LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన ఫిర్యా దులను పరిశీలించిన స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఇద్దరు ఎమ్మె ల్యేలు పార్టీ మార్పిడి చేశా రని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం స్పీకర్ వాటిని డిస్మిస్ చేశారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి పై ఉన్న పార్టీ ఫిరాయింపు ఆరోపణల నుంచి వారికి క్లీన్ చిట్ లభించింది. ఫిర్యాదులపై అందిన పత్రాలు, ఆధారాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్ల డించింది.  పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత విధించాలనే అభ్యర్థనలను స్పీకర్ తిరస్కరించారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ మార్పిడి ఆరోపణలు రావడంతో వారి సభ్యత్వంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం నుంచి కూడా ఈ వ్యవహారంపై పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అయితే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ ఈ ఫిర్యాదులను కొట్టివే యడంతో వారి సభ్యత్వాలు కొనసాగనున్నాయి. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
బీజేపీ ఎట్టకేలకు మౌనం వీడింది. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.  రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో  బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్‌తో పొత్తు  ప్రసక్తే లేదన్నారు. ఇది బీజేపీ తుదినిర్ణయమని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో   బీఆర్ఎస్‌  రెండుసార్లు, కాంగ్రెస్‌  ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.   బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు.  తమ క్యాడర్ ను, లీడర్ లను కాపాడుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ బలమన్న రామచందర్ రావు.. రేవంత్ సర్కార్  ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో  ఘోరాతి ఘోరంగా విఫలమైందన్నారు.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, కుటుంబ పాలన వంటి అంశాల కారణంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన అటువంటి బీఆర్ఎస్ తో చేతులు కలిపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీతో.. తెలంగాణలో  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖపోరు అనివార్యం అని తేలిపోయింది. అలాగే బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి పొత్తు అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించినట్లైంది.  అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో  బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించింది. ఇంత కాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్నా.. ఇంత వరకూ కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే.. ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రశక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.  
వన్ నేషన్ వన్ ఎలక్షన్  కరెక్ట్ కాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించడానికే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు అంటోందని విమర్శించారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గిపోతుందని విమర్శించారు.   అదికారాలన్నీ కేంద్రం చేతుల్లోకే వెళ్లిపోతాయన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంటే  సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమే అవుతుందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది విఘాతమేనని స్టాలిన్ పేర్కొన్నారు. జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.   కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.   ప్రస్తుత   సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ నెల 20 వరకూ సాగే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమెదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికల నిర్వహణను ప్రజాస్వామ్యంపై దాడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ అభివర్ణించారు. అన్ని రాజకీయ పార్టీలూ దీనిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.  కాగా   మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ  లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరపాలన్న వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనపై గతంలో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.  
ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెచ్చరిల్లడానికి కారణంగా రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల పాలనే కారణమని ఆరోపించారు.   తూర్పుగోదావరి జిల్లా  దుద్దుకూరులో  నిర్వహించిన  ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో ఆమె జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.  జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు.  జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.  ప్రత్యేక హోదా కోసం మోడీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని విమర్శించారు.  రాష్ట్ర ప్రజలు గత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని దారుణంగా ఓడంచడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కోసం బతిమలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
  రాయలసీమ ముఖద్వారం, అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన 'రాజకీయం' మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే.. సొంత గూటిలోనే సాగుతున్న 'ఆధిపత్య పోరు' ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాసరాజుల  మధ్య సాగుతున్న అంతర్యుద్ధం కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా, రాబోయే స్థానిక సమరానికి సవాలుగా మారింది. *ఆధిపత్య పోరు టిడిపి ఇన్చార్జి ​చమర్తి జగన్ మోహన్ రాజు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆయన, రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు, మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో యల్లటూరు  శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతుడు, మృదుస్వభావి అనే ఇమేజ్‌తో ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు. *​అసలు చిచ్చు ఎక్కడ? ​రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న 'రాజుల' వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూలకారణమని పరిశీలకులు భావిస్తున్నారు. *​ప్రోటోకాల్ రచ్చ:  ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా 'ముందువరుస' ఎవరిది? అనే అంశంపై ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా "అది మా నాయకుడి చలవే" అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితులు కూటమి క్యాడర్ పై ప్రభావం చూపుతోంది.ఒకే కూటమి  కింద ఉన్నప్పటికీ, కార్యకర్తలు "జగన్ మోహన్ రాజు వర్గం", "శ్రీనివాసరాజు వర్గం"గా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది. *​వైఎస్సార్‌సీపీకి 'అయాచిత' బలం! ​ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ అంతర్గత కలహాలు వరంగా మారాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వంటి ఉద్ధండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ, ఇక్కడ "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న చందంగా ఒకరిని ఒకరు నష్టం పరుచుకునే  క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. *​అధిష్టానం మౌనం..   ​ఈ ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే, ఇద్దరినీ వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజంపేట రాజకీయ యవనికపై ఈ ఇద్దరు 'రాజుల' పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే, మరొకరు మారుతున్న సమీకరణాలను నమ్ముకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు.. కానీ, నేనే రోజు..నేనే రాజు అన్న చందంగా ఎవరికి వారు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది
ALSO ON TELUGUONE N E W S
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొరియన్ రొమాంటిక్ డ్రామా ఫ్రెండ్ తమ్ముడితో 35 ఏళ్ళ మహిళ లవ్ స్టోరీ కొరియన్ సిరీస్ లకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. పలు సిరీస్ లు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొరియన్ రొమాంటిక్ డ్రామాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఓ రొమాంటిక్ డ్రామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2018 లో వచ్చిన కొరియన్ సిరీస్ 'సంథింగ్ ఇన్ ది రెయిన్'(Something in the Rain). సన్ యే-జిన్, జంగ్ హే-ఇన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కి.. అహ్న్ పాన్-సియోక్ దర్శకత్వం వహించారు. 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ, తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన స్నేహితురాలి తమ్ముడితో ప్రేమలో పడితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే కోణంలో ఈ సిరీస్ నడుస్తుంది. ఓటీటీ వేదికలు నెట్ ఫ్లిక్స్, ఎంఎక్స్ ప్లేయర్ లలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కథ ఏంటంటే.. జిన్-ఆహ్ అనే మహిళ ఓ కాఫీ హౌస్ లో పనిచేస్తుంటుంది. అక్కడ మహిళలను చిన్నచూపు చూస్తుంటారు. మహిళా ఉద్యోగులకు బాస్ నుంచి లైంగిక వేధింపులు కూడా ఎదురవుతుంటాయి. 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకుండా, ఆఫీస్ లో బాస్ వేధింపులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న జిన్-ఆహ్ జీవితంలోకి.. జూన్-హుయి అనే యువకుడు వస్తాడు. అతను ఎవరో కాదు.. ఆమె ఫ్రెండ్ తమ్ముడే.  వీడియో గేమ్ డెవలపర్ గా పని చేసే అతను.. విదేశాల నుంచి తిరిగి వస్తాడు. మొదట్లో అతన్ని ఓ తమ్ముడు లాగానే చూస్తుంది. క్రమంగా ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. ముఖ్యంగా ఓ రోజు వర్షంలో గొడుగు కింద నడుస్తున్నప్పుడు ఇద్దరూ బాగా దగ్గరవుతారు. అప్పటినుంచి ముద్దు ముచ్చట్లతో సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలుస్తుంది. వయస్సు తేడా వల్ల వారి ప్రేమ కథకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అలాగే ఆఫీస్ లో వేధిస్తున్న బాస్ కి 'జిన్-ఆహ్' బుద్ధి చెప్పిందా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. మంచి లవ్ స్టోరీతో పాటు మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపిన ఈ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఐఎండీబీలో ఈ సిరీస్ కి 8 రేటింగ్ ఉంది. Also Read: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'పెన్నుమ్ పోరాట్టమ్'
  -మొన్న ఎంజిఆర్ పై నోరు జారిన రాజేంద్రప్రసాద్  -స్పందించిన విశాల్, నాజర్  -క్షమాపణ చెప్పాలని డిమాండ్  ఇటీవల 'కళాప్రపూర్ణ కత్తి కాంతారావు'(kantharao)జాతీయ పురస్కారంని నటకిరీటి రాజేంద్రప్రసాద్(Rajendraprasad)అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు జానపద చిత్రాల్లో కాంతారావు ప్రతిభని చూసి తమిళ గొప్ప నటుడు ఎంజిఆర్ ఉచ్చపోసుకునే వాడని మాట్లాడాడు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే దిగులు తెలుగు సినిమా ప్రేమికుల్లో ఉంది.వాళ్ళు అనుకున్నట్టుగానే స్పందించడం స్టార్ట్ అయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.  ప్రముఖ నటుడు విశాల్(Vishal)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'డియర్ రాజేంద్రప్రసాద్ సర్, మీ మీద ఎంతో గౌరవం ఉంది. కానీ మీరు దివంగత లెజెండరీ నటుడు, వన్ అండ్ ఓన్లీ ఎంజిఆర్ గురించి చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, తమిళనాడుకి గొప్ప లీడర్. కాంతారావు గారిని పొగడాలనే ఉద్దేశంతో మీరు ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమైంది. అయితే అదే సమయంలో ఎంజిఆర్ ని తక్కువగా, చులకనగా చేసి మాట్లాడిన అవసరం లేదు. ఆయన, మా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయా  రు. అలాంటి నటుడి గురించి ఇలా మాట్లాడి, తమిళనాడు ప్రజల మనోభావాలని  దెబ్బతీశారు. దయచేసి ముగింపు ఇస్తారని కోరుతున్నా. మిమ్మల్ని క్షమాపణలు చెప్పాలని కోరుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ ఒక వేళ భవిష్యత్తులో నేను ఏదైనా నోరుజారి మాట్లాడితే, బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి వెనకాడనని తెలిపాడు. సదరు ట్వీట్ ని తెలుగు మూవీ అసోసియేషన్‌ని కూడా ట్యాగ్ చేశాడు. also read: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న తెలంగాణ సాంగ్.. కానీ డబ్బులు ఎంత వచ్చాయో తెలుసా!  సీనియర్ అండ్ లెజండ్రీ యాక్టర్ నాజర్(Naasar)కూడా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలని ఖండిస్తు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసాడు. పలువురు నటులు, టెక్నీషయన్స్ నుంచి కూడా క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. విశాల్, నాజర్ ఎంటైర్ తమిళ చిత్ర పరిశ్రమ నటుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నడిగర్ సంఘంకి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీగా ఉన్నారు.    
  -యూట్యూబ్ లో తెలంగాణ సాంగ్స్ జోరు  -రికార్డు వ్యూస్ తో ఎన్నో సాంగ్స్  -అదే దారిలో మరో పాట తెలంగాణ(Telangana)పల్లెల పరిమళాన్ని వెదజెల్లే ఎన్నో పాటలు సంగీత, సాహిత్య ప్రియుల్ని అలరిస్తూ వస్తున్నాయి. దీంతో రికార్డు వ్యూస్ వాటి వశమవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ ఆడపడుచుల మనో వేదనని పూస గుచ్చినట్టుగా చెప్పే  సాంగ్స్ కూడా పైన చెప్పుకున్న విషయాల్లో వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా తమ పెనిమిటి, పరాయి స్త్రీ మోజులో పడి తనని పట్టించుకోవడంలేదనే సాంగ్స్ ఎక్స్ పైరీ డేట్ కి చాలా దూరంగా ఉంటున్నాయి. అలాంటి ఒక సాంగ్ యూట్యూబ్ లో తన హవాని కొనసాగిస్తు వస్తుంది. డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   'ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ'.. జానపద స్టైల్ లో కూడిన ఈ సాంగ్ ఒన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజు నుంచే యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని రాబడుతు ప్రస్తుతం 47 మిలియన్ల వ్యూస్ దగ్గర ఉంది. దీన్ని బట్టి తెలంగాణ జానపద సాంగ్స్ కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ పల్లెల్లో ఉన్న ఎన్నో అచ్చ తెలుగు పదాల్ని తెలియచెప్పడం కూడా ఈ సాంగ్ స్టైల్. also read:  Anupama Parameswaran: ప్రెగ్నెంట్‌గా అనుపమ పరమేశ్వరన్.. సైలెంట్‌గా ఓటీటీలోకి   ఈ సాంగ్ ని చాలా మంది డీజే రీమిక్స్ చేసారు. అవి కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.  కాని సాంగ్ ని రాసిన జోగుల వెంకటేష్ కి ఎలాంటి రెమ్యునరేషన్ ని ఇవ్వలేదు. ఈ విషయాన్నీ స్వయంగా  తానే గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడి చేసాడు.లావణ్య ఆలపించగా  జోగుల వెంకటేష్ , సౌజన్య అయాన్. మన్ప్రీత్ కౌర్ ముఖ్యమైన క్యారెక్టర్స్. సుమారు ఐదు లక్షలతో సాంగ్ ని రూపొందించారు.    
-అనుపమ పరమేశ్వరన్ కొత్త మూవీ -ఎప్పుడు రిలీజ్ అయ్యింది. -సదరు సబ్జెట్ ఏంటి  తెలుగుప్రేక్షకుల హృదయాలని ఖాళీగా ఉంచని మరో ముద్దుగుమ్మ 'అనుపమ పరమేశ్వరన్'(Anupama parameswaran). షార్ట్ పీరియడ్ లోనే ఆ హృదయాల్ని గెలుచుకొని అభిమాన నటిగా కూడా మారింది. ఆ అభిమానం యొక్క  రేంజ్ ఎంత స్థాయికి వెళ్లిందంటే టిల్లు స్క్వేర్ లో కొంచం రొమాంటిక్ యాంగిల్ ఉన్న క్యారక్టర్ లో కనిపిస్తేనే అభిమానులు విలవిలలాడిపోయారు. అంతలా ఆమెని ఆరాధిస్తున్నారు. మరి ఆమె కొత్త సినిమా ఓటిటి లో కి వచ్చిందంటే ఊరుకుంటారా! ఎప్ప్పుడు వచ్చింది అనే ప్రశ్నలు వేస్తూ ఓటిటి ముందు వాలిపోతారు. పైగా ప్రీవియస్ మూవీ బైసన్ లో అనుపమకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే అప్ సెట్ లో కూడా వాళ్లంతా ఉన్నారు. మరి ఓటిటిలో ఉన్న మూవీ చుద్దాం   లాక్ డౌన్..(lockDown)థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కగా అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించింది. ఇదేంటి ఎప్పుడు తెరకెక్కించారు, ప్రమోషన్స్ కూడా ఎక్కడ కనపడలేదు కదా అని అనుకుంటున్నారా! మీరు అనుకునేది నిజమే. లాక్ డౌన్ మూవీ ఈ ఏడాది స్టార్టింగ్ లో జనవరి 30 న తమిళనాట రిలీజయ్యింది. కాకపోతే పెద్దగా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇప్పుడు కూడా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా  వచ్చేసింది. తమిళంతో పాటు  తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. also read: Tammareddy: ఇండస్ట్రీ పెద్ద దిక్కుపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు వైరల్.. ఉంటే కనుక ఎవరు ! కథ పరంగా చూసుకుంటే మధ్యతరగతికి చెందిన అనిత అనే పెళ్లి కాని యువతి గర్భం దాలుస్తుంది. షాక్ అయిన అనిత గర్భాన్ని తొలగించుకోవాలని అనుకుంటే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల అనిత బయటకి వెళ్లలేకపోతుంది. అన్ని హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లనే ట్రీట్ చేస్తారు. మరి అనిత పరిస్థితి ఏంటనేదే లాక్ డౌన్ కథ. లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా ఎ.ఆర్.జీవా(Mr jeeva)డైరెక్టర్. చార్లీ, లివింగ్ స్టోన్, నిరోషా ముఖ్యమైన క్యారక్టర్ లలో కనిపించారు.    
  మూవీ : జాకీ నటీనటులు: యువన్ కృష్ణ,  రిధాన్ కృష్ణ, అమ్ము అభిరామి, మధుసూదన్ రావు ఎడిటింగ్: ఎన్. బి శ్రీకాంత్ మ్యూజిక్: శక్తి బాలాజీ సినిమాటోగ్రఫీ: ఎన్. ఎస్ ఉత్తయ్ కుమార్ నిర్మాతలు: ప్రేమ కృష్ణదాస్ దర్శకత్వం: ప్రగభాల్ ఓటీటీ : అమోజాన్ ప్రైమ్ కథ: మధురైలో రాముడు (యువన్ కృష్ణ) అనే యువకుడు షేర్ ఆటో నడుపుకుంటూ బ్రతుకుతుంటాడు. అతనికి ఒక అక్క, మేనకోడలు ఉంటారు. వారే అతని కుటుంబం. ఆటో నడుపుతున్న రాముడికి 'మీను' (అమ్ము అభిరాభి) పరిచయమవుతుంది. ఆ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అదే విలేజ్ కి పెద్దమనిషిగా చక్రవర్తి (మధు సూదన్ రావు) ఉంటాడు. ఆయన మేనల్లుడే కోబ్రా కార్తీక్ ( రిధాన్ కృష్ణ). అతను ఎక్కువగా పొట్టేళ్ల పోటీలలో పాల్గొంటాడు. అయితే ఆ ఊర్లో పొట్టేళ్ల పోటీలో గెలిచినవారికి 'జాకీ' అనే ఒక మెడల్ ఇస్తుంటారు. ఆ మెడల్ కారణంగా వాళ్లకి ఊళ్లో ఎంతో గౌరవం లభిస్తుంటుంది. ఆ మెడల్ ఏడాది నుంచి కార్తీక్ దగ్గరే ఉంటుంది. అలాంటి కార్తీక్ పొట్టేలుతో, రాముడి పొట్టేలు 'కాళీ' తలపడుతుంది. ఆ పోటీలో అనుకోకుండా కాళీ గెలుస్తుంది. దాంతో రాముడికి జాకీ మెడల్ వస్తుంది. తను చేజారిపోయిన మెడల్, రాముడికి దక్కడాన్ని కార్తీక్ తట్టుకోలేకపోతాడు. అందుకోసం మరోసారి తనతో పోటీకి తలపడేలా రాముడిని రెచ్చగొడతాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? రాముడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది మిగతా కథ. విశ్లేషణ: సినిమా మొత్తం పొట్టేళ్ళ మధ్య పందెం సాగుతుంది. ఇందులో లవ్, రిలేషన్స్, ఫ్రెంఢ్ షిప్ ఉన్నప్పటికి పొట్టేళ్ళ మధ్య పోటీనే హైలైట్ చేశారు మేకర్స్. దానివల్ల క్యారెక్టర్ల కంటే కూడా పొట్టేళ్ళే ముఖ్యపాత్రలుగా కనిపిస్తాయి.‌ ఇది ఆడియన్ కి అంతగా కనెక్ట్ కాలేకపోవచ్చు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా లేకపోవడం.. సినిమా ‌మొదల్లో హీరో ఫ్యామిలీతో హ్యాపీగా గడిపే సీన్లు చూపించినా ఆ తర్వాత అవి ఎక్కడా కనపడవు..ఎంత సేపు పొట్టేళ్ళ పోటీ.. అందులో‌.. గెలవాలి.. లేదంటే వ్యూహం‌ పన్నాలని ఎక్కువగా ఉంది. అది సినిమాకి పెద్ద మైనస్ గా ఉంది. అటు హీరో, ఇటు విలన్ నటన కాస్త వీక్ గానే అనిపిస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా పలకలేదు. క్లైమాక్స్ పర్వాలేదు. కొన్ని సీన్లు కొత్తగా ఉన్నాయి. అయితే వాటి కోసం సినిమా చూడాలా అంటే లేదనే చెప్పాలి. కొత్తదనం లేని పాయింట్ తో వచ్చిన ఈ జాకీకి ఎవరు పెద్దగా కనెక్ట్ కాలేరు.  పొట్టేళ్ల ఫైట్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువైపోవడం, మిగతా ఎమోషన్స్ శాతం తగ్గడం వలన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. ఎన్. ఎస్ ఉత్తయ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. శక్తి బాలాజీ బిజిఎమ్ అండ్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: రాముడుగా యువన్ కృష్ణ,కోబ్రా కార్తీక్ గా రిధాన్ కృష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక మిగతా వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.  ఫైనల్ గా : జస్ట్ ఓకే. రేటింగ్ : 1.5 / 5  ✍️. దాసరి మల్లేశ్
-హాట్ టాపిక్ గా మారిన తమ్మారెడ్డి వ్యాఖ్యలు  -ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు! -దాసరి తర్వాత ఎవరైనా ఉన్నారా! -ఇంక పెద్ద దిక్కు రానట్టేనా! సుదీర్గ కాలం నుంచి తెలుగు సినిమా తన మనుగడ కొనసాగిస్తు కోట్లాది మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. సినిమా అలవాటు లేని వాళ్ళు సైతం అనుకోకుండా సినిమా చూస్తే ఇక సినిమా చూడటం అనేది తన నిత్య దినచర్యగా చేసుకుంటారు. ఈ విషయంలో తిండి, నిద్ర, కాలకృత్యాలు అనేవి తనకి ఎదురొచ్చినా డోంట్ కేర్ అనే నైజం. అంతటి బలమైన సాధనం సినిమా. మరి అలాంటి సినిమాని తెరకెక్కించే 24 క్రాఫ్ట్స్ లో ఒక్కోసారి సమస్యలు వస్తాయి. తద్వారా సినిమా కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayanarao)వ్యవహరించేవాడు. కానీ ఆయన తర్వాత పెద్ద దిక్కు ఎవరనే మాటలు తరచుగా వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja)చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తమ్మారెడ్డి 'వదలా'(vadhala)అనే మూవీతో మరోసారి నిర్మాతగా అడుగుపెడుతున్నాడు. నిన్న ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక మీడియా ప్రతినిది తమ్మారెడ్డితో 'ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అని అడగటం జరిగింది. అందుకు తమ్మారెడ్డి మాట్లాడుతు 'ఇండస్ట్రీలో పదవులు ఉండవు. పెద్ద దిక్కు అనేది పదవి కాదు. ఎవరైనా సరే వాళ్లు చేసే పనులని బట్టి పెద్ద దిక్కు అవుతారు. అప్పట్లో దాసరి నారాయణరావు గారు తాను చేసే పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యారు. దాంతో అందరం ఆయన దగ్గరకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఆయన లేరు కాబట్టి, పెద్ద దిక్కు కూడా ఇంకెవరూ లేరు. నాకు తెలిసి అలాంటి వ్యక్తి రావడం కూడా జరగదని బదులిచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. also read: UStaad Bhagat Singh: మహేష్ బాబు ఫ్యాన్స్ కి క్షమాపణలు.. ఉస్తాద్ భగత్ సింగ్ కి మద్దతు ఇస్తారా!    'వదలా'మూవీ చూసుకుంటే జగపతి బాబు(Jagapathibabu)లయ, హృతిక శ్రీనివాసన్ జత కడుతుండగా వంశీ కృష్ణ ఆకెళ్ల(Vamsikrishna akella)దర్శకుడు. కిషోర్ నాయుడు మరో నిర్మాత. గ్లింప్స్‌ అయితే ఆసక్తికరంగా ఉంది.  
ప్రస్తుతం గ్రాఫిక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. అయితే సీజీ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కెమెరామెన్ పాత్ర అత్యంత కీలకం. తాజాగా 'వదలా' మూవీ ఈవెంట్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు(Chota K Naidu ) ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజీ సినిమాల్లో కెమెరామెన్ పోరాటం ఇప్పుడు సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ కాకుండా, సీజీ కోసం ప్రత్యేకంగా ఒక టెక్నీషియన్ ఉంటున్నాడు. ఆ టెక్నీషియన్ అనుమతి లేకుండా ఇప్పుడు ఒక్క ఫ్రేమ్ కూడా తీయడం లేదని ఛోటా కె. నాయుడు వివరించారు.  "నేను పెద్ద పుడింగిని, నాకు నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి అని నా ఇగో చూపిస్తే ఇక్కడ వర్కవుట్ అవ్వదు" అని ఛోటా చాలా నిజాయితీగా చెప్పారు. సీజీ టెక్నీషియన్ కి ఏం కావాలో అదే చేస్తున్నామని అన్నారు. సీజీ టెక్నీషియన్ అప్రెంటిస్ అయినా, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడైనా సరే.. వాళ్లకు ఏం కావాలో అదే అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే కొందరు అవుట్ పుట్ బాగుంటే వాళ్ళు క్రెడిట్ తీసుకొని, అవుట్ పుట్ బాలేకపోతే మాత్రం సినిమాటోగ్రాఫర్స్ ని నిందిస్తున్నారని ఛోటా కె. నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంజి 'తల ఎత్తుకుని'.. విశ్వంభర 'తల వంచుకుని'.. గతంలో 'అంజి' వంటి అద్భుత దృశ్య కావ్యాన్ని కెమెరామెన్ గా పనిచేసిన ఛోటా కె. నాయుడు, ఇప్పుడు 'విశ్వంభర'(Vishwambhara) సినిమాకు పని చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ పనిచేసే విధానం మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంజి సినిమా కోసం మేము ఎంతో గర్వంగా, తల ఎత్తుకుని పని చేశాం. విశ్వంభర విషయానికి వస్తే, తల వంచుకుని పని చేయాల్సి వస్తోంది. దీనికి కారణం ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. అంత భారీ సినిమా తీస్తున్నప్పుడు, తన అహం కంటే సినిమా అవుట్‌పుట్ ముఖ్యమని అన్నారు. ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకుని, ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ శ్రమిస్తోందని ఛోటా కె. నాయుడు తెలిపారు. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాలు, ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూలు, తాజా అప్‌డేట్స్ కోసం మా 'తెలుగువన్ సినిమా'(TeluguOne Cinema) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
జీవితంలో మనం చేసే ప్రతి పోరాటం, పడే ప్రతి కష్టం మన వారి కోసమే. కానీ, మనం ఎవరి కోసమైతే రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నామో, అదే వ్యక్తులు మనల్ని అపార్థం చేసుకుంటే ఆ మనసు పడే వేదన వర్ణనాతీతం. ‘ఎవరి కోసమే ఆ సంపాదన?’ అనే ప్రశ్న వెనుక దాగి ఉన్న కన్నీటి కథ ఇది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న వదిన, మరోవైపు కనీసం తిండికి కూడా లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇంటి ఆడబిడ్డ తన అవసరాలను సైతం పక్కన పెట్టి ఆఫీసుకెళ్లి కష్టపడుతుంటే, తోటివారు ఆమెను విమర్శించడం ఎంతటి దౌర్భాగ్యం? ‘నోరు ఉంది కదా అని ఎదుటివారిని తప్ప్పుబడితే ఏమొస్తుంది?’ అనే ఆవేదన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె సంపాదించే 600 రూపాయల జీతం ఆమె విలాసాల కోసం కాదు. అది ఒక గొప్ప లక్ష్యం కోసం. ఆ వివరాలు తెలిస్తే ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. తన సోదరి హారతి భవిష్యత్తు కోసం, కళ్ళు లేని తమ్ముడు రాజు కంటి ఆపరేషన్ కోసం, మరో సోదరి సుమతి వివాహం కోసం, అన్నయ్య మూర్తి పిల్లలు కుమార్,  సీత బంగారు భవిష్యత్తు కోసం.. ఇలా తను సంపాదించినదంతా ఆ కుటుంబం కోసమే దాచిపెడుతోంది. ఒక పిచ్చుక తన గూడు కోసం ఒక్కో గింజా తెచ్చినట్లుగా, ఆమె తన కుటుంబం కోసం ఒక్కో రూపాయిని కూడబెడుతోంది. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, అందరి కోసం బతుకుతున్న ఆ ఆడబిడ్డ త్యాగం నిజంగా వెలకట్టలేనిది. ‘ఈ సంసారం బరువు బాధ్యతలు మోయడానికి ఒక మగాడు అంటూ ఏనాడు నిలబడతాడో, ఆనాడే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను’ అని ఆమె చెప్పే మాటలు నేటి సమాజానికి ఒక హెచ్చరిక. తాగుడుకు బానిసైన వ్యక్తి ఇంటి పెద్దగా మారినప్పుడు, బాధ్యతను తన భుజాన వేసుకున్నప్పుడు మాత్రమే ఆమె మనసు శాంతిస్తుంది. మూర్తి వంటి వ్యక్తులు తమ తప్పు తెలుసుకుని, ‘నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు’ అని గ్రహించినప్పుడే ఆ కుటుంబానికి నిజమైన వెలుగు వస్తుంది. బంధాలు అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవడం. స్వార్థం వీడి, కుటుంబం కోసం కష్టపడే వారిని గౌరవించినప్పుడే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. మన కోసం శ్రమించే వారి కన్నీటి వెనుక ఉన్న కారణాన్ని గుర్తించమని తెలియజెప్పే ఈ గాథ మనందరికీ ఒక పాఠం. ఇంతటి ఉద్వేగభరితమైన సన్నివేశం ‘అంతులేని కథ’ చిత్రంలోనిది. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయప్రద ప్రధాన పాత్ర పోషించారు. ఆమెకు అన్నయ్యగా రజినీకాంత్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తారు. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా, ఆలోచన రేకెత్తించే విధంగా సాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల సమాహారమే ఈ వీడియో. వీక్షించండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
హాట్ టాపిక్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్' బిజినెస్  రికార్డు ధరకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  పవన్ కళ్యాణ్ గత చిత్రం 'ఓజీ' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు, 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ బిజినెస్ రూ.130 కోట్లని సమాచారం. నైజాంలో రూ.50 కోట్లు, ఆంధ్రాలో రూ.60 కోట్లు, సీడెడ్ లో రూ.20 కోట్లతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.130 కోట్ల బిజినెస్ జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.150 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశముంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది మూవీ టీమ్. థర్డ్ సింగిల్ 'కాలరే ఎత్తరా'ను మార్చి 12న విడుదల చేస్తుండగా, ట్రైలర్ ను మార్చి 14న విడుదల చేయనున్నారు. అలాగే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. https://x.com/Theteluguone/status/2031718217295798393
సినిమా అంటే కేవలం వెండితెరపై కనిపించే గ్లామర్ మాత్రమే కాదు, దాని వెనుక ఎన్నో ఏళ్ల స్నేహం, కష్టం, మరెన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఇటీవల జరిగిన "వదల"(Vadhala) సినిమా గ్లింప్స్ లాంచ్ వేడుకలో నటుడు జగపతి బాబు(Jagapathi Babu) చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసేలా, నవ్వులు పూయించేలా సాగింది. చిత్ర యూనిట్‌తో తనకున్న అనుబంధాన్ని, షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన మనసు విప్పి పంచుకున్నారు. 'లెజెండ్' తర్వాత దక్కిన ఆ బోనస్ "లెజెండ్" సినిమా నుంచి తనకు ఒక్క హీరోయిన్ కూడా ఉండటం లేదని, అందరూ సి.జి (CG) వర్క్ తోనే సరిపెడుతున్నారని జగపతి బాబు సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ "వదల" సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం తనకు దక్కిన ఒక పెద్ద బోనస్ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. లయలోని 'శూర్పణఖ'ను చూసి షాక్ అయ్యాను నటి లయ తనకు ఎంతో కాలంగా అత్యంత సన్నిహిత మిత్రురాలని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. ఆమె చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే తనకు తెలుసని అన్నారు. 'హనుమాన్ జంక్షన్' వంటి విజయవంతమైన సినిమాల్లో నటించామని తెలిపారు. "వదల" సినిమాలో ఆమె నటన గురించి చెబుతూ, ఒక సన్నివేశంలో ఆమెలోని "శూర్పణఖ" బయటకు రావడం చూసి తాను నిజంగానే కంగారు పడ్డానని, అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయిందని ప్రశంసించారు,. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమెకు ఉన్న రెండు సాలిడ్ సీన్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెర వెనుక అసలైన హీరోలు ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ప్రధాన కారణమని, ఆయనే ఈ సినిమాకు అసలైన హీరో అని జగపతి బాబు కొనియాడారు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమా చేశారన్నారు. తన ఎనర్జీతో సెట్‌లోని అందరిలోనూ ఉత్సాహం నింపారని తెలిపారు. అలాగే నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి మాట్లాడుతూ, ఈ వయసులో కూడా ఆయన రాత్రంతా మేల్కొని ఒక యువకుడిలా కష్టపడటం చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. భోపాల్ షూటింగ్ కష్టాలు ఈ సినిమా షూటింగ్ భోపాల్‌లో జరిగినప్పుడు వసతులు సరిగ్గా లేకపోయినా, టెక్నీషియన్లు మరియు నటీనటులు ఎంతో ఓపికతో పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. కనీసం రెస్ట్ రూమ్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో హీరోయిన్లు ఎటువంటి ఫిర్యాదు చేయకుండా సహకరించడం తనను ఆకట్టుకుందని ఆయన అన్నారు.  టైటిల్ ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే, సంగీత దర్శకుడు కార్తీక్ పంపిన "వదల" అనే బిట్ సాంగ్ విన్న వెంటనే అది తనను ఎంతో ఆకట్టుకుందని, అక్కడి నుంచే ఈ టైటిల్ ఖరారు అయిందని వెల్లడించారు. "వదల" సినిమా కేవలం ఒక వినోదభరిత చిత్రం మాత్రమే కాదు, ఒక గొప్ప బృందం పడిన కష్టానికి నిదర్శనం. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయాల్సిన బాధ్యత మీడియా మరియు అభిమానులదేనని జగపతి బాబు కోరారు. మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశేషాలు, ఇంటర్వ్యూలు మరియు తాజా అప్‌డేట్స్ కోసం మా 'తెలుగువన్ సినిమా'(TeluguOne Cinema) ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం.  అటు ఏడు తరాలు,  ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది.  పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది.  అబ్బాయి విషయంలో అయినా, అతని కుటుంబం పరంగా అయినా, ఆర్థిక విషయాలు అయినా.. ఏ సమస్య వచ్చినా అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందుల పాలవుతారు. ఒకప్పుడు సమస్య వస్తే.. సర్దుకుపోవాలని అనుకునేవారు అమ్మాయిలు. కానీ.. నేటికాలంలో అలా లేదు.. సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు ముఖ్య కారణం.. అబ్బాయిలు, అతని కుటుంబ సభ్యులు అయినప్పుడు ఆమె వారిని ఎదిరించడానికి సిద్దపడుతోంది, ప్రశ్నిస్తోంది,  కానీ ఒత్తిడి అనుభవించేది కూడా అమ్మాయిలే. ఈ గొడవలు ఏమీ లేకుండా వివాహం తర్వాత జీవితం బాగుండాలంటే.. పెళ్లికి ఒప్పుకోవడానికి ముందు ప్రతి అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని అడగవలసిన ప్రశ్నలు కొన్నిఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. కెరీర్ లక్ష్యం..  సంబంధం ఫైనల్ కాబోతుంటే లేదా ఇప్పటికే ఫైనల్ అయి ఉంటే,  కాబోయే భర్తను అతని కెరీర్ లక్ష్యాల గురించి అడగాలి. దీని గురించి ముందుగానే చర్చించడం మంచిది. అతను తన కెరీర్ గురించే కాదు.. అమ్మాయి  కెరీర్‌కు మద్దతు ఇస్తాడా?  లేదా.. ఈ విషయాలు ముందే మాట్లాడటం మంచిది.  ఎందుకంటే వివాహం తర్వాత కెరీర్ ను పక్కన పెట్టి ఇంటిని చూసుకోమని చెప్పేవారు చాలా ఎక్కువమంది ఉంటారు. డబ్బు.. డబ్బు గురించి మాట్లాడితే.. ఈ అమ్మాయి మనీ మైండెడ్ అని ఎవరైనా అనుకుంటారేమో అని వెనకడుగు వేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కానీ పెళ్లి తర్వాత జీవితంలో చాలా వరకు డబ్బు కారణంగా గొడవలు వస్తుంటాయి.  కాబోయే భర్తతో ముందుగానే డబ్బు నిర్వహణ గురించి చర్చించాలి. అతను డబ్బును ఎలా తెలివిగా ఆదా చేస్తాడో, అతను అప్పుల్లో ఉన్నాడా లేదా  అనే విషయాలు మాట్లాడాలి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఇంటిని  ఎలా మెయింటైన్  చేస్తారనే విషయం కూడా చర్చించాలి. లైఫ్ స్టైల్.. సంబంధాన్ని నిర్ధారించుకునే ముందు అతని జీవనశైలి గురించి ప్రశ్నలు అడగాలి.  భర్త జీవిత లక్ష్యాలను ప్రతి అమ్మాయి అడిగి  తెలుసుకోవాలి. అతనికి ప్రయాణం చేయడం ఇష్టమా? అతనికి సినిమాలు చూడటం ఇష్టమా?  రోజును ఎలా మలచుకుంటాడు.. ఇవన్నీ చర్చిస్తే.. వీటి సమాధానల మీదే అతని వ్యక్తిత్వం కూడా స్పష్టంగా తెలుస్తుంది. పర్సనల్ సేవింగ్స్.. సంబంధం ఇక ఖాయం అనుకున్నప్పుడు వారితో వ్యక్తిగత పొదుపు గురించి చర్చించాలి.  వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. వారి ప్లానింగ్స్ ప్రకారమే భార్య భవిష్యత్తు అతనితో ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. దీని వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ముందే పరిష్కారమవుతాయి. లోన్ లు,  అప్పులు..  కాబోయే భర్తకు ఏవైనా అప్పులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అతని కుటుంబానికి ఏవైనా పెద్ద అప్పులు ఉన్నాయా లేదా బ్యాంక్ లోన్లు వంటివి ఉన్నాయా  అని కూడా ముందుగానే అడగాలి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందే అమ్మాయిలు కాబోయే భర్తను అడిగి క్లియర్ చేసుకుంటే వివాహం తర్వాత జీవితం చాలా వరకు సంతోషంగా గడిచిపోతుంది.                                        *రూపశ్రీ.
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక. ఆడవారికైనా, మగవారికైనా ఒత్తైన కురులు ఉండాలని కోరుకోవడం సహజం. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దీనికి పరిష్కారాలు ఏమిటి? డాక్టర్ల అభిప్రాయం ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను Expert Dermatologist Dr. Sunaina Shaik (MD, DNB Dermatology, FRGUHS Trichology) విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి.  మనం జుట్టుపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి? (Why Should We?) జుట్టు రాలడం అనేది కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు, అది మన శరీరంలో ఉన్న అంతర్గత మార్పులకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. • ఆత్మవిశ్వాసం: ఒత్తైన జుట్టు మన అందాన్ని పెంచడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. • ఆరోగ్య సూచిక: జుట్టు అధికంగా రాలుతుంటే అది మన శరీరంలో పోషకాహార లోపం (Vitamin D, Iron, Zinc) లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. • ముందస్తు జాగ్రత్త: ప్రారంభంలోనే జుట్టు రాలడాన్ని గమనించి తగిన చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో జుట్టు పల్చబడకుండా (Hair Thinning) చూసుకోవచ్చు. ఏం చేయకూడదు? (What Not To Do) తెలిసో తెలియకో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు జుట్టు విపరీతంగా రాలడానికి కారణమవుతాయి. వాటిని వెంటనే ఆపండి: 1. బిగుతైన హెయిర్ స్టైల్స్ (Tight Hairstyles): జుట్టును గట్టిగా లాగి ముడి వేయడం లేదా పోనీటైల్స్ వేయడం వల్ల 'ట్రాక్షన్ అలోపేషియా' (Traction Alopecia) వచ్చి నుదురు భాగంలో జుట్టు రాలిపోతుంది. 2. టైట్ హెల్మెట్లు వాడటం: మగవారిలో టైట్ హెల్మెట్లు వాడటం వల్ల కలిగే ఘర్షణ (Friction) జుట్టు షాఫ్ట్ బలహీనపడి విరిగిపోవడానికి కారణమవుతుంది. 3. ఇతరుల వస్తువులు వాడటం: ఒకరు వాడిన హెల్మెట్ లేదా దువ్వెన మరొకరు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది. 4. జంక్ ఫుడ్‌పై ఆధారపడటం: సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు అందాల్సిన ప్రోటీన్ అందదు. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి? (How To) జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం పైన రాసే నూనెలు, సీరమ్స్ మాత్రమే కాదు, లోపలి నుండి పోషణ అవసరం. • సరైన డైట్ (High Protein Diet): జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ బరువులో ప్రతి కిలోగ్రాముకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం (ఉదాహరణకు 60 కేజీల బరువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి). మీ ఆహారంలో పన్నీర్, సోయా, చికెన్, చేపలు మరియు గుడ్లు ఉండేలా చూసుకోండి. • గింజలు మరియు విత్తనాలు (Nuts & Seeds): ప్రతిరోజూ గుప్పెడు నట్స్, గుమ్మడి గింజలు (Pumpkin Seeds), పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మరియు నువ్వులు తీసుకోవడం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. • ఒత్తిడి తగ్గించుకోండి: అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. • స్కాల్ప్ పరిశుభ్రత: చెమట పట్టినప్పుడు జుట్టును తరచుగా వాష్ చేయడం మరియు హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: రోజుకు ఎన్ని వెంట్రుకలు రాలడం సహజం?  జ: సాధారణంగా రోజుకు 100 వెంట్రుకల వరకు రాలడం సహజమే. అయితే మీ జుట్టు పల్చగా ఉంటే, 50 వెంట్రుకలు రాలినా అది సమస్యగానే పరిగణించాలి. ప్ర: హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుందా?  జ: కేవలం హెల్మెట్ వల్ల జుట్టు ఊడదు. కానీ టైట్ హెల్మెట్ వల్ల కలిగే ఘర్షణ మరియు చెమట వల్ల ఇన్ఫెక్షన్లు ఉంటే జుట్టు రాలవచ్చు. ప్ర: జుట్టు రాలడం మొదలైన వెంటనే చికిత్స తీసుకోవాలా?  జ: సాధారణంగా ఏదైనా స్ట్రెస్ లేదా అనారోగ్యం (జ్వరం వంటివి) వచ్చిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. అది ఆరు నెలల వరకు ఉంటే పర్వాలేదు కానీ, ఏడాది కంటే ఎక్కువ కాలం విపరీతంగా రాలుతుంటే తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. జుట్టు సంరక్షణ అనేది ఒక ప్రయాణం. మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి మరియు మనం చేసే చిన్న చిన్న మార్పులే మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మీ జుట్టును ప్రేమించండి. మీకు మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాలు కావాలా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ను క్లిక్ చేయండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు.  అయితే  ప్రపంచవ్యాప్తంగా  కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  పెరుగుతున్న కిడ్నీ  వ్యాధి వ్యాప్తి గురించి అవగాహన కల్పించడానికి,  అవగాహన పెంచడానికి,  కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది ఈ ఏడాది మార్చి 12వ తేదీన వచ్చింది.  అన్ని వయసుల వారిలో కిడ్నీ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. . పిల్లలు కూడా కిడ్నీ సమస్యల ప్రమాదంలో ఉన్నారు. మూత్రపిండాలు  శరీరానికి ఫిల్టర్లలా పనిచేస్తాయి. అవి రక్తం నుండి మలినాలను,  అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం మానేస్తే, శరీరంలో విషపూరితం పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాల పరీక్షల సమయంలో క్రియేటినిన్ స్థాయిలు గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అసలు క్రియోటినిన్ అంటే ఏంటి?  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. క్రియాటినిన్.. క్రియాటినిన్ అనేది శరీర కండరాలలో ఉత్పత్తి అయ్యే క్రియాటిన్ అనే సమ్మేళనం విచ్ఛిన్నం కావడం ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. మనం శారీరక శ్రమలో పాల్గొన్నప్పుడు, మన కండరాలు శక్తిని ఉపయోగిస్తాయి,  ఈ ప్రక్రియలో క్రియాటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో నిరంతరం ఉత్పత్తి అవుతుంది.  సాధారణ పరిస్థితులలో మూత్రపిండాలు దానిని రక్తం నుండి వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేసినప్పుడు, రక్తంలో క్రియాటినిన్ స్థాయి సమతుల్యంగా మారుతుంది.  క్రియేటినిన్ పెరగడం అనేది మూత్రపిండాలు రక్తాన్ని తగినంతగా ఫిల్టర్ చేయడం లేదని సంకేతాన్ని ఇస్తుంది. క్రియాటినిన్ స్థాయి.. క్రియాటినిన్ స్థాయి ఎలా ఉండాలి? రక్త పరీక్ష ద్వారా క్రియాటినిన్ స్థాయిలను గుర్తిస్తారు.    పురుషులలో సాధారణ క్రియాటినిన్ స్థాయిలు 0.7 నుండి 1.3 mg/dL వరకు ఉంటాయి. మహిళల్లో, ఇది 0.6 నుండి 1.1 mg/dL మధ్య  ఉంటే అది సాధారణం అని పరిగణిస్తారు. క్రియాటినిన్ స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. క్రియాటినిన్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే,  మూత్రపిండాలు అంత ప్రమాదంలో ఉంటాయి. క్రియాటినిన్ ఎక్కువైతే ఏ సమస్యలు వస్తాయి.. మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటంతో క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయి, దీని వలన శరీరంలో యూరియా,  ఇతర విషపదార్థాలు పేరుకుపోతాయి.   మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, తరచుగా నొప్పి నివారణ మందులు వాడటం,  శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం మొదలైనవన్నీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి,  అధిక క్రియాటినిన్ స్థాయిలకు దారితీస్తాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. క్రియాటినిన్ పెరగడం వల్ల మూత్రపిండాలే కాకుండా మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలో ద్రవం,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వలన పాదాలు, ముఖం లేదా చేతులు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. రక్తంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల అలసట, బలహీనత, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.  కొన్ని సందర్భాల్లో,  పొటాషియం స్థాయిలు అసమతుల్యంగా మారడం,  హృదయ స్పందనలు క్రమబద్దంగా లేకపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. క్రియాటినిన్ పెరిగితే ఏం చేయాలి? క్రియాటినిన్ స్థాయి తరచుగా ఎక్కువగా ఉంటే, కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి  ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. మందులతో పాటు, క్రియాటినిన్ స్థాయిలను నియంత్రించడానికి  ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలి.   మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గించే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తినాలి.  ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాల పరిమాణాన్ని పెంచాలి. ఉదాహరణకు పండ్లు,  కూరగాయలు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఉప్పు,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. నీరు పుష్కలంగా త్రాగాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.                        *రూపశ్రీ.
మూత్రపిండాలు శరీరంలో వడపోత  అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. అలాగే శరీరంలో ద్రవాల నుండి వెలువడే వ్యర్థాలను మూత్రం రూపంలో విసర్జించడానికి సహాయపడతాయి. అయితే నేటి కాలంలో చాలామంది మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  కిడ్నీ ఫెయిల్యూర్,  మూత్రనాళ ఆరోగ్యం దెబ్బతినడం, కిడ్నీలలో రాళ్లు..ఇలా మూత్రపిండాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి.  మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలన్నా, వాటి పనితీరు మెరుగ్గా ఉండాలన్నా కొన్ని పండ్లు చాలా బాగా సహాయపడతాయి.  ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు.  ఆ పండ్లు ఏమిటో.. ఆ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎందుకు సహాయపడతాయో తెలుసుకుంటే.. బెర్రీస్.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  అలాగే పొటాషియం తక్కువగా ఉంటుంది.  ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.  మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి. చెర్రీస్.. చెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ముత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేసే యూరిక్ ఆమ్లాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా కలిగి ఉంటాయి.   ద్రాక్ష.. ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ ఉంటుంది.  ఇది గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.  ద్రాక్షలో పొటాషియం తక్కువగా ఉంటుంది.   పైనాపిల్.. పైనాపిల్ పొటాషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది ఉష్ణ మండల పండు. ఇందులో బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది.  ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఎంజైమ్. పుచ్చకాయ.. పుచ్చకాయ చర్మాన్ని హెడ్రేట్ చేస్తుంది.  శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది వాపును కూడా తగ్గిస్తుంది.  మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  యాపిల్స్.. యాపిల్స్ లో పొటాషియం తక్కువగా ఉంటుంది.  ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ,  శరీరంలో ఉండే వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. పీచ్.. పీచ్ పండ్లలో పొటాషియం తక్కువగా ఉంటుంది. కానీ విటమిన్-ఎ,  విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండ రోగులకు చాలా మంచి పండు.  అందులోనూ ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు.. ఈ పండు వేసవిలో విరివిగా దొరుకుతుంది. క్రాన్బెర్రీ.. క్రాన్బెర్రీ పండ్లు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.  అలాగే కాల్ఫియం,  ఆక్సలేట్ తో  మూత్రపిండాలలో తయారయ్యే రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. బేరి.. బేరి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ ఉంటుంది.  అలాగే ఈ పండులో సోడియం తక్కువగా ఉంటుంది.  ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పైన చెప్పుకున్న పండ్లన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో బాగా సహాయపడతాయి.  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న పండ్లను తప్పక తినండి.                                  *రూపశ్రీ.
మంచి నీరు అంటే నేటికాలంలో అందరికీ మినరల్ వాటర్ ఏ తెలుసు. ఇక చాలామందికి తాగే నీరు అంటే RO వాటరే. ఇప్పట్లో ధనికుల ఇళ్ళ నుండి మధ్య తరగతి కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఇంట్లో రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ ఉపయోగించే ఫ్యూరిఫైయర్లు వాడుతున్నారు.  వీటినే సింపుల్ గా RO ఫ్యూరిఫైయర్లు అని అంటున్నారు. నీటిలో ఉండే  మలినాలను, భారీ లోహాలను,  ఇతర హానికరమైన కలుషితాలను తొలగించడంలో ఈ ప్యూరిఫైయర్లు బాగా సహాయపడతాయని చెబుతారు.  ఈ కారణంగానే ప్రతి ఇంట్లో వాటర్ ఫ్యూరిపైయర్లు వాడటం సహజం అయిపోయింది. ప్రతిరోజూ ఆర్.ఓ వాటర్ తాగడం సహజం.  అయితే ప్రతిరోజూ ఈ ఆర్.ఓ వాటర్ ను తాగడం మంచిదేనా?  ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు?  తెలుసుకుంటే.. ఆర్.ఓ శుద్దీకరణ ఎలా పనిచేస్తుంది? RO టెక్నాలజీలో, నీరు పొర గుండా వెళుతుంది, బ్యాక్టీరియా, వైరస్‌లు, కరిగిన లవణాలు, భారీ లోహాలు,  ఇతర హానికరమైన మూలకాలను తొలగిస్తుంది. అందుకే ఆహార కాలుష్యం లేదా మలినాలకు గురయ్యే ప్రాంతాలలో నీటిని శుద్ధి చేయడంలో RO వ్యవస్థ ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ప్రక్రియ నీటిలోని కాల్షియం,  మెగ్నీషియం వంటి కొన్ని సహజ ఖనిజాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలామంది RO నీరు అధికంగా శుద్ధి చేయబడిందని, ఈ నీటిలో  అవసరమైన పోషకాలు ఉండవని చెబుతారు.   ఖనిజ లోపాలు.. ఆహారం.. శరీరానికి అవసరమైన ఖనిజాలకు  ప్రధాన వనరు నీరు కాదని,  మనం రోజువారీ తీసుకునే  ఆహారమే ఖనిజాలు భర్తీ చేస్తుందని  పోషకాహార నిపుణులు అంటున్నారు. త్రాగునీటి నుండి శరీరం పొందే ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చాలా పోషకాలు ఆహారం నుండి లభిస్తాయి, అయితే ప్రతిరోజూ సమతుల్య,  పోషకమైన ఆహారం తీసుకుంటే, RO నీటిలో కొద్దిగా ఖనిజాలు లోపం ఉన్నా అదేమీ సమస్య కాదని అంటున్నారు. . పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీర పోషక అవసరాలను సులభంగా తీర్చగలుగుతాయని అంటున్నారు. ఆర్.ఓ నీరు.. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండ వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, RO నీరు సాధారణంగా మూత్రపిండాల ఆరోగ్యంపై ఎటువంటి పెద్ద ప్రతికూల ప్రభావాలను చూపదట.  నీటి నుండి మలినాలను తొలగించడానికి, త్రాగడానికి సురక్షితంగా చేయడానికి RO వ్యవస్థ రూపొందించబడిందని వైద్యులు అంటున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ఖనిజాలు కోల్పోవచ్చు, మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండటానికి నీరు తగినంతగా తాగడం చాలా ముఖ్యమట. సమతుల్య ఆహారం తీసుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. శుభ్రమైన,  సురక్షితమైన నీటిని తాగడం మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆర్.ఓ నీరు.. ఎలక్ట్రోలైట్లు.. కొంతమంది RO నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని చెబుతారు. కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తులలో ఇది చాలా అరుదని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత మూత్రపిండాల హార్మోన్లు,  ఆహారం నుండి పొందిన పోషకాల ద్వారా నియంత్రించబడుతుంది. సోడియం, పొటాషియం, కాల్షియం,  మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ప్రధానంగా ఆహారం నుండి లభిస్తాయి. కాబట్టి సాధారణ సమయాలలో ఆర్.ఓ నీరు తాగడం వల్ల ఎలాంటి ఎలక్ట్రోలైట్ సమతుల్యత ప్రబావితం కాదు.                                  *రూపశ్రీ.