English | Telugu
పవన్ కళ్యాణ్ సినిమా ఆపగలిగే దమ్ముందా!.. ఏపి,తెలంగాణాలో దిల్ రాజుకి ఉన్న థియేటర్స్ ఇవే
Updated : May 26, 2025
సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా ఉంటు ఎన్నో ఉత్తమమైన సినిమాలని ప్రేక్షకులకి అందిస్తు వస్తున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju). ప్రస్తుతం ఎఫ్ డి సి చైర్మన్ గా కూడా తన బాధ్యతలని నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా జూన్ 1 నుంచి సినిమా థియేటర్స్ బంద్ కాబోతున్నాయని, జూన్ 12 న విడుదల కాబోయే పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కాకుండా చెయ్యాలనే థియేటర్ల మూత వేత అంశం తెరపైకి వచ్చిందనే మాటలు వినపడుతున్నాయి.
ఈ అంశంపై రీసెంట్ గా దిల్ రాజు మాట్లాడుతు కొన్ని ప్రశ్నలకీ జవాబులు చెప్పాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చాను. ఏప్రిల్ 19 న ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య మీటింగ్ జరిగింది.అందులో ఎగ్జిబిటర్స్ మాట్లాడుతు మాకు థియేటర్స్ రన్నింగ్ వర్క్ అవుట్ అవ్వడం లేదు. పర్శంటేజ్ విధానం ఉండాలని కోరుకున్నారు. సంవత్సరంలో 150 సినిమాలు రిలీజ్ అయితే అందులో 90 సినిమాలు పర్శంటేజ్ విధానంతోనే ఆడిస్తున్నారు. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్శంటేజ్ విధానంతోనే ఆడిస్తున్నారు. దీంతో ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ పర్శంటేజ్ విధానం కోరుకోవడం జరిగింది. అందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చెయ్యలేదు. మే 1 న విడుదలైన 'హిట్ 3 ' కి పర్శంటేజ్ ఇవ్వలేదని, వాళ్ళు ఇలా అయితే థియేటర్స్ మూసివేస్తామని చెప్పడం జరిగింది. ఇది కేవలం ఈస్ట్ గోదావరి కి చెందిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య జరిగిన సంఘటన.
ఈ సమస్య కి సంబంధించి మీటింగ్ జరిగితే అందులో కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్ మాటల సందర్భంలో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని చెప్పారు. అది ఫైనల్ అవ్వకుండానే మీడియాలో జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu)ని అడ్డుకోవడానికి చూస్తున్నారని స్ప్రెడ్ అయ్యింది. అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపగలిగే దమ్ము, సత్తా ఎవరికైనా ఉన్నాయా. జూన్ 1 న థియేటర్స్ బంద్ అనే మాటని ఛాంబర్ ఖండించకపోవడం తప్పు. తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి ఎవరు కలిసి రావడం లేదు. తెలంగాణాలో 370 సింగిల్ స్క్రీన్స్ ఉంటే నాకు, నా పార్టనర్ చారికి కలిపి మొత్తం 30 థియేటర్స్ ఉన్నాయి. ఉత్తరంధ్ర లో 20 థియేటర్స్ ఉన్నాయని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
