Read more!

English | Telugu

డియర్ స్టూడెంట్స్ మ్యాడ్ కి సీక్వెల్‌ వస్తుంది..టైటిల్ ఇదే..హీరో కూడా ఫిక్స్

గత సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన యూత్ ఫుల్ మూవీ మ్యాడ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది 

మ్యాడ్ కి  సీక్వెల్ గా  మ్యాడ్ స్క్వేర్‌ రాబోతుంది. మ్యాడ్ ని పని చేసిన టీమే స్క్వేర్‌ కి కూడా పని చేస్తుంది.  ఈ మేరకు రీసెంట్ గా  మూవీ ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖ హీరో  సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అథితిగా హాజరయ్యి దర్శకుడు కళ్యాణ్ శంకర్ కి స్క్రిప్ట్ ని అందచేసాడు. జాతి రత్నాలు దర్శకుడు  అనుదీప్ కూడా హాజరయ్యి యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పాడు. ఇప్పుడు ఈ ఆవార్త యూత్ లో జోష్ ని  తెస్తుంది.

పార్ట్ 1 లో మెప్పించిన  యువ హీరోలు  నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగబోతుంది.మ్యాడ్ నెస్ ఇంకా  పూర్తి కాలేదని  ఈసారి మ్యాడ్ నెస్  రెట్టింపు ఉంటుందని మేకర్స్  పేర్కొన్నారు. దీన్ని  బట్టి చూస్తే ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి  థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.దాదాపుగా  మ్యాడ్  కోసం వర్క్ చేసిన   సాంకేతిక నిపుణులే  స్క్వేర్ కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా  షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్.