇతర సినిమాలు భయపడుతున్నాయి. ఒక బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ సైతం.. 'పుష్ప-2'తో తలపడటానికి భయపడి వెనకడుగు వేసింది.

బాలీవుడ్ లో రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా రూపొందే 'సింగం' సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా ఈ సిరీస్ నుంచి 'సింగం', 'సింగం రిటర్న్స్' రాగా.. రెండూ ఘన విజయం సాధించాయి. ఈ చిత్రాలు హీరోగా అజయ్ దేవ్‌గణ్ కి మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించాయి. ఇప్పుడు వీరి కలయికలో 'సింగం ఎగైన్' రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఆగస్టు 15న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ ఇప్పుడు 'పుష్ప-2' దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్నారు. 

అసలే అజయ్ దేవ్‌గణ్- రోహిత్ శెట్టి కాంబినేషన్ మూవీ. పైగా సింగం సిరీస్. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె వంటి ఎందరో స్టార్స్ సందడి చేయనున్నారు. ఇన్ని పాజిటివ్ లు, ఇంత బలం ఉన్నప్పటికీ..  'పుష్ప-2' సునామీలో తాము నిలబడటం కష్టమని భావించిన సింగం టీమ్.. సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల కానుందట. మొత్తానికైతే పుష్పరాజ్ దెబ్బకి బాలీవుడ్ సినిమాలే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.