ఏమయినప్పటికీ ప్రపంచంలో జీవించడమంటే _కేవలం తిని తాగడమే కాదని గరవయ్య గ్రహించాడు. సుదర్శనం చావు అతడికి తగుడుపై విరక్తిని మించి భయాన్ని పెంచింది. చావు అతడికి తాగుడుపై విరక్తిని మించి భయాన్ని పెంచింది. ఊరివారి గౌరవవాభిమానాలు _ అతడి బాధ్యతలను పెంచాయి. క్రమంగా తగ్గిస్తూ వచ్చిన తాగుడు నతడినిప్పుడు పూర్తిగా మానేశాడు తరుచుగా రాజారావుని కలసి విజ్ఞాన విషయాలు చర్చించడమే కాక_ ఊళ్ళో రాజకీయాలమీద కూడా ఆసక్తి చూపిస్తున్నాడు.
27
లీలాసుందరి, జగ్గారావులనూ __ వారి బృందాన్నీ పోలీసులగప్పగించేక __ రమాకాంతానికూళ్ళో కొత్త సమస్యలేర్పడ్డాయి. జగ్గారావునాయన ఇంట్లో పెట్టుకున్నాడు. పైగా లీలాసుందరికి బస కూడా తనే ఏరపాటు చేశాడు.
ఆయనేమి కారణాలు చెప్పిన ఈ విషయమై అందరూ తలోరకంగా అనుకోసాగారు. రాజారావువంటి పెద్దమనిశులపీడను శాశ్వతంగా వదిలించుకోవాలని __ లీలాసుందరితో లాలూచీ పడ్డాడని చాలామందిఅనుకోసాగారు.
ఈ విషయమై రెండు పక్షాలేర్పడి ఊళ్ళో చర్చలు మొదలయ్యాయి. లీలాసుందరి రమాకాంత౦ మనిషయితే ముందు చలమయ్యను కాక నర్సన్న అంతం చూడాలనుకునేదని __ రమాకాంతం పక్షం వాళ్ళన్నారు. అవతలి పక్ష౦వాళ్ళు దానికి బదులుగా __ "చలమయ్యకు రమాకాంతాన్ని పైకి తెచ్చాడు . ఇద్దరికీ ఒకరి రహస్యలోకరికి బాగా తెలుసు. కాబట్టి చలమయ్య పోవడమే ఆయనకు మంచిదన్నారు.
ఇందులో నిజా నిజాల ప్రసక్తిలాగున్నా _ రమాకాంతానికిఊరి మేలుకంటే _స్వప్రయోజనమే ముఖ్యమన్న పేరు వచ్చింది అందుకు నర్సన్న కూడా కష్టపడి ప్రచారం చేయించాడు. ఇది అతడికేన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న అవకాశం. అతడు వివిధ ప్రచారాలతో ఊరిని రమాకాంతానికి వ్యతిరేకంగా తయారుచేయసాగాడు. పరిస్థితుల౦దుకు అనుకూలంగా ఉండడంతో రమాకాంత౦ అసుయాయులు కూడా ఆ ప్రచారాలను నమ్మసాగారు. ఇనుమును వేడిమీదేదెబ్బ కొట్టాలన్న ఉద్దేశ్యంతో ఎన్నికలకింకా నాలుగయిదు నెలల వ్యవధి ఉన్నప్పటికీ _ నర్సన్న ఎన్నికల ప్రచారంలో దిగేశాడు.
ప్రజలందరూ అడిగేదాకా రోడ్డ్లు వేయించకపోవడం' అనుమానితులకి ఆశ్రయమివ్వడం _ విషయాల్లో నర్సన్న రమాకాంతాన్ని తీవ్రంగా విమర్శించి __ "మన గ్రామానికి బడహ్యతగల ప్రెసిడెంటు కావాలిప్పుడు. రమాకాంతానికి ప్రెసిడెంటుయ్యే అర్హత లేదు. నాకో అవకాశమిచ్చి చూడండి నా సేవ మీకు నచ్చకపొతే _ మీరు చెప్పకుండానే నేను పదవిలోంచి తప్పుకుంటాను __" అంటూ అతడు గ్రామ ప్రజలకు నోరూరించే బాగ్ధనాలు కూడా చేశాడు.
నర్సన్న జోరునాపడానికి రమాకాంతమూ ఎన్నికల ప్రచారంలో దిగాడు. కానీ ఒకే ఊపులో నర్సన్న పలుకుబడి పెరిగిపోతోంది. రమాకాంతానిది తరిగిపోతోంది.
పదవికి బాగా అలవాటుపడి, రమాకాంతమూ ఎన్నికల ప్రచారంలో దిగాడు. కానీ ఒకే ఊపులో నర్సన్న పలుకుబడి పెరిగిపోతోంది. రమాకాంతానిది తరిగిపోతోంది.
పదవికి బాగా అలవాటుపడి, పదవి కోసం ఏమయినా చేయగల రమాకాంతానికి భవిష్యత్తు అంధకారంగా కనబడిభయపెడుతోంది. అది లీలాసుందరి, జగ్గారావుల సృష్టి!
రమాకాంతం దురదృష్ట౦ అంతటిలో ఆగలేదు. లీలా సుందరి, జగ్గరావులు చేసింది చాలదన్నట్లు _ ఆ ఊరి రాజకీయాల్లోకి మూడో మనిషిగా __ సాక్ష్యాత్తూ భగవంతుడే ప్రవేశించాడు.
28
నారయ్య ఆ గ్రామ ప్రజల్లో అతి సామాన్యుడు. అతడికి చదువులేదు. రెండెకరాల పోలముంది. అది దున్నుకుమ్తూ తన బ్రతుకేదో బ్రతుకుతున్నడు. ఊళ్ళోని గొడవలతో అతడికి నిమిత్తంలేదు కానీ, నర్సన్నకూ , అతడికీ దూరపు చుట్టరికముంది అందువల్ల ఎన్నికల్లో అతడేప్పుడూ నర్సన్నకే ఓటువేస్తాడు తప్పితే, రమాకాంతమంటే విరోధ భావం లేదు. ఉన్నా లేకున్న ఊరివారెవ్వరికీ అతడి భావాల పట్ల ఆసక్తి లేదు.
అలాంటి దిప్పుడూళ్ళో నారయ్య పేరు మ్రోగి పోతోంది.
నారయ్యకు దేవుడు పూనాడు. ఆ దేవుడు కూడా సాక్ష్యాత్తూ శ్రీ వెంకటేశ్వరుడు.
నారయ్య విషయమై ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి.
తొలిసారి నారయ్యకు దేవుడు పూనినప్పుడతమో అంటూంటే పిచ్చివాగుడేమో అనుకుని ఒకడు __ " ఏమిట్రా నారయ్యా __ ఆ పిచ్చివాగుడేమో అనుకుని ఒకడు __ "ఏమిట్రా నారయ్యా __ అపిచ్చివాగుడు __ నోర్మూసుకోక ...." అన్నాట్ట. అంతే _ ఆ అన్నవాడి నోరు వెంటనే పడిపోయిందట . వెంకతెశ్వరస్వామిని అపరాధం క్షమించమని మనసారా వేడుకునే దాకా అతడికి నోరు తిరిగి రాలేదుట.
ఆ తర్వాత వారంరోజుల్లో నారయ్యకు దేవుడు పూనుతున్నట్లు __ ఊరంతా అంగీకరీంచారు. ఆ దేవుడు ఆ స్తమానూపూనడు. తనకు తీరుబడి చూసుకుని తోచినపుడు పూనుతూంటాడు పూనకం లేనప్పుడు నారయ్య మామూలుగా ఉంటాడు. కానీ పూనకంలో లేనప్పుడు నారయ్య మామూలుగా ఉంటాడు. కానీ పూనకంలో అతడు దివ్యబోధనలు చేస్తాడు. ఆ సమయంలో అతడి విజ్ఞానం _ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
నారయ్యను దేవుడు పూనుతున్నాడడడాని కీ బోధన లోక్కటే కారణం కాదు. అతడానేక మహిమలు చేసి చూపి స్తున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ అతడు గాలిలోంచి విభూతి తీసిస్తూంటాడు. ఎదుటివాళ్ళ మనసులోని భావాలు యదాతధంగా చదివిచెప్పి __ వారి సందేహాలకు సమధానాలిస్తూంటాడు.
ఒకసారి పూనకంలో మాట్లాడుతుండగా నారయ్య చేతుల్లోకి శంఖం, చక్రం, వచ్చాయి. ఆ దృశ్యం చూసి భక్తబృందం పరవశంతో ఊగిపోయింది. అతడు దేవుడి మనిషనడానికదో పెద్ద నిదర్శనం.
గతంలో నారయ్యేక్కడు౦టేనేం __ ఇప్పుడతడు నలుగురికీ కావలసిన దేవుడు. అతడికి ప్రత్యెక స్థలం ఏర్పాటు చేయాలనీ ఊళ్ళో అనుకున్నారు. అప్పుడు నర్సన్న ముందుకువచ్చి __ తనకున్న ఓ స్థలాన్ని దైవదత్తం చేసి అక్కడో పాక వేయించి _ నారయ్యకు తాత్కాలిక నివసాస్థానం కల్పించాడు. నారయ్యకు తనతో ఉన్న బందుత్వాన్ని పురస్కారించుకుని అతడా చొరవచేశాడు.
నారయ్యకు పూనకం రాగానే అతడ్ని ఎల్లవేళలా వంతులవారీగా కనిపెట్టుకుని ఉండే భక్తులు కొందరు _ అతడి నీపాకలోనికి తీసుకుని వస్తారు. ఆ పాకలో అప్పట్నుంచీ భజన ప్రారంభమవుతుంది.
ఆ పాకకు నర్సన్నగారి పాక అనే పేరు రావడం విషయంలో నర్సన్న జాగ్రత్తపడ్డాడు. ఆ విధంగా దేవుడితో పాటు నర్సన్న పేరు కూడా నలుగురి నోళ్ళలోనూ సలగసాగింది. "నర్సన్నగారి పాకలో నారయ్య దేవుడని ....." అంతా అంటూంటారు. అయితే చాలామంది నారయ్య నిప్పుడా పేరుతో వ్యవహరించడాని కిష్టపడడంలేదు. చాలా మంది అతడిని __ "స్వామి" __ అంటున్నారు. కాస్తో కూస్తో కవిత్వం వచ్చిన ప్రతి ఒక్కడూ నారయ్యమీద పద్యాలు, పాటలు రాయసాగారు.