Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోయిన్ భయపెడుతోంది!

2009లో విడుదలైన "బోణీ" సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన భామ కృతి కర్భంద. ఆ సినిమా అనుకొన్న స్థాయిలో ఆడకపోవడంతో ఆమెను ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "తీన్ మార్" కూడా ఆమెకు స్టార్ డమ్ తీసుకురాలేకపోయింది. దాంతో రామ్ చరణ్ "బ్రూస్ లీ" సినిమాలో చరణ్ కు అక్కగానూ నటించింది. ఆ సినిమా కూడా ఆడలేదనుకోండి. దాంతో అమ్మడు తెలుగులో కష్టం అని భావించి బాలీవుడ్ పయనమైంది. బాలీవుడ్ లో "రాజ్" సిరీస్ లో వస్తున్న నాలుగో సినిమాలో కృతి కథానాయికగా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ కథానాయికగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు. కన్నెర్ర చేసిన కృతి ప్రేక్షకులను భయపెట్టడానికి వీరాలెవల్లో ట్రై చేస్తుంది. మరి కృతి బాలీవుడ్ ఎంట్రీ ఆమెకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి!