LATEST NEWS
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 సీజన్‌లో 70 లీగ్ మ్యాచ్‌లు ఆడింది.  అంతే కాదు  ఇప్పటివరకు 11 సెంచరీల  స్కోరు చేసింది.  1,066 సిక్సర్‌ల వరకు నమోదయ్యాయి.    ఐపీఎల్ 2023లో ఈ సీజన్‌లో 11 సెంచరీలు ఉన్నాయి.  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా సెంచరీలు చేసిన నాలుగో బ్యాటర్‌గా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఐపిఎల్  2023 లీగ్ దశలో ఇప్పటివరకు 11 సెంచరీలను సాధించింది,  ఐపిఎల్  2023 రికార్డు స్థాయిలో రికార్డులను నమోదు చేసింది. ఐపిఎల్  2023లో 35 సార్లు మొత్తం 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయబడింది.ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 సార్లు 200 పరుగుల ఛేజ్ చేసింది. ఐపీఎల్ 2023లో ఇప్పటికే రికార్డు స్థాయిలో 1,066 సిక్సర్లు కొట్టారు, ఈ సీజన్‌లో మొత్తంగా అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయి. గతంలో 2022 సీజన్‌లో 1062 సిక్సర్లు కొట్టి, జాబితాలో రెండో స్థానంలో ఉంది. 
మరి కొన్ని గంటలలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా అంటే న్యాయనిపుణులు ఔననే అంటున్నారు. ఏపీ సీఎం జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసిన నేపథ్యంలో  అవినాష్ కు ముందస్తు బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమేనని అంటున్నాయి. అయితే గత శనివారం (మే 27) తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ ముందస్తు బెయిలు పిటీషన్ పై వాదనలు విన్న అనంతరం తీర్పును బుధవారం(మే31)కు వాయిదా వేసింది. అంతకు ముందు వరుసగా రెండు రోజుల పాటు అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు, డాక్టర్ సునీత తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు సుదీర్ఘవాదనలు వినిపించాయి. ఆ తరువాత హైకోర్టు వేకేషన్ బెంచ్ తీర్పు బుధవారం(మే 31)కి వాయిదా వేసింది. 31వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ దర్యాప్తు తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. అవినాష్ కు అరెస్టు కాకుండా ఎటువంటి రక్షణా లేకున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది? అవినాష్ ఫోన్ ను ఇంత వరకూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. కాగా అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై వాదనలు క్లోజ్ గా ఫాలో అయిన న్యాయ నిపుణులు ఆయనకు యాంటిసిపేటరీ బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమని చెబుతున్నాయి.  అసలు మొదటి నుంచీ సీబీఐ వర్సెస్ అవినాష్ టామ్ అండ్ జెర్రీని తలపించేలాగే సాగింది. సీబీఐ విచారణకు పిలిచినప్పుడల్లా ఏవేవో కారణాలు చెప్పి వాయిదాలు తీసుకుంటారు. ఇక హాజరు కాక తప్పదన్న పరిస్థితి వస్తే కోర్టులను ఆశ్రయిస్తారు. గత జనవరి నుంచీ ఈ గేమ్ ఇలా సాగుతూనే ఉంది. ఇక చివరి అంకానికి వచ్చేసింది. అవినాష్ ముందస్తు బెయిలుపై తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు బుధవారం (మే 31) తెరపడుతుంది. 
తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల ఎవరు వదిలిన బాణమంటూ అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటన్నిటినీ దాటుకుని ఆమె చాలా దూరం నడిచేశారు. అయినా ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె టార్గెట్ ఎవరు అన్న విషయంలో ఇంత కాలం స్పష్టత రాలేదు. అయితే ఇటీవల స్వల్ప వ్యవధిలో ఆమె కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండు సార్లు భేటీ అయిన తరువాత ఆమె అడుగులు ఎటు? ఆమె టార్గెట్ ఎవరు అన్న విషయంలో మెల్లిమెల్లిగా ఒక క్లారిటీ వస్తోంది.  ఇప్పటి వరకూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత, ఆయన కుటుంబ సభ్యులూ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ జాతీయ స్థాయి రాజకీయ పార్టీలను ఆకర్షించిన షర్మిల తన అసలు టార్గెట్ మాత్రం సొంత సోదరుడు, ఏపీ సీఎం జగన్ రెడ్డే అన్న విషయాన్ని డీకేతో భేటీ సందర్భంగా ఆయనకు తేటతెల్లం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని నడపడానికి అవసరమైన వనరుల సమీకరణలో ఆమెకు సోదరుడు జగన్ అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారన్నది ఆమె ఆగ్రహంగా చెబుతున్నారు.  ఇక షర్మిల అవసరాన్ని ఆసరాగా చేసుకుని డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించి షర్మిల కాంగ్రెస్ లో చేరే విధంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. అసలు విషయమేమిటంటే.. డీకే ప్రతిపాదనకు షర్మిల ఇప్పటి వరకూ ఔనని కానీ.. కాదని కానీ బదులివ్వలేదని అంటున్నారు. ఆమె ఇంత కాలం తన కార్యక్షేత్రం  తెలంగాణ అని భావించి అక్కడ పని చేసి  కొంత వరకూ సక్సెస్ అయ్యారు. ఆమెను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి ఫోన్ చేసి పరామర్శించారు.  అయితే తెలంగాణలో పార్టీ  నడిపేందుకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ అండతో ఏపీలో కూడా కాలుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తెలంగాణ పార్టీని ఏపీలో విస్తరించే అవకాశం లేనందున ఆమె తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అదే  జరిగితే.. వైఎస్ జీవించి ఉన్నంత కాలం అంటిపెట్టుకుని ఉన్న పార్టీలోకి ఆయన వారసురాలిగా ఆమె అడుగుపెట్టినట్లౌతుంది. అదీ గాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి రెండు ప్రాంతాలలోనూ అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో   అపార ప్రజాభిమానం ఉంది. ఇక ఏపీలో జగన్ విషయానికి వస్తే తండ్రి  మరణం తరువాత కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నా  కుటుంబం మొత్తం  ఆయన వెన్నంటి నిలిచి  వైఎస్ రాజకీయ వారసుడు జగనే అని చాటారు. అయితే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీరుతో కుటుంబం మొత్తం ఆయనకు దూరమైంది. మరీ ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్ వ్యవహరించిన తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి వత్తాసుగా  వివేకా కుమార్తెను ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలతో  కుటుంబం జగన్ కు దూరమైంది. చివరకు సొంత తల్లి, చెల్లి కూడా ఆయనకు దూరం జరిగారు. అదే సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తు తీరుపై డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయపోరాటానికి షర్మిల మద్దతుగా నిలవడంతో వైఎస్ కుటుంబం  షర్మిల వెనుక  నిలవడంతో జగన్ ఒంటరి అయ్యారు. ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తే వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా జగన్ గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే  ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తునకే అడుగడుగునా అడ్డుపడుతూ,  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం, తాజాగా ఈ కేసులో  సీబీఐ జగన్ పేరును కూడా ప్రస్తావించడంతో  ఆయన ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో బాబాయ్ హత్య కేసులో న్యాయం కోసం నిలబడిన వివేకా కుమార్తె సునీతకు అండగా నిలిచిన షర్మిల కనుక ఏపీ రాజకీయాలలో ప్రవేశిస్తే జగన్ కు రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఆస్తుల వ్యవహారంలోనే కాకుండా, రాజకీయంగా కూడా తనకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన సోదరుడు జగన్ పై ఆగ్రహంతో ఉన్న షర్మిల కాంగ్రెస్ ఆఫర్ ను అంగీకరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.   పార్టీని   విలీనం చేయడానికి అంగీకరిస్తే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు షర్మిలకు అప్పగించేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే సూత్ర ప్రాయంగా అంగీకరించిందని కూడా చెబుతున్నారు. అదే జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు, జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న బీజేపీకీ ఒకే సారి చెక్ పెట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ బలోపేతమౌతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద షర్మిల స్వల్ప వ్యవధిలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ ల  వెనుక కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉన్నారనీ, ఆమె సూచన మేరకే షర్మిలను కాంగ్రెస్ లోకి డీకే ఆహ్వానించారనీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 
అవును. తెలుగు దేశం పార్టీ మహానాడులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన, 2024 ఎన్నికల ముందస్తు మినీ  మేనిఫెస్టో అనేక మందిని ఆశ్చర్యపరిచింది. తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఆర్థిక సంస్కరణలకు పెట్టింది పేరుగా నిలిచారు. ఆర్థిక, విద్యుత్ సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు తెచ్చిన సంస్కరణల ఫలితంగానే, తెలుగు రాష్టాలకు, ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని  హైదరాబాద్  నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐటీ, ఫార్మా  హబ్ గా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇది ఎవరో అన్న మాట కాదు  స్వయంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కేటీఆర్ ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సత్యం. నిజం. చంద్రబాబు శ్రీకారం చుట్టిన సంస్కరణలే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఇంధనంగా  మారి ముందుకు నడిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా ప్రపంచం గుర్తిస్తోంది.  అవును. అప్పుడు అలా సంస్కరణలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు నాయుడు, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత వరాలు సహజంగానే, కొన్ని ప్రశ్నలను తెర మీదకు తెచ్చాయి. అలాగే, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరిట అమలు చేస్తున్న ఉచిత పథకాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయని విమర్శిస్తున్న తెలుగు దేశం పార్టీ,  ఉచిత పథకాలను, మినీ మేనిఫెస్టోలో, గ్యారెంటీలుగా చూపడం ఏమిటనే ప్రశ్నతో పాటుగా, మరి కొన్ని ప్రశ్నలు విమర్శలువినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో తో కలవర పాటుకు గురైన వైసీపీ మంత్రులు, మాజీలు మినీ మేనిఫెస్టో పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతాన్ని తవ్వి తీసి, ప్రజలు తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మరని సంబర పడిపోతున్నారు.జగన్ రెడ్డికి  ఉన్న ‘గొప్ప’ విశ్వసనీయత చంద్రబాబాబుకు లేదని తమలో తాము సంబుర పడిపోతున్నారు.  అయితే  అధికార వైసీపీ చేస్తున్న పసలేని రాజకీయ విమర్శలను పక్కన పెడితే, తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు సంస్కరణలకు పెద్ద పీట వేసింది నిజం. అలాగే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరిట అమలు చేస్తున్న ఉచిత పథకాలను విమర్శించిందీ నిజమే. కానీ  తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పేదలకు పనికొచ్చే, సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. నిజానికి  ఈరోజు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా అమలవుతున్న సబ్సిడీ బియ్యం (రూపాయికి కిలో బిబియ్యం) పథకానికి శ్రీకారం చుట్టింది తెలుగు దేశం పార్టీ... అలాగే ఈ రోజున తెలుగు రాష్త్రాలు సహా వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న ఉచిత విద్యుత్, మహిళా సాధికరిత కోసం చేపట్టిన  అనేక సంక్షేమ పథకాలకు  గతంలో  తెలుగు దేశం ప్రభుత్వాలే శ్రీకారం చుట్టాయి.  అంతే కాదు, తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకుపోతే, వైసీపీ  జగన్ రెడ్డి అభివృద్ధిని పక్కకు నెట్టి ఆర్థిక ప్రగతిని పట్టాలు తప్పించారు. సంతుల్యత లోపించి రాష్ట ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. అప్పుల కుప్పగా మారిపోయింది. అప్పు పుడితే తప్ప పూట గడవని పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జారిపోయింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా ఇవ్వలేనంతగా రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారిపోయింది. అదలా ఉంటే  వైసీపీ ప్రభుత్వం  ఓ వంక  సంక్షేమం పేరిట ప్రజలను మభ్య పెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ, మరో వంక మద్యం ధరలు మొదలు విద్యుత్, బస్సు చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయింది. జనం నడ్డి విరిచింది.  చివరాఖరుకు చెత్తమీదా పన్నేసింది. ఈ  చేత్తో ఇచ్చి ఆ చేత్తో అంతకు పదింతలు గుజుకుంది. ఆలా గుంజుకున్న సొమ్ములను అవినీతి ఖాతాలో వేసుకుని నేతలు ఆస్తులు పెంచుకున్నారు. రాష్టాన్ని అప్పుల ఊబిలోకి, జనాలను మద్యం మత్తులోకి  వైసీపీ సర్కార్ నెట్టి వేసింది..నిజానికి తెలుగు దేశం తప్పు పట్టింది, వైసీపీ ప్రభుత్వం సక్షేమం చాటున సాగిస్తున్న అవినీతి బాగోతాన్నే కాని, సంక్షేమ పథకాలను కాదు. అయితే  వైసేపీ నేతలు తెలుగు దేశం మినీ మేనిఫెస్టో ను విమర్శిస్తున్నారు. చంద్రబాబు, తమ నాయకుడు జగన్ రెడ్డిని ఫాలో అవుతున్నారని సంబర పడి పోతున్నారు. కానీ  ప్రజలు సంక్షేమం, సంక్షోభం మధ్య ఉన్న సన్నని  పొరను గుర్తిస్తున్నారు. జగన్ రెడ్డి కుట్రలను గ్రహించారు. అందుకే  చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నారు. అందుకే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. గోల చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా, చంద్రబాబు నాయుడు తమ అనుభవం అంతా రంగరించి సంధించిన మినీ మేనిఫెస్టో ... వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని విధాలుగా ఆలోచించడం సహజం. అయితే ఆ ప్రయత్నం మరీ సుదీర్ఘంగా సాగితే చులకన అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు దాదాపు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధినేతను ధిక్కరించి బహిష్కరణ వేటుకు గురి కావడం అంటే మామూలు విషయం కాదు. మాజీ మంత్రి ఈటల తరువాత అంత సాహసోపేతంగా వ్యవహరించిన నేతలుగా పొంగులేటి, జూపల్లి గుర్తింపు పొందారు. ముఖ్యంగా పొంగులేటి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు దక్క నివ్వనంటూ భీషణ ప్రతిజ్ణ చేసి సంచలనం సృష్టించారు. అదేదో రాజకీయ ప్రకటన కాదనీ, నిజంగానే పొంగులేటికి జిల్లాపై అంత పట్టుందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తరువాత అటా..ఇటా ఎటువైపు అన్న విషయంలో పొంగులేటి, జూపల్లి చేస్తున్న కాలహననం వారిని ప్రజలలో పలుచన చేస్తున్నది. ఇరువురూ కడా అటా ఇటా అంటే కాంగ్రెస్ లోకా, బీజేపీలోకా అన్నది తేల్చుకోలేక సతమతమౌతున్నారు. ఆ రెండు పార్టీలూ కూడా సిద్ధాంత పరంగా పరస్పర విరుద్ధమైనవి. కానీ వీరిరువురూ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టలలో ప్రస్తుతం ఏ పార్టీ బలంగా ఉందో అందులో చేరాలని భావిస్తున్నా.. తమ రాజకీయ అనుభవాన్నంతా రంగరించి పరిశీలిస్తున్నా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే  వారు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైందంటూ రెండు మూడు ముహూర్తాలు కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత తూచ్ కాదు కాదు, బీజేపీలో చేరుతున్నారంటూ కూడా ముహూర్తాలు ఖరారు అయ్యాయని ప్రచారం జరిగింది. ఆ తరువాత రెండూ కాదు.. వీరిరువురూ కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అనీ, ఆ పేరుపై రిజిస్ట్రేషన్ కు కూడా దరఖాస్తు చేయడం అయిపోయిందనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా పొంగులేటి, జూపల్లిలు ఈటలతో రహస్య భేటీ జరపడంతో కమలం గూటికే చేరుతున్నారని అంతా భావించారు. తీరా భేటీ తరువాత ఈటల చేసిన వ్యాఖ్యలు వారు కమలానికి దూరమేనని తేటతెల్లం చేశాయి. వారిరువురూ తనకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఈటల సెటైర్ వేయడంతో రహస్య భేటీ  పొంగులేటి, జూపల్లి కమలం గూటికి ప్రవేశించడానికి  మార్గం సుగమం చేయడం అటుంచి.. ఆ దారులనే మూసేసిందని తేటతె ల్లమైపోయింది.    ఇక వారి ముందున్నది రెండే మార్గాలు కాంగ్రెస్ లో చేరడం.. లేదా ప్రచారంలో ఉన్న విధంగా సొంత కుంపటి పెట్టుకోవడం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం చేస్తే.. వారి మద్దతు దారులు తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer under the direction of stylish maker Meher Ramesh is one of the most-awaited movies. Mounted on a huge canvas with a high budget by Ramabrahmam Sunkara, the movie is in the last leg of shooting.    The makers recently completed a song shoot in Switzerland on Chiranjeevi and Tamannaah Bhatia. As promised, the film's promotions begin soon. First of all, they will start the musical journey.   Mahati Swara Sagar scored a chartbuster album for the movie. Some talkie part, climax shoot, and a huge set song are pending. The entire shoot of the movie will be wrapped up by the end of June. The film will release in August.   This commercial entertainer produced by Anil Sunkara’s AK Entertainments will have emotions and other elements in the right proportions.   Tamannaah is playing the leading lady, while Keerthy Suresh will be seen as Chiranjeevi’s sister. Talented actor Sushanth is essaying a lover boy role.   Dudley cranks the camera, wherein Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the production designer. Story supervision by Satyanand and dialogues by Thirupathi Mamidala. Kishore Garikipati is the executive producer.
God Of Masses Natasimha Nandamuri Balakrishna and blockbuster director Anil Ravipudi’s much-awaited mass and action entertainer NBK108 will feature several prominent actors in vital roles.   This prestigious project in the deadly combination is being produced on a grand scale by Sahu Garapati and Harish Peddi under the banner of Shine Screens banner.   Kajal Aggarwal is the female lead in the movie and Sreeleela, Arjun Rampal will be seen in a crucial role. Now the latest rumours on social media about NBK's character name and film title going viral.   NBK’s character name in the film is said to be Bhagavath Kesari and the movie’s title is expected to be the same with the tag line "I Don't Care". This title looks surprising and unique and it needs to be seen how the people will respond to it.   S Thaman composes tunes for NBK108, while C Ram Prasad takes care of cinematography. Tammi Raju is the editor and Rajeevan is the production designer. V Venkat will choreograph the action part.   NBK108 is scheduled for its theatrical release for Vijayadasami (Dussehra).
Many heroes in Tollywood have entered into other ventures. We know that Icon StAAr Allu Arjun will be having a AAA Asian Allu Arjun cinemas in Ameerpet. The latest news is that the theatre is almost finished.   Now Allu Arjun will have a grand opening of his new multiplex with Prabhas’s Adipurush film on June 16th. Allu Arjun bought the Satyam theater in Ameerpet and built this theater in his place.    Reportedly, a statue of Allu Arjun will be placed at the entrance of the multiplex. It is also being said that they will play a 100 plus LED screens at different corners of the multiplex premise on the launch day, which is now just 2 weeks away.
Pan Indian star Prabhas is currently taking a leap in terms of career with consecutive films. One of the craziest project he is currently working on is huge sci-fi genre movie Project K.   Nag Ashwin is making this movie on a grand scale and is being produced by Ashwini Dutt under the banner of Vyjayanthi Movies. Santhosh Narayanan is composing the music for Project K, which is shooting at a fast pace.   Now there is a sensational news/report about the film has emerged, and it is creating waves across the social media that iconic actor Kamal Haasan will be a part of this movie.   It is being reported that the unit of Project K has approached none other than Ulaganayagan Kamal Haasan for a villain role in the movie. However, Kamal Haasan is yet to take the decision on this and an official confirmation on the same is awaited.   The film has already been completed to the extent of 70 percent and the famous VFX companies of Hollywood are providing visual effects for it. Project K is a working title, makers will announce the original title when the time is right.   The makers have already announced that the Project K movie will be released on January 12, 2024 in many theaters in many languages
The upcoming rural entertainer Pareshan is releasing on June 2nd. Thiruveer of 'Masooda' fame plays its male lead. It is presented by Rana Daggubati, is written and directed by Rupak Ronaldson. Pavani Karanam play the lead roles in the film that also stars Sai Prasanna, Arjun Krishna, Shruthi Riyan, Buddarakhan Ravi, Raju Bedigela and Muralidhar Goud.   The actor Thiruveer shared interesting things about the film today during media interaction. He said "I feel fortunate that the slangs I use in my movies suit me perfectly. They elevate my performance. 'Pareshan' is an out-and-out comedy where every single character is under pressure or anxious."   He added "Pareshan' is an out-and-out Telangana movie. Recently, we screened the movie for a group of audience in Vijaywada. They enjoyed the movie like anything. When Rana garu watched the movie at Ramanaidu Studios, he was laughing throughout. He enjoyed the movie and decided to present it."   Talking about the characters he said, "Many unfamiliar actors will find their footing after this movie. They will be remembered after their names in the movie. The names are funny and they will be etched in the minds of the audience."
The new Industry hit of Mollywood 2018 Movie is recently released in Telugu by Bunny Vas and continuing the sensation with decent collections and packed houses everywhere. The movie has collected around 5.47 crores in just 4 days and it is still going strong.   The film's box office performance was decent on a busy working day and the IPL finale. It was rock steady against all odds and the movie's performance improving today.    Meanwhile, the movie is already into the profits zone for the makers. The makers didn't had much time for the promotions and released suddenly but the word of mouth gave a solid boost for the film especially during weekend.   Telugu audience who support content rich films is supporting this film which is based on devastating Kerala floods in 2018. Audience rave reviews and positive word of mouth increasing the film's performance.   The film is directed by Jude Anthany Joseph has ensemble star cast Tovino Thomas, Indrans, Kunchacko Boban, Aparna Balamurali, Vineeth Sreenivasan, Asif Ali, Lal, Narain, Tanvi Ram, Sshivada, Kalaiyarasan, Aju Varghese, Siddique, and Joy Mathew, Sudheesh in prominent roles.
Talented actor Allu Sirish was last seen in the Urvashivo Rakshasivo movie which bagged a decent status at the ticket windows. Now, he is all set to entertain the movie buffs with another interesting project. Yesterday the actor shared a pre look in which a teddy bear was seen standing beside actor.   Now today on the eve of actors birthday, the makers unveiled the Intriguing first look. The vibrant poster features Allu Sirish with a gun, while a teddy bear is seen standing beside him in a fighting position. The film titled as Buddy and the intriguing poster raised curiosity on the film.   But the netizens saying that this film is actually remake of Tamil film Teddy starring Arya and Sayyesha. It is known that this project intially announced with Sandeep Kishan and for few unexplainable reasons he was out of the project. We have to wait for few more days to know that this film is a remake or not.   The film is produced by ace producer KE Gnanavel Raja under Studio Green banner. It is directed by Sam Anton while Gayathri Bharadwaj and Gokul playing key roles in the film. The film's music is scored by sensational Hip Hop Tamizha while editing is handled by Ruben. More details about this exciting project will be announced soon.
గతేడాది 'ఊర్వశివో రాక్షసివో' చిత్రంతో ఆకట్టుకున్న అల్లు శిరీష్ ఈ ఏడాది 'బడ్డీ' అనే చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకుడు. నేడు(మే 30) శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ని విడుదల చేశారు. నిజానికి 'బడ్డీ' చిత్రాన్ని గతంలో సందీప్ కిషన్ హీరోగా ప్రకటించి, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి సందీప్ ప్లేస్ లోకి శిరీష్ ఎంట్రీ ఇచ్చాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు శిరీష్. తాజాగా విడుదలైన 'బడ్డీ' ఫస్ట్ లుక్ కూడా మరో విభిన్న చిత్రమనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉంది. ఇక ఈ మూవీ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. 'బడ్డీ'ని చంపడానికి ఒకతను కోట్ల రూపాయలు ఆఫర్ చేయడం, రౌడీ గ్యాంగ్ నుంచి దానిని రక్షించడానికి శిరీష్ రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలతో.. శిరీష్, బడ్డీ పాత్రలను పరిచయం చేసిన తీరు మెప్పించింది. ఇక గ్లింప్స్ చివరిలో 'కేజీఎఫ్', 'విక్రమ్' సినిమాల రేంజ్ లో బడ్డీ మిషన్ గన్ తో షూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, స్టూడియో గ్రీన్ బ్యానర్ తమిళ్ లో ఆర్య హీరోగా 'టెడ్డీ' అనే చిత్రాన్ని రూపొందించింది. 2021 లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు శిరీష్ నటిస్తున్న ఈ 'బడ్డీ' సినిమా, ఆ 'టెడ్డీ'కి సీక్వెల్ అని తెలుస్తోంది.
'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4 గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని జూన్ 2 న, ఉదయం 11:39 కి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. 'కొత్త బంగారు లోకం'(2008) అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(2013) రూపంలో మరో ఘన విజయాన్ని అందుకున్న ఆయన.. దాని తర్వాత చేసిన 'ముకుంద'(2014) తోనూ పరవాలేదు అనిపించుకున్నారు. అనంతరం 'బ్రహ్మోత్సవం'(2016) రూపంలో ఘోర పరాజయం ఎదురుకావడంతో, కొత్త సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. 2021 లో అడ్డాల డైరెక్ట్ చేసిన 'నారప్ప' రీమేక్ ఫిల్మ్ కావడం, పైగా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ఆయనకు ఆ సినిమా వల్ల ఆశించినంత ప్రయోజనం చేకూరలేదు. అయితే ఇప్పుడు ఆయన స్ట్రాంగ్ బ్యాక్ తో లెక్క సరిచేయాలని చూస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను వదిలారు. గాయాలతో ఉన్న చేతిని చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ మెప్పిస్తోంది. అదే సమయంలో పోస్టర్ మీద 'ఇది పీకే మొదటి సినిమా' అని సూచించేలా #PK1 అని రాసుంది. తెలుగు ప్రేక్షకులకు పీకే అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు, మరి ఈ సినిమాలో నటిస్తున్న కొత్త పీకే ఎవరు? అని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈ కొత్త పీకే ఎవరో కాదు.. నిర్మాత మిర్యాల రవీందర్ బావమరిది(భార్య సోదరుడు) అని సమాచారం. ఈ విషయాన్ని జూన్ 2 న అధికారికంగా వెల్లడించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11 న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇటీవల ఈ సినిమా దసరాకు వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న 'భోళా శంకర్' మూవీ ప్రమోషన్స్ కి పాటలతో శ్రీకారం చుడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'భోళా మేనియా త్వరలోనే ప్రారంభం కానుంది' అంటూ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. బ్యాక్ గ్రౌండ్ లో జాతర వాతావరణం తలపిస్తుండగా, చిరంజీవి అటువైపు తిరిగి వెనుక జేబుల్లో చేతులు పెట్టుకొని ఉన్న డ్యాన్సింగ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఇది మూవీలో ఇంట్రో సాంగ్ అనిపిస్తోంది. అలాగే పోస్టర్ లో సినిమాని ఆగస్టు 11 న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 'భోళా శంకర్' వాయిదా అనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి.. 'భోళా శంకర్'తో ఆ జోరుని కొనసాగిస్తారేమో చూడాలి.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి. జీవితంలో చాలామందికి ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. ప్రపంచ జనాభాలో నూటికి 80% మంది ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్కు గురి అవుతుంటారు. ప్రపంచం అభివృద్ధి చెందేకొద్ది, మనుషులు అన్ని రకాల అవసరాలను చాలా సులభంగా తీర్చుకునే కొద్దీ మనుషులకు మానసిక వ్యాధులు ఎక్కువ అవుతూ ఉన్నాయి.  చాలామంది మానసిక సమస్యతో బాధపడుతున్నా సరే అది మానసిక వ్యాధి అని వారు గుర్తించరు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో దీన్ని గుర్తించేవారు లేరు. డిప్రెషన్ తో బాధపడే వారిని పొగరు మనుషులుగా ముద్ర వేస్తుంటారు చాలా మంది. డిప్రెషన్కు గురి అయినవారు ఏదో ఒక బాధతో, దుఃఖంతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు. ఏదో చిరాకు, ఇష్టమైన వాటి మీద కూడా అయిష్టంగా వుంటారు. అంతేకాకుండా వారు చెయ్యగలిగిన వాటిని చెయ్యలేరు, నా వల్లకాదు అన్న ఆలోచనలు కలిగివుంటారు. అందుకే వారు ఏ పనికి ముందుకు రారు, చేయమని ఎవరైనా చెప్పినా కాదని చెబుతారు. ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు. కానీ ఇదంతా వారి నాటకం అని, పని తప్పించుకోవడానికి వారు అలా చేస్తున్నారని చుట్టూ ఉన్నవారు చెబుతారు.  జీవితానికి అవసరం అయిన ఎన్నో విషయాలపై మనం ఇంట్రస్టును కోల్పోతుంటాము. మనకు ఆనందాన్నిచ్చే విషయాలపై ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు, పిక్నిక్ లు, మొదలైన వాటిపట్ల కూడా ఆసక్తి కోల్పోతారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి నిద్రపట్టకపోవడం, నిద్రపట్టినా కలతనిద్రే తప్ప సుఖనిద్ర లభించదు. అంతేకాకుండా నిద్రలో ఏదో భయంకరమైన కలలు రావటం జరుగుతుంది. మరణం గురించిన ఆలోచనలు తరుచుగా వస్తూ వుంటాయి. జీవితం మీద విరక్తి వస్తుంది. బతకటం కంటే చావటం మేలు అనుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితాన్ని భారంగా భావిస్తారు.  మార్పు అన్నది జీవితంలో అత్యంత సహజమైన విషయం. కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అయితే అందరూ ఆ మార్పులను తట్టుకోలేరు. జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం అన్నాక సుఖదుఃఖాలు రెండూ వుంటాయి. దుఃఖం కలిగినప్పుడు తల్లడిల్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోకుండా జరిగిన అనుభవించిన సుఖాల గురించి, మంచిని గురించి ఆలోచించాలి. అప్పుడు మనం దుఃఖం గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళకుండా వుండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మార్పులకు అనుగుణంగా మనం మారాలే తప్ప బాధ పడకూడదు. ఏ మార్పు జరిగినా అది మన మంచికే అన్న భావనను కలిగి ఉండాలి. అప్పుడే మానసికంగా ఎంతో కొంత ఓదార్పు లభిస్తుంది. మనం మనకి సంబంధించిన వారు ఎవరైనా దూరమైపోతున్నప్పుడు చాలా బాధపడుతుంటాం. కొంతమంది ఈ చిన్న విషయానికి డిప్రెషన్ కు గురి కావటం జరుగుతుంది. మనుషులు దూరమైనంత మాత్రాన వారిలో మార్పు సంభవించదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి.  ఎంతదూరంగా ఉంటే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది అన్న సత్యాన్ని ఆలోచించినట్లయితే డిప్రెషన్కు టాటా చెప్పవచ్చు.                                        ◆నిశ్శబ్ద.
మనిషి జీవితంలో విజయం అనేది స్థాయిని పెంచుతుంది.  సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం మొదలైనవి సంపాదించి పెడుతుంది. విజయం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అయితే విజయం సాధించిన వ్యక్తికి మాత్రం కష్టం అంటే ఏమిటి?? కష్టం ఎలా ఉంటుంది?? కష్టం తరువాత విజయం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?? విజయ సూత్రం ఏంటి?? ఇలాంటి విషయాలు తెలిసి ఉంటాయి.  ఒక విజేతను "మీ విజయరహస్యం ఏమిటి?" అని ప్రశ్నించినప్పుడు  "నేను జీవితంలో  విజయాలు సాధించడానికి కారణం నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే హాజరు కావటమే” అని అన్నాడట! మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడేతత్వం ఉన్నా చేసే పని ఇంకా మిగిలుందే అని కాలాన్ని పట్టుకుని ఆపలేడు. నిరంతర ప్రవాహిని లాగా కాలం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే చేసే పనిపట్ల అవగాహన పెంచుకుంటే కాలాన్ని ఆదా చేయవచ్చు. నిర్ణీత సమయంలో పని పూర్తి కావాలంటే ఆ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం ఒకటే మార్గం. చేసే పని గురించి అవగాహన పెంచుకుంటే సమయాన్ని ఆదా చేసే కళ తెలుస్తుంది. సమయాన్ని ఆదా చేయడం కూడా ఒక కళనా అని అనిపిస్తుందేమో!!  కాలాన్ని ఆదా చేయడమనే కళ!! మనం నిత్యం చేయవలసిన పనులను అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో రూపొందించుకోవాలి. ఈ ప్రక్రియనే కాలాన్ని ఆదాచేసే కళ అంటారు. క్రమపద్ధతిలో రూపొందించుకోవడం అంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన పనులను సమయ ప్రణాళిక వేసుకుని ఒక పట్టిక రూపొందించుకోవడం. అయితే ఇలా రూపాందించుకోవటంతోనే సమేక్మ్ ఆదా అయిపోదు. రూపొందించుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆచరించినప్పుడే సరైన ఫలితం. దక్కుతుంది.   “నిన్న జరిగిన దానిని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఈ రోజు కూడా వృధా చేసుకోవటం నిరర్ధకం. నిన్నటికంటే ఈరోజు మనిషిలో ఆలోచనాపరంగా బుద్ధి వికాసం కలగాలి. అలా కలగకపోతే  మన జీవితంలో మరొక రోజు వ్యర్ధమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అనేది మన ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది.  గడిచి పోయిన క్షణాలు తిరిగిరావు, అలాంటప్పుడు గడిచిపోయిన కాలంలో ఎలాంటి బాధపెట్టే విషయాలు ఉన్నా వాటిని తలచుకుంటూ బాధపడకూడదు.  ఏపుగా పెరిగిన పైరుని కోయకపోతే దాని పరమార్ధం దెబ్బ తింటుంది. అలాగే వికసించిన పూలను కోసుకోకపోతే వాటి ప్రయోజనమే దెబ్బ తింటుంది. అదే విధంగా వయస్సులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఎందుకంటే ఆలస్యమయితే కాలం మన చేతిలో ఉండదు. గడిచిపోయే ప్రతి నిమిషం తన విలువను గుర్తుచేసే సందర్భాలు భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఆ సందర్భాలలో " అయ్యో!! అప్పుడు ఆ కాలాన్ని అలా వృధా చేయకపోతే ఇప్పుడు ఇలా కలలను కోల్పోయి ఉండను కదా!!" అనుకునేలా ఉంటుంది మనసు పరిస్థితి. ఈ సెకను, ఈ నిమిషం, ఈ రోజు నాది. నేను ఏ పనినైనా చేయగలను అనుకునేవాడిదే ఈ ప్రపంచం. కాలానికి ఎదురుపడి ప్రయాణం చేసేవాడే విజేత. ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది అనే విషయం మర్చిపోకూడదు. కాలాన్ని సరిగా అర్ధం చేసుకున్నవాడే జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు.  మనం నిమిషాల గురించి జాగ్రత్త పడితే గంటలు అవే జాగ్రత్త పడతాయి. రూపాయలను పొదుపుచేస్తే వేలు అయినట్టు, కాలం ఆ విధంగానే పొదుపు అవుతుంది. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఎప్పుడూ పరాజితులుగా మిగిలిపోతారు. మరికొందరు పరాజయానికి, కాలం వృధా అవ్వడానికి సాకులు వెతికి వాటిని చూపిస్తుంటారు. వాటివల్ల ఇతరులను నమ్మించగలరేమో కానీ అలా తనని తాను మభ్యపెట్టుకోవడం తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఇతరులకంటే అలా సాకులు చెప్పేవారికే నష్టం. అందుకే   ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని ఆదా చేసే కళ నేర్చుకుంటే జీవితంలో విజేతలుగా గుర్తించబడతారు.                                        ◆నిశ్శబ్ద.
తప్పు చేసిన వారిని, నొప్పించిన వారిని పెద్ద మనసుతో క్షమించడం ఎంతో గొప్ప విషయం. ఇది ఇప్పుడు చెబుతున్న మాట కూడా కాదు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుండి పెద్దలు చెబుతున్న మాట. ఇంకా చెప్పాలంటే మన పురాణాల నుండే ఈ క్షమాగుణాన్ని నలుగురికి తెలిసేలా చేయడం మొదలయ్యింది.  ప్రతి మనిషి తన జీవితంలో ఎవరో ఒకరి వల్ల బాధపడుతూ ఉంటాడు. ఆ బాధలో నుండి కోపం పుట్టుకొస్తుంది. కోపంలో నుండి ఆ మనిషి మీద వ్యతిరేక భావం పుడుతుంది. ఆ వ్యతిరేక భావం కాస్తా శత్రుత్వంగా మారిపోతుంది. ఇలా ఒక నిర్దిష్ట దశలలో మనుషుల మధ్య ఏర్పడే గొడవలు, లేదా చిన్న చిన్న తగాదాలు క్రమంగా శత్రుత్వం వరకు దారి తీయడం అంటే మనుషుల మధ్య అర్థం చేసుకునే గుణం తక్కువ ఉందనే చెప్పాలి. మాటా మాటా కారాదు తూటా!! ఇంట్లో సాధారణంగా భార్యాభర్తలు, ఇంకా పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక విషయంలో కచ్చితంగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ ఎలాంటిదంటే ఒకరు ఎడ్డేమంటే ఇంకొకరు తెడ్డెమంటూ ఉంటారు. ఎవరో ఒకరు మాత్రమే కాస్తో కూస్తో ఆలోచించే మైండ్ సెట్ కలిగి ఉంటారు. అవతలి వాళ్ళ మొండితనం తెలిసి వాళ్ళతో ఇక వాదులాట ఎందుకు అని వదిలేయాలి. నిజానికి ఇలా వాధించే వాళ్ళతో, మనల్ని నొప్పించిన వాళ్ళను క్షమించేసేయ్యడం అంటే మనం తగ్గిపోవడం కాదు, అవతలి వాళ్లకి భయపడటం అసలే కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.  కాబట్టే ఏదైనా తప్పు జరిగినప్పుడో, గొడవ జరిగినప్పుడో మాటకు మాట పెంచుకుంటూ పోవడం కంటే దాన్ని మొదలులో తుంచేయడం మంచిది. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు!! తప్పులు చేయడం అందరూ చేస్తారు. ఆ తప్పులను అందరూ గమనిస్తారు. అయితే ఆ తప్పులను అదేపనిగా ఎత్తిచూపేవారు కొందరు ఉంటారు. మూర్ఖుల లిస్ట్ లో ధీమాగా నిలబడదగిన వాళ్ళు వీళ్ళు. ఎప్పుడూ ఇతరులను చూస్తూ వాళ్ళ తప్పులు గురించి మాట్లాడటమే కానీ తాము చేస్తున్న తప్పులను విశ్లేషించుకునే తీరికా ఓపిక అసలు ఉండవు వీళ్ళకు.  ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే బుర్ర పాడు అవ్వడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. క్షమించడానికి కావాలి కాసింత ఓర్పు, నేర్పు!! నిజంగా నిజమే. ఎదుటి వారు నొప్పిస్తే దాన్ని మనసులో ఎంతో లోతుకు తీసుకుని వాళ్ళను తిరిగి ఏమి అనకుండా క్షమించడం గొప్ప విషయం. ఎదుటి వారి ప్రవర్తనను భరించడానికి, ఆ తప్పు తాలూకూ నష్టం మానసికం అయినా, ఆర్థికపరం అయినా దాన్ని భరించడానికి ఎంతో ఓర్పు కావాలి. తరువాత ఆ తప్పు తాలూకూ విషయాలు మళ్లీ మళ్లీ ప్రస్తావనకు తీసుకురాకుండా, అదే వ్యక్తులతో ఆ విషయం గురించి ఎలాంటి చర్చా లేకుండా గడపడమనే నేర్పు కూడా కలిగి ఉండాలి. విలువ కోల్పోకూడదు!! కొందరుంటారు. తప్పు చేసిన వాళ్ళను క్షమిస్తారు. అయితే ఆ ఎదుటి వారికి ఆ క్షమాగుణం గొప్పదనం అర్ధం కాదు. వాళ్ళేదో తోపు అయినట్టు. వాళ్లను ఏమీ అనలేమనే కారణంతో క్షమించిన వాళ్ళను తక్కువ చేసి చూస్తుంటారు. దీని పలితం ఎలా ఉంటుంది అంటే మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తూ, ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తారు వాళ్ళు. కేవలం క్షమాగుణం వల్ల ఇలా సఫర్ అవ్వడం చాలా మంది జీవితాలలో గమనించవచ్చు కూడా. అందుకే ఆ క్షమాగుణానికి కూడా ఒక పరిధి అంటూ ఉండాలి. మాటి మాటికి తప్పులు చేస్తూ వాళ్ళు, వాళ్ళను క్షమిస్తూ ఎదుటివాళ్ళు ఇలా అయితే ఆ తప్పులు చేసేవాళ్ళు ఎప్పటికీ ఒక మంచి మార్గాన్ని తెలుసుకోలేరు మరియు దాన్ని ఫాలో అవ్వలేరు. అందుకే క్షమించడం గొప్ప విషయం.  క్షమించేవారిని గౌరవించకపోతే ఎంతో పెద్ద తప్పు చేసినట్టే.  ◆ వెంకటేష్ పువ్వాడ  
ఏవైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళన పడటం సహజం. ఆ ఆందోళన కాలక్రమేణా నయమవుతుంది. కానీ , కారణాలు పెద్దగా లేకున్నా తరచుగా ఆందోళన చెందేవారు చాలామంది ఉంటున్నారు. ఇలా ఆందోళన చెందేవారు ఈ ఆందోళన కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా,  శారీరక ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఒత్తిడి నియంత్రణ చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.   ఆందోళన చాలా కాలంగా ఉంటూ అది అదుపులోకి రాకపోతే ఈ సమస్యకు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఆందోళన-ఒత్తిడి సమస్యలు నాడీ వ్యవస్థ, మధుమేహం నుండి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్కవగా ఆలోచించడం, ఆందోళన చెందడం ఈ కింది సమస్యలున్నవారితో ప్రమాదం పెంచుతాయి.  మధుమేహ వ్యాధిగ్రస్తులలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది..  దేనిగురించైనా ఆందోళన చెందుతున్నప్పుడు, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఒత్తిడి మధుమేహానికి కారణం కాదని పరిశోధకులు కనుగొన్నారు, కానీ అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కళ్ళ నుండి గుండె జబ్బులు, నరాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. నరాల మీద దుష్ప్రభావాలు..  నరాలు మెసేజింగ్ నెట్‌వర్క్‌ల లాగా పనిచేస్తాయి. ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల  హృదయ స్పందన రేటు, శ్వాసను ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపించవచ్చు. చాలా కాలం పాటు అనియంత్రిత ఒత్తిడి స్థాయిలు రక్తంలో చక్కెర, నరాల సమస్యలకు దారితీస్తాయి.  ఒత్తిడి-డిప్రెషన్‌తో బాధపడేవారిలో స్ట్రోక్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. గుండె ఆరోగ్యంపై ప్రభావం.. ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది  రక్తపోటు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ, ఆలోచిస్తూ ఉంటే , శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్  గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇలా పదే పదే జరిగితే,  రక్తనాళాలు ఎర్రబడి, తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలే కాదు.  మొత్తం శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.                                         ◆నిశ్శబ్ద.
ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఇది విజృంభించింది. ఇప్పుడు యువత కూడా దీని బారిన పడే పరిస్థితి నెలకొంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసిక-శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొకదాని పై ఉంటుంది.  డిప్రెషన్‌ను కేవలం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యగా మాత్రమే పరిగణించరాదని డిప్రెషన్‌పై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు తెలిపారు. అనేక రకాల శారీరక దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఉంటుంది. డిప్రెషన్‌కు గురైనట్లయితే, మైగ్రేన్, గుండె జబ్బులు, రక్తపోటు,  రోగనిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య సంబంధం.. మైగ్రేన్ సాధారణ తలనొప్పి సమస్య అని అనుకుంటే పొరపాటే.. మైగ్రేన్ సైకోసోమాటిక్ డిజార్డర్ అని పరిశోధకులు కనుగొన్నారు. మానసిక రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు. ఇవి కూడా శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు మైగ్రేన్‌  వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని, మైగ్రేన్‌ ఉన్నవారు ఐదు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని తేలింది.  మైగ్రేన్ వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం..  మైగ్రేన్, డిప్రెషన్, స్ట్రెస్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. వాస్తవానికి, మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. మైగ్రేన్ ప్రారంభమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత చాలా మందిలో డిప్రెషన్ మొదలవుతుంది. మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ జన్యుపరమైనవి కూడా కావచ్చు. డిప్రెషన్ ఉన్న రోగులలో మైగ్రేన్ రిస్క్ మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ తక్కువ స్థాయి 5-హైడ్రాక్సీట్రిప్టమైన్ (5-HT) లేదా సెరోటోనిన్ రిసెప్టర్లకు సంబంధించినవి. సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్లు కూడా జన్యు మార్పులకు కారణం అవుతాయి. మైగ్రేన్ అనేది జీవిత నాణ్యతను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది ఇతర  మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  అదేవిధంగా, మైగ్రేన్, డిప్రెషన్ ఉన్నవారిలో కాలక్రమేణా సైకోసోమాటిక్ డిజార్డర్‌గా మార్పు చెందుతాయి.  ఇవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ ఒక్కటి వచ్చినా మరొకటి మెల్లిగా డవలప్ అవుతుంది. కాబట్టి వీటికి దూరం ఉండటం అన్ని విధాలా మంచిది.                                    ◆నిశ్శబ్ద.
పచ్చిపాలు తాగితే చాలా లాభాలు సురక్షితం అనికొందరు.  కాదు కాదు పచ్చిపాలు ఆరోగ్యానికి హానికరం అని ఇంకొందరు అంటున్నారు మరి అందులో నిజం ఏది? అనితేలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల లోకి వెళ్తే మనం ప్రతిరోజూ పాలు ఎదో రూపం లో వాడుతూ ఉంటాము.మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు పాలు లాభదాయకంగా ఉంటుంది. అని అందరూ అంగీకరిస్తారు.మరి మీరు తేల్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పచ్చిపాలు లాభదాయకమని లేదాపేస్టూ రైజ్డ పాలు లాభమా అన్నది ప్రశ్న. మీరు రోజూ పాలు తాగుతారా ?అయితే ఇది చదవడం అత్యవసరం.పాలు మనం ప్రతిరోజూ ఎదోరూపం లో వాడతాము.అసలు పాలు లేకుండా రోజు గడవడం కష్టం.అంటే పాలు లేకుండా ఉండడం కొంచం కష్టం.మీ ఇమ్యునిటీ నిపెంచడం దగ్గరనుంచి ఎముకలు,పళ్ళు బలంగా ఉండేందుకు మెటాబాలిజం పెంచేందుకు పాలు దోహదం  చేస్తాయని అనడంలో సందేహం లేదు. అయితే మీరు పాలను సరైన పద్దతిలో తాగాకుంటే పాలలో ఉండే సంపూర్ణ పోషకాలు లేకుండా మీ శరీరానికి ఉపయోగ పడదు. పచ్చిపాలు తాగ వచ్చా? ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదు మనశరీరానికి పచ్చిపాల లో ఉన్న పోషక తాత్వాలను అందిస్తుంది.ఎందుకంటే గడ్డితిని ఆవులు లేదా గేదెల నుండే పాలు తీస్తారు.ఈ విధంగా పాలు ఎంజయిం ఆరోగ్యం ప్రోటీన్లతో సంపూర్ణంగా ఉంటుంది.ఆయితే కొన్నిరకాల కీటకాలు ,జీవాణువులను చంపాలంటే పాలను ఒకక్రమ పద్దతిలో సాగుతాయి.ఈ కారణంగా ఎలర్జీ తో పాటు గుండె సంబందిత రోగాలు రావచ్చు. పాల వల్ల లాభాలు... కొన్ని ఏళ్లుగా పాలు తాగడం వల్ల కలిగే లాభాలు చెపుతూనే ఉన్నాము.నష్టాలు గురించి తక్కువే చెప్పుకుంటాము పాలలో కాల్షియం,పోస్ఫరస్,విటమిన్ బి,పొటాషియం,విటమిన్ డి,వంటి పోషక తత్వాలు సంపూర్ణంగా ఉంటాయి.దీనితోపాటు ప్రోటీన్ అధికసంఖ్యలో లభిస్తుంది.మన ఎముకలను పటిష్టంగా ఉంచేందుకు పాలు దోహదం చేస్తాయి.కణాలు టిష్యులు రీజేనేవేషన్,లేదా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.మరి మీరు సరైన పద్దతిలో పాలు తీసుకుంటున్నారా.? పాలు తాగాలంటే సరైన పద్ధతి ఏమిటి? పాలను వినియోగించాలంటే మిల్క్ షేక్,స్మూదీ,టీ,మిటాయి, ఎక్కడైనా ఏరూపంలో ఐనా వాడతారు.ప్రతివ్యక్తి పాలను వాడే సరైన పద్ధతి వేరు వేరుగా ఉంటుంది. కాని చాలామందికి పచ్చి పాలు  తాగడం ఇష్ట పడతారు.ఇది ఏ మాత్రం కలుషితం లేనిదని పవిత్ర మైనవిగా భావిస్తారు. పచ్చిపాలను తాగడం మంచిదేనా? సురక్షితమా? కొన్ని ఏళ్ళుగా ఒక పరంపరగా పచ్చిపాలను తాగడం ఆరోగ్యానికి మంచిదని ధర్మంగా భావిస్తారు.వీటిలో ఏ రకమైన పదార్ధాలు తీయకుండా నేరుగా తాగడం కాలాను గుణంగా ఆలోచనలు పెరిగి మార్పులు వచ్చాయి. ఇప్పుడు పచ్చిపాలు తాగడం సురక్షితం కాదని నిర్ధారించారు. పచ్చి పాలు తాగితే ఏమౌతుంది? పచ్చి పాలు తాగడం వల్ల హానికలగ వచ్చు ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా లిస్టేరియా,ఈ కోలి,కాక్సిఎలా ,సాల్మనేల్ల,కేండి లో బెక్టర్,యార్సినియా,ఆరోగ్యం పంచెంద్రియాల పై సమస్యలు సృష్టించ వచ్చు. ఒక వేళ ఆయా ఆవులు గేదేలలో శరీరం లో ఏమైనా వైరస్ సంక్రమించి ఉంటె సమస్యలు వస్తాయి. గర్భవతులు పాలిచ్చే తల్లుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.