LATEST NEWS
అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో స్పందించింది. తాజాగా ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీకి ఓ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. కృష్ణంరాజుపై తీసుకున్న చర్యల నివేదికను మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఇక ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాలలో సాక్షి కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆ ఆందోళనలు చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.  అంతే కాకుండా ఆందోళనలు చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు, సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సజ్జల వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరరెడ్డి సజ్జలను రాజకీయ పిపీలకంగా అభివర్ణించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల నీచాతినీచమైన వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలను రాష్ట్రబహిష్కరణ చేయాలని డిమాండ్ చే శారు. సజ్జల జగన్ గుమాస్తా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని బంట్రోతు అంటూ, రాజకీయ విమర్శలు చేసే అర్హత సజ్జలకు లేదని పేర్కొన్నారు.   తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా సజ్జలపై విమర్శల వర్షం కురిపించారు. సజ్జలను ఓ మూర్ఖుడిగా అభివర్ణించిన షర్మిల ఇదే సజ్జల కుమారుడు వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా అనుచిత విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. జగన్ కు సొంత చెల్లి అంటేనే మర్యాద లేదు.. ఇక రాష్ట్రంలో మహిళలపట్ల గౌరవం ఉంటుందని ఎలా భావిస్తామని ప్రశ్నించారు.   
బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా సాగుతున్నారు. తాజాగా బస్ పాస్ చార్జీలను పెంచు తూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఆందోళనకు దిగారు. బస్ చార్జీల పెంపునకు నిరసనగా ఆమె మంగళవారం (జూన్ 10) బస్ భవన్ బంద్ నకు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జెండాలు లేకుండా ఆమె జనజాగృతి కార్యకర్తలతో  బస్ భవన్ ముట్టడికి బయలు దేరారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో  పోలీసులు కవితను అదుపులోనికి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆందోళనలో పాల్గొన్న జనజాగృతి కార్యకర్తలను కూడా అదుపులోనికి తీసుకున్నారు.   పెంచిన బస్ చార్జీలను తగ్గించే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని కవిత ఈ సందర్భంగా చెప్పారు. అంతకు ముందు కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బస్ చార్జీల పెంపును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సంస్కృతి, భాష, యాస కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి పోన్ లో మాట్లాడేటప్పుడు హలో అనడానికి బదులుగా జై తెలంగాణ అనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనడానికి మనసురావడం లేద న్నారు.బోనాల సందర్భంగా ప్రతి బోనం పైనా జై తెలంగాణ నినాదం రాయాలని పిలుపునిచ్చారు. 
తిరుమలలో అగ్రిప్రమాదం సంభవించింది. అయితే అటవీ ప్రాంతంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.   శిలాతోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. భక్తుల సమాచారంతో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.   అగ్నిప్రమాాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. అటవీ ప్రాంతంలో స్వల్పంగా మంటలు చెలరేగాయనీ, వెంటనే అదుపు చేశామని అగ్నిమాపక సిబ్బంది తెలిసారు. టీటీడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదని తెలిపారు. 
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు..  ఒక్క మంత్రి వర్గ విస్తరణ విషయంలోనే కాదు..  ఆయన అసంతృప్తికి ఇంకా చాలా  కారణాలున్నాయి.  అయితే.. రోజు రోజుకు అధిష్టానంతో పెరుగతున్న దూరం విషయంలో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పెరుగతున్న దూరం విషయంలో ఆయన కొంత మధన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఇటీవల చేసిన కొన్ని  వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.   ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో .. ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతేదూరం అవుతుంది. అందులో సందేహం లేదు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మధ్య పెరుగుతున్న దూరం గురించిన చర్చ సందర్భంగా ఒక పెద్దాయన నోటి నుంచి వచ్చిన మాట ఇది. నిజమే.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంత కంఫర్టబుల్ గా లేరు. ఇంకా స్పష్టంగా చెప్పలంటే.. కష్ట నష్టాలను తట్టుకుని తెచ్చుకున్న ముఖ్యమంత్రి కుర్చీలో కంఫర్టబుల్ గా కూర్చో లేకపోతున్నారు. అవును.. రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు గమినిస్తే.. ఇటు  పార్టీలో,  అటు ప్రభుత్వ వ్యవహారాల్లో  ఆయన సంతృప్తిగా లేరని.. ఒక విధమైన ఉక్క పోతను అనుభవిస్తున్నారని అపిస్తోందని అంటున్నారు.   అవును..  ముఖ్యమంత్రి కంఫర్టబుల్ గా లేరన్న విషయం ఎవరో చెప్పడం కాదు..  ఆయన మాటల్లోనే ఆ ధ్వని స్పష్టంగానే వినిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో  జరుగుతోంది.  ముఖ్యంగా కొద్ది రోజుల కిందట హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆత్మకథ,  ప్రజల కథే ..నా ఆత్మ కథ   పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి అసౌకర్యానికి అద్దం పడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మోదీ బడిలో, చంద్రబాబు కాలేజీలో చదువుకుని,రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నాను అంటూ చేసిన వ్యాఖ్య ఆయనలోని అసంతృప్తిని ప్రతిబింబించేలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అంటూ.. ముఖ్యమంత్రి పదవిని  కొలువుగా పేర్కొనడంలో ఏదో నిగూఢ అర్థం,  కనిపించని బాధ దాగుందని అంటున్నారు.   అయితే.. రేవంత్ రెడ్డిలో ఉన్న అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్కుంటున్నట్లు చెపుతున్న అవమానాల విషయాన్ని పక్కన పెడితే.. దత్తాత్రేయ ఆత్మ కథ ఆవిష్కరణ సభలో ఆయన తమ పూర్వాశ్రమ సంబంధాలను నెమరవేసుకోవడం వెనక ఏదో కథ ఉందనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. నిజానికి,రేవంత్ రెడ్డి బీజేపీ వేదిక మీద ప్రసంగించడం, ఆ వేదిక మీద నుంచే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో తనుకున్న పూర్వ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం అలాగే.. దత్తాత్రేయ మొదలు కిషన్ రెడ్డి వరకు అనేక మంది బీజేపీ నాయకులతో తనకున్న సన్నిహిత పరిచయం గురించి బహిరంగ వేదిక నుంచి ప్రస్తావించడం ఇదే మొదటి సారి కాదు.  గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు , ఆత్మ కథ, ‘ఉనిక’ ఆవిష్కరణ సభలోనూ రేవంత్ రెడ్డి బీజేపీ, బీజేపీ నాయకులతోనే కాదు, సంఘ్ (ఆర్ఎస్ఎస్) పెద్దలతో సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీని, అయన సమక్షంలోనే బడేభాయ్‌ అని సంబోదించారు. అయితే.. అప్పటికీ, ఇప్పటికీ  ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కొంత తేడా ఉందనీ.. అప్పట్లో  రాహుల్ ప్రస్తావన చేయని రేవంత్ రెడ్డి ఈసారి,  తాను రాహుల్ గాంధీ వద్ద కొలువు చేస్తున్నాని అన్నారు. అంటే..  తనకు స్వయం నిర్ణయాధికారం లేదనీ చెప్పకనే చెప్పారు. అలాగే..  కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డీ తానూ కలిస్తే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పడు ఈ వ్యాఖ్యలే   రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా.. బీజేపీ నేతలు, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్యపక్షాల నాయకులు పాల్గొన్న సభలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి పాల్గొనడమే విశేషం అనుకునుటే, రేవంత్‌రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి,చేసిన వ్యాఖ్యలు,  అనుమానస్పదంగా ఉన్నాయని అంటున్నారు.  బీజేపీ నేతలను ఇంతలా ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి పాకులాడటం వెనుక ఆంతర్యమేంటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్‌గాంధీ దగ్గర  ఉద్యోగం  చేస్తున్నా అని బీజేపీ వేదికపై చెప్పడం ద్వారా..  రేవంత్ రెడ్డి  ఎవరికీ ఎలాంటి సంకేతం ఇచ్చారనే చర్చ నడుస్తోంది. అన్నీ కలిసొస్తే మీతో కలిసి నడుస్తానని కమలదళానికి సంకేతం ఇచ్చారా?  ఉద్యోగ భద్రత, ఉద్యోగ సంతృప్తి లేక పోతే..  రాహుల్ దగ్గర చేస్తున్న ఉద్యోగం వదిలేస్తాననే  సంకేతం కాంగ్రెస్‌ పెద్దలకు ఇచ్చారా..  అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే..  ఈ చర్చకు ముగింపు మాత్రం ఇప్పట్లో ఉండదని అంటున్నారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ( జూన్ 9) హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను తొలుత  విజయవాడకు, ఆ తర్వాత గుంటూరు రూరల్ నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంగళవారం (జూన్ 10)  గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు  ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కొమ్మినేనిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.   రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీనియర్ జర్నలిస్టు  కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. జగన్ సొంత మీడియాలో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్ధించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కొమ్మినేనిని అరెస్టు చేసిన పోలీసులు కృష్ణంరాజు కోసం గాలిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే  కంగనా రనౌత్(Kangana Ranaut)2006లో 'అనురాగ్ బసు'(Anurag Basu)దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ స్టర్' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన కంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. తెలుగులో కూడా 'ప్రభాస్'(Prabhas)సరసన ఏక్ నిరంజన్ అనే చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలని పొందిన కంగనా, ఈ ఏడాది జనవరిలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(Indhira Gandhi) ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన 'ఎమర్జెన్సీ' పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించి ఇందిరా గాంధీ ని మురిపించిన కంగనా ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది.    రీసెంట్ గా మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ ని అతని భార్య సోనమ్ తన ప్రియుడు తో కలిసి చంపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కంగనా ఇనిస్టా వేదికగా స్పందిస్తు 'రాజా రఘువంశీ హత్య కేసు నన్ను ఎంతగానో  కదిలించింది. అసలు ఈ కేసుని  అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక మహిళ తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్ని తిరస్కరించదు. అలాంటి మహిళ ఇంత క్రూరమైన హత్యకు పథకం వేసి సుపారీ ఇవ్వగలదా. ఉదయం నుంచి ఈ విషయం నా మనసును కలచివేస్తోంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు, తలనొప్పిగా ఉంది. భర్త నుంచి  విడాకులు తీసుకొని ప్రియుడుతో పారిపోకుండా ఎంత క్రూరమైన పని చేసింది. అందుకే  మూర్ఖుల్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వారే సమాజానికి అత్యంత ప్రమాదకారులు. తెలివైన వ్యక్తులు తమ స్వార్థం కోసం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారేమో కానీ, తెలివితక్కువ వారు ఎలాంటి భయంకరమైన పనులకు పాల్పడతారో ఊహించలేం. దయచేసి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండంటూ ఇనిస్టా లో పోస్ట్ చేసింది.   కంగనా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరుఫున హిమాచల్ ప్రదేశ్ లోని 'మండి' లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్ మెంబర్ గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఫిజియోలాజికల్ థ్రిల్లర్ గా ఒక కొత్త మూవీని తెరకెక్కించే ఆలోచనలో కంగనా ఉంది.  
గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ 'నందమూరి బాలకృష్ణ'(Nandamuri Balakrishna)అప్ కమింగ్ మూవీ అఖండ 2 (Akhanda 2). బాలయ్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ కి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతుండటంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు మరింత పెరిగేలా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న అఖండ 2  టీజర్ రిలీజయ్యింది. నిమిషం పద్దెనిమిది సెకన్ల నిడివితో ఉన్న టీజర్, రిలీజైన ఇరవై నాలుగు గంటలోనే 22 మిలియన్ల వ్యూస్ పైగా రాబట్టింది. దీంతో రాబోయే రోజుల్లో యూట్యూబ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా అఖండ 2 దూసుకుపోవడం ఖాయమని అర్ధమవుతుంది. అభిమానులైతే ఇలాంటి రికార్డులు సృష్టించడం మా బాలయ్యకి మాత్రమే సాధ్యమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇక టీజర్ గురించి చెప్పుకుంటే అఘోర గెటప్ తో హిమాలయ పర్వతాల్లో ఉన్న బాలయ్య దుష్ట శక్తులతో పోరాడే విధానం, డైలాగ్స్,  థమన్ బిజిఎమ్ చూస్తుంటే రేపు థియేటర్స్ లో అఖండ పార్ట్ 1 కంటే రెట్టింపుగా బాక్స్ లు బద్దలు కాబోతున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది.  బాలయ్య  నట విశ్వరూపంలో దాగి ఉన్న మరో కొత్త కోణాన్ని కూడా చూపించబోతున్న అఖండ  2 కి బోయపాటి శ్రీను(BOyapati Srinu) దర్శకుడు. 14  రీల్స్ పతాకంపై గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన రామ్ ఆచంట, గోపినాద్ ఆచంట తో కలిసి బాలకృష చిన్న కూతురు తేజస్విని అఖండ 2 ని నిర్మిస్తుండగా  ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలని మేకర్స్ త్వరలోనే వెల్లడి చేసే అవకాశం ఉంది.    
Ustaad Bhagat Singh is one of the highly awaited films in recent times. Fans of the actor are believing that Harish Shankar and Pawan Kalyan combination will do the magic again like they did with Gabbar Singh. After finishing Hari Hara Veera Mallu and OG, the Power Star joined UBS sets, in Hyderabad, today. The shoot of the movie is currently taking place in Hyderabad. Alongside Pawan Kalyan, the film’s prominent cast is also participating in the shoot. Produced by Naveen Yerneni, and Y.Ravi Shankar on Mythri Movie Makers on a grand scale, the film stars Sreeleela playing the leading lady. The technical team includes Rockstar Devi Sri Prasad providing the music, Ayananka Bose handling the cinematography, Ujwal Kulkarni editing, and Ram-Laxman duo choreographing the action sequences. Anand Sai is the production designer. The screenplay is penned by K. Dasharath, with additional writing by C Chandra Mohan. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
God of Masses Nandamuri Balakrishna has been delivering blockbusters and the actor's collaboration with director Boyapati Srinu has always resulted in a cult blockbuster. Be it Simha, Legend or Akhanda, each one became bigger hit than the other. Now, Akhanda 2 teaser has been released for NBK's birthday.  The teaser created unscalable records in 24 hours among senior heroes of Telugu Cinema. It hit 22.33 Million views and 531.5k likes and it is being regarded as an all-time Top 5 among all Telugu films, too. NBK's get-up and trident scene are being talked about everywhere.  The anticipation for the film has been amplified by this teaser and it looks like NBK and Boyapati are going to smash all senior hero records at the BO too. NBK's walk and long hair, beard get-up have become talking points everywhere. Thaman's electrifying score is being appreciated along with production values and visuals.    Aadi Pinisetty is playing a prominent role and Samyuktha is playing the leading lady role. Raam Achanta and Gopi Achanta are producing the movie on a massive scale and it is releasing for Dussehra on 25th September, all over. M Tejaswini Nandamuri is presenting this prestigious film which is generating gigantic buzz. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Sekhar Kammula's Kuberaa starring Dhanush, King Nagarjuna, Rashmika Mandanna is set to release on 20th June. The movie produced by Sunil Narang, Pushkar Rammohan Rao is trying to create buzz and hype before the release. Today, makers have released Pippi Pippi Dum Dum song in Mumbai.  Speaking at the event, Dhanush reiterated that Sekhar Kammula kind of directors are rare to find and he is happy to be part of the film. He stated that within first 20 minutes of narration he accepted the movie. He teased Rashmika stating that even in a dump yard, she is happy and chill.  He further said that the movie has been a soul searching journey for him as he is playing a Beggar. He stated that it is hard to play such a role but Sekhar guided him through. Rashmika with her cute antics became the life of the event and stated that Nagarjuna's praises after watching the film is enough for her.  King Nagarjuna stated that he watched the movie and liked it. He called it as an intriguing plot and stated that it will touch everyone. He stated that he has been wondering what would be his next and happily agreed to be part of Sekhar Kammula's world. Devi Sri Prasad is composing music for the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
'ఛలో' తో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక(Rashmika Mandanna)అనతికాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. పుష్ప, పుష్ప 2 , యానిమల్, చావా వంటి యూనివర్సల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. దీంతో నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)తో కలిసి  చేస్తున్న 'కుబేర'(Kuberaa)పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల(Sekhar Kammula)దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర ఈ నెల 20 న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది. అందులో భాగంగా రీసెంట్ గా ముంబైలో 'పీపీ డుమ్, డుమ్' అనే సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, ధనుష్, రష్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతు ఒక డంప్ యార్డ్ లో నేను, రష్మిక సుమారు ఏడు గంటల పాటు షూటింగ్ లో పాల్గొన్నాం. అక్కడ అంత సేపు ఉన్నా, రష్మిక మాత్రం  నాకు వాసన రావటం లేదని చెప్పింది. మరి ఆమెకి ఏమైందో నాకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ధనుష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, రష్మిక కి నటన పట్ల ఉన్న కమిట్ మెంట్ ని అభిమానులతో పాటు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అనంతరం రష్మిక కూడా మాట్లాడుతు ఇంతకుముందు వేర్వేరు చిత్రాల్లో పోషించిన గీతాంజలి, శ్రీవల్లి, మహారాణి యేసుబాయి క్యారెక్టర్స్ లాగానే కుబేర లో పోషించిన క్యారక్టర్ కూడా అందరికి గుర్తుండిపోతుంది. ఒక్కో దర్శకుడిది ఒక్కో విజన్. దర్శకుడు చెప్పినట్టుగానే నేను నటిస్తాను. నాగార్జున, ధనుష్ తో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.    
  తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోస్తారు. ఆయన కెరీర్ లో ఎన్నో మరపురాని పాత్రలు ఉన్నాయి. ప్రస్తుతం కోట వయసు 82 సంవత్సరాలు. దాంతో సినిమాలు చెయ్యట్లేదు. బయట కూడా పెద్దగా కనిపించట్లేదు. అలాంటి కోట సడెన్ గా ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఆయన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో చూసిన అభిమానులు.. అసలు కోటకు ఏమైంది? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Kota Srinivasa Rao)   నటుడు, నిర్మాత బండ్ల గణేష్ "కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు, కోటా బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది." అంటూ తాజాగా కోట శ్రీనివాసరావుతో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ ఫొటోలో చాలా రోజులకు కోట కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కాళ్ళు చూసి ఆవేదన చెందుతున్నారు. కోట శ్రీనివాసరావు ఒక కాలికి కట్టు కట్టి ఉంది, మరో కాలేమో వాచినట్టుగా కనిపిస్తోంది. మనిషి కూడా చాలా బక్కగా కనిపిస్తున్నారు. "కోట గారికి ఏమైంది? ఆయనను ఇలా చూడటం బాధగా ఉంది. కోట గారు కోలుకొని మునుపటిలా ఉండాలని కోరుకుంటున్నాము." అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.    
మంచు విష్ణు(Manchu Vishnu)మోహన్ బాబు(Mohan Babu)ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన చిత్రం కన్నప్ప(Kannappa). ప్రభాస్(Prabhas),మోహన్ లాల్,(Mohan Lal)అక్షయ్ కుమార్(Akshay KUmar)వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న కన్నప్ప ఈ నెల 27 న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది. అందులో భాగంగా రీసెంట్ గా గుంటూరు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా, మరికొన్ని ఏరియాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా విష్ణు 'ఎక్స్'(X)వేదికగా  జూన్ 13 న ట్రైలర్ రిలీజ్ చేస్తునట్టుగా ప్రకటించాడు. కాకపోతే డేట్ ని ప్రకటించలేదు. మరి ఆ రోజు ఉదయం టైమ్ ని వెల్లడి చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా 13 న ట్రైలర్ రిలీజ్ కావడంతో  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ట్రైలర్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ మొదలయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో అయితే ట్రైలర్ లో  ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే కన్నప్ప లో ప్రభాస్ ని ప్రకటించినప్పటి దగ్గర్నుంచి  ప్రభాస్ క్యారక్టర్ కి సంబంధించిన ఒక పోస్టర్ ని మాత్రమే వదిలారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే చిన్నప్పటి టెన్షన్ కూడా అభిమానుల్లో మొదలయిందని చెప్పవచ్చు. విష్ణు సరసన ప్రీతిముకుందన్ హీరోయిన్ గా చేస్తుండగా మోహన్ బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహా భారతం ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడుగా వ్యవహరిస్తున్న కన్నప్ప మూవీ  పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.      
Dhanush and Simbu are always seen as rivals at the box office and even personal lives wise, too. They have been close friends before but issues in love life with Aishwarya Rajinikanth, said to have drawn a wedge between them. Recently, they both have hugged each other at a private ceremony.  Now, the actors could be seen together in Vada Chennai 2, says few reports. According to the reports, Simbu and Vetrimaaran are coming together for a film in the production of Kalaipuli Thanu. As Suriya and Vetrimaaran's Vaadivaasal is dropped, this movie is set to go on floors quite soon.    Few reports suggest that Simbu will be appearing in a character that is supposed to appear in Vada Chennai, originally, and written for him. Now, Vetrimaaran has developed a new script with that character in mind. Some are even suggesting that this character will appear in Vada Chennai 2, as well.  If these reports are to be believed then that the movie will be one of the biggest multi-starrers in current Tamil Cinema. We have to wait and see, if Vetrimaaran will bring out his own franchise with Vada Chennai characters. He already stated that he could make a spin-off on Rajan character played by director Ameer.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టేజియస్ట్ మల్టిస్టారర్ చిత్రాల్లో నాగార్జున(Nagarjuna),ధనుష్(Dhanush)ల   'కుబేర'(Kuberaa)కూడా ఒకటి. రష్మిక(Rashmika mandanna)హీరోయిన్ కాగా 'జిమ్ సర్బ్, దలిప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల(Sekhar Kammula)స్వీయ దర్శకత్వంలో సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు భారీ వ్యయంతో నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్(devi sri Prasad)సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇప్పటికే రిలీజైన నాగార్జున, ధనుష్, రష్మిక క్యారెక్టర్స్ కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దీంతో  కుబేర పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కుబేర ఈ నెల 20 న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారకంగా ప్రకటించారు. అంటే రిలీజ్ కి ఇంకో పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. కానీ  ఒక  సాంగ్ పెండింగ్ ఉండటంతో  పాటు రీ రికార్డింగ్  కంప్లీట్ కాలేదు. ఈ విషయాన్నీ నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడి చేసాడు. ప్రస్తుతం రీ రికార్డింగ్ అనేది సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల  వాళ్ళకి నచ్చేలా చాలా జాగ్రతగా ఆర్ ఆర్ ని సమకూర్చాలి. ఈ నేపథ్యంలో సాంగ్ తో పాటు ఆర్ ఆర్ ని దేవి కంప్లీట్ చెయ్యకపోవడంతో, నాగ్, ధనుష్ అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. చిత్ర యూనిట్ కూడా ఈ విషయంలో టెన్షన్ గా ఉన్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ కూడా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాల్సి ఉంది. మరి అప్పటికి  దేవి ఆర్ఆర్ ని  కంప్లీట్ చేస్తాడేమో చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ లు ఈ మధ్య కాలంలో రీ రికార్డు  లేట్ చెయ్యడంతో  రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సిన పరిస్థితి. కానీ కుబేర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్(Amazon prime)తో ఒప్పందం  చేసుకోవడం వల్ల రిలీజ్ డేట్ మార్చలేని పరిస్థితి. ఏది ఏమైనా  దేవి కారణంగా లాస్ట్ మినిట్ లో 'కుబేర'  టీంకి టెన్షన్ పెరిగిందని చెప్పవచ్చు.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఈ కాలంలో అమ్మాయిలు ఎంచక్కా చదువుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఒక నిర్ణీత వయసు రాగానే పెళ్లి అనేది సాధారణ విషయం. అయితే పెళ్లికి ముందు పుట్టింట్లో నాన్న దగ్గర గారాలు పోయి, అమ్మ దగ్గర బుజ్జగింపులు చేసి, అవ్వతాతల దగ్గర డిమాండ్ చేసి ఇలా అందరి దగ్గరా హాయిగా డబ్బు తీసుకుని అవసరాలు తీర్చేసుకుంటారు. కానీ పెళ్లి అయ్యాక అసలు సీన్ అన్నట్టు ఎంత కట్టుకున్నవాడు అయినా భర్త దగ్గర చెయ్యి చాపలేరు కొంతమంది అమ్మాయిలు. ఒకవేళ స్వేచ్ఛగా అడిగి తీసుకున్నా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మొగుళ్ల దగ్గర, అత్త మామల  దగ్గర ఏదో ఒక సంఘటనలు జరుగుతుంటాయి. ఫలితంగా ఒకానొక గిల్టీ ఫీలింగ్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఎంతో మంది అమ్మాయిల జీవితాలలో ఉంటాయి. అయితే అలా కాకుండా అమ్మాయిలు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అంటే దానికి పరిష్కారం అమ్మాయిలు తమకు తాము ఆర్థిక భరోసా ఇచ్చుకోవాలి. విద్యార్హత, ఉద్యోగం! ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ లు, బ్యాంకింగ్, పీజీ లు పిహెచ్డి లు ఇవి ఇవే పెద్ద ఉద్యోగాలని, వీటి ద్వారా ఆర్థిక భరోసా సాధ్యమని అనుకునేవాళ్ళు నిజంగా అమాయకులు అనుకోవాలి.  పదవ తరగతి నుండి డిగ్రీ వరకు కనీస స్థాయి విద్య చదివిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ సమాజంలో. అయితే వాళ్ళందరూ ఈ పోటీ ప్రపంచంలో ఈ విద్యార్హత పెద్దది కాదులే అనుకోవడమే పెద్ద వైఫల్యం. పడవ తరగతి మొదలు డిగ్రీ వరకు ఎన్నో అవకాశాలు ఉంటూనే ఉంటాయి. చెయ్యాల్సిందల్లా ప్రయత్నమే.  ప్రతి మనిషిలోనూ ఏదో ఒక విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని ఫాలో అవుతూ దాన్ని పదును పెట్టుకుంటూ అందులో నైపుణ్యం సంపాదిస్తే అందులోనే పైసలు సంపాదించొచ్చు. ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పడం నుండి దగ్గరలోనే ఉన్న షాప్స్, ఆఫీస్ లు, షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షోరూమ్స్ వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి చోట్ల పని చేసేవాళ్ళు సరైన వ్యక్తిత్వం కలిగి ఉండరు, తప్పు దారిలో వెళ్తారు లాంటి పిచ్చి ఆలోచనల వల్ల అమ్మాయిలు ధైర్యం చేయడం లేదు. సరైన వాక్చాతుర్యం, ఉన్నంతలో శుభ్రంగా ఉండటం, కాసింత ఓపిక ఉంటే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఏమీ చేయకుండా ఉండటం కంటే ఏదో ఒకటి అయినా చేయడం ఉత్తమం కదా!! ఈ ఉద్యోగాలలో వచ్చే సంపాదనలో కనీసం 40-50% డబ్బును అమ్మాయిలు జాగ్రత్త చేసుకోగలిగితే గొప్ప ఆర్థిక భరోసా ఉంటుంది. జీవితంలో ధైర్యం దానికదే వస్తుంది. విభిన్న మార్గాలు! చదువుతో సంబంధం లేని మార్గాలు కూడా బోలెడు ఉన్నాయి. మొబైల్, కెమెరా గురించి కాస్త అవగాహన పెంచుకుంటే వంటిట్లో వండర్స్ చేసే మహిళలు యూట్యూబ్ లో అదరగొట్టేస్తారు. కిచెన్ చానల్స్ ను స్టార్ట్ చేసి దిగ్విజయంగా నడుపుతూ లక్షలు సంపాదిస్తున్న మహిళలే నిదర్శనం మరి. వాళ్లలో ఉన్నది మనలో లేనిది ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటే మనలో లేనిది అవగాహన మాత్రమే అనే విషయం ఒప్పుకుని తీరాలి. కొందరు కారణాలు వెతికి చూపిస్తారు. కానీ నిజానికి ఉన్నదాంట్లో విభిన్నంగా చూపించడంలో సహజమైన ప్రతిభ ఉంటుంది.  పొదుపు భరోసా! సంపాదించుకునే దాంట్లో 40-50% పొదుపు సాధ్యమా అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ ఆలోచిస్తే నిజమే సాధ్యమే అనే విషయాన్ని నమ్మాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఊరికే బలాదూర్ గా ఏమి ఉండరు. వారి సంపాదన వాళ్లకు వుంటుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి కాని అమ్మాయిలలో సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లో ఇవ్వమని ఫోర్స్ చేసేవాళ్ళు చాలా తక్కువే. చాలా దిగువ తరగతి కుటుంబాలలో కూడా ఈ పరిణామాలు తక్కువే ఉంటాయి. కాబట్టి కనీసం 20% అయినా పొదుపు వైపు మళ్లించడం మంచిది. ఒకవేళ అలా అవ్వదు అనే అనుమానం వస్తే సింపుల్ గా వచ్చే సాలరీ ని తగ్గించి చెబితే సరోపోతుంది. ఇది మోసం అని అనుకునే కంటే భవిష్యత్తు గురించి జాగ్రత్త అనుకోవడం మంచిది. పొదుపు చేస్తున్నట్టు చెప్పినా ఎప్పుడూ ఆ పొదుపు గురించి డిస్కస్ చేయడం చాలా మంది అలవాటు కాబట్టి ఆ పొదుపును కూడా కాసింత రహాస్యంగానే చేసుకోండి తప్పు లేదు.  ప్రస్తుత కాలంలో కొందరు మగవాళ్ళు నాకు మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయి బాగా చదువుకున్నా ఉద్యోగం చెయ్యక్కర్లేదు ఇంట్లోనే ఉంటే బెస్టు, ఇంటిని, పిల్లల్ని చూసుకుంటేనే నాకు ఇష్టం అంటూ ఉంటారు. నిజానికి పెళ్లి అయిన తరువాత కూడా పిల్లలు పుట్టిన తరువాతే చాలా ఆర్థిక భారాలు పెరుగుతాయి.  అన్నిటినీ భర్త, అత్త మామలు ఇచ్చే డబ్బుతోనే మైంటైన్ చెయ్యలేరు హౌస్ వైఫ్స్. కాబట్టి పెళ్లికి ముందు ఆర్థిక భరోసా, పెళ్లి తరువాత విభిన్న మార్గాల సంపాదన ఎంతో ముఖ్యం.                                  ◆వెంకటేష్ పువ్వాడ.
అతనో సాధారణ మధ్యతరగతి మనిషి. కానీ జీవితంలో ఎలాగైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కసి ఉన్నవాడు. అందుకనే నిరంతరం ఒళ్లు వంచి పనిచేసేవాడు. యజమాని ఏ పని చెప్పినా కిమ్మనకుండా పూర్తిచేసి, తనేమిటో నిరూపించుకునేవాడు. కానీ ఆ పని ఒత్తిడిలో పడి తన కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయేవాడు. ఒక్క ఆదివారం మాత్రమే ఇంటిల్లపాదీ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అవకాశం దక్కేది. తన కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోతున్నానన్న బాధ అతని మనసులో మెదులుతూనే ఉండేది. భార్యాపిల్లలు కూడా అతను తమకోసం మరింత సమయం గడిపితే బాగుండు అని తెగ ఆశపడేవారు. ఇదిలా ఉండగా, ఆ మధ్యతరగతి మనిషి తన ఉద్యోగంలో ఎలాగైనా పదోన్నతి సాధించాలనుకున్నాడు. అందుకోసం మరిన్ని చదువులు చదివితే బాగుండు అనిపించింది. దాంతో ఓ ఏడాదిపాటు అతని ఆదివారాలన్నీ చదువుకే అంకితమైపోయాయి. రోజూ రాత్రివేళ మాత్రమే అతను తన కుటుంబంతో కాసేపు గడపగలిగేవాడు. అతను ఇంట్లో ఎక్కువసేపు గడపడం లేదంటూ భార్యపిల్లలు బాధపడితే... ‘మీకోసమే కదా కష్టపడుతోంది’ అంటూ వారి నోరు మూయించేవాడు. ఆ మాటలో నిజం ఉందని తోచడంతో భార్యాపిల్లలు ఇక మారు మాట్లాడేవారు కాదు. ఓ ఏడాది గడిచిపోయింది. మధ్యతరగతి మనిషి చదువు పూర్తయిపోయింది. ఊహించినట్లుగానే పదోన్నతి కూడా లభించింది. ఆయన చదువు పూర్తయి కోరుకున్న పదోన్నది లభించింది కాబట్టి, ఇకనుంచి తమతో మరింతసేపు గడుపుతాడని ఆశించారు భార్యాపిల్లలు. కానీ పదోన్నది లభిస్తే సరిపోతుందా! దాని సరిపడా పని కూడా ఉంటుంది కదా. పైగా ఆ మనిషి తన పనిలో వెనక్కి తగ్గే రకం కాదయ్యే! దాంతో అహర్నిశలూ కార్యాలయంలోనే గడిపేవాడు. ఏ అర్ధరాత్రికో పిల్లలు పడుకున్నాక కానీ ఇల్లు చేరుకునేవాడు కాదు. ఉదయం అతను లేచేసరికి పిల్లలంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. దాంతో అతను పిల్లలతో మాట్లాడే సందర్భాలే తగ్గిపోయాయి. తను కుటుంబానికి ఏమాత్రం సమయం వెచ్చించలేకపోతున్నానని అతనికి తెలుసు. కానీ ఇదంతా వారి భవిష్యత్తు కోసమే చేస్తున్నానని తల్చుకుని ఓర్చుకునేవాడు. ఉద్యోగంలో మరో మెట్టు పైకి ఎక్కితే ఇంత ఒత్తిడి ఉండదు కదా అని ఎదురుచూసేవాడు. అనుకున్నట్లుగానే ఇంకో ఏడాది గడిచేసరికి అతను డిపార్టుమెంట్ అధిపతిగా మారిపోయాడు. ఇది వరకు అతను పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు అలాకాదయ్యే! బాధ్యత కూడా తోడయ్యింది. ప్రతి ఫలితానికీ జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితి. తనేమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దాంతో అతను ఆ సవాలుని స్వీకరించాడు. ఒకోరోజు ఆఫీసులోనే నిద్రపోయేవాడు. ఇప్పుడు భార్యని చూడటం కూడా తగ్గిపోయింది. దాంతో ఓ రోజు భార్యాపిల్లలు కలిసి అతని ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘సంపాదించిన స్థాయి చాలు. ఇక కుటుంబం గురించి కూడా ఆలోచించమని’ వేడుకున్నారు. ‘మరొక్క ఏడాది ఓపిక పట్టండి. ఇంకో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చాక ఇంక కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తాను,’ అంటూ మాట ఇచ్చాడు. మాట ఇచ్చినమేరకు ఏడాది గడిచిపోయింది. ఊహించినట్లుగానే మరో ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడతను మధ్యతరగతి మనిషి కానేకాదు. తన పనిచేస్తున్న కంపెనీకే వైస్ ప్రెసిడెంట్. ‘రేపటి నుంచి మీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను. మీ బాగోగులను గమనించుకుంటాను,’ అంటూ ఆ రాత్రి భార్యాపిల్లలకి సంతోషంగా చెప్పాడు. కానీ మర్నాడు ఉదయం లేవనేలేదు!!! తను చిన్నవయసులోనే చాలా సాధించాడంటూ ఓదార్చడానికి వచ్చినవారంతా తెగ పొగిడారు. కానీ అతను ఏం కోల్పోయాడో అతని భార్యాపిల్లలకే తెలుసు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.    
జీవితంలో మనకు కావలసిన వాటికోసం, అవసరమైన వాటి కోసం , ప్రయత్నాలు చేయడం సహజం. అయితే వాటిని సాధించుకునే తీరులో తేడాలు ఉంటాయి. మనిషిలో రెండు వ్యతిరేక స్వభావం కలిగిన అంశాలు ఉంటాయి. అవే ఆశయం, అత్యాశ. చాలామంది ఆశయానికి అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోలేరు. ఫలితంగా అత్యాశ ద్వారా ఏదైనా సాధించుకుంటే దాన్ని ఆశయంతో సాధించుకున్నట్టు ఫీలైపోతారు.  "ఆశయం అంటే కష్టపడి సాధించుకోవడం అత్యాశ అంటే ఒకరి నుండి లాగేసుకోవడం" ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఎదుగుతున్న వారికి ఈ ఆశయం, అత్యాశ మధ్య ఉన్న తేడా ఏంటి?? దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవాలి. ఆశయం!! ఆశయం మనిషిని మానసికంగా, సామాజికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అంశం. ఆశయంలో లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రణాళిక ఉంటుంది, సాధించాలి అనుకున్న విషయం మంచా, చెడా అనే విచక్షణ కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, గెలుపు, ఓటమి మొదలైనవాటిని తీసుకునే తీరు ఇవన్నీ ఆశయంలో అంతర్భాగంగా ఉంటాయి.  ఒక ఆశయంలో ప్రయోజనం అనేది ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తికా లేక కుటుంబంకా, సమాజనికా అనేది ఆశయంలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి ఆశయం అనేది ఒకరికి లేక కొందరికి ప్రయోజనం చేకూర్చే అంశం. దానివల్ల మనిషిలో ఉన్నత విలువలు పెంపొందుతాయి.  ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉండాలి. అదే ఆ మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. అతని ఎదుగుదలే ఓ కుటుంబాన్ని అన్ని కోణాల్లోనూ ఓ మెట్టు పైకి చేర్చుతుంది.  ఆశయాలు చిన్నవైనా, పెద్దవైనా, జీవితకాల నిర్ణయాలు అయినా వాటితో మనిషి భవిష్యత్తు మెరుగుపడుతుంది.  ఇదీ ఆశయంలో ఉన్న సారం. అత్యాశ!! కావలసింది, అవసరమైనది సాధించుకోవడం ఆశయమైతే, ఆశయంలో ఓటమిని ఎదుర్కోలేక తనకే కావాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం అత్యాశ అవుతుంది. అత్యాశ అనేది మనిషికి ఉండకూడని లక్షణాలతో ఒకటి.  కావలసిన దాన్ని నిజాయితీగా, కష్టపడి సాధించుకుంటే దానిలో అర్థముంటుంది. అదే వక్రమార్గంలో దాన్ని సాధించుకుంటే?? అటువైపు దానికోసం కష్టపడుతున్న వారిని మోసం చేసినట్టు, వారి నుండి దాన్ని లాక్కున్నట్టు, వారికి దక్కాల్సినది దక్కకుండా చేసినట్టు అవుతుంది.  ద్వేషం, అసూయ, మూర్ఖత్వం, మొండితనం, ఓర్పు లేకపోవడం ఇవన్నీ అత్యాశలో నిండిపోయి ఉంటాయి. వీటి వల్ల జరిగేది ఏంటి?? ఇతరులు సంతోషపడితే చూడలేకపోవడం, దానికోసం వారికి దక్కాల్సినవి దక్కకుండా చేయడం, వారు బాధపడుతుంటే చూడటం కోసం వారు నష్టపోయేలా చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా తనకు అవసరం లేకపోయినా తనకే దక్కాలి అనే అహంకారం అత్యాశతో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవిధమైన లక్షణం మనిషిని క్రమంగా మృగత్వం వైపుకు లాక్కెళ్తుంది. అత్యాశ నిత్యనాశనం అంటారు. అదెప్పుడూ మనిషిలో మానసిక ప్రశాంతతను లాగేస్తుంది. కాబట్టి అత్యాశ అనేది కేవలం ఇతరులను ఇబ్బందిపెట్టే గుణమే కాదు. అది ఉన్న మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయదు. ఆశయానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే అప్పుడు మనిషి తన జీవితంలో సాధించుకోవలసింది ఏంటి?? వదిలేసుకోవలసింది ఏంటి?? అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతాడు.  లక్ష్యాలు ఏర్పరుచుకుని, శక్తి సామర్త్యాలు ఉపయోగించి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేది ఆశయం.  ఇతరుల సంతోషం నీరుగార్చడం కోసం తనకు అవసరం లేకపోయినా దాన్ని దక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం అత్యాశ.  ఈ రెండింటిని తెలుసుకుని ముందుకు సాగితే జీవితానికి ఓ మంచి అర్థముంటుంది.                                      ◆నిశ్శబ్ద.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో విటమిన్-సి ముఖ్యమైనది.  విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.  జబ్బు పడినప్పుడు విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలా తొందరగా కోలుకుంటారు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  సాధారణంగా విటమిన్-సి లోపం రావడం అరుదే అయినప్పటికీ..  ఈ లోపం ఏమాత్రం ఉన్నా ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. విటమిన్-సి లోపం తొలగాలన్నా,  రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ కింది సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి. బ్రోకలీ.. బ్రోకలీలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అలాగే కాల్షియం,  ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి.. ఉసిరికాయలు విటమిన్-సి కి చాలా మంచి మూలం.  నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కంటే 10 రెట్లు విటమిన్-సి  ఉసిరికాయలలో ఉంటుంది.  ఉసిరికాయను పొడి రూపంలో తీసుకున్నా,  జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా రోజూ ఒక కాయను పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.   రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మం మెరిచేలా చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తొలగిస్తుంది. నారింజ.. నారింజ సిట్రస్ పండ్లలో ప్రముఖమైనది. నారింజను తినడం వల్ల  రోగనిరోధక శక్తి అద్బుతంగా పెరుగుతుంది.  ప్రతిరోజూ ఒక నారింజ పండు తింటుంటే వృద్దాప్యం త్వరగా రాదట.  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.  తెల్ల జుట్టు సమస్య అస్సలే ఉండదని ఆహార నిపుణులు అంటున్నారు.  నారింజలో పైబర్,  విటమిన్-ఎ, పొటాషియం, విటమిన్-సి ఉంటాయి.    ఇన్పెక్షన్ ప్రమాదాలు తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాప్సికం.. క్యాప్సికంలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇందులో విటమిన్-సి,  విటమిన్-ఎ,  బీటా కెరోటిన్ ఉంటాయి.  దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్-సి లోపం తొలగిపోతుంది.  దీన్ని సలాడ్ లలోనూ,  వెజిటబుల్ జ్యూస్ లోనూ జోడించుకోవచ్చు. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇధి మాత్రమే కాకుండా ఇది శరీరం డిటాక్స్ కావడంలో సహాయపడుతుంది. అంటే.. శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.                                      *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
నేటి డిజిటల్ యుగంలో స్క్రీన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. వర్క్ చేయడం నుండి సరదాగా సమయం గడపడం వరకు మొబైల్, సిస్టమ్, టీవీ, సినిమా హాల్ ఇలా ఎక్కడ చూసినా స్కీన్ కాస్తా ఫ్రంట్ ఆఫ్ ద హుమన్ గా మారింది.  దీన్ని దాటి, దీన్ని కాదని ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. మంచి అయినా, చెడు అయినా ఇప్పుడు మొత్తం ఈ స్క్రీన్ నుండే అందుతోంది. అందుకే  గత ఇరవై, ముఫ్పై ఏళ్ళ కిందట లేని కంటి సమస్యలు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సుమారు 10మందిలో 9మందికి అంతో ఇంతో దృష్టిలోపం సమస్య ఉంటోంది. నేటికాలంలో కలుషితమవుతున్న, రసాయనాల నిలయమైన ఆహారం, నీరు, గాలి, పరిసరాలు కూడా ఇందుకు కారణం. దీనికి తోడు జీవనశైలి మరీ దారుణంగా ఉంటుంది కొందరికి. రాత్రెప్పుడో మూడు, నాలుగు గంటలవరకు మొబైల్, సిస్టమ్ లో గడిపి, ఆ తరువాత నిద్రపోతారు. ఉదయం ఎప్పుడో 9 గంటలకు లేస్తారు. ఆ సమయంలో అదరాబదరా తయారయ్యి ఆఫీసులకు,కాలేజీలకు పరిగెడతారు. ఉదయం అల్పాహారం ఈ కారణంగానే చాలామందికి స్కిప్ అవుతుంది. ఆకలేస్తే పాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద పడి అడ్డమైన గడ్డి తింటారు. ఈ అన్ని కారణాల వల్లా కొన్ని కామన్ సమస్యలు ఏర్పడుతున్నాయి చాలామందిలో. వీటిలో పైన ప్రస్తావించిన దృష్టిలోపం సమస్య ప్రధానమైనది.  మన కళ్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. నిజానికి, పిల్లలు  పెద్దలు ఇద్దరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో ఎక్కువ సమయం గడుపడం వల్లే దృష్టిలోపం సమస్య ఏర్పడుతోందనేది వాస్తవం. ఇది చిన్న వయస్సులోనే కంటి సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం  గ్లాకోమా వంటి దృష్టి సమస్యలకు ఈ అలవాటు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితులలో  కంటి చూపును పెంచే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దృష్టిలోపాన్ని సరిదిద్దుకోవడం మంచిది. దృష్టి సామర్థ్యం పెరగడానికి సింపుల్ గా అందరూ చేయగలిగే మూడు టిప్స్ ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేస్తే కేవలం నెలరోజుల్లోపు దృష్టిసామర్థ్యం ఎంతో పెరుగుతుంది.  ఆ టిప్స్ ఏంటో  తెలుసుకుంటే..   అరచేతులతో అద్బుతం.. ఉదయం లేవగానే అరచేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకోవడం చాలామంది చేస్తారు. నిజానికి ఇది దృష్టి సామర్యాన్ని పెంచుతుంది. అరచేతులలో నరాలు, కళ్ల చుట్టూ ఉన్న నరాలకు మధ్య జరిగే సున్నితమైన స్పర్శ  కంటి నరాలను ఉత్తేజం చేస్తుంది.  అరచేతులు వెచ్చగా మారే వరకు  గట్టిగా రుద్దాలి.తరువాత వీటిని  మూసిన కనురెప్పలపై సున్నితంగా  ఉంచాలి. ఈ సందర్భంలో ఎలాంటి ఒత్తిడి ఉపయోగించకూడదు.  చేతుల వెచ్చదనం  కళ్లలోకి ప్రసారమవుతుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. నరాలనుకు శక్తిని ఇస్తుంది. రెప్పలు చేసేమాయ.. కనురెప్పలు వాల్చకుండా తదేకంగా సిస్టమ్ లేదా మొబైల్ వైపు చూడటం వల్ల కళ్లు చాలా తొందరగా అలసిపోతాయి. కనురెప్పలు ఆర్పడమనే వ్యాయామం ఇందుకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యాయామం సులభంగానూ, ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఆచరించాలంటే హాయిగా కళ్లు తెరిచి కూర్చోవాలి. దాదాపు 10 సార్లు వేగంగా రెప్పవేసి, ఆపై 20 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటూ మీ శ్వాసపై దృష్టి సారిస్తూ కళ్లు మూసుకోవాలి. దీన్ని సుమారు 5 సార్లు రిపీట్ చేయండి. ఆరుతూ, వెలుగుతూ ఉండే విద్యుత్ దీపాలు చూడటం, వెలుగుతున్న దీపాన్ని తదేకంగా చూడటం వంటి వ్యాయామాలు  కళ్లను లూబ్రికేట్ చేయడంలో సహాయపడతాయి.  ఎక్కువ సేపు స్క్రీన్‌లను చూస్తూ ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి. కంటి భ్రమణం..  తలను కదల్చకుండా కళ్ళను సవ్యదిశలో కదిలించి, ఆపై ప్రతి దిశలో 5-10 నిమిషాలు అపసవ్య దిశలో ఉంచాలి. సింపుల్ గా చెప్పాలంటే కళ్ళను క్లాక్ వైజ్ లో తిప్పాలి, ఆ తరువాత అపసవ్య దిశలో ఇదే విధంగా చేయాలి. ఇలా  కళ్లను తిప్పడం వల్ల కళ్ల కండరాల దృఢంగా మారతాయి.  రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.                                                                     *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా  ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోనూ, వైద్యంలోనూ మంచి ఔషదంగా కూడా పరిగణిస్తారు. అయితే  చాలామంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం. శనగలు, పెసలు, బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు. అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.  ఈ లాభాలేంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన పెసలు  బరువు తగ్గించడంలో  సహాయపడుతాయి.  రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఇది మాత్రమే కాదు.. మొలకెత్తిన పెసలలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు పెరగనీయవు. ఇక మొలకెత్తిన పెసలు  కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ 'A' ఉంటుంది. ఇది కాకుండా  ఉబ్బరం,  కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలలో  కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో  మొలకెత్తిన పెసలు  సహాయపడుతాయి.  అధిక గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరంతో బాధపడేవారు మొలకెత్తిన  పెసలను  తినవచ్చు. ఇది  బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.  మొలకెత్తిన పెసలను  తీసుకోవడం వల్ల రోజంతా  శక్తివంతంగా ఉండచ్చు.  దీన్ని తినడం వల్ల సోమరితనం లేదా బద్దకం దరిచేరదు. మరీ ముఖ్యంగా మొలకెత్తిన పెసలు  శరీరానికి చలువ చేస్తాయి. దీని కారణంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.                                                  *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...