Read more!

English | Telugu

రామ్ చరణ్ పై అల్లు అర్జున్ పైచేయి సాధిస్తాడా? 

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు మళ్ళీ విడుదలై ఒక్క రోజులోనే కోట్లలో గ్రాస్ వసూలు చేసి సత్తా చాటాయి. రీరిలీజ్ సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా రూ.4 కోట్లకు పైగా గ్రాస్ తో 'ఖుషి' టాప్ పొజిషన్ లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రూ.3 కోట్లకు పైగా గ్రాస్ తో 'జల్సా', రూ.2 కోట్లకు పైగా గ్రాస్ తో 'ఒక్కడు', రూ.1.7 కోట్లకు పైగా గ్రాస్ తో 'పోకిరి' ఉన్నాయి. ఇటీవల మళ్ళీ విడుదలైన 'ఆరెంజ్' సైతం మొదటి రోజు రూ.1.5 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఇక ఇప్పుడు 'దేశముదురు' వంతు వచ్చింది.

అల్లు అర్జున్, హన్సిక జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దేశముదురు'. 2007, జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలోని కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ తో కనిపించడం విశేషం. ఆయన స్టైల్ కి, డ్యాన్స్ లకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమాకి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుంది. అందుకే రీరిలీజ్ సెలబ్రేషన్స్ కి ఈ సినిమాని ఎంచుకున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 8) వేడుకల్లో భాగంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నారు. 'దేశముదురు' రీరిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి వసూళ్ల పరంగా ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 'ఆరెంజ్'ని దాటేసి టాప్-5 లో నిలుస్తుందేమో చూద్దాం.