LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన   అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన లోకేష్.. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని  డబుల్ ఇంజిన్ సర్కార్  వల్లనే రాష్ట్రానికి మెగా పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వేగంగా సాధ్యమవుతున్నాయన్నారు.  ఐదేళ్ల  వైసీపీ పాలనలో అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన ఆయన  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో  కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను శరవేగంగా పరిగెత్తిస్తున్నదన్నారు. అమరావతిని కేవలం భవనాల నగరంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీ కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిఉద్ఘాటించారు. గతంలో భారత  రైల్వే రంగంలో భద్రత, పరిశుభ్రత లోపించేవని, కానీ ప్రధాని మోడీ ముందుచూపు వల్ల దేశంలో వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' ఆటోమేటిక్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో కూడిన సరికొత్త రైల్వే విప్లవం నడుస్తోందని లోకేష్ కొనియాడారు. దశాబ్దాల నాటి ఆంధ్రుల కల అయిన విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ప్రధాని మోడీ వెంటనే మంజూరు చేసి కార్యరూపంలోకి తెచ్చారని, ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన లోకేష్.. మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ' ప్రసాద్' పథకం కింద నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారని, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కట్టుగా పని చేస్తే నియోజకవర్గం ఎలా మారుతుందో చెప్పడానికి మంగళగిరి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని  వివరించారు. ఒక రూపాయి ఆదాయానికి ఒక రూపాయి నలభై పైసల ఖర్చు ఉన్నప్పటికీ.. సూపర్ సిక్స్ హామీలైన తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ, మెగా జాబ్ క్యాలెండర్ వంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. గతంలో పెట్టుబడులు లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందనీ..  కూటమి ప్రభుత్వం వచ్చాక రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలతో పాటు ఫైటర్ జెట్ తయారు చేసే  అమ్కా  వంటి భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, పొరుగు రాష్ట్రాల యువతే ఏపీ వైపు చూసేలా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు తాను చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేర్చుకునేవాడినని, కానీ ఇప్పుడు కుప్పం నేతలు కూడా మంగళగిరిని చూసి నేర్చుకునే స్థాయికి ఇక్కడి అభివృద్ధిని తీసుకెళ్లామని సగర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో మంగళగిరిని ఐటీ,  పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని లోకేష్ స్పష్టం చేశారు. Nara Lokesh Mangalagiri, Amaravati Capital Development, AP Double Engine Government, Andhra Pradesh Mega Investments South Coast Railway Zone Vizag
తెలుగువన్ ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ  హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలో   విజయవంతంగా రాణిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలు తమంతట తాముగా వెళ్ళిపోలేదని, నాటి ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులు,  వాటా ఇస్తేనే వ్యాపారం అనే  దౌర్భాగ్య విధానాల వల్లే పారిశ్రామికవేత్తలు దండం పెట్టి మరీ ఏపీని వదిలి పారిపోయారని తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ విశ్లేషకుడు సువేరా అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన  సంచలన నిజాలను వెల్లడించారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీస్ గ్లోబల్ కర్మాగారం ప్రారంభోత్సవ నేపథ్యంలో ఏపీ పారిశ్రామిక విధ్వంసంపై ఆయన మాట్లాడారు.  వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన  ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.  ఒక గ్లోబల్ టెక్నాలజీ కలిగిన అమరరాజా సంస్థను బెదిరించడం వల్లే వారు వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించారని, నిన్న దివిటిపల్లిలో జరిగిన కనులపండువ లాంటి ప్రారంభోత్సవమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీలో ఉపాధి కోల్పోయిన యువత తరపున నారా లోకేష్ క్షమాపణలు చెప్పడం నాటి దుస్థితికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని పక్కనబెట్టి..  కేవలం తమ సొంత బినామీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే వైఎస్ కుటుంబం మొదటి నుంచి ప్రయత్నించిందని   ధ్వజమెత్తారు. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు బలవంతపు ల్యాండ్ పూలింగ్స్, అధికార దుర్వినియోగంతో చెరబట్టారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసే ఈ చెంబల్ వ్యాలీ బందిపోటు సంస్కృతి వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిన్నదని, కేవలం లంపెన్ శక్తులను, అసాంఘిక మూలకాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేశారని సువేరా విశ్లేషించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ పాలన తిరిగి గాడిలో పడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాల పారిశ్రామిక అనుభవం, మంత్రి నారా లోకేష్ నిరంతర శ్రమతో మళ్లీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్న సువేరా.. అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులు వస్తుండటం శుభపరిణామన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటూ ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇలాంటి పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని కథనాన్ని ముగించారు. Why Industries Left Andhra Pradesh,  Suvera Analysis,  TeluguOne,  AmarRaja Batteries,  Chandrababu Naidu Investments AP, AP Past Government Industry Scams
హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో తీవ్ర కలకలం రేగింది. రాజకీయ, మతపరమైన అంశాలపై జరిగిన ఈ లైవ్ డిబేట్‌లో ఒక ప్రతినిధి మరో ప్యానలిస్టుపై భౌతిక దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌కు సంబంధించిన వివాదమే చివరకు ఈ ఘర్షణకు దారితీసింది. దీనిపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. మతం పేరుతో జరుగుతున్న రచ్చకు ఇది తాజా ఉదాహరణ అన్నారు. అసలు ఇంతకీ  టీవీ లైవ్ డిబేట్ లో భౌతిక దాడికి దారి తీసిన కారణం ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంగా నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక కటౌట్‌లో శ్రీమహావిష్ణువు విశ్వరూప ప్రదర్శన చిత్రంలో విష్ణుమూర్తి ముఖ స్థానంలో ప్రధాని మోదీ ముఖాన్ని మార్ఫింగ్ చేసి పెట్టారు. దీనిపై హిందూ ధర్మ ప్రచారకుడు, సామాజిక విశ్లేషకుడు రమణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దైవ సమానమైన విశ్వరూప స్థానంలో ఒక రాజకీయ నాయకుడి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నారు. రమణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై డిబేట్‌లో పాల్గొన్న  ధర్మవీర్  సంస్థ ప్రతినిధి కశ్యప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, హిందుత్వ, మోదీ అన్నీ ఒకటేనని, ఇందులో తప్పేముందని ఆయన వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. రమణమూర్తి శాంతంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, కశ్యప్ రెడ్డి సహనం కోల్పోయి ఒక్కసారిగా తన చెప్పు తీసుకుని రమణమూర్తిపై దాడికి తెగబడ్డారు. ఈ ఆకస్మిక దాడితో టీవీ స్టూడియోలో ఉన్న యాంకర్లు, ఛానల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకుని కశ్యప్ రెడ్డిని పక్కకు లాగి, అక్కడి నుంచి పంపించి వేశారు. అవమానానికి గురైన రమణమూర్తి అనంతరం స్టూడియో వెలుపలికి వచ్చి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో, అదీ టీవీ చర్చల్లో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. రమరమూర్తి వ్యతిరేకించింది హిందుత్వనే కానీ హిందూ మతానని కాదని భరద్వాజ విశ్లేషించారు.  రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ,  చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే  హిందుత్వ  వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే  ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.  సామాజిక మాధ్యమాలు, టీవీ చర్చల్లో ఇటీవల కాలంలో కొందరు నాయకులు, సంస్థల ప్రతినిధుల భాష, ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పుతోందని, కేవలం రాజకీయ పార్టీల మెప్పు కోసమో, లేదా ఆర్థిక లబ్ధి కోసమో కొందరు ఇటువంటి వివాదాలను సృష్టిస్తూ సమాజంలో అలజడి రేపుతున్నారని అభిప్రాయపడ్డారు.  ఇలాంటి దాడులు జరిగినప్పుడు సదరు రాజకీయ శ్రేణులు గానీ, అనుబంధ సంస్థలు గానీ మౌనంగా ఉండటం మరిన్ని దాడులకు ఉసిగొల్పినట్లవుతుందని హెచ్చరించారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి అసలు ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోలవరం నిధులు, ఆరోగ్యశ్రీ వంటి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. Kashyap Reddy Attacks Ramana Murthy, TV Debate Slipper Attack Hyderabad,  Modi Vishwaroopam Cutout Controversy, Dharmaveer Kashyap Reddy, Tone News,  Tone News Debate Attack Case
ALSO ON TELUGUONE N E W S
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషల్ డ్రామా మూవీ 'ది ఇండియా స్టోరీ'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 35 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, దేశంలో ఆహార కాలుష్యం, క్రిమిసంహారకాల వాడకం వల్ల సామాన్యుల జీవితాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించింది.  ట్రైలర్ ప్రారంభమే ఒక తండ్రి రోదనతో మొదలవుతుంది. తన 7 ఏళ్ల కూతురు హత్యకు గురైందని, దానికి కారణమైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఒక తండ్రి పోలీస్ స్టేషన్‌లో వేడుకునే సీన్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. అయితే ఆ పాప మరణానికి అసలు కారణం క్యాన్సర్ అని మెడికల్ రిపోర్టులు చెబుతాయి. కానీ ఆ క్యాన్సర్ రావడానికి వెనుక ఉన్న భయంకరమైన కార్పొరేట్ మాఫియా, విషపూరిత రసాయనాల వాడకాన్ని ఈ చిత్రం ప్రశ్నించబోతోంది. మన దేశంలో పంటల దిగుబడి కోసం, ముఖ్యంగా జీడి తోటలపై హెలికాప్టర్ల ద్వారా విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులను జల్లుతున్నారు. కెమికల్స్ కాదు, అవి నిలువునా ప్రాణాలు తీసే విషం అని ట్రైలర్‌లో బలంగా చూపించారు. మార్కెట్లో దొరికే పండ్లు, కూరగాయలను ఎంత కడిగినా ఆ విషపు రసాయనాల ప్రభావం పోదని, అవి మన శరీరంలోకి చేరి ప్రాణాంతక క్యాన్సర్‌గా మారుతున్నాయని ఈ కథ హెచ్చరిస్తోంది. కేవలం కూరగాయలే కాదు, పండగల సమయంలో, ఫంక్షన్ల సమయంలో విరివిగా వాడే పాలలో కూడా ఎలాంటి కల్తీ జరుగుతుందో, అవి స్వీట్ల రూపంలో మన పిల్లల పొట్టల్లోకి ఎలా చేరుతున్నాయో కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ పోరాటం కేవలం ఒక పాప కాదు, దేశంలోని ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం అంటూ సాగే డైలాగులు ఆలోచింపజేస్తాయి. రైతుల్ని అన్నదాతలు అని అంటాం, కానీ కొందరు స్వార్థపరుల వల్ల అమాయక రైతులు కూడా ఎలా నష్టపోతున్నారో ఇందులో చూపించారు. ట్రైలర్‌లో అత్యంత ప్రభావవంతమైన అంశం పంజాబ్ లోని 'బటిండా నుండి బికానీర్' వెళ్లే క్యాన్సర్ ట్రైన్ గురించి ప్రస్తావించడం. క్రిమిసంహారక మందుల వాడకం, రసాయనాల కాలుష్యం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో దేశంలోని ప్రతి ఊరు నుండి ఒక క్యాన్సర్ ట్రైన్ బయలుదేరాల్సిన పరిస్థితి వస్తుందని కాజల్ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ భయంకరమైన సామాజిక సమస్యను ఎదిరిస్తూ జూలై 24న థియేటర్లలోకి రాబోతున్న 'ది ఇండియా స్టోరీ' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.   Kajal Aggarwal, The India Story, Movie Trailer  
  సంక్రాంతి పండుగకి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)సినిమా చూస్తే వచ్చే మజా వేరని అభిమానుల నమ్మకం. మెజారిటీ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు కూడా ఆ మాటకి ఏకీభవిస్తారు. స్వయానా బాలకృష్ణకి కూడా సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చెయ్యడం  సెంటిమెంట్. ఏదో ఒకటి రెండు సార్లు మినహా సంక్రాంతి  పండుగ బరిలో నిలిచిన ప్రతిసారీ బ్లాక్ బస్టర్ హిట్లతో రికార్డుల వేట సాగించాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త మూవీ చేస్తున్నాడు. బాలయ్య, గోపీచంద్ కాంబోలో వీరసింహా రెడ్డి తర్వాత వస్తున్న మూవీ కావడంతో  అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు డిసెంబర్ లేదా సంక్రాంతి రేసులో నిలపాలని గట్టిగా భావిస్తున్నారు. అయితే, సంక్రాంతి బరిలోకి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తీసుకురావాలనే ఆలోచన ఇప్పుడు బాలయ్యకు ఒక పెద్ద సవాలుగా, సరికొత్త రిస్క్‌గా మారిందని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది..ఈ సవాలుకి ప్రధాన కారణం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని విశ్లేషకులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడికి ఒక బలమైన హోల్డ్ ఉంది. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్ 3 , సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం. మన శంకర వరప్రసాద్ గారు  వంటి వరుస హిట్లతో పండుగ విన్నర్‌గా నిలుస్తూ వస్తున్నాడు. రాబోయే సంక్రాంతి బరిలోనూ విక్టరీ వెంకటేష్ ళ్యాణ్ రామ్ కాంబినేషన్ చిత్రంతో వస్తున్నాడు. గతంలో సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి సినిమాలతో పోటీపడిన రెండు సందర్భాల్లోనూ బాలకృష్ణ సినిమాలకి గట్టి దెబ్బ తగిలింది. 'ఎఫ్2' మూవీకి పోటీగా వచ్చిన బాలయ్య 'కథానాయకుడు' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సాధారణంగా పండుగ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్‌  కనెక్ట్ చేసే వినోదాత్మక చిత్రాలే భారీ వసూళ్లు సాధిస్తుంటాయి, ఆ విషయంలో అనిల్ రావిపూడి ఎక్స్‌పర్ట్ కావడమే దీనికి కారణం. సంక్రాంతికే వచ్చిన 'డాకు మహారాజ్' చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా హవాని  తట్టుకోలేకపోయింది.  Also read: షాక్ లో అక్కినేని ఫ్యాన్స్! ఆ సమయంలో డాకు మహారాజ్ నాలుగు రోజుల ముందే థియేటర్లలోకి రావడం వల్ల బ్రేక్ ఈవెన్ సాధించి సేఫ్ జోన్‌లోకి వెళ్ళగలిగింది కానీ, ఒకే రోజు గనుక పోటీ పడి ఉంటే గట్టెక్కడం చాలా కష్టమయ్యేదని ట్రేడ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అన్న ఆందోళన అభిమానుల్లో ఉంది. కేవలం అనిల్ రావిపూడి మాత్రమే కాదు, ఈ సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కూడా పోటీకి సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతికి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మరి ఈ ట్రిపుల్ కాంబో బాక్స్ ఆఫీస్ వార్ లో నటసింహం తన సెంటిమెంట్‌  కాపాడుకుని విజేతగా నిలుస్తారో లేదో చూడాలి!    balakrishna, nbk111, chiranjeevi, anilravipudi, venkatesh, kalyan ram
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమాతో ఇండియన్ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో వచ్చిన సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'బాలన్: ది బాయ్' (Balan: The Boy). జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ మలయాళ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది మాలీవుడ్‌లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, విజయవంతంగా థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మిస్టరీ థ్రిల్లర్ యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. 'బాలన్: ది బాయ్' చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) లో జూలై 31, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. చిదంబరం తన మునుపటి చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' తో ఒక రియల్ లైఫ్ సర్వైవల్ డ్రామాను చూపిస్తే, ఈ చిత్రంలో మాత్రం భయం, మనుగడ, ఒక మిస్టీరియస్ పాత జీవితం నేపథ్యంగా సాగే తల్లి-కొడుకుల బంధాన్ని చాలా వినూత్నమైన పంథాలో ఆవిష్కరించారు. ఈ విభిన్న కథాంశమే థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. బాక్సాఫీస్ గణాంకాల విషయానికి వస్తే, 'బాలన్: ది బాయ్' సినిమా థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ. 30.24 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహిళల కారాగారంలో తన తల్లితో కలిసి పెరిగే బాలన్ అనే బాలుడి చుట్టూ తిరుగుతుంది. ఆ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, అతని తల్లి తన పాత జీవితం నుండి తప్పించుకోవడానికి నిరంతరం ప్రదేశాలను మారుస్తూ, వారి గుర్తింపులను, నేపథ్యాలను మారుస్తూ ఉంటుంది. మనుగడ సాగించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మకూడదని బాలన్ చిన్నతనం నుంచే నేర్చుకుంటాడు. ఒక ప్రశాంతమైన కొండ గ్రామంలో కొన్నాళ్లు వారి జీవితం నిలకడగా సాగినప్పటికీ, కొన్ని ఊహించని సంఘటనల వల్ల బాలన్ తన తల్లికి దూరమవుతాడు. ఆ తర్వాత అబ్బాస్ అనే వ్యక్తి బాలన్‌కు ఆశ్రయం ఇచ్చి, అతని తల్లిని వెతకడానికి సహాయం చేస్తానని అంటాడు. చిన్నతనం నుండి నేర్చుకున్న మెలకువలతో బాలన్ తన తల్లి కోసం, ఆమె వదిలిపెట్టిన పాత జీవితం వైపు అడుగులు వేస్తాడు. ఈ అన్వేషణ కేవలం ఒక తల్లి కోసం సాగే ప్రయాణం మాత్రమే కాకుండా, భయం మనుషులను ఎలా వెంటాడుతుందో చూపించే ఒక ఎమోషనల్ రైడ్‌గా మారుతుంది. ఈ చిత్రంలో అధిశేషన్ కె.ఆర్, ఫర్జానా పలాతింగల్, ముహమ్మద్ జినాన్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే జీన్ పాల్ లాల్, డాలీ జూన్, గిరీష్ ఎ.డి కీలక పాత్రల్లో కనిపించగా, ప్రముఖ నటుడు టోవినో థామస్ ఒక ప్రత్యేకమైన ఎక్స్‌టెండెడ్ కామియో రోల్‌లో మెరిశారు. జితు మాధవన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ సంయుక్తంగా నిర్మించారు.      Balan The Boy, OTT Release Date, Chidambaram, Tovino Thomas, ZEE5 Movie  
బుల్లితెరపై 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ నటుడు నిహార్ ముఖేశ్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మన ముందుకు వచ్చాడు. ఆయన నటించిన సరికొత్త చిత్రం 'తీర్థరూప తాండేయవారిగే' ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్'లో తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. రామెనహళ్లి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక భావోద్వేగభరితమైన ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నిహార్ ముఖేశ్ సరసన రచన ఇందర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటి సితార, రవీంద్ర విజయ్, రాజేష్ కీలక పాత్రలు పోషించారు. జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా రేటింగ్ విషయానికి వస్తే 5 కి 2.00 గా నిలిచింది. ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్, కుటుంబంలో ఉండే అపార్థాలు, మరియు ఒక మిస్టరీ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. కథ విషయానికి వస్తే, పృథ్వీ (నిహార్ ముఖేశ్) ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. అతను ఒక పాపులర్ ట్రావెల్ వ్లాగర్ కావడంతో, అందమైన లొకేషన్లకు వెళ్తూ వీడియోలు చేస్తూ డిజిటల్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. సమాజంలో అతనికి ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ, అతని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఒక పెద్ద వెలితి వెంటాడుతూనే ఉంటుంది. దానికి కారణం అతని చిన్నతనంలోనే తండ్రి శివ శంకర్ (రవీంద్ర విజయ్) ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోవడం. తండ్రి లేని కారణంగా పృథ్వీ స్కూల్ రోజుల నుండి కాలేజ్ వరకు ఎన్నో అవమానాలను, హేళనలను ఎదుర్కొంటాడు. తన తండ్రి ఎందుకు వెళ్లిపోయాడు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న అతన్ని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో తన తల్లి జానకి (సితార) స్థానిక వ్యక్తి విశ్వనాథ్ (రాజేశ్ నటరంగ)తో సన్నిహితంగా ఉండటం పృథ్వీకి నచ్చదు. తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి తల్లి ప్రవర్తనే కారణమని భావించి, ఆమెతో చాలా ముభావంగా ఉంటాడు. ఈ క్రమంలోనే పృథ్వీ జీవితంలోకి అక్షర (రచన ఇందర్) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే, అక్షర తండ్రి రవి రామనాథపుర ఒక సీనియర్ జర్నలిస్ట్ అని తెలిసి పృథ్వీ షాక్ అవుతాడు. కొన్ని కారణాల వల్ల వారి ప్రేమ ఫలించడం కష్టమని అనుకుంటున్న తరుణంలో, అక్షర తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు. ఆయన చనిపోయే ముందు రాసిన ఒక లేఖ అక్షర చేతికి చిక్కుతుంది. ఆ లేఖ చదివిన అక్షరకు ఒక చేదు నిజం తెలుస్తుంది. పృథ్వీ తండ్రి శివశంకర్ అదృశ్యం కావడానికి, తన తండ్రి రవి రామనాథపురకి మధ్య ఏదో బలమైన సంబంధం ఉందని ఆమె గ్రహిస్తుంది. అసలు ఆ ఇద్దరి గతంలో ఏం జరిగింది, అక్షర ఈ నిజాన్ని పృథ్వీకి చెప్పిందా లేదా, చివరికి పృథ్వీ తన తండ్రి జాడను కనుగొన్నాడా అనే ఆసక్తికరమైన అంశాలతో మిగతా కథ నడుస్తుంది. దర్శకుడు రామెనహళ్లి జగన్నాథ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. సినిమా ఫస్టాఫ్ చాలా నిదానంగా సాగుతుంది. హీరోకి తండ్రి లేడనే అసంతృప్తిని, తల్లి పట్ల ఉన్న కోపాన్ని చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. లవ్ ట్రాక్‌లో రొమాన్స్ మరింత పండించి ఉంటే బాగుండేది. అయితే, సెకండాఫ్ నుండి కథలో వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాంకేతిక విభాగంలో దీపక్ ఫొటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. మేఘాలయ వంటి లొకేషన్లను కెమెరాలో అద్భుతంగా చూపించారు. జో కోస్టా అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదనిపించినా, పాటల సాహిత్యం మరియు డబ్బింగ్ పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. మొత్తానికి, 'తీర్థరూప తాండేయవారిగే' నెమ్మదిగా సాగే ఒక ఎమోషనల్ డ్రామా, ఓటీటీలో ఒకసారి చూడదగ్గ చిత్రంగా మిగిలింది.
Presented by Elred Kumar under the RS Infotainment banner, Mandaadi is directed by Mathimaran Pugazhendi and produced by Elred Kumar. The film stars Soori and Suhas in pivotal roles.  The content released so far has generated a strong response from audiences. The striking character transformations of Soori and Suhas have grabbed attention, while the makers are confident that the film's high-octane action sequences and stunning visuals will be among its biggest highlights. The much-talked-about boat action sequence, which the team has already teased, is expected to be one of the major attractions of the film. Mandaadi is all set for a grand worldwide release on September 10 in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi. The Telugu version will be distributed across Andhra Pradesh and Telangana by Mythri Movie Distributors LLP, ensuring a massive release in the Telugu states. The film also stars Mahima Nambiar as the female lead, alongside Sathyaraj, Ravindra Vijay, Mithun, Bala Saravanan, and others in key roles. The music is composed by G.V. Prakash Kumar, while S.R. Kathir handles the cinematography. D.R.K. Kiran is the production designer, Pradeep E. Ragav serves as the editor, and the action sequences are choreographed by Peter Hein, Dileep Subbarayan, and Mahesh Mathew. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  అఖిల్ అక్కినేని(Akhil Akkineni)లెనిన్ తో సూపర్ హిట్ అందుకోవాలని కోరుకొని అభిమాని లేడు. ఆ అభిమానుల భావోద్వేగాల మధ్య లెనిన్ రిలీజ్ కావడం, సూపర్ హిట్ టాక్ అందుకోవడం జరిగింది. కేవలం 3 రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా  68 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యడంతో ఫ్యాన్స్ మొత్తం కాలర్ ఎగరేసుకొని ఫిగర్ తాలూకు ఇమేజ్ ని తమ ఫోన్ లో స్టేటస్ గా ఉంచుకున్నారు.  ఇక లెనిన్(Lenin)తో అఖిల్ తొలి సారి వంద కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడని, అందుకు తగ్గ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. వాళ్ళు ఆందోళన చెందటానికి కారణం లేకపోలేదు. లెనిన్ గత శుక్రవారం 10 న రిలీజ్ అయ్యింది.మూడు రోజులకే  68 కోట్ల గ్రాస్ ని అందుకుంది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో కలెక్షన్ల గ్రాఫ్ కాస్త తగ్గుముఖం పట్టింది. నాల్గవ రోజు కేవలం 4.5 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి . వంద కోట్ల మార్కు అందుకోవడానికి 32 కోట్లు అవసరం. also read: ప్రీతీ ముకుందన్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆ అపర మేధావికి మునిమనవరాలు! మరోవైపు నిన్న శుక్రవారం బాక్సాఫీస్ బరిలోకి కొన్ని సినిమాలు వచ్చాయి పైగా 'ఓడిస్సి, మూవీ కూడా తిష్ట వేసింది. అందుకే అభిమానుల్లో లెనిన్ వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనే టెన్షన్ లో మొదలైంది. మరి బాక్సాఫీస్ రేసులో 'లెనిన్' వంద కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి. akhil, lenin, nagarjuna, nagavamsi    
భారతీయ కార్పొరేట్, డిజిటల్ రంగ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన స్మార్ట్ ఫోన్ మోసం ఆధారంగా సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం రూ. 251 ధరకే పూర్తి ఫీచర్లు కలిగిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ 2016వ సంవత్సరంలో ఒక కంపెనీ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ కొనడం సామాన్యుడికి పెద్ద పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కావడం, దానికి తోడు ఇంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లభిస్తుండటంతో జనం ఎగబడ్డారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఏకంగా 7 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఆ స్మార్ట్‌ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. అయితే అత్యంత చౌకైన ఈ స్మార్ట్ ఫోన్ డ్రీమ్ కాస్తా కొద్దిరోజుల్లోనే ఒక పెను వివాదంగా మారి, భారతదేశపు అతిపెద్ద వ్యాపార మోసాలలో ఒకటిగా నిలిచింది. తాము నమ్మిన సంస్థ నుంచి స్మార్ట్ ఫోన్లు రాకపోవడంతో కోట్లాది మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పాటు, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు, వెండర్లు కోట్ల రూపాయల నష్టాలను చవిచూశారు. ఇప్పుడు ఇదే వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'ఆజాదీ 501' (Azadi 501) అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్ శివతేజ తెరకెక్కించారు. థర్స్ డే సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రచన రెడ్డి ములుముడి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. తాజాగా విడుదల చేసిన ఈ సిరీస్ ప్రమోషనల్ పోస్టర్ ప్రేక్షకులలో అమితమైన క్యూరియాసిటీని పెంచుతుంది. దేశంలోనే అతిపెద్ద మొబైల్ స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు, తెరవెనుక జరిగిన పొలిటికల్ అండ్ బిజినెస్ డ్రామాను ఈ సిరీస్ ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు. జూలై 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో తేజ కాట్రగడ్డ, హర్షవర్ధన్, బంటి ద్వారక, శశాంక్, గీతా భాస్కర్, రాకీ కృష్ణ, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. భారతదేశపు బిగ్గెస్ట్ డిజిటల్ స్కామ్ మిస్టరీని డీకోడ్ చేస్తూ రాబోతున్న ఈ 'ఆజాదీ 501' వెబ్ సిరీస్ ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. https://www.instagram.com/p/Da45snBpmOC/     Aha Telugu, Azadi 501 Web Series, Freedom 251 Scam, Smartphone Scam  
  -బ్లాస్ట్ జోన్ తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సొంతం  -ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలియడంతో అందరు షాక్  -ఎంతైనా ప్రీతీ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్, నెటిజన్స్  ప్రీతీ ముకుందన్(Preity Mukhundhan)ఏ ముహూర్తాన బ్లాస్ట్ జోన్ మూవీ చేసిందో గాని ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ పొందింది. ఈ చిత్రంలో గ్లామర్ కే సరికొత్త అర్ధం చెప్పేలా ప్రీతీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. బ్లాస్ట్ జోన్ కంటే ముందే చేసిన కన్నప్ప లో కూడా అదే స్థాయి పెర్ఫార్మ్ చేసి మెప్పించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రీతి ముకుందన్ నేపథ్యం గురించిన ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. శ్రీనివాస రామానుజన్(Srinivasa ramunajan).. భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ ప్రసిద్ధ గణిత మేధావి. ఆయన కుటుంబానికి ప్రీతీ వారసురాలని తెలుస్తోంది. అమ్మ తరపు బంధుత్వం ప్రకారం రామానుజన్ ప్రీతీకి ముత్తాత అవుతారట. 1887లో జన్మించి కేవలం 32 ఏళ్ల వయసులోనే 1920 ఏప్రిల్ 26న కన్నుమూసిన ఆ లెక్కల మాంత్రికుడి జీన్స్ ఈమెలో కూడా ఉన్నాయని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  కేవలం అందంతోనే కాకుండా చదువులోనూ ప్రీతి ముకుందన్ తన జీనియస్ మైండ్‌ను నిరూపించుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ఎన్ఐటి ట్రిచీ నుండి బీటెక్  డిగ్రీని పూర్తి చేసింది. కేవలం చదువే కాదు, సాంప్రదాయ నృత్యమైన భరతనాట్యంలో కూడా అద్భుతమైన ప్రావీణ్యం ఉంది.  Also read: విజయ్ పై వరలక్ష్మి శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. 2018 లోనే ఆ విషయం తెలుసు కళలు, మేధస్సు పుట్టుకతోనే అబ్బాయనడానికి మరో ఉదాహరణ కూడా ఉంది. అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ గిటార్ విద్వాంసుడు 'గిటార్ ప్రసన్న' కూడా ప్రీతి ముకుందన్‌కు స్వయానా మేనమామ అవుతారు. ఇలాంటి ఒక గొప్ప శాస్త్రవేత్తల, కళాకారుల విలక్షణమైన నేపథ్యం నుండి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ప్రీతీ ప్రస్తుత సినీ కెరీర్ విషయానికి వస్తే అల్లు అర్జున్ నుంచి రాబోయే ఒక ప్రతిష్టాత్మక చిత్రంలోనూ, ధనుష్ 56వ సినిమాలోని ప్రీతీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.   preity mukhundhan, srinivasa ramanujan    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.  తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి,  వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి.  అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ  పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో  తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల.   తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం  కోసం  మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్  అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా  సరిపోతారు. కేర్ టేకర్ ను  ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను  ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే  సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో,  మెడిసిన్ షెడ్యూల్ ను  నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో,  వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.  వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం  లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై  విషయాన్ని ముందుగానే చర్చించాలి.   తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ  ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం  గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు  ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత,   భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు.  కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా  వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి.  కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం,  కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..! ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే.. నిర్ణయం, కట్టుబడి ఉండటం.. ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది. కొత్త అలవాట్లు.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్య సహాయం.. స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు. 4-డి సూత్రం.. "4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.   స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.                                       *రూపశ్రీ.
వాము, జీలకర్రతో చేసే ఈ చూర్ణం గ్యాస్, అజీర్ణానికి ఎంత ఉపయోగమో తెలుసా.! గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమస్యలను సహజసిద్ధమైన ఆయుర్వేద పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.   ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద చూర్ణం తయారీ విధానాన్ని చూపించారు. వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల ఉప్పు వంటి మన వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో పూర్తి వివరంగా తెలిపారు. ఈ చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ సమస్యను తగ్గించడంలో, కడుపు ఉబ్బరాన్ని నియంత్రించడంలో, అసిడిటీ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: గ్యాస్, అసిడిటీకి సహజమైన ఆయుర్వేద చిట్కా ఇంట్లోనే చూర్ణం తయారు చేసే విధానం వాము, జీలకర్ర, ధనియాలు, సోంపు ప్రయోజనాలు చూర్ణం తీసుకునే సరైన సమయం, మోతాదు జీర్ణక్రియను మెరుగుపరచే సహజ మార్గాలు మీరు తరచూ గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద నిపుణులు అందించిన సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.