Read more!

English | Telugu

మహేష్ బాబు కి 42 , 85 ర్యాంక్ లు..సాగర సంగమంకి 75

పుష్పలో ఎవడ్రా ఎవడ్రా నువ్వు కాల్చితే ఇనుమవుతాను అనే పాట ఒకటి ఉంటుంది. ఇప్పుడు అది సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) కి పర్ఫెక్ట్ గా సూటవ్వుతుంది. పైగా అభిమానులు కూడా కాలర్ ఎగరేస్తున్నారు. కనపడ్డ ప్రతీ వారితో ఆ రెండు సినిమాలు సరిగా ఆడలేదని ఎవరు చెప్పారంటున్నారు. ఇంతకీ  అసలు విషయం ఏంటో చూద్దాం 


లెటర్‌బాక్స్డ్( letterboxed) అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల గురించి  చర్చ జరిగే వేదిక. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  సినీ ప్రేమికులు తమకి నచ్చిన సినిమా  గురించి అందులో మాట్లాడతారు.  రేటింగ్స్  ని కూడా  ఇస్తుంటారు. తాజాగా అత్యధిక అభిమానుల ఆదరణ చూరగొన్న టాప్ వంద చిత్రాల జాబితాను లెటర్‌బాక్స్‌డ్ ప్రకటించింది. ఆ  వంద చిత్రాల్లో  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన  నాలుగు సినిమాలు స్థానాన్ని దక్కించుకున్నాయి. పైగా వాటిల్లో రెండు చిత్రాలు మహేష్ బాబు వే.  అతడు, ఖలేజా లు 42 , 85  ర్యాంకులు  దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ వార్తతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. నాచురల్ స్టార్ నాని  జెర్సీ 57వ ర్యాంక్ ని, కమల్ హాసన్ విశ్వనాధ్ ల కళాసృష్టి సాగర సంగమం 75వ ర్యాంక్ ని దక్కించుకున్నాయి.  

అతడు మూవీ 2005 లో రాగా  ఖలేజా 2010 లో వచ్చింది. మంచి కంటెంట్ తోనే ఆ రెండు  తెరకెక్కాయి. కానీ  థియేటర్స్ లో మాత్రం యావరేజ్ గానే నడిచాయి.  బుల్లి తెర మీద మాత్రం అత్యధిక రేటింగ్స్ తో ఇప్పటికి  రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి.ఆ  రెండిటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దరకుడు కావడం గమనార్హం. మొన్న సంక్రాంతికి  ఆ ఇద్దరి కాంబోలో గుంటూరు కారం వచ్చింది. ఇక  మహేష్ తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి తో చేస్తున్నాడు. త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ మీద ఎలాంటి అధికార ప్రకటన లేదు