English | Telugu
హీరోల గొప్ప ఏంటి..మా వల్ల కూడా సినిమాకి వస్తారు.. మహేష్, ప్రభాస్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
Updated : Apr 12, 2024
ఎవరండీ సినిమాలో హీరో ఉంటేనే జనం థియేటర్స్ కి వస్తారని చెప్పింది. పైగా పెద్ద హీరో ఉంటే పరుగులు పెట్టుకుంటూ వస్తారని చెప్పింది. అదంతా అబద్దం. ఇప్పుడు ఈ మాటలన్నీ ఒక ప్రముఖ హీరోయిన్ చెప్తుంది.పైగా ఇండస్ట్రీ లో హీరోల మధ్య ఐక్యత అనేది కూడా అబద్దం అంటుంది. తనెవరో కాదు మహేష్(mahesh)ప్రభాస్(prabhas)ల హీరోయిన్ కృతి సనన్.
కృతి సనన్ (kriti sanon) తాజాగా బాలీవుడ్ లో క్రూ (crew)అనే మూవీ చేసింది. టబు, కరిష్మా కపూర్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది అందులో ఆ ముగ్గురే ప్రధాన పాత్రధారులుగా చేసారు. మొన్న మార్చి 29 న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. ప్రమోషన్స్ లో భాగంగా కృతి పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతు ఒక సినిమాలో హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు థియేటర్స్ కి పరుగెత్తుకుంటు రారు. కథ బాగుంటేనే వస్తారు. పైగా అందులో హీరోగా చేస్తుంది ఆడ, మగ అని చూడరు. దురదృష్టవశాత్తు కొంత మంది దర్శక నిర్మాతల్లో మహిళా ప్రాధాన్యత సినిమాలని ప్రేక్షకులు చూడరనే అభిప్రాయం ఉంది. అది కేవలం వాళ్ళ అపోహా మాత్రమే
అలాగే తాను నటించిన క్రూ మూవీని ఉదాహరణగా చూపెడుతుంది. మా సినిమాలో ఎలాంటి హీరో లేడు. అయినా కూడా మూవీ మంచి విజయం దిశగా దూసుపోతుందని అంటుంది. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ గా మారాయి.అలాగే పరిశ్రమలో చాలా మంది మొహమాటంతో పొగుడుకుంటూ ఉంటారు. అవన్నీ నిజాలు కాదని, ఒక సినిమా హిట్ అయితే సంతోషించే వాళ్ళే కాదు ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక ఆమె తన తదుపరి చిత్రంగా ధో పత్తి అనే మూవీ చేస్తుంది.సీనియర్ యాక్టర్ కాజల్ తో కలిసి నటించనుంది.