LATEST NEWS
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు.  జాగీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించలరా?  అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్ధానంలో బీఆర్ఎస్ నిలిచింది. బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై   తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇదేంటి ఎన్నికలు జరిగింది తెలంగాణలో  ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి కలిగించేలా సోషల్ మీడియాలో వార్త  హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సంర్పంచ్ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్ జగన్నాథమ్. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.  ఈ ఎన్నికలో   భూక్య చంద్రబాబు  బానోత్ జగన్నాథమ్  బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు.  దీనిపైనే నెటిజనులు తెలంగాణలో కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు. నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు  ప్రధాని మోడీ,  జలవనరులశాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ తో వేర్వేరుగా భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరనున్నట్లు తెలుస్తోంది. 
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
          -సుకుమార్ ఏం చెప్పాడు -అవతార్ 3 రిజల్ట్ ఎలా ఉంది! -భావోద్వేగం తప్పదా!       'అవతార్ ఫైర్ అండ్ యాష్'(Avatar fire and ash)తో జేమ్స్ కామెరూన్ (James Cameron)మరోసారి సృష్టించిన అద్భుతమైన ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసే టైంకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రేపు వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండటంతో అవతార్ ప్రేమికులతో పాటు సినీ ప్రేమికుల్లో సందడి వాతారణం నెలకొని ఉంది. ఇప్పటికే కొంత మంది సినీ ప్రముఖులకి అవతార్ ఫైర్ అండ్ యాష్ టీం ప్రత్యేక షో ని ప్రదర్శించి చూపించడం జరిగింది. వాళ్ళల్లో ప్రముఖ దర్శకుడు 'సుకుమార్'(Sukumar)కూడా ఒకరు. దీంతో ఆయన అవతార్ ఫైర్ అండ్ యాష్ ఎలా ఉందో చెప్పడం జరిగింది.     సుకుమార్ మాట్లాడుతు 'సినీ దర్శకుల్లో జేమ్స్ కామెరూన్ ఒక అవతార్ అయితే మిగతా వారంతా మానవ మాత్రులం. మూవీ చూస్తుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి. మూడుగంటల పదిహేను నిముషాలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఫ్యామిలీతో అందరూ చూసే సినిమా. మన ప్రేక్షకులకి నచ్చేలా భావోద్వేగాలు  ఉన్నాయి. విజువల్స్, క్యారక్టర్ లు నా మైండ్ సెట్ లోనుంచి వెళ్లడం లేదు. సినిమా అంటే ఇదే. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. అందరు థియేటర్స్  లోనే చూసి ఎంజాయ్ చెయ్యండని చెప్పుకొచ్చాడు.     also read:  17 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సిజ్జు.. విడాకులు వస్తాయా!     ఇక పుష్ప 2 తో పాన్ ఇండియా లెవల్లో స్టార్ మేకర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ తన అప్ కమింగ్ మూవీని మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభం కాబోయే ఈ మూవీని పుష్ప 2 ని మించి సక్సెస్ చెయ్యాలనే పట్టుదలతో సుకుమార్ ఉన్నాడు.          
          -సిజ్జు విడాకులు ఎందుకు ఇచ్చాడు! -సిజ్జు భార్య ఎవరు  -విడాకులకి కారణం ఏంటి!      దేవిశ్రీప్రసాద్ మొట్టమొదటి మూవీ 'దేవి' సినిమాని, అందులోని సాంగ్స్ ని మర్చిపోవడం ఇప్పట్లో ఎవరి తరం కాదు.  లెజండ్రీ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1999 లో వచ్చిన  ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయమై మంచి పేరు సంపాదించాడు సిజ్జు. మలయాళ చిత్ర సీమకి చెందిన సిజ్జు ఆ తర్వాత పలు చిత్రాల్లో చేసి మంచి పేరు సంపాదించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని పోషిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నువ్వు నాకు నచ్చావు, సింహరాశి. మనసంతా నువ్వే. శివరామరాజు, శతమానం భవతి,బ్లఫ్ మాస్టర్, రాబిన్ హుడ్  వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సిజ్జు రీసెంట్ గా  పోస్ట్ చేసిన  నోట్ ఒకటి అభిమానులని షాక్ కి గురి చేస్తుంది.       సదరు నోట్ లో 'నా భార్య ప్రీతీ ప్రేమ్ నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. అధికారకంగా విడాకులు కూడా  మంజూరు అయ్యాయి.ఈ విషయాన్ని అర్ధం చేసుకొని మా ఇద్దరిపై పుకార్లు సృష్టిస్తు మా ఇద్దరి వ్యక్తిగత గోప్యానికి ఎలాంటి భంగం కలిగించవద్దు. ఈ విషయంలో ప్రతి ఒక్కర్ని అభ్యర్దిస్తున్నాను. ఇకపై మేము విడివిడిగా జీవితాన్ని కొనసాగిస్తామని ఇనిస్టాగ్రమ్ లో నోట్  ని  రిలీజ్ చేసాడు.     Also read:   ఛావా క్లైమాక్స్ సీన్ పై విక్కీ కౌశల్ కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడే ఎందుకని      సిజ్జు, ప్రీతీ ప్రేమ్ ది లవ్ మ్యారేజ్. మతాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. 2008 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ఒక కూతురు కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు పదిహేడేళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ విడిపోవడం మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చినీయాంశమయ్యింది. సిజ్జు పూర్తి పేరు సిజు అబ్దుల్  రషీద్.  ఎయిర్ హోస్ట్ గా పని చేసిన ప్రీతీ ఒక క్రిస్టియన్.     
  హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన అద్భుతం 'అవతార్'కి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో భాగంగా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వస్తోంది. రేపు(డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు రానున్న అవతార్-3.. ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. (Avatar: Fire and Ash)   2009 డిసెంబర్ లో విడుదలైన అవతార్ మూవీ, తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ సమయంలో ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం గొప్ప విషయం. ఇక 'అవతార్-2' మూవీ 2022 డిసెంబర్ లో విడుదల కాగా.. తెలుగునాట ఏకంగా రూ.101 కోట్ల గ్రాస్ రాబట్టింది. (Avatar 3)   Also Read: కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. డెకాయిట్ టీజర్ అదిరింది!   ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో 'అఖండ-2' విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పైగా, 'అవతార్-2' స్థాయిలో 'అవతార్-3'పై ఎందుకనో హైప్ రాలేదు. దీంతో మళ్ళీ తెలుగునాట ఆ రేంజ్ లో ప్రభావం చూపుతుందా లేదా? అనే చర్చ జరుగుతోంది. 'అవతార్-3' రూ.50 కోట్ల దాకా రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ జేమ్స్ కామెరూన్ బిగ్ స్క్రీన్ పై మళ్ళీ మ్యాజిక్ చేస్తే.. ఆ నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.    
Adivi Sesh, renowned for his streak of innovative thrillers, is set to push boundaries again with his most ambitious project, Dacoit. The makers recently unveiled the teaser, offering a glimpse into a world that is as emotionally raw as it is action-packed. The narrative centers on a fractured love story, featuring Mrunal Thakur in a powerhouse performance that transitions seamlessly between innocence and profound anguish. The film's gravity is further bolstered by an elite ensemble cast, including acclaimed filmmaker Anurag Kashyap, alongside veterans Prakash Raj and Atul Kulkarni, promising intense on-screen confrontations. Adivi Sesh shines in a rugged avatar, mastering a sharp Rayalaseema dialect that adds a layer of authenticity to his commanding screen presence. Under the brilliant direction of Shaneil Deo, the teaser emerges as a technical marvel. Cinematographer Danush Bhaskar captures visceral, dusty landscapes, while Gyaani’s pulse-pounding score—highlighted by a high-energy remix of the iconic "Kanne Pittaro"—elevates the tension. Produced by Supriya Yarlagadda and presented by Annapurna Studios, the film boasts top-tier production values. Dacoit is slated for a grand worldwide theatrical release on March 19, 2026, perfectly timed for the Ugadi festivities. It promises to be a brutal, emotional, and unforgettable cinematic experience for the Telugu New Year. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడివి శేష్. ఆయన నటించిన సినిమా అంటే.. అందులో కంటెంట్ బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంటుంది. అలాంటి శేష్ నుంచి.. 2022లో వచ్చిన 'మేజర్', 'హిట్-2' తర్వాత హీరోగా సినిమా రాలేదు. శేష్ ప్రేక్షకులను పలకరించి మూడేళ్లు అయిపోయింది. ఆ లోటుని భర్తీ చేసేలా.. 2026లో 'డెకాయిట్', 'గూఢచారి-2' సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.   అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ 'డెకాయిట్'. శనియేల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఉగాది కానుకగా 2026 మార్చి 19న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   నిమిషంన్నర నిడివితో రూపొందిన 'డెకాయిట్' టీజర్ ఆకట్టుకుంటోంది. 'ఒక ప్రేమ కథ' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నప్పటికీ.. ఇందులో రొమాన్స్ కంటే కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండనున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. జైలు నుంచి వచ్చిన క్రిమినల్ పాత్రలో శేష్ కనిపిస్తున్నాడు. మృణాల్ తో కలిసి శేష్ ఒక రాబరీ చేయడానికి సిద్ధపడటం? అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా? అనే కోణంలో టీజర్ ను కట్ చేశారు.    టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా 'కన్నె పిట్టరో కన్ను కొట్టరో' సాంగ్ రావడం హైలైట్ గా నిలిచింది. ఆ సాంగ్ టీజర్ కి కొత్త లుక్ తీసుకొచ్చింది. అలాగే, టీజర్ లో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ వంటి ప్రముఖ నటులు కనిపించారు. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ మైక్ లో "ఓ..ఓ.." అని హమ్ చేస్తుండగా టీజర్ ఎండ్ అవ్వడం మెప్పించింది.    Also Read: రాజా సాబ్ సాంగ్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్!   'డెకాయిట్'లో అడివి శేష్, మృణాల్ ప్రేమించుకొని విడిపోతారు. ఈ మాజీ ప్రేమికులు ఒక క్రైమ్ వల్ల మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు.. ట్విస్ట్ లు, ఛేజ్ లు, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా నడవనుందని తెలుస్తోంది.    
    -ఏం చెప్పాడు! -క్లైమాక్స్ అప్పుడు ఏం జరిగింది -షూట్ ఎలా చేసారు       మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందువుల ఆరాధ్య దైవం 'ఛత్రపతి శివాజీ(chhatrapati shivaji)మహారాజ్' కొడుకు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(chhatrapathi  sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఛావా'(chhaava). ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 5 న భారత దేశ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు తెలుగులోను డబ్ అయ్యి మంచి ఫలితాన్నే చవి చూసింది. ఇక ఈ  మూవీ క్లైమాక్స్ లో శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు చిత్ర హింసలకి గురి చేసే సన్నివేశం ఎంతో మందిని కంటతడిపెట్టించింది. ఇనుప సువ్వలతో ఒళ్ళంతా రక్తం కారేలా చిత్ర హింసలకి గురి చేస్తున్నా, కళ్ళని పొడుస్తున్నా శంభాజీ మహారాజ్ తాను అనుకున్న లక్ష్య సాధన కోసం నిలబడతాడు. గూస్ బంప్స్ తెప్పించే స్థాయిలో పిక్చరైజేషన్ జరుపుకోవడంతో పాటు ఒరిజినల్ గానే సదరు సన్నివేశం జరుగుతుందన్నట్టుగా కూడా అనిపించింది.      రీసెంట్ గా చాలా రోజుల తర్వాత  సదరు సన్నివేశం గురించి శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ లో విజృంభించి నటించిన 'విక్కీ కౌశల్'(Vicky Kaushal)మాట్లాడుతు 'క్లైమాక్స్ సీక్వెన్స్ ని  తెరకెక్కించడం అనుకున్నంత సులంభం కాదు. సన్నివేశం ప్రారంభించిన మూడవ రోజు చిత్రీకరణ టైంలోనే  నేను గాయపడ్డాను. దాంతో నెలన్నర రోజులు షూటింగ్ ని ఆపేశాం. సెట్ ని తీసేసి మళ్ళీ రెండు నెలల తర్వాత సెట్ ని ఏర్పాటు చేసారు. అందుకు మరో పన్నెండు రోజుల సమయం పట్టింది..శంభాజీ మహారాజ్ గురించి ప్రపంచానికి చెప్పాలని నాతో సహా ప్రతి ఒక్కరం వంద శాతం కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.     Aslo read:  శివాజీ పశ్చాత్తాపడుతున్నాడా! పూర్తి క్లారిటీ వచ్చేసింది    చావా కలెక్షన్స్ విషయానికి వస్తే సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 800 కోట్లు దాకా రాబట్టింది. రష్మిక(Rashmika Mandanna),అక్షయ్ ఖన్నా(Akshay Khanna)కూడా తమ తమ క్యారెక్టర్స్ లో అత్యద్భుతంగా నటించి విజయంలో బాగస్వామ్యులయ్యారు.ఇక విక్కీ కౌశల్ ప్రస్తుతం 'లవ్ అండ్ వార్' అనే మూవీలో చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ సదరు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  
        -అసలు ఏం చెప్పాడు? -ఇప్పుడు ఏమంటున్నాడు -అసలు మ్యాటర్ ఏంటి!       తెలుగు చిత్ర పరిశ్రమకి, శివాజీ(Sivaji)కి మధ్య ఉన్న అనుబంధం యొక్క వయసు రెండున్నర దశాబ్దాల పైనే.  1997 లో వచ్చిన చిరంజీవి హిట్ మూవీ 'మాస్టర్' తో ఎంట్రీ ఇచ్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో చేస్తూ తన కంటూ ఒక 'ఎరా' ని సృష్టించుకున్నాడు. కొంత కాలం తర్వాత కోర్టు మూవీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తన హవా చాటడం స్టార్ట్ చేసిన శివాజీ ఈ నెల 25 న క్రిస్మస్ కానుకగా 'దండోరా' మూవీతో థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రచార చిత్రాలు బాగుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.     కొన్ని రోజుల క్రితం శివాజీ మాట్లాడుతు టికెట్ ధరలని పెంచడం వల్లే తొంబై తొమ్మిది శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకి దూరమవుతున్నారనే వ్యాఖ్యలు చేసిన విషయం  తెలిసిందే. దీంతో సదరు వ్యాఖ్యలు సినీ సర్కిల్స్  లో వైరల్ గా మారాయి. తాను చేసిన ఆ వ్యాఖ్యలపై  'దండోర' (Dandora)ప్రచార కార్యక్రమాల్లో మరోసారి శివాజీ మాట్లాడుతు ప్రస్తుతం   ఉన్న సందర్భాన్ని అందరికి గుర్తు చేయాలనే మాట్లాడతాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు మాట్లాడను. ఏ విషయంలోనైనా నిజం మాట్లాడటం నా అలవాటు, నేను చేసిన కామెంట్స్ ని  తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.      Also read:   ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్      ఇదే విధంగా  ఐబొమ్మ రవి గురించి మాట్లాడాను. అతడికి ఉన్న తెలివితేటలని మంచి పనులకి  ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పాను. కానీ అతను చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి తప్పు చేసినట్లే అని కూడా చెప్పా. ఆ కామెంట్స్ విషయంలో నేను పశ్చాత్తాపడడం లేదు అని మరోసారి తన వ్యాఖ్యలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు.           
  రాజా సాబ్ సాంగ్స్ పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు నిరాశపరిచిన ఫస్ట్ సింగిల్! సెకండ్ సింగిల్ అంచనాలు అందుకుందా?   'ది రాజా సాబ్'(The Raja Saab) ఆల్బమ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎన్నో అంచనాలు ఉన్నాయి. వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారని ముందు నుంచి మూవీ టీమ్ చెబుతుండటంతో.. డార్లింగ్, మిర్చి రోజులను గుర్తుచేసేలా అదిరిపోయే సాంగ్స్ ఉంటాయని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో ఫస్ట్ సింగిల్ ఫెయిల్ అయింది.   తమన్ సంగీతం అందిస్తున్న 'రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'రెబల్ సాబ్'(Rebel Saab) సాంగ్ నవంబర్ లో విడుదలైంది. రిలీజ్ కి ముందు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్.. తీరా రిలీజ్ అయ్యాక బాగా డిజప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగా సాంగ్ లేదని మెజారిటీ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.   ఇటీవల కాలంలో పలువురు స్టార్ హీరోల సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్ విడుదలయ్యాయి. దాదాపు ఆ పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచి, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ లిస్టులో 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ చేరకపోవడం.. అభిమానులను నిరాశపరిచింది.   Also Read: 'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్.. ఇది కదా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే..!   ఇప్పుడు 'రాజా సాబ్' నుంచి సెకండ్ సింగిల్ గా 'సహనా సహనా'(Sahana Sahana) అనే పాట వచ్చింది. ప్రోమోతోనే ఈ మెలోడీ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫుల్ సాంగ్ కి కూడా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తోంది. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'సామజవరగమన' స్థాయిలో కాకపోయినా.. సహనా సాంగ్ బాగానే ఉందని, ఇది స్లో పాయిజన్ లా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.   మొత్తానికి 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ తో అభిమానులను నిరాశపరిచిన తమన్.. సెకండ్ సింగిల్ తో మంచి స్పందననే రాబడుతున్నాడు. మరి రాబోయే పాటలు ఎలా ఉంటాయో చూడాలి.    
      -ఎవరు ఆ హీరోయిన్  -ప్రేమించి పెళ్లి చేసుకున్నారు -రికార్డు కలెక్షన్స్      ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 'ధురంధర్'(Dhurandhar)తన ప్రభంజనాన్ని యధావిధిగా కొనసాగిస్తోంది. డిసెంబర్ 5 న సెల్యులాయిడ్ పై అడుగుపెట్టగా ఇప్పటి వరకు నాలుగువందల కోట్లకి పైగా సాధించి ఐదువందల కోట్ల మార్కుకి చేరువలో ఉంది.  ప్రేక్షకులతో పోటాపోటీగా సినీ, రాజకీయ, క్రికెట్ సెలబ్రటీస్ కూడా ధురంధర్ ని వీక్షిస్తుండటంతో ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు 'ఆదిత్య దర్'(Aditya Dhar)కి సంబంధించిన పర్సనల్ న్యూస్ ఒకటి అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ఏంటో చూద్దాం.     ఆదిత్య దర్ భార్య ప్రముఖ హీరోయిన్ 'యామి గౌతమి'(Yami Gautam). సినిమాల్లోకి రాక ముందు అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించగా 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2011 లో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'నువ్విలా' చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయమవ్వగా, ఆ తర్వాత అల్లు శిరీష్ డెబ్యూ మూవీ 'గౌరవం', తరుణ్ తో యుద్ధం, నితిన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులని  మెప్పించింది. పలు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా చేసి తన సత్తా చాటగా, 2024 లో తనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్టికల్ 370 చిత్రంతో సోలో విజయాన్ని అందుకుంది. ఇక 2019 లో ఆదిత్య దర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉరి' అనే చిత్రంలో చేసిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో  2021లో పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య దర్ మొదటి మూవీ కూడా అదే. జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది.     Also read:  థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన టీమిండియా క్రికెటర్లు.. ఫ్యాన్స్ హంగామా       ఈ ఏడాది ఫిబ్రవరి లో ఆదిత్య దర్ నిర్మాతగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ధూమ్ ధామ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ తో హక్ అనే సినిమాలో చెయ్యగా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య దర్ కెరీర్ విషయానికి వస్తే ఉరి తర్వాత ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి చిత్రాలకి రైటర్ గా పనిచేశారు. ఆరు సంవత్సరాల తర్వాత 'ధురంధర్' తో వచ్చి ఇండియా సినిమా తన వైపు చూసేలా చేసుకున్నాడు.        
Prabhas is undeniably the biggest star of indian Cinema but his fans seem to be bringing a bad name to his "Good Boy" image. At the second single, Sahana Sahana from highly anticipated horror-comedy, The Raja Saab, launch event, people witnessed unprecedented scenes. The event at Lulu Mall turned into a site of immense ruckus as hundreds of "Rebel Star" fans overwhelmed the venue to catch a glimpse of their favorite stars. The star-studded event was attended by lead actresses Nidhhi Agerwal and Riddhi Kumar, along with music composer S. Thaman, director Maruthi Dasari, producer TG Vishwa Prasad, and creative producer SKN. Addressing the massive gathering, Director Maruthi expressed immense confidence in the film’s Sankranti release, boldly declaring, "This Pongal is Rebel Pongal!"   However, the excitement quickly spiraled as the crowd breached safety barriers, causing significant congestion and minor damage to mall property. They faught with the leading ladies security teams as they surged towards them while they were leaving the Mall, post event.  While the "Rebel" mania is undeniable, industry experts and mall management have issued a plea for restraint. While celebrating their idol, fans must behave responsibly and ensure that public spaces and mall property are not damaged during such high-profile events. With the film set for a grand January 9 release, the team hopes future celebrations remain safe for all. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   
  పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది.  ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే.. తల్లిదండ్రుల శైలి.. భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు.  ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది.  పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు.   అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ.  దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. డబ్బు.. డబ్బు చాలా ముఖ్యమైన అంశం.  కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి,  మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి.  ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో  ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి. సాన్నిహిత్యం.. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు.  దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు,  ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి.  ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి. భవిష్యత్తు.. పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు.  జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు,  నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు.  ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు.  వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. పైన పేర్కొన్న  ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది.  కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది.  అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు,  సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం.  ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు.  రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం,  చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.                           *రూపశ్రీ. 
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది.  కొన్ని ప్రశ్నలు అమ్మాయిలను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. అమ్మాయిలను ఎప్పుడు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వీటిని అడగకుండా ఉండటం వల్ల అమ్మాయిల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా కాపాడిన వాళ్లమవుతాము.  ఇంతకీ అమ్మాయిలను ఎప్పుడూ అడగకూడదని ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలను ఎందుకు అడగకూడదు? తెలుసుకుంటే.. శరీరం గురించి.. అమ్మాయిలు లావుగా  ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం చాలామందిలో ఉంటుంది.  ఇది పైకి కనిపించే విషయమే.  ఎప్పుడైనా సరే అమ్మాయిలను కామెడీ కోసం లేదా సీరియస్ గా అయినా శరీర ఆకృతి గురించి,  బరువు గురించి అస్సలు అడగకూడదు.  ఇంత లావుగా ఉన్నావేంటి.. లేదా ఇంత సన్నగా ఉన్నావేంటి? వంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ఇది బాడీ  షేమింగ్ చేయడం కిందకు వస్తుంది.  ఇలా చేయడం వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరం లావుగా లేదా సన్నగా ఉండటానికి చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల అలా ఉంటారు. దీనికి కామెంట్ చేస్తూ ప్రశ్నించడం తప్పు. పిల్లలు.. పెళ్లైన ప్రతి స్త్రీ కి ఎదురయ్యే ప్రశ్న పిల్లల గురించి.  కొత్తగా పెళ్లైన దగ్గర నుండి  పిల్లలు కలగడం ఆలస్యమయ్యే వారి వరకు ఎప్పుడూ పిల్లలను ఎప్పుడు కంటావ్ అని అడుగుతారు.  పిల్లలను కనాలనే నిర్ణయం కేవలం అమ్మాయిలది మాత్రమే కాదు.. వారి కుంటుంబానిది, మరీ ముఖ్యంగా భర్త కూడా దీనికి కీలకం.  అందుకే పిల్లల గురించి మహిళలను పదే పదే ప్రశ్నలు వేయకూడదు. ఇది వారిని మానసిక  ఒత్తిడికి గురి చేస్తుంది. వివాహం.. వయసు పెరుగుతున్నా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కూడా ఉంటారు. లేదంటే భర్త చనిపోయిన తరువాత వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి వారితో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నలు వేయకూడదు. వివాహం  అనేది  మహిళల వ్యక్తిగతం. అలాగే అది కుటుంబ సమస్య కూడా.  దీని గురించి ప్రశ్నించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వృత్తి.. మగవారికి వారి జీవితకాలం వృత్తి పరమైన కెరీర్ ఉంటుంది. కానీ చాలామందికి  మహిళలు తమ కెరీర్ మధ్యలో వదిలేస్తారు అనే ఆలోచన ఉంటుంది.  పెళ్లి అయిన తరువాత  పిల్లలు పుడితే ఇక మహిళలు తమ కెరీర్ ను కొనసాగించలేరేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మహిళల కెరీర్ వారి ఇష్టం.  వారు తమ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కెరీర్ కొనసాగించుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు.  అనవసరంగా వారి కెరీర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది అని ప్రశ్నించకూడదు. సమయం.. చాలామంది మహిళలు బయటకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆలస్యం అయితే అందరూ అడిగే ప్రశ్న ఇంత ఆలస్యం ఎందుకైంది అని. అదే తొందరగా వారు ఎక్కడికైనా హాజరైతే ఇంత త్వరగా ఇంటి నుండి వచ్చావేంటని.  ఇవి మహిళలను అసౌకర్యానికి గురిచేస్తాయి.  మహిళలు కుటుంబాన్ని,  తమ పనులను చేసుకోవడంలో ప్రాధాన్యతలు, టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆలస్యం గురించి కానీ,  వారి తొందర గురించి కానీ అలా  అడగకూడదు. ఇది విమర్శ చేసినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియా.. సోషల్ మీడియా ఇప్పట్లోచాలా సహజం. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహిళలు  అనేకం.  చాలామంది అలాంటి మహిళల పట్ల ఎందుకు సోషల్ మీడియాలో  అంత యాక్టీవ్ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం మహిళల వ్యక్తిగతం,  అది వారి అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఉంటుంది.  దాని గురించి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. డ్రస్సింగ్.. ప్రతి మహిళ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తుంది.  కొందరు ప్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు.  ఏది ఏమైనా మహిళల డ్రెస్సింగ్ గురించి వారు ధరించే దుస్తుల గురించి ప్రశ్నించడం,  కామెంట్ చేయడం అస్సలు మంచిది కాదు. పైన పేర్కొన్న 7 విషయాలు మహిళల వ్యక్తిగతం,  కుటుంబానికి సంబంధించినవి.   వాటిని ప్రశ్నించడం వల్ల మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్టే. అంతేకాదు.. పై ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి ఫీలవుతారు. అలాగే వారి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.                                     *రూపశ్రీ.
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఈ టీ-బిస్కెట్ కాంబినేషన్ ను చాలా చెత్త కాంబో గా చెబుతున్నారు. టీ-బిస్కెట్ చాలా సింపుల్ గా రుచిగా అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అసలు టీ-బిస్కెట్లు తీసుకోవడం వల్ల జరిగేదేంటి? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుంటే.. టీ-బిస్కెట్ కహానీ.. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన బిస్కెట్లు ఎక్కువగా పాశ్చరైజ్ చేయబడతాయి. వాటిలో శుద్ధి చేసిన పిండి అంటే మైదా, అధిక మొత్తంలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు,  అనేక ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఈ  పదార్థాలు టీలోని కెఫిన్,  టానిన్‌లతో కలిపినప్పుడు అది జీర్ణక్రియను చాలా  ప్రభావితం చేస్తుంది. శరీరంలో అనవసరమైన చక్కెర,  కొవ్వు పేరుకోవడాన్ని  పెంచుతుంది. టీ-బిస్కెట్ తినడం అనేది రోజువారీ అలవాటుగా మారితే  అది ఊబకాయం, మధుమేహం  జీర్ణ సమస్యల ప్రమాదాన్ని చాలా సులువుగా  పెంచుతుంది. పోషకాలు జీరో.. మార్కెట్లో దొరికే బిస్కెట్లు మైదా నుండి తయారవుతాయి.  వీటిలో  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఏమీ ఉండవు.ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. టీతో వాటిని తినడం వల్ల అప్పటిక్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పోషకాహారం ఏమీ ఉండదు. ట్రాన్స్ ఫ్యాట్స్.. బిస్కెట్లను క్రిస్పీగా చేయడానికి,  వాటి షెల్ఫ్ లైప్  పొడిగించడానికి హైడ్రోజనేటెడ్ నూనెలు లేదా ట్రాన్స్ ఫ్యాట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చక్కెర .. బిస్కెట్లలో చక్కెర,  శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని టీతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆపై పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గులు ఎక్కువగా జరిగితే అవి  శక్తి లేకపోవడానికి దారితీయడమే కాకుండా, దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. జీర్ణక్రియ, యాసిడ్.. బిస్కెట్-టీల కాంబో  జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే  జిగట,  టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.  టీలోని ఆమ్లతత్వం,  బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం,  యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ  చేస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...