English | Telugu

సినిమాల్లో చేసే మహిళ కమిట్మెంట్ అడిగిందంటున్న టాప్ హీరోయిన్..ఆ సినీ మహిళ ఈమేనా!

సినిమాల్లో చేసే మహిళ కమిట్మెంట్ అడిగిందంటున్న టాప్ హీరోయిన్..ఆ సినీ మహిళ ఈమేనా!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)వైవిఎస్ చౌదరి(Yvs Choudary)కాంబోలో  2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'రేయ్'. ఈ మూవీలో తేజ్ కి జోడీగా ముంబై ముద్దుగుమ్మ సయామీ ఖేర్(Saiyami Kher)నటించింది. ఆమెకి  కెరీర్ లో ఇదే తొలి సినిమా. అయినా కూడా ఎలాంటి బెరుకు లేకుండా అన్ని రకాల వేరియేషన్స్ లోను అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది.  

రీసెంట్ గా సయామీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ ప్రారంభంలో తెలుగు సినిమాలకి సంబంధించిన మహిళా ఏజెంట్ నన్ను కలిసింది. సినిమాల్లో అవకాశాల కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందని చెప్పింది. ఒక మహిళ అయ్యి ఉండి, ఇంకో మహిళతో ఆ విధంగా మాట్లాడే సరికి తట్టుకోలేకపోయాను. మొదట్లో ఆమె మాటలు అర్ధం కానట్టుగా నటించాను. కానీ పదే పదే అవే మాటలు చెప్తుండేది. దాంతో ఒకరోజు ఆమెతో నన్ను క్షమించండి మీరు నన్ను వేరే మార్గంలో వెళ్లాలని చెప్తున్నారు. నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని నేను ఎప్పుడు దాటనని చెప్పాను. చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చాను. ఇండస్ట్రీలో నాకొచ్చిన అవకాశాల పట్ల సంతృప్తిగానే  ఉన్నానని చెప్పుకొచ్చింది.

'రేయ్ మూవీ తర్వాత సయామి ఖేర్ బాలీవుడ్ లో మిర్జియా, మౌళి, చోక్డ్, వంటి పలు చిత్రాల్లో నటించింది. 2021 లో నాగార్జున తో కలిసి 'వైల్డ్ డాగ్' మూవీలో చేసిన  సయామీ, గత నెలలో సన్నీడియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో  వచ్చిన 'జాట్ మూవీలో మెరిసింది. ఎస్ ఐ  విజయలక్ష్మి గా ఒక పవర్ ఫుల్ పోలీస్ క్యారక్టర్ చేసి తన నటనతో చిత్ర విజయంలో భాగమయ్యింది.