English | Telugu
ఉప్పెన లో శ్రీదేవి కూతురు ఉందా.. బోనీ కపూర్ చెప్తున్నాడు
Updated : Mar 22, 2024
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన మూవీ ఉప్పెన. 2021 లో వచ్చి మంచి విజయాన్నే అందుకుంది. చాలా ఏరియాల్లో రికార్డు కలెక్షన్స్ ని కూడా సృష్టించింది. అంతటితో ఆగకుండా బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం కేటగిరిలో జాతీయ అవార్డుని సైతం అందుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
రీసెంట్ గా రామ్ చరణ్ నూతన చిత్రం ప్రారంభం అయ్యింది. అందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. దీంతో బోనీ కపూర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడున్న కొంత మంది విలేకరులతో మాట్లాడుతు ఉప్పెన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపాడు. తన చిన్న కూతురు ఖుషి కపూర్ తో మూవీ చూడమని చెప్పానని తెలిపాడు. అంటే అయన చెప్పిన దాన్ని బట్టి ఉప్పెన హిందీ లో ఖుషి హీరోయిన్ గా చెయ్యబోతుందని తెలుస్తుంది. కాకపోతే హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు. గతంలో కూడా బోనీ కపూర్ చాలా తెలుగు సినిమాలని హిందీ లో కి రీమేక్ చేసి మంచి విజయాల్ని అందుకున్నాడు.
వైష్ణవ్ తేజ్ తో కృతిశెట్టి జోడి కట్టింది. మూవీలో ఆ ఇద్దరి ఫెయిర్ కూడా సూపర్ గా ఉంటుంది.ఇక కృతి ఫాదర్ గా చేసిన విజయ్ సేతుపతి వాళ్ళ సినిమా తాలూకు విజయం పెరిగింది.అలాగే దేవి శ్రీప్రసాద్ సంగీతంలో వచ్చిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.