English | Telugu
ప్రియాంక చోప్రా ముఖమంతా గాయాలు.. ఏం జరిగింది?
Updated : May 18, 2022
బుధవారం ఉదయం ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఓ పిక్చర్తో ఆమె అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె తన తొలి వెబ్ సిరీస్ 'సిటాడెల్' షూటింగ్లో ఉంది. ముఖమంతా గాయాలతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె, "పనిచేసేటప్పుడు మీకు కూడా ఇలాంటిది ఎప్పుడైనా ఎదురైందా?" అని ఫ్యాన్స్ను ప్రశ్నించింది. దాంతో సెట్స్ మీద నిజంగానే ఆమెకు దెబ్బలు తగిలాయని పలువురు ఫ్యాన్స్ నమ్మారు. కొంతమందేమో అది మేకప్ అని అభిప్రాయపడ్డారు.
ఆ పిక్చర్ను షేర్ చేసిన ప్రియాంక, “Did you have a tough day at work as well? #actorslife #citadel #adayinthelife @agbofilms @amazonstudios.” అంటూ దానికి కాప్షన్ రాసుకొచ్చింది. బ్లాక్ టాప్ ధరించి కనిపించిన ఆమె, కళ్లపైన బ్లూ కలర్ వేసుకొంది. ఆమె షేర్ చేసిన ఫొటోలో ముక్కు కిందా, పెదాలు, గడ్డం మీదా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.
అది చూసి, ఒక అభిమాని, "ఏం జరిగింది, మీరు బాగానే ఉన్నారా?" అని ప్రశ్నిస్తే, మరో అభిమాని, "జాగ్రత్త. ప్రతి రోజూ ఓ కొత్త అనుభవం" అని రాసుకొచ్చాడు. ఇంకో అభిమాని అయితే, "ఓ మై గాడ్, ఒక్క సెకను నీకు నిజంగానే దెబ్బలు తగిలాయని అనుకున్నా" అని రాశాడు. ఇదంతా ప్రియాంక క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల వచ్చిన తంటా.
'సిటాడెల్' విషయానికి వస్తే, అది అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రుస్సో బ్రదర్స్ క్రియేట్ చేస్తోన్న వెబ్ సిరీస్. అందులో రిచర్డ్ మాడెన్ కూడా నటిస్తున్నాడు.