Read more!

English | Telugu

"చుట్టాలబ్బాయి" టీజర్ విడుదల!

శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్ మరియు ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "చుట్టాలబ్బాయి". వీరభద్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా వెంకట్ తలారి-రామ్ తాళ్లూరి నిర్మాతలుగా పరిచయమవుతున్నారు. మలయాళం హీరోయిన్ నమిత ప్రమోద్ తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్ నేడు (జూన్ 25) విడుదల చేశారు. తమన్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని బ్లూఫాక్స్ రెస్టారెంట్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కథానాయకుడు ఆది, దర్శకుడు వీరభద్రమ్, నిర్మాతలు వెంకట్ తలారి-రామ్ తాళ్లూరి, కెమెరామెన్ ఎస్.అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు ఆది మాట్లాడుతూ.. "కన్ఫ్యూజన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఎంటర్ టైనింగ్ ఫిలిమ్ "చుట్టాలబ్బాయ్". వీరభదర్ గారు సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. నిర్మాతలు చాలా ఫ్యాషన్ తో ఈ సినిమాను నిర్మించారు. కేవలం డబ్బులు మాత్రమే కాదు గట్స్ కూడా పుష్కలంగా ఉన్న నిర్మాతలు వారు. మలయాళంలో దాదాపు 11 సినిమాల్లో నటించిన "నమిత ప్రమోద్" మా సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమవుతోంది, ఆమె నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జూలై 6న "చుట్టాలబ్బాయి" ఆడియోను విడుదల చేసి.. అదే నెల రెండోవారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి" అన్నారు.

దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ.. "సినిమా మొదలెట్టినప్పట్నుంచి పాజిటివ్ బజ్ ఉంది. టైటిల్ మొదలుకొని కథ వరకూ అన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వెంకట్-రామ్ లు నన్ను సపరేట్ సినిమాల కోసం అడిగారు కానీ.. ఇద్దరూ కలిస్తే మంచి బడ్జెట్ సినిమా వస్తుందని భావించి వారిద్దరికీ కలిపి "చుట్టాలబ్బాయి" సినిమాను రూపొందించాము. నిర్మాతలు వెంకట్ తలారి-రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. "వీరభద్రమ్ గారి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ద్వారా నిర్మాతలుగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సిట్టింగ్ లోనే వీరభద్రమ్ గారికి చెక్ ఇచ్చేశాము. కథ మాకు అంతగా నచ్చింది. ఈ సినిమా ద్వారా తప్పకుండా సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తామన్న నమ్మకం ఉంది" అన్నారు.
కథను నమ్మి ఖర్చుపెట్టారు నిర్మాతలు, వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని కెమెరామెన్ ఎస్.అరుణ్ కుమార్ నమ్మకం వ్యక్తం చేశారు.