అర్జునుడికి దివ్య అశ్వములిచ్చిన అంగారపర్ణుడు
Angaraparna
అంగారపర్ణుడు ఒక గంధర్వుడు.
ద్రౌపది స్వయంవరం విషయం తెలుసుకుని పాండవులు ద్రుపదరాజు వద్దకు వెళ్ళే సమయంలో వారిని అడ్డగించి తనతో యుద్ధం చేసి గెలవమని సవాలు చేస్తాడు అంగారపర్ణుడు.
అప్పుడు అర్జునుడు యుద్ధం చేసి, అతడిని ఓడిస్తాడు.
యుద్ధంలో ఓడిపోయిన అంగారపర్ణుడు, పాండవులతో మిత్రత్వం వహించి, అర్జునుడికి జాక్షుసి అనే విద్యను ఉపదేశించి, దివ్య అశ్వములనిస్తాడు.
అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు, తన రథం ద్వంసం కావడంతో మరో రథం సృష్టించుకుని అప్పటి నుంచి చిత్రరాధుడనే పేరుతో స్థిరపడతాడు.