English | Telugu
పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడు.. చిరంజీవి బుక్కయ్యాడు!
Updated : May 21, 2025
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన గత చిత్రం 'భోళా శంకర్'. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. 2023 ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం పరాజయం పాలైంది. నిజానికి ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉండగా.. అనుకోకుండా చిరంజీవి చేసి ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నారు.
జూన్ 12న 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించనున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా వీరమల్లు మూడో గీతం 'అసుర హననం' ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితో తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'ని రీమేక్ చేద్దామనుకున్నామని.. కానీ ఎన్నికల వల్ల చేయలేకపోయామని చెప్పారు.
వేదాళం మూవీ 2015 లో విడుదలైంది. ఎ.ఎం. రత్నం మాటలను బట్టి చూస్తే.. 2019 ఎన్నికలకు ముందు పవన్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. ఆ తర్వాత ఇదే సినిమాని 'భోళా శంకర్'గా రీమేక్ చేశారు చిరంజీవి. తమిళ్ లో విడుదలైన ఎనిమిదేళ్ళకు తెలుగులో రీమేక్ అయిన ఈ సినిమా నిరాశపరిచింది.
