Read more!

English | Telugu

సారధి స్టూడియోస్ లో ఎన్టీఆర్ గ్యారేజ్ ని మూసేశారు...!

'టెంపర్, నాన్నకు ప్రేమతో" లాంటి వరుస హిట్ల తర్వాత ఎన్టీయార్ నటిస్తున్న "జనతా గ్యారేజ్" టాకీ పార్ట్ నేటితో పూర్తయ్యింది. ఇవాళే (జూన్ 29) ఆఖరి రోజు. హైద్రాబాద్ లోని సారధి స్టూడియోస్ లో వేయబడిన భారీ సెట్ లో గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో పూర్తికానుంది. ఎన్టీయార్ మరియు ఇతర కీలకపాత్రధారులపై ఆఖరి షాట్ ను తీసేశాడు కొరటాల. సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సాయికుమార్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను హైద్రాబాద్ లోని శిల్పకళావేదికలో జూలై నాలుగో వారంలో నిర్వహించేందుకు యూనిట్ సభ్యులు సన్నద్ధమవుతున్నారు. ఎన్టీయార్ ఆల్రెడీ ఈ సినిమా డబ్బింగ్ కూడా మొదలెట్టేశాడు. ఆగస్ట్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది!