Read more!

English | Telugu

తెలుగులో ధనుష్ మూడో సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్!

కోలీవుడ్ హీరో ధనుష్(Dhanush) టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' మూవీ చేశాడు. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 'కుబేర' సినిమా చేస్తున్నాడు. ఇదిలా తాజాగా మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

శర్వానంద్ హీరోగా నటించిన 'శ్రీకారం'(2021) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కిషోర్ బి. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం తర్వాత కాస్త సమయం తీసుకున్న కిషోర్.. అదిరిపోయే కథను రెడీ చేసి, ఇటీవల ధనుష్ కి వినిపించాడట. కిషోర్ చెప్పిన కథ విని ఇంప్రెస్ అయిన ధనుష్.. వెంటనే సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడని తెలుస్తుండగా.. దసరాకు ప్రారంభం కానుందని వినికిడి. మరి ధనుష్ కోసం దర్శకుడు కిషోర్ ఎలాంటి కథను సిద్ధం చేశాడో చూడాలి.