Read more!

English | Telugu

‘విరూపాక్ష’లో పార్వతక్కగా చేసాక నా పరిస్థితి ఇది!

యాంకర్ శ్యామల.. బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తుంది. ఒకవైపు యాంకర్ గా, మరోవైపు నటిగా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్యామల. శ్యామల పంతొమ్మిదేళ్ళకే లవ్ మ్యారేజ్ చేసుకుంది. తన కెరీర్, తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో తాజాగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది శ్యామల.

తాజా ఇంటర్వూలో "ఎంత కాలం యాంకరింగ్, సీరియల్స్ కి గ్యాప్ వచ్చింది" అని ప్రశ్నించగా.. "నాకు ప్రెగ్నెన్సి వచ్చాక ఎనిమిది నెలల వరకు యాంకరింగ్ చేసాను.. తొమ్మిదో నెల నుండి బాబుకి పదకొండు నెలల వచ్చేవరకు ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లోకి వచ్చాను" అని శ్యామల చెప్పింది. అయితే తను బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు పలువురు విమర్శించారంట. డబ్బు కోసం బాబుని వదిలేసి వెళ్తున్నావని అన్నారంట. అయితే అప్పుడు తన ఫ్యామిలీ తనకి సపోర్ట్ గా ఉందని.. తన భర్త తనకి ముందుండి ప్రోత్సాహం ఇచ్చాడని చెప్పుకొచ్చింది శ్యామల. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినవాళ్ళు ఎవరూ లేరని.. తనే మొదటి వ్యక్తినని చెప్పిన శ్యామల.. సరిగ్గా వాళ్ళ బాబు బర్త్ డే ముందు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చినట్టు చెప్పింది.

విరూపాక్ష సినిమా గురించి మీకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటని అడుగగా.. "చాలా మంచి టాక్ వచ్చింది. నా యాక్టింగ్ బాగుందని నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ చెప్పారు. చాలామంది కాల్ చేసి, మెసేజ్ లు చేసి చెప్పారు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే లెక్కలేనన్ని మెసెజ్ లు చేసారు.‌ ఈ సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులందరికి థాంక్స్.

ఇన్నాళ్ళు శ్యామలక్క అనేవాళ్ళు ఇప్పుడు పార్వతక్క అని అంటున్నారు" అని శ్యామల చెప్పుకొచ్చింది. అయితే మీకు సోషల్ మీడియాలో నలభై లక్షల ఫాలోవర్స్ ఉన్నారు కదా అని ప్రస్తావించగా.. "నేనెప్పుడూ ఫాలోయింగ్ గురించి ఏది చేయను.. నాకేమనిపిస్తే అదే చేస్తాను. వర్తమానంలోనే ఉంటాను.. ఇప్పుడు ఈ రోజు ఎలా ఉందనేది ఆలోచిస్తాను. నాకు సంబంధించిన ప్రతీది సోషల్ మీడియాలో షేర్ చేయను. నాకు ఈ సోషల్ మీడియాకి మధ్య ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ పరిధిలోనే ఉంటాను. నా బెడ్ రూంలోకి, వాష్ రూంలోకి దూరిపోయి పబ్లిసిటి కోసం ఫాలోవర్స్ కోసం ఏదీ చేయను" అని శ్యామల చెప్పుకొచ్చింది.