LATEST NEWS
జగన్ మావిగన్ సవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ చెబుతున్న మావిగన్ అంటే ఏమిటో భగవంతుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల.. వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అమరావతి పనుల్లో  విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.. ఆ అవినీతికి విరుగుడుగా.. తాను అధికారంలోకి వస్తే మావిగన్ ను రాజధాని చేస్తానని ప్రకటించారు. అదే తన ఎన్నికల నినాదమని చెప్పారు. సహజ వనరులు, ముందే సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల మావిగన్  లాభదాయకమన్నారు.  జగన్ మావిగన్ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.  తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లెలో జరిగిన విక్సిత్ భారత్-గ్రామ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలా మావిగన్ ఏమిటో  దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు.  అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారనీ,  ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్  రాగం అందుకున్నారని విమర్శించారు.  రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో 29 వేల మంది రైతులు  33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తు చేసిన ఆయన అటువంటి  అమరావతిని గత ప్రభుత్వం శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు.  రాజకీయ స్వార్థం కోసం చెరుకు తోటలకు నిప్పు పెట్టి, ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్రలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ లాంటి శాశ్వత రాజధానులు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి గత ఐదేళ్లలో దాపురించిందన్న చంద్రబాబు..  2026లో పార్లమెంటు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని ఆమోదించిందని, ఇది జూన్ 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రం అందించిన ఈ చట్టబద్ధమైన రక్షణతో అమరావతి ఎదుగుదలను భూమిపై ఏ శక్తి కూడా ఆపలేదన్న చంద్రబాబు..  రాజకీయ నాయకుడు మాట మీద నిలబడాలని.. పూటకో మాట  మార్చే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిని 2028 నాటికి క్వాంటం వ్యాలీగా, నాలెడ్జ్ హబ్‌గా పూర్తిస్థాయిలో నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. 
వైసీపీకి పెట్టని కోటగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోట అయిన  కడప  ఇప్పుడు ఆయన చేజారిపోయిందా?  అంటే ఇటీవలి పరిణామాలను గమనించిన పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం జిల్లాలో..  కేడర్ నుంచి లీడర్ల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. జగన్‌కు తన సొంత జిల్లాపైనే పట్టు సడలినట్లు కనిపిస్తోందన్న భావన రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.  అందుకు..   జగన్ కడప జిల్లాలో ఇటీవల జరిపిన మూడు రోజుల పర్యటన నిలువెత్తు నిదర్శనంగా  నిలుస్తోంది.  ఈ పర్యటనలో జగన్.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పార్లమెంటు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. సాధారణంగా పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే.. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీలో పండుగ వాతావరణం నెలకొంటుంది.  కానీ జగన్ తాజా పర్యటనలో అటువంటివేవీ కనిపించలేదు. పైపెచ్చు..  జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు.  కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.  అధినేత పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల వైసీపీ కడప జిల్లా నేతలలో నెలకొన్న నిర్లిప్తతకు, అసంతప్తికి పరిశీలకులు దీనినే కడప జగన్ చేజారిపోయిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు.   నిజానికి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. జగన్ శ్రద్ధపెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా.. పార్టీకి పెట్టని కోటలాంటి కడప, బలమైన పట్టు ఉన్న నెల్లూరులలోనే వైసీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది.  అయితే పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ కడప జిల్లాలో దయనీయంగా మారడానికి జగన్ స్వయంకృతాపరాథమే కారణమని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో లీడర్లను, క్యాడర్ ను దూరం చేసుకున్నారంటున్నారు.  గతంలో నాయకులను ఇష్టానుసారంగా మార్చడం, స్థానిక సమీకరణాలను పట్టించుకోకుండా, ఎవరికీ ఇష్టం లేకపోయినా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు సీనియర్లను నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుండా నివారించాయనీ, ఇక తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గానికి  ప్రాధాన్యత ఇవ్వలేదని వారిలో అప్పట్లో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పటికీ అలానే ఉందనీ అంటున్నారు.    మరోవైపు  కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ  క్రమంగా విస్తరిస్తుండగా,   కడపలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలమైన విజయాన్ని దక్కించుకుంది.  ఇంత జరుగుతున్నా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ, కనీసం కేడర్‌కు భరోసా ఇచ్చే  చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పరిస్థితి కడప జిల్లాలో నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందని వైసీపీ నేతలే అంటున్నారు.  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇటీవల బోడుప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ వద్ద చోటు తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరపాలంటూ సాగిన ఈ పోరాటంలో  టీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కవితను మహిళా పోలీసులు అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయారు. ఆ తరువాత ఆమెను అరెస్టు చేసిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్వకుంట్ల అరెస్టుకు సంబంధించిన విజువల్స్ లో   మహిళా పోలీసులు కవితను చుట్టుముట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ తీవ్ర తోపులాటలో కవితతో పాటు  మహిళా పోలీసులూ కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది.  ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. నెటిజనులైతే.. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా ఉందని ఫైర్ అవుతున్నారు.   కవితను పోలీసులు అరెస్టు చేసిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం టీఆర్ఎస్ శ్రేణులే కాదు.. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా  పోలీసుల తీరును తప్పుపడుతున్నారు.  జనసేన   తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి కవిత అరెస్టు సందర్భంగా పోలీసుల దురుసు వైఖరిని   తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, రాజకీయ వైరుధ్యాలు ఉండటం సహజమన్న ఆయన.. ఒక  మహిళా నేత పట్ల  ఇంత అగౌరవంగా, కనీస మర్యాద లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని, ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.   మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు  బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు  
    ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది. ఇటీవల ప్రసిద్ధ మీడియా ఛానల్ 'టాన్ న్యూస్' లో ప్రసారమైన 'వాస్తవ వేదిక'లో, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ మధ్య జరిగిన చర్చ ఏపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తల ప్రభావం మరియు సోషల్ మీడియా ఎత్తుగడలపై ఒక లోతైన విశ్లేషణను అందించింది. ఈ విశ్లేషణాత్మక కథనంలో ఏపీ రాజకీయాల ప్రస్తుత స్థితి, వ్యూహాలు, రాబోయే రోజుల్లో వాటి ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితి: సానుభూతి వర్సెస్ ప్రజాకర్షక ప్రచారాలు..! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల పబ్లిక్ రిలేషన్స్ వ్యూహాలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రులు లేదా ప్రతిపక్ష నేతలు సామాన్య ప్రజలను కలవడం, తాటిచెట్లపాలెం వంటి ప్రాంతాల్లో మత్స్యకారులతో కలిసి భోజనం చేయడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే ఈ ప్రచారాలు కేవలం ఎన్నికల స్ట్రాటజీలలో భాగమేనని, క్షేత్రస్థాయిలో నాయకులు నిజంగా ప్రజలతో మమేకం కావడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న ప్రజా సానుభూతి ఆయనకు ప్రధాన అర్హతగా బలంగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాతి కాలంలో ఆ సానుభూతిని సమర్థవంతంగా వాడుకున్నప్పటికీ, కేవలం సానుభూతి కార్డు మాత్రమే ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేయలేదని 2014 ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి. కేవలం సెంటిమెంట్లపై కాకుండా క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహాలు మరియు వాటి అంతరార్థం..! ఆధునిక ఏపీ రాజకీయాలను శాసిస్తున్న మరో కీలక అంశం 'పొలిటికల్ స్ట్రాటజిస్టులు' (రాజకీయ వ్యూహకర్తలు) మరియు డేటా మేనేజ్‌మెంట్. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు సమాజంలో కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించే సంక్షేమ పథకాలను ప్రోత్సహిస్తూ, రాజకీయాలను మరింత వ్యాపారమయం చేశారనే తీవ్ర విమర్శలను ఈ ఇంటర్వ్యూలో లేవనెత్తారు. పెన్షన్ల పెంపుదల, అమ్మఒడి పథకం వంటి తాత్కాలిక లబ్ధి చేకూర్చే పథకాలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ, ఇవి రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యూహకర్తలు ప్రతి గ్రామంలోని కుల సమీకరణాలు, స్థానిక ఓటర్ల మనోభావాల డేటాను సేకరించి, దానికి అనుగుణంగా ఓటర్లను ప్రభావితం చేసే 'నెరేటివ్స్' (కృత్రిమ కథనాలు) సృష్టిస్తున్నారు. ఉదాహరణకు, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వచ్చిన  డైమండ్' వంటి ఆరోపణలు కేవలం ఒక రాజకీయ ప్రచారంలో భాగమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని ఈ చర్చలో విశ్లేషించారు. 'మై టిడిపి' యాప్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో రేటింగ్ సిస్టమ్స్ పెట్టడం, కృత్రిమ డేటాతో సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించడం వంటి సరికొత్త పద్ధతుల ద్వారా సాంప్రదాయ ఎన్నికల విధానాన్ని మార్చేస్తున్నారు. ఓటర్ల విశ్వాసాన్ని నేరుగా గెలుచుకోలేమనే భావనతోనే ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం..! ఈ విధమైన డేటా ఆధారిత  సోషల్ మీడియా వ్యూహాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చనున్నాయి. అయితే, ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న రాజకీయ అవగాహన కారణంగా ఈ తాత్కాలిక వ్యూహాల మాయాజాలం ఎక్కువ కాలం సాగకపోవచ్చు. గతంలో ఎన్నికలకు సంబంధించి లోకేష్  చంద్రబాబులకు ముందే అంచనాలు అందించినట్లు, టిడిపికి అత్యధిక స్థానాలు వస్తాయని విశ్లేషకులు ముందే ఊహించిన తరుణంలో, క్షేత్రస్థాయిలో ప్రజల నిజమైన తీర్పు ఎలా ఉంటుందో స్పష్టమైంది. భవిష్యత్తులో కేవలం కృత్రిమ నెరేటివ్‌లు, సానుభూతి కార్డులు లేదా ఉచిత పథకాల హామీలతో ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యం కానుంది. వ్యూహకర్తల కృత్రిమ రేటింగులు  అంచనాలను పక్కనబెట్టి, ప్రజలు నిజమైన నాయకత్వాన్ని, స్థిరమైన అభివృద్ధిని ఆశించే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిజమైన ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన మాత్రమే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తులో శాశ్వత మనుగడను అందిస్తాయి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
బోడుప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత్రి  కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారు లను పోలీసులు అరెస్టు చేసి  బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని  ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. "మేము కొత్త డిమాండ్లు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను  అమలు చేయాలని కోరాం. ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే రక్తం కళ్ల చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉద్యమకారులు హామీలు అమలు చేయాలని అడిగినందుకే లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టడం అన్యాయమన్న కవిత..  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  "కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రతి రోజూ ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. 
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల, ఆనంద్ భారతి, బాలా పరాశర్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు రచన, దర్శకత్వం: వెంకటేష్ మహా డీఓపీ: కార్తీక్ పర్మార్ ఎడిటర్: వెంకటేష్ మహా సంగీతం: స్మరణ్ సాయి నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ సమర్పణ: GMB ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల తేదీ: జులై 3, 2026 టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన మూవీ రావు బహదూర్. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడు కావడంతో పాటు, మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా అని టీమ్ ప్రమోట్ చేయడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి రావు బహదూర్ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటి? ఈ కొత్తదనం ఏ మేరకు మెప్పించింది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Rao Bahadur Movie Review) కథ: రాజ కుటుంబానికి చెందిన రామప్ప(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ తో బాధపడుతుంటాడు. భ్రమలు, భయాలతో తన గదినే ప్రపంచంగా బ్రతుకుతున్న రామప్పకు వింతైన మానసిక సమస్య కూడా ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న అతను.. మరెన్నో రోజులు బ్రతకడని డాక్టర్లు చెబుతారు. కానీ, సీనియర్ డాక్టర్ల అంచనాలను కూడా తలకిందులు చేస్తూ.. రామప్ప ఎక్కువరోజులు బతుకుతుంటాడు. దానికి కారణం అనుమానం అనే పెనుభూతం. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన రెండో కొడుకు తనకి పుట్టినవాడు కాదని అనుమాన పడుతుంటాడు. ఆ అనుమానం తీరే వరకు ప్రాణాలతోనే ఉంటానంటూ, చావుకే సవాల్ విసురుతాడు. అసలు రామప్పకు ఆ మానసిక సమస్య ఎలా వచ్చింది? కొడుకు పుట్టుకపై అనుమానం కలగడానికి కారణమేంటి? అసలు ఆ అనుమానం నిజామా కాదా? చివరికి రామప్పకు తెలిసిన నిజమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: అనుమానం అనే పురుగు మెదడులోకి ప్రవేశిస్తే.. అది మనిషిని ఎంత మూర్ఖంగా, ఎంత కఠినంగా మారుస్తుంది? దాని వల్ల ఎలాంటి అనర్ధాలు వస్తాయి? అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. కథగా చూసుకుంటే ఇందులో పెద్ద కథేమీ లేదు. తెలిసిన కథ, అందునా చిన్న కథ. తన కొడుకు నిజంగా తనకు పుట్టాడా లేదా? అని చనిపోయేలోపు హీరో తెలుసుకోవాలి అనుకుంటాడు. కథ అద్భుతం కాకపోయినా, ఆ కథను తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు వెంకటేష్ మహా. ప్రజెంటేషన్ కొత్తగా ఉంది. ఈ తరహా ప్రజెంటేషన్ తో మన దగ్గర సినిమాలు రావడం చాలా అరుదు. సైకలాజికల్ డ్రామాను ఒక చందమామ కథలా చెప్పే ప్రయత్నం చేశాడు. అదే ఈ సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. సినిమా ప్రారంభమే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మాయాలోకాన్ని తలపించే రాజకోట, ఒక పిల్లాడిని వేళ్ళతో మట్టిలోకి లాక్కెళ్ళే చెట్టు, ఆ తర్వాత వింత మానసిక సమస్యతో బాధపడే రామప్ప పాత్ర పరిచయం.. ఇలా పూర్తిగా ఒక కొత్త సినిమా చూస్తున్నామనే భావన ప్రారంభ సన్నివేశాల్లోనే కలుగుతుంది. అయితే కథ ముందుకెళ్తున్న కొద్దీ, కథనం నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే హీరోహీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్ తేలిపోయింది. కొన్ని సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగుతూ సహనానికి పరీక్ష పెడతాయి. అయితే ఇంటర్వెల్ కి ముందు మళ్ళీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. కథ ముందుకు జరుగుతున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. చిన్న కొడుకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక అసలు ఆ అబ్బాయి హీరో కొడుకా కాదా? అనే సస్పెన్స్ ను మెయింటైన్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో వచ్చే ట్విస్ట్ లు సర్ ప్రైజ్ చేశాయి.  తీసింది రెండు సినిమాలే అయినా రచయితగా వెంకటేష్ మహా ఇప్పటికే బలమైన ముద్ర వేశాడు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలు ఆయన రచనలో ఉట్టిపడతాయి. అయితే ఇందులో సిచువేషనల్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, ఎమోషన్స్ మాత్రం పూర్తి స్థాయిలో పండలేదు. హీరో పాత్రతో కానీ, ఆ పాత్రలోని సంఘర్షణతో కానీ ప్రేక్షకులు అంత ఎమోషనల్ గా కనెక్ట్ కాలేరు. దానికి కారణం.. ఓ రకంగా దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ అని చెప్పవచ్చు.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: నటీనటులంతా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యువకుడు, మధ్య వయస్కుడు, వృద్ధుడిగా మూడు దశల్లో ఉన్న పాత్రను అద్భుతంగా పోషించాడు. ముఖ్యంగా వృద్ధ పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు. ఇక రామప్ప భార్య రేణుక పాత్రలో దీపా థామస్ తన సహజ నటనతో మెప్పించింది. రామప్ప ఫ్రెండ్, డాక్టర్ ఆచారి రోల్ లో వికాస్ ముప్పాల సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక పనిమనిషి అచ్చమ్మ పాత్రలో బాలా పరాశర్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. అక్కడక్కడా బాగానే నవ్వులు పూయించింది. ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రచయితగా పరవాలేదు అనిపించుకున్న వెంకటేష్ మహా, దర్శకుడిగా మ్యాజిక్ చేశాడు. ఈ కథను ఆయన తెరపైకి కొత్తగా తీసుకొచ్చిన తీరు అద్భుతం. కొన్ని కొన్ని సీన్స్ ను ఆయన డిజైన్ చేసిన తీరు కానీ, ఏ మాత్రం తడబాటు లేకుండా వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తీరు కానీ కట్టిపడేసింది. ఈ సినిమాకు ఎడిటర్ కూడా మహానే. అందుకే కొన్ని సీన్స్ ట్రిమ్ చేయడానికి మనసు రాలేదనుకుంటాను. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసినా, లేదా హీరోహీరోయిన్ల ట్రాక్ ను ఇంకా బాగా రాసుకున్నా అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది. కార్తీక్ పర్మార్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. వెంకటేష్ మహా ఆలోచనను తెరపైకి తీసుకువడంలో ఆయన పనితనం అడుగడుగునా కనిపించింది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. పాటలతో ఓకే అనిపించుకున్న స్మరణ్ సాయి, నేపథ్య సంగీతంతో మాత్రం మ్యాజిక్ చేశాడు. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: సత్యదేవ్ సహా ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ప్రజెంటేషన్ టెక్నికల్ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ పాయింట్స్: కథాంశం అందరికీ కనెక్ట్ అయ్యేది కాకపోవడం అక్కడక్కడా నెమ్మదించిన కథనం ఫైనల్ గా.. ప్రయత్నం బాగుంది. కానీ, దర్శకుడు ఎంచుకున్న కథాంశం అందరికీ కనెక్ట్ అవ్వడం అనుమానమే. రేటింగ్: 2.5/5  Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.     Rao Bahadur Review, Rao Bahadur, Satyadev, Venkatesh Maha, Mahesh Babu   
  ఎదురుగా పంచ పరమాన్నాలు ఉంచినా కూడా పలానా సినిమా బాగుందని తెలిస్తే చాలు, పరమాన్నాలు సంగతి తర్వాత చూద్దాం, ముందు సినిమా చూడాలని థియేటర్స్ కి పరుగులు తీసేవాళ్ళు. వాళ్ళు అంతలా పరిగెత్తడానికి కారణం సినిమా బాగుందంటే కథ, కథనం తమని ఎంతగానో మెస్మరైజ్ చేస్తాయని. ఆ సినీ ఆనందాన్ని తనకి తెలిసిన వాళ్ళ కంటే ముందుగా తనే పొందాలని. కానీ ప్రస్తుతం కొంత మంది మేకర్స్  సినిమా అంటే కథ, కథనంకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే  విజువల్ కిఇంపార్టెన్స్ ఇస్తున్నారు. భారీ స్కేల్‌లో, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో . వందల కోట్ల బడ్జెట్ పెట్టి విజువల్స్ ఎఫెక్ట్స్ (VFX) వెంట పడుతున్నారు. అయితే, ఈ క్రమంలో అసలైన కథని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్. కేవలం గ్రాఫిక్స్ నమ్ముకుని థియేటర్లకు వచ్చే ప్రేక్షకుడిని ఎంతసేపు బురిడీ కొట్టించగలరు ఈ ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, సగటు సినిమా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. కథ బలంగా లేనప్పుడు ఎంతటి విజువల్స్ అయినా స్క్రీన్ మీద వెలవెలబోవడం ఖాయం. ఇటీవలి కాలంలో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సినిమా మేకర్స్ దాదాపు 70% నుండి 80% బడ్జెట్‌ను విజువల్స్, భారీ సెట్టింగ్స్, మరియు స్టార్ కాస్టింగ్ కోసమే కేటాయిస్తున్నారు. కానీ స్క్రిప్ట్ వర్క్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కోసం కేవలం 10% సమయం లేదా శ్రద్ధ కూడా పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా, థియేటర్‌లో మొదటి 30 నిమిషాలు విజువల్స్ చూసి మురిసిపోయే ప్రేక్షకుడు, ఆ తర్వాత కథలో బలం లేక, ఎమోషన్ కనెక్ట్ అవ్వక తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. సినిమా అనేది చూసేది మాత్రమే కాదు, హృదయానికి హత్తుకునే ఒక అనుభూతి అనే విషయాన్ని కొందరు దర్శకులు మర్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు కథే సినిమాకి హీరో.  క్యారెక్టర్స్ మధ్య  సంఘర్షణ, బలమైన డైలాగులు, గుండెలని  పిండేసే సెంటిమెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి. కానీ నేడు 100 కి పైగా కంప్యూటర్ గ్రాఫిక్స్ షాట్స్ ఉంటేనే అది పెద్ద సినిమా అనే భ్రమలో కొందరు మేకర్స్ ఉన్నారు. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ఏ సినిమాని  చూసినా అందులో బలమైన కథాంశం (Plot) ఉంటుంది. విజువల్స్ అనేవి ఆ కథను మరింత అందంగా చూపించడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే, అదే సర్వస్వం కాకూడదు. పునాది బలహీనంగా ఉన్నప్పుడు ఎంత రంగుల మేడ కట్టినా అది కూలిపోక తప్పదు. also read: Nandini reddu: భర్తపై నందినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు బాక్సాఫీస్ లెక్కలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేవలం విజువల్ గ్రాండియర్ నమ్ముకుని వచ్చిన 60% పైగా భారీ బడ్జెట్ చిత్రాలు కథలో పట్టులేక డిజాస్టర్లుగా మిగిలాయి. అదే సమయంలో, కేవలం 15 నుండి 20 కోట్ల పరిమిత బడ్జెట్‌తో, బలమైన కంటెంట్‌తో వచ్చిన చిన్న చిత్రాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ప్రేక్షకులు కేవలం స్క్రీన్ మీది రంగులను చూడటానికి రావడం లేదు, ఒక మంచి కథలో లీనమవడానికి వస్తున్నారు. కాబట్టి, మూవీ మేకర్స్ విజువల్స్ వెంట పడటాన్ని తప్పుబట్టలేం కానీ, కథను విస్మరించడం ఖచ్చితంగా పెద్ద పొరపాటే అవుతుంది. కంటెంట్ ఈజ్ కింగ్  అనే సూత్రాన్ని నమ్మి, కథకి  మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆ విజువల్స్ కూడా సార్థకమవుతాయి మరియు సినిమా అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది.  
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత అందమైన, మధురమైన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తోంది. ఒకవైపు కెరీర్ పరంగా సంచలన విజయాలు అందుకుంటూనే, మరోవైపు తన జీవితంలోకి రాబోతున్న కొత్త అతిథి కోసం ఎంతో ఆనందంగా నిరీక్షిస్తోంది. గతేడాది డిసెంబర్ 1న బాలీవుడ్ ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె, ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా అందరూ విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తుంటారు, కానీ మొదటి నుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సమంత మాత్రం ఈ ప్రత్యేక సమయంలోనూ తన వ్యాయామ దినచర్యను అస్సలు విస్మరించడం లేదు. తాజాగా జూన్ నెలకు సంబంధించిన తన జ్ఞాపకాల ఫోటో డంప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సమంత, అందులో తను జిమ్‌లో చేస్తున్న కఠినమైన వ‌ర్క‌వుట్‌ వీడియోను కూడా జత చేసింది. ఈ వీడియోలో ఆమె అప్పర్ బాడీకి సంబంధించిన వ్యాయామాలు చేస్తూ కనిపించింది. ఒక రాడ్‌కు కట్టిన బలమైన తాడు సహాయంతో వ్యాయామం చేస్తున్న సామ్, ప్రతి సెట్ ముగిసిన తర్వాత కొద్దిసేపు అలసటగా విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. 39 ఏళ్ల వయసులో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతున్న సమంతకు ఈ వీడియోలో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వైద్య నిపుణుల ప్రకారం గర్భవతులు పొట్టపై ఒత్తిడి పడకుండా నిపుణుల పర్యవేక్షణలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో అనవసరమైన బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటంతో పాటు నడుము నొప్పి నుంచి ఉపశమనం లభించి, సుఖ ప్రసవానికి అవకాశాలు మెరుగవుతాయని వైద్యులు చెబుతుంటారు. సమంత చూపించిన ఈ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో "లవ్ యూ సామ్.. మీ చిన్నారిని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. మరోవైపు సమంత వృత్తిపరంగా కూడా సరికొత్త చరిత్ర సృష్టించి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం అంతర్జాతీయంగా సుమారు రూ. 86.80 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సోలో ఫీమేల్-లీడ్ చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీని ద్వారా 17 ఏళ్ల క్రితం 'అరుంధతి' సినిమాతో అనుష్క క్రియేట్ చేసిన చారిత్రాత్మక రికార్డులను కూడా సమంత తిరగరాయడం విశేషం. ఈ సినిమా ఒక్క ఇండియాలోనే రూ. 53 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్ మార్కెట్లో ఏకంగా రూ. 24 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇలా అటు పర్సనల్ లైఫ్‌లో మాతృత్వపు ఆనందం, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో రూ. 86 కోట్లకు పైగా కలెక్షన్ల రికార్డులతో సమంత కెరీర్ పీక్ స్టేజ్‌లో దూసుకుపోతోంది.     Samantha pregnancy workout, Samantha baby bump video, Raj Nidimoru Samantha marriage, Maa Inti Bangaram box office collections, Samantha gym video viral, Samantha broke Arundhati record
  దర్శకురాలు నందిని రెడ్డి 'మా ఇంటి బంగారం'తో  లైమ్ లైట్ లోకి వచ్చింది. లైమ్ లైట్ లోకి రావడమే కాదు రేపో మాపో వంద కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది.  దీంతో అభిమానులు సమంత తో హ్యాట్రిక్ మూవీ ఎప్పడు ఉంటుందనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు.  తాజాగా నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 40  ఏళ్లు దాటినా, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో పెళ్లి అనేది ఒక 'డూ ఆర్ డై' నిబంధన లేదా కచ్చితంగా పాటించాల్సిన రూల్ ఏమీ కాదు. నా మనస్తత్వానికి సరిపోయే, మెంటాలిటీకి సింక్ అయ్యే సరైన వ్యక్తి దొరకలేదు.  నచ్చిన వాళ్లతో కూడా భావాలు కుదరకపోవడం వల్లే  వివాహ బంధానికి దూరంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ విషయంలో నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. జీవితం సంతోషంగా సాగాలి అంటే కేవలం మొగుడు, పెళ్లాం అనే ఒకే ఒక్క బంధం మాత్రమే ఉంటే సరిపోదు. మనిషి జీవితంలో ఎన్నో రకాల అనుబంధాలు ఉండాలి. మన కష్టసుఖాలని  పంచుకోవడానికి, మన బాధ్యతలను మోయడానికి, అండగా నిలవడానికి కేవలం భర్త మాత్రమే అవసరం లేదు; ఆ స్థానంలో మంచి స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు వంటి వారు ఎందరో ఉంటారు. నా చుట్టూ నేను ఒక అద్భుతమైన, నమ్మకమైన రిలేషన్స్ ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. నా పక్కన లేనిది కేవలం ఒక మొగుడు మాత్రమే. మిగతా అన్ని రకాల బంధాలు, ఆనందాలు నా జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని బాధపడలేదు, లోన్లీగా ఫీల్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. Also read: Rao Bahadur: రావు బహదూర్ ట్విట్టర్ రివ్యూ ఇదే! 2011లో నాని, నిత్యామీనన్ జంటగా వచ్చిన 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకురాలిగా ప్రస్థానం ప్రారంభించిన నందినిరెడ్డి  మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుని  సొంతం చేసుకున్న నందిని రెడ్డి ఖాతాలో 'కళ్యాణ వైభోగమే', 'ఓ బేబీ' వంటి చిత్రాలు ఉన్నాయి. Nandini reddy about on marriage, nandini reddy opens about on marriage and single life, Director Nandini Reddy Marriage  
    సత్యదేవ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రావు బహదూర్'(Rao Bahadur)సైకాలజికల్ డ్రామాగా తెరకెక్కగా ఈ రోజు  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సమర్పించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. విడుదలకు ముందే ప్రైవేట్ స్క్రీనింగ్‌లో ఈ సినిమా చూసిన మహేష్ బాబు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఇక ఈ రోజు ఉదయం నుంచే ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ అభిప్రాయాలని  పంచుకుంటున్నారు. అసలు ఈ 'రావు బహదూర్' కథేంటి, ట్విట్టర్ యూజర్లు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.   రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) అనే 60 ఏళ్ల వృద్ధుడు ఒక తీవ్రమైన శారీరక రుగ్మతతో బాధపడుతుంటాడు. వైద్యులు చెప్పిన గడువు దాటిపోయినా, తను అనుకున్న ఒక వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటాడు. దాదాపు పక్షవాతం వచ్చిన స్థితిలో కూడా తన చుట్టూ ఉన్న వారి సహాయంతో తన  లక్ష్యాన్ని ఎలా పూర్తి చేశాడు అనేదే ప్రధాన కథాంశం. ఈ ప్రయాణంలో రేణుక (దీప థామస్)తో ప్రేమ, యువకుడిగా ఉన్నప్పటి జ్ఞాపకాలు, భావోద్వేగాలు ప్రేక్షకులని  కట్టిపడేస్తాయి. Also read: OG 2: ఓజి 2 స్టోరీ లీక్!  కుల వ్యవస్థ, చర్మం రంగు, రక్తసంబంధాలు, సామాజిక మూఢనమ్మకాలపై దర్శకుడు వెంకటేష్ మహా వేసిన సెటైర్లు, ఫిలాసఫికల్ టచ్ ప్రధాన బలంగా నిలిచాయి.  ట్విట్టర్ టాక్ ప్రకారం, సినిమా ఓపెనింగ్ 5 నిమిషాల నుంచే ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. మొదటి 30 నిమిషాలు రామప్ప రావు బహదూర్ ప్రపంచంలోకి, అతని భువనాలయంలోకి, అక్కడి యాసలోకి వెళ్లడానికి ప్రేక్షకులకి  కొంచెం సమయం పట్టినప్పటికీ, ఆ తర్వాత కథలో లీనమైపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా నెమ్మదిగా పాత్రల పరిచయం, వరల్డ్ బిల్డింగ్‌తో సాగుతుంది. అయితే ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులలో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో డ్రామా మరింత తీవ్రమవడమే కాకుండా, క్లైమాక్స్ ట్విస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. చివరి 25 శాతం సినిమా 'పీక్ సినిమా' అని, టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రయోగమని నెటిజన్లు కొనియాడుతున్నారు.    Rao Bahadur Twitter Review, Rao Bahadur Movie Review, Satyadev in rao Bahadur, Venkatesh Maha, Rao Bahadur Rating
  టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)సృష్టించే ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2025 సెప్టెంబర్ 25న విడుదలైన ‘దే కాల్ హిమ్ ఓజీ’ (They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్‌ని  షేక్ చేయడమే కాకుండా, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓజీ అభిమానులకి  మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓజీ 2’ (OG 2) రాబోతోందంటూ అధికారికంగా ప్రకటన విడుదలైంది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, దీనిని ఒక భారీ ‘ఓజీ యూనివర్స్’ (OG Universe) గా విస్తరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఓజీ మారుమోగిపోతోంది. ఈ సరికొత్త ప్రాజెక్టును పవన్ కల్యాణ్ తన స్వంత బ్యానర్ అయిన ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (PKCW) పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో దర్శకుడు సుజీత్ ఈ కథకు సంబంధించిన కొన్ని కీలకమైన ఎలిమెంట్స్‌ను, ఐకానిక్ విజువల్స్ ఐడియాలను పవన్ కల్యాణ్‌కు వివరిస్తూ కనిపించారు. కథా చర్చల్లో భాగంగా సుజీత్ చెప్పిన కొన్ని పాయింట్స్ వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. మంచు క్రమక్రమంగా రక్తంగా మారే ఒక అద్భుతమైన సీన్, అలాగే కథను మలుపు తిప్పే ఒక ‘అవుట్‌సైడర్’ క్యారక్టర్  గురించి, మొదటి భాగంలో పవన్ కల్యాణ్‌తో పాటు కనిపించిన పెంపుడు కుక్క ప్రాధాన్యత గురించి సుజీత్ ఈ వీడియోలో వివరించారు. ఈ కథా చర్చల్లో పవన్ కల్యాణ్ ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ, సుజీత్ విజన్‌కు ఫిదా అయ్యారు. ఒకానొక సందర్భంలో ‘ఈ సీన్ మాత్రం స్క్రీన్‌పై అత్యంత ఐకానిక్ విజువల్ కాబోతోంది’ అని పవన్ కల్యాణ్ ప్రశంసించడం విశేషం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నారు. దర్శకుడు సుజీత్‌తో మాట్లాడుతూ, ‘నీకు నా వైపు నుండి ఏం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను’ అని పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి ఎస్. థమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నారు. ఓజీ మొదటి భాగంలో థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన బలమన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోయే ఓజీ యూనివర్స్‌లో ఓజాస్ గంభీర గతానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా జపాన్‌తో అతనికి ఉన్న కనెక్షన్‌ని  మరింత లోతుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జపనీస్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ కొత్త అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కల్యాణ్ సరికొత్త రగ్గడ్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతూ రికార్డు వ్యూస్ సాధిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఓజీ తుఫాన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సరికొత్త రికార్డులని   సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.       
సూపర్‌స్టార్ రజినీకాంత్ మాస్ రచ్చకు థియేటర్లు మళ్లీ ముస్తాబవుతున్నాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, ఏకంగా 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గురువారం ఒక అధికారిక ప్రకటనతో సినీ ప్రియుల్లో భారీ జోష్ నింపింది. మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ 'జైలర్2' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు సన్ పిక్చర్స్ వదిలిన సరికొత్త టీజర్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో మొదటి భాగంలో విలన్‌గా అలరించిన వినాయకన్ పలికిన డైలాగులు నెక్స్ట్ లెవెల్ ఉత్కంఠను రేపుతున్నాయి. "నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు జైలర్.. నా వెనుక చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంది, ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో నీకు తెలియదు.. నీ జీవితం నరకమే" అంటూ విలన్ హెచ్చరించే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఆ వెను వెంటనే మన తలైవా రజినీకాంత్ తనదైన ట్రేడ్‌మార్క్ స్టైలిష్ స్వాగ్‌తో ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సీక్వెల్‌ను మొదటి భాగానికి మించి, మరింత పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అద్భుతంగా తెరకెక్కించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులో ఉన్న మరో విశేషం ఏమిటంటే, కేవలం రజినీకాంత్ మాత్రమే కాదు.. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అలాగే టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా అత్యంత కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మల్టీస్టారర్ లైనప్‌తో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ తదితరులు తమ పాత్రలతో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి భాగానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను ఊపేసిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా అదిరిపోయే స్వరాలను అందిస్తున్నారు. అక్టోబర్ 15న రాబోతున్న ఈ బాక్సాఫీస్ సునామీ సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.     Rajinikanth Jailer 2, Jailer 2 Release Date Fixed, Jailer 2 Teaser, Sun Pictures Jailer 2, Anirudh Ravichander, Jailer 2 Movie Cast
  అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో లెనిన్ తో ఈ నెల 10 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్నాడు. దీంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సదరు ప్రమోషన్స్ లో సమంత వన్ వుమన్ షో 'మా ఇంటి బంగారం'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.    అఖిల్ మాట్లాడుతు  ‘లెనిన్’(lenin)ప్రమోషన్స్ వల్ల బిజీగా ఉండి  'మా ఇంటి బంగారం' ఇంకా చూడలేదు. కానీ ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మూవీ వైబ్స్ ,పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా అనిపించడంతో పాటు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొడుతుందని అనుకున్నాను. ఒక సాధారణ మహిళగా కనిపిస్తూనే, చీర కట్టుకుని సమంత చేసిన యాక్షన్ సీన్స్, ఫైట్స్ చేయడం అంత మామూలు విషయం కాదు. సామ్ నిజంగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది" అంటూ అఖిల్ కొనియాడారు. ఇప్పుడు అఖిల్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. 'మా ఇంటి బంగారం' ప్రస్తుతం  80 కోట్ల రూపాయలని క్రాస్ చేసి 100 కోట్లు అందుకోవడానికి ఉత్సాహంగా ఉంది. Also read: Nagabandham: నాగబంధం మూవీలో ఉన్న హైలెట్స్ ఇవే! akhil akkineni about maa inti bangaram, maa inti bangaram collections, samantha about akhil akkineni, lenin movie cast    
Rao Bahadur starring Satyadev and directed by Venkatesh Maha has been one of those rare attempts in Telugu Cinema that excited many cinephiles and general audiences. The movie being presented by Mahesh Babu added to the buzz and anticipation of the film. Now, the movie released worldwide on 3rd July and let's look at initial reactions.  The movie is receiving very mixed reviews from audiences on X. Whatever the critics and reviewers have to say, such films demand major attention from general audiences as it lands in an experimental zone. Claims of it being a new-age psychological drama from makers further cement the need to look at audiences perspective.  Currently though, the movie seems to be attracting major reactions but they have been polarising. While some are appreciating the attempt and Venkatesh Maha's guts to write such characters, they are also criticising his choice to be over indulgent. Major complain has been that the movie is too slow in its first hour.  Even the second hour has been not so interesting but Satyadev's performance shoulders the film and climax does make it all interesting. Yet, some are complaining that Maha went over the top at places as well. Overall, from initial reactions we can state that Rao Bahadur is slow in pacing but bold as an attempt for Telugu Cinema.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలు, ఆర్థిక నష్టాల గురించి వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా తన కొత్త చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నామ వెల్లడించిన విషయాలు, టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంపై నిర్మాత అభిషేక్ నామ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. ఈ చిత్రానికి ఆయన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించకపోవడంతో, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వాటిల్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ నష్టాల తీవ్రత ఎంత ఉందంటే, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈ సందర్భంగా అభిషేక్ నామ స్పష్టం చేసిన ఒక విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. "ఆ సినిమా వల్ల మాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినప్పటికీ... మేము విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా తిరిగి అడగలేదు. కానీ, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మా బ్యానర్‌లో ఆయన మరో సినిమా చేస్తారని మేము ఆశించాం," అని ఆయన తన ఆవేదనను బయటపెట్టారు. కేవలం ఆశించడమే కాకుండా, ఆయన నుండి సానుకూల స్పందన కోసం ఏకంగా మూడేళ్ల పాటు వేచి చూశామని అభిషేక్ నామ వాపోయారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ థ్రెసా వంటి స్టార్ హీరోయిన్లు నటించినప్పటికీ, ఫలితం మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఊరటనివ్వలేదు. మూడేళ్లు గడిచినా, హీరో నుండి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం వల్లే తాను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నిర్మాతలు మరియు హీరోల మధ్య ఉండే అవగాహనలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ప్రస్తుతానికి ఈ వివాదంపై విజయ్ దేవరకొండ స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, టాలీవుడ్ బడ్జెట్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్స్‌లో ఇలాంటి సంఘటనలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు కూడా ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.     Vijay Deverakonda, Abhishek Nama, World Famous Lover, Tollywood controversy, Producer comments, Telugu cinema news
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు వాడమని చెబుతారు.  అయితే.. తన దగ్గరకు వచ్చిన రోగులకు జాగ్రత్తలు  చెప్పడానికి ముందు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు, మంచి అలవాట్లు ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే వారి మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం అనేది తొందరగా లభించేది కాదు.. అది రోజువారీ మంచి అలవాట్ల ద్వారా నిదానంగా సొంతమవుతుంది.  వైద్యులు తమ రోజువారీ జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్లు ఉన్నాయి.  వీటిని అందరూ పాటించవచ్చు.  ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. దీని వల్ల వైద్యుల లాగే ఓర్పు, సహనం వంటివి పెరుగుతాయి. ప్రతి ఏడాది డాక్టర్స్ దినోత్సవాన్ని జూలై 1 వ తేదీన జరుపుకుంటారు.  ఈ సందర్బంగా వైద్యులు పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుంటే.. నిద్ర.. ప్రతిఒక్కరికి కనీసం ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. "సమయానికి నిద్రపోవడం ద్వారా శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.  దీని వల్ల ఒత్తిడి  తగ్గుతుంది,  రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.  మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.   బ్లూ లైట్.. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్‌లు, కంప్యూటర్‌లు , ఇతర ఎలక్ట్రానిక్స్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతిని నివారించాలి. ఆహారం..  కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ వనరులు, ఆరోగ్యకరమైన కొవ్వులు , అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది. డిన్నర్ టైం.. రాత్రి భోజనాన్ని త్వరగా తినడం ఎంతో మంచిది.  రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించడం వల్ల శరీరానికి రాత్రంతా విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రాసెస్ ఆహారాలు.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరతో నిండిన డెజర్ట్‌ల విషయంలో చాలా మంది కంట్రోల్ గా ఉండలేరు. కానీ వాటిని నివారించడానికి  తీపి తినాలని అనిపించినప్పుడు, చక్కెరతో నిండిన ప్రాసెస్ చేసిన డెజర్ట్‌ల వైపు వెళ్లకుండా ఆయా కాలాల్లో లభించే తాజా పండ్లు తినడం, ఖర్జూరం,  డ్రై ప్రూట్స్ వంటి తినడం వల్ల తీపి తిన్న ఫీల్ వస్తుంది. ఆరోగ్యానికి పోషకాలు కూడా అందుతాయి. భోజనం ట్రిక్.. భోజనం తినే ముందు  కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ తినడం వల్ల, ఎక్కువ ఆహారం తినకుండానే కడుపు నిండుతుంది.  దీనివల్ల ఆహారం అతిగా తినడం నివారించవచ్చు.  భోజనానికి కనీసం 20 నిమిషాల ముందు సలాడ్‌ తినడం చాలా మంచిది. చురుగ్గా ఉండాలి.. లైఫ్ స్టైల్ చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  క్రమం తప్పకుండా కార్డియోవాస్కులర్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే వ్యాయామం వల్ల ఓర్పు కూడా పెరుగుతుంది.   స్ట్రెంత్ ట్రైనింగ్.. క్రమం తప్పకుండా శరీరాన్ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఫుషప్స్,  బైసెప్స్ తో పాటు ఇతర స్ట్రెంట వ్యాయామాలు కూడా శరీరం బలంగా మారడానికి సహాయపడుతుంది.  ఇవి కండరాలు బలంగా మారడానికి సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వైద్యులకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం,యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేస్తారు.   రిలేషన్స్.. వైద్యులు కేవలం సమాజం కోసం మాత్రమే కాదు.. తమ కోసం తాము కూడా బ్రతకాలి.  వారికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం,  సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడం వంటివి వారు వృత్తిలో రాణించడానికి సహాయపడతాయి. కనీసం రోజుకు గంట సేపు అయినా కుటుంబంతో సంతోషంగా గడపడం చాలా ముఖ్యం. పైన చెప్పుకున్నవన్న ఎంతో మందివైద్యులు తప్పకుండా తమ జీవితంలో రోజూ పాటించే అలవాట్లు. ఇవి సాధారణ వ్యక్తులు కూడా పాటించవచ్చు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి. అప్పుడే వారు వృత్తికి సరైన న్యాయం చేయగలరు.                                       *రూపశ్రీ.
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే.. జీతం.. ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు. పెళ్ళెప్పుడు.. పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు. వయసు.. వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది. పిల్లలు.. భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.                                 *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆడవారిలో గర్బం నిలవకపోవడం లాగానే.. మగవారిలో వీర్యకణాల సమస్య వంటివి పిల్లలు పుట్టడంలో ఆటంకాలు కలిగిస్తాయి. కొందరికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొందరికి వీర్యం సరిగా ఉత్పత్తి కాకపోవడం లాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. అయితే మగవారిలో కొన్ని  అలవాట్లు వారిలో సంతాన అవకాశాలు తగ్గించేస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వేడి అసలు కారణం.. జీవశాస్త్రపరమైన కారణం వల్ల వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని వైద్యులు చెబుతారు. వీర్య కణాల ఉత్పత్తి ఉత్తమంగా జరగాలంటే , వృషణాల ఉష్ణోగ్రత శరీర అంతర్గత ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 4°C తక్కువగా ఉండాలట. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం కొద్దిగా తగ్గినా కూడా, అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వీర్య కణాలను ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం జరుగుతుందట. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, వీర్యకణాల DNA దెబ్బతింటుందట. భారతీయ పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి వేడికి గురికావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ్య కారణాలని చెబుతున్నారు. ఒడిలో ల్యాప్టాప్.. చాలా మంది మగవాళ్లు ల్యాప్‌టాప్‌ను నేరుగా తమ తొడలపై ఉంచుకుని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలక్రమేణా వృషణాల ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచడానికి దారితీస్తుంది. కానీ వేడి ఒక్కటే సమస్య కాదు, ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం , ఫోన్‌ను ప్యాంటు జేబులో ఉంచుకోవడం వల్ల విద్యుదయస్కాంత వికిరణానికి గురై పిల్లలు పుట్టడంలో సమస్యలు   పెరగవచ్చట. లోదుస్తులు, జీన్స్..  బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించే పురుషులతో పోలిస్తే, వదులుగా ఉండే బాక్సర్ షార్ట్స్ ధరించే పురుషులలో మొత్తం వీర్య కణాల సంఖ్య 17% ఎక్కువగా , చురుకుగా ప్రయాణించే వీర్య కణాలు 33% ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. స్కిన్నీ లేదా బిగుతుగా ఉండే జీన్స్ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆయన ఇంకా తెలిపారు. అవి రోజంతా వృషణ ప్రాంతాన్ని శరీరానికి దగ్గరగా నొక్కి ఉంచుతాయి, దీనివల్ల వేడి లోపలే నిలిచిపోయి, శరీరం  ఉష్ణోగ్రత నియంత్రణకు అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడూ అవే ధరించడం వల్ల, కాలక్రమేణా ఈ ప్రభావం పెరిగి సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. సహాయపడే మార్పులు.. వదులుగా ఉండే బాక్సర్ షార్ట్‌లకు మారడం,  ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది.  ల్యాప్‌టాప్‌ను  ఒడిలో కాకుండా బల్లపై ఉంచుకోవడం మంచిది. వేడి ప్రాంతాలలో ఎక్కువ సేపు గడపకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది.                            *రూపశ్రీ.
 నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం  మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.    కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా..  ఈ రెండింటిలో  గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది?  తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ  ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో  చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది.  జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.  తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను  కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా  కార్డియో వ్యాయామాలు చేస్తే  గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను  కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే  యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.  అయితే యోగా  గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక  విధాలుగా కూడా  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా  ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని  మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు.  ఈ విషయాన్ని ఆరోగ్య  నిపుణులే చెబుతున్నారు.  ఆరోగ్య  నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి  కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి  తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని  గుండె ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.  ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్  ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్,  కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని ,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                       *రూపశ్రీ.