LATEST NEWS
వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగులు ఎటు అన్న విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా నడుస్తోంది.  శాసనమండలిలో  వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూపు సారించారన్న చర్చ జోరందుగుంది.  ఆయన రాజకీయ అడుగులు జనసేన వైపు పడుతున్నాయని వైసీపీలోనే వినిపిస్తున్నది.  ఆయన ఇప్పటికే జనసేన అగ్రనేతతో ఈ విషయంగా చర్చలు జరిపారని గట్టిగా వినిపిస్తోంది.  ఈ విషయంలో  బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతాన్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని కొట్టి పారేశారు.  బొత్స స్వయంగా ఖండిచినా ఆయన జనసేనకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ పరిశీలకులు సైతం బొత్సలో జనసేన, వైసీపీల మధ్య ఊగిసలాట కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న జనసేనాని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం  చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంగా బొత్స జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా బొత్స ఇటీవలి మౌనాన్ని వీడి మండలిలోనూ, బయటా కూడా తెలుగుదేశం పై, మంత్రి లోకేష్ పై విమర్శలకు పదును పెట్టడం, అదే సమయంలో జనసేన పట్ల ఒకింత మెతక వైఖరిని అవలంబించడం ఇందుకు తార్కానాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బొత్స రాజకీయ అడుగుల విషయంలో అటు వైసీపీలోనూ, ఇటు జనసేనలోనూ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.   Botsa Satyanarayana, Janasena Party, YSRCP, AP Politics, Vizianagaram Politics
  టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..! తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ‘అదృశ్య వ్యక్తులు’ ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని సురేఖ తెలిపారు.  అయినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఒకే తరహాలో తనపై, తన కుటుంబంపై విమర్శలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆమె కోరారు.  పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న సురేఖ.. సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై సామూహికంగా విమర్శలు వస్తున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు. Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, Konda Susmitha, TPCC, Congress MLAs Ultimatum, TPCC Disciplinary Committee, MP Mallu Ravi  
మార్గదర్శి ఫిన్ క్యాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.   రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో  సుప్రీం కోర్టు  ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఈ కేసుతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది.   2008 నుంచి ప్రారంభమైన ఈ మార్గదర్శి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేసినప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఊరూరా సభలు నిర్వహించి మరీ  మార్గదర్శి సంస్థలు ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించాయని, ప్రజలను మోసం చేశాయని   ఆరోపణలు గుప్పించారు. అయితే ఆయన వాదనలు, ప్రచారాలు, ఆరోపణలూ అన్నీ అసత్యాలని సుప్రీం తీర్పుతో తేలిపోయింది.  దీనిపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు.. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసారావు తెలుగువన్ చానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఉండవల్లి మార్గదర్శిపై కేసు, న్యాయపోరాటం అంతా కేవలం ఈర్ష్యతోనే అన్నారు. అయితే దోమ ఏనుగుని చూసి ఈర్ష్యపడితే ఏమౌతుందో.. ఇప్పుడు ఉండవల్లి పరిస్థితి కూడా అంతేనన్నారు.   మార్గదర్శి డిపాజిటర్ల పరంగా ఇప్పటివరకూ ఒక్క బాధితుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం, సంస్థ ఇప్పటికే రూ.2,600 కోట్లకు పైగా ఎస్క్రో అకౌంట్‌లో జమ చేయడం వంటి అంశాలను గుర్తు చేసిన అడుసుమిల్లి..  రామోజీరావు నిర్మించిన పత్రికా, వ్యాపార సామ్రాజ్యంపై కేవలం ఈర్ష్యా ద్వేషాలతోనే ఉండవల్లి అరుణ్ కుమార్,   వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రామోజీరావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు. ఈ తీర్పు  రామోజీరావు ప్రతిష్టను ఇనుమడింపచేసిందనీ, ఆయనపై   కక్షసాధింపు చర్యలకు చెక్ పడిందని  అడుసుమిల్లి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అజెండాతో చేసిన పోరాటాలు చివరికి న్యాయస్థానాల ముందు నిలబడవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందన్న ఆయన. సుప్రీం కోర్టు నిర్ణయంతో మార్గదర్శి వివాదానికి   ముగింపు పడినట్లేనన్నారు.  ఇప్పటికైనా విమర్శకులు తమ వైఖరిని మార్చుకోవాలని అడుసుమిల్లి హితవు పలికారు.  Supreme Court,  Margadarsi Judgement, Vundavalli Aruna Kumar,  Margadarsi Case,  Court Verdict Telugu, TeluguOne
తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు.  అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి,   మంత్రి కొండా సురేఖను  పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై  ప్రభుత్వ విప్ వేముల వీరేషం  తెలుగువన్ న్యస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక జోడెడ్ల బండిలా రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే... కొంతమంది వ్యక్తులు మీడియా మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడటం వల్ల క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోందని వేముల వీరేషం అన్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ను బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి అనే తేడాలు ఉండవు. బి ఫామ్ అందరికీ ఒక్కటే, పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒక్కటే! తప్పు చేస్తే చర్యలు తప్పవు, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా?" అని ప్రశ్నించారు.  తెలంగాణలో  ఆగస్టు సంక్షోభం, రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను   క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తిరిగి వస్తున్నారన్న కామెంట్లను కూడా వీరేషం ఖండించారు.  2029 వరకే కాదు, 2034 వరకు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు.   Demand in Congress to Burthruf Konda Surekha, Vemula Veeresham, CM Revanth Reddy, Telangana Congress Politics, Konda Sushmitha Comments, Revanth Reddy Cabinet 
తెలుగు రాజకీయాల్లో  సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి   హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది.  2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ  ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.    ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.   ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం  కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు.  అదలా ఉంటే..   ప్రజా కోర్టులో  వివేకా హత్య కేసులో   తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి?  అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ..  40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే..   అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు.   ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి   స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది. ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
    ఇరుముడి... ఇది కేవలం సినిమా కాదు.. ఎంతో మంది ఆశలకి ఉపిరిపోసిన సంజీవిని. జోరు వర్షాల్లో కడుపుకి తింటానికి కూడా కాలు బయటపెట్టకుండా యాప్స్ పై ఆధారపడిన క్లాస్, మాస్  ఫ్యామిలీస్ నిన్న వాన కురుస్తున్నా కూడా చలో టూ ఇరుముడి థియేటర్స్ అని తరలి వెళ్లారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు రెండు  తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్. సీట్స్ లో ఎక్కడ చూసినా సెవెంటీ పర్శంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో ఒక మాట బాగా వినిపిస్తోంది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించేశారని, కేవలం మాస్, యాక్షన్ సినిమాలకు మాత్రమే థియేటర్లలో కలెక్షన్లు వస్తాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ల బాట పడతారని  'ఇరుముడి' సినిమా నిరూపించింది.  "ఫ్యామిలీలు థియేటర్లకు రారు" అనే మాట తప్పని   నిరూపిస్తూ పరిశ్రమకి, ఫ్యామిలీ చిత్రాలని నిర్మించాలనుకునే మేకర్స్ కి  ఒక కొత్త ఆశ, భరోసాని ఇచ్చింది. ముఖ్యంగా వంశపారంపర్యంగా థియేటర్స్ ని నమ్ముకున్న వాళ్ళల్లో జోష్ తీసుకొచ్చింది. థియేటర్స్ లో  పని చేసే స్టాఫ్ కి జీతాలు ఇచ్చే ఒకటవ తారీకుకి ఎలాంటి డోకా లేకుండా చేసింది. Also Read: యాభై భాషల్లో వారణాసి మొదటి రోజు కేవలం 20 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభమైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే కుటుంబ ప్రేక్షకుల 'మౌత్ టాక్' వల్ల ఏకంగా 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇదంతా కుటుంబప్రేక్షకుల పుణ్యమే. ఏది ఏమైనా ఇరుముడి లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి ఎంతో అవసరం. రూపాయికి రెండు వందల రూపాయిల లాభాన్ని తెచ్చిపెట్టే దిశగా ఇరుముడి దూసుకెళ్తుంది. మూడు రోజులకి వచ్చిన 80 కోట్లే ఉదాహరణ. Irumudi, Raviteja, Theaters, ShivaNirvana, PriyaBhavanishankar, Nakshthra  
  ఇండియన్ సినిమా వైపు ప్రపంచ సినిమా చూడాలనే లక్ష్యంగా 'వారణాసి' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుకోసం మహేష్, రాజమౌళితో పాటు టీం మొత్తం అహర్నిశలు శ్రమిస్తోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 120కి పైగా దేశాల్లో విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ విజువల్ వండర్ కి  సంబంధించి తాజాగా ఒక సంచలనాత్మక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వారణాసిని  50కి పైగా  భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇన్ని భాషల్లో డబ్బింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ వాయిస్ క్లోనింగ్ సాంకేతికతపై ఆధారపడటం సులభమైన మార్గం. అయితే, సినిమాలోని  ఎమోషన్ 'ఏఐ' ద్వారా రాదని, దాదాపు 1600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో ఆయా భాషల డబ్బింగ్ ప్రక్రియని  నిర్వహించేందుకు జక్కన్న  పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సుదీర్ఘ డబ్బింగ్ ప్రాసెస్ కోసం ఆయా భాషలకు సంబంధించిన స్థానిక ఉచ్చారణ, నిర్దిష్టమైన యాస మరియు సంస్కృతికి తగినట్లుగా డైలాగ్స్ రూపుదిద్దుకుంటున్నాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటీనటుల తెరపై కనబరిచే హావభావాలు, నటనలోని అసలైన భావోద్వేగాలు ఏ భాషలో చూసినా ప్రేక్షకులకు ఎంతో సహజంగా అనిపించేలా ప్రతి పాత్రకూ వాయిస్ టెస్టులు చేసి ప్రత్యేకంగా డబ్బింగ్ రికార్డ్ చేయిస్తున్నారు. 1600 మంది కళాకారుల విభిన్న గొంతులతో 50 భాషల్లో ఒకే చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రాసెస్ చేయడం గ్లోబల్ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది.      Also Read: మూడు రోజులకి ఎంతంటే! వారణాసి కథ విషయానికి వస్తే, ఇది కేవలం సాధారణ అడ్వెంచర్ మాత్రమే కాదు.   భూమిని ఢీకొట్టేందుకు అత్యంత వేగంగా దూసుకొస్తున్న ఒక భారీ ఉల్క వల్ల ఏర్పడే సర్వనాశనం ప్రమాదం నుండి పవిత్ర నగరం వారణాసితో పాటు మొత్తం ప్రపంచాన్ని కాపాడే ఒక ఉత్కంఠభరితమైన మిషన్‌గా ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే అత్యంత సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తుండగా, కథాంశంలో భాగంగా ఆయన వివిధ కాలాల మధ్య టైమ్ ట్రావెల్ చేసేలా అత్యుత్తమ స్క్రీన్ ప్లేని రాజమౌళి తీర్చిదిద్దారు. భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన పురాణ వైభవం మరియు ఆధునిక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్లను మిళితం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటూ ఉంది. 1400 కోట్ల భారీ బడ్జెట్ తో కె ఎల్ నారాయణ నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్. Varanasi, Mahesh Babu, Rajamouli, Priyanka Chopra
Mahakali has unveiled its grand glimpse, offering a striking look at the ambitious mythological spectacle from the Prasanth Varma Cinematic Universe. More importantly, the makers have locked 8th January, for its theatrical release, bringing the film into the Sankranti festive race. Titled Shukracharya’s WarCry, the glimpse puts Akshaye Khanna at the centre of the spectacle. Playing Shukracharya, the formidable guru of the Asuras, Khanna appears in a fierce and unrecognizable avatar. His intense gaze and commanding presence immediately create curiosity about the character and the role he will play in the impending war. The glimpse hints at a conflict far bigger than a conventional battle between good and evil. The clash between Dharma and Adharma appears to have consequences for an entire mythological universe, with ominous imagery, elaborate world-building and striking visual effects establishing the scale of the story. The final moments of the glimpse particularly stand out with a goosebumps-inducing visual. Written by Prasanth Varma and directed by Puja Aparna Kolluru, Mahakali expands the universe established with HanuMan. Sriya Reddy, Bhoomi Shetty and Rohit Saraf are also part of the prominent cast. Produced by Riwaz Ramesh Duggal under RKD Studios, Mahakali has become one of the notable releases entering the Sankranti 2027 season. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    మంచి కంటెంట్ ఇచ్చి కలెక్షన్స్ సంగతి మాకు వదిలేయండి అన్నటుగా ఉంది ఇరుముడి కలెక్షన్స్ పరిస్థితి. మొన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన ఇరుముడి ఆ ఏరియా ఈ ఏరియా అని కాదు వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ లో రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది.  మూడు రోజులకి 80 కోట్ల రికార్డు మార్కుని అందుకొని రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మేకర్స్ కూడా కలెక్షన్స్ పై అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో మాస్ మహారాజా అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. 200 కోట్ల మార్కుని అందుకుంటామని నెట్టింట హంగామా చేస్తున్నారు. ఇరుముడి వేగాన్ని చూస్తే 200 కోట్లు పెద్ద కష్టమేమి కాదనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో సైతం వినిపిస్తున్నాయి. Also Read: చిరంజీవి బర్త్ డే రోజు రిలీజైన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా!  తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగమైన అనుబంధానికి,  అయ్యప్ప దీక్షా నేపథ్యం కలవడంతో ప్రేక్షకుల హృదయాలను తాకడంతో థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. చాలా సినిమాల తర్వాత  రేపు ఇరుముడి మూవీకి వెళ్లాలని  ముందురోజే  ప్రేక్షకులు ప్రిపేర్ అయ్యి తమ రోజువారీ టైం టేబుల్ వేసుకుంటున్నారంటే ఇరుముడికి యొక్క ప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవచ్చు.   మైత్రీ మూవీ మేకర్స్,  టి సిరీస్ సంయుక్తంగా నిర్మించగా బంగాళా ఖాతంలో ఎన్ని వాయుగుండాలుపడినా ఇరుముడి థియేటర్స్ మాత్రం అభిమానులు, ప్రేక్షకులతో కళకళలాడటం ఖాయం. అందుకు హైదరాబాద్ లో  నిన్న ఆదివారం కురిసిన భారీ వర్షాలే ఉదాహరణ.   Irumudi, Raviteja, Shiva Nirvana, PriyaBhavani Shankar, Nakshtra    
ప్రస్తుతం సోషల్ మీడియాలో జయరామ్, సిమ్రాన్‌ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తులు, మెడలో పూలదండలతో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు చూసి.. జయరామ్, సిమ్రాన్‌ పెళ్లి చేసుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  సీనియర్ యాక్టర్స్ ఉన్నట్టుండి ఇలా పెళ్లి బట్టల్లో కనిపించేసరికి అభిమానులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే దీని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో తెలిస్తే మరింత షాక్ అవ్వడం గ్యారెంటీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు నిజమే. వారి మెడలో పూలదండలు ఉన్న మాట కూడా వాస్తవమే. కానీ, వారు పెళ్లి చేసుకోలేదు. వైరల్ అవుతున్న ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు కారణం.. ఒక కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం. ఇటీవల ప్రారంభమైన ఒక కొత్త మూవీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా, సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న జయరామ్, సిమ్రాన్‌ కు నిర్వాహకులు పూలదండలు వేసి సత్కరించారు. అక్కడ తీసిన ఫోటోలనే కొందరు పెళ్లి ఫోటోలు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో నిజంగానే వీరిద్దరికి పెళ్లయిందని చాలామంది నెటిజెన్లు భ్రమపడ్డారు. మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం ఎంత కష్టమైపోయిందో దీని ద్వారా మరోసారి అర్థమవుతోంది.       Jayaram, Simran, Viral Photos  
Nandamuri Balakrishna and Gopichand Malineni’s upcoming action entertainer, tentatively titled NBK111, appears to be heading towards a Christmas release. The film was initially being planned for a Dussehra release, but the latest industry buzz suggests that the makers are now considering December 24 as the new target. The change in plans is reportedly linked to the shooting schedule. Balakrishna recently sustained an injury while filming a high-intensity action sequence and underwent surgery. With the actor currently recuperating, the team has had to rework its shooting plans. The additional time could also help the makers complete the film’s elaborate action blocks and post-production without rushing the project. The film has already generated considerable interest following its birthday glimpse, which showcased Balakrishna in a younger and stylish avatar. Manchu Manoj and Kajal Aggarwal are playing prominent roles, while S Thaman’s background score has added further impact to the glimpse. Produced by Venkata Satish Kilaru under Vriddhi Cinemas, NBK111 is being mounted on a large scale as a commercial action spectacle. A Christmas release would give the film access to a strong holiday window across domestic and overseas markets, making Christmas an attractive alternative to the earlier Dussehra plan.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Yash’s confidence in Toxic was evident throughout his speech at the film’s grand pre-release event in Hyderabad, but what stood out just as much was his effort to connect with the Telugu audience in their own language. The Rocking Star spoke extensively in Telugu, displaying an impressive command over the language and making the interaction feel far more personal. Yash fondly recalled how Telugu audiences embraced him as Rocky Bhai through the KGF franchise. He described Toxic as a major step towards his larger ambition of taking Indian Cinema to the world, calling the film “bold, sensational, original, unique and path-breaking.” His conviction was unmistakable as he confidently promised that the film would be an “Oora Mass” entertainer capable of reaching and entertaining everyone. Interestingly, Yash’s speech also reflected the thought behind Toxic beyond its scale and action. He specifically spoke about the film’s women characters and how society often underestimates women. According to him, every woman in Toxic has been written differently and their journeys should inspire audiences to believe that they can achieve anything. His connection with the Hyderabad audience became even more evident when he stopped his speech after noticing people falling from a height in the crowd. Yash refused to continue until he was assured that they were safe, showing a genuine concern for the people who had gathered to see him. More than the usual pre-release promises, Yash’s words revealed a star who clearly believes in the film he has made. His confidence in Toxic, coupled with his comfortable Telugu delivery and genuine affection for the Telugu audience, made his speech one of the highlights of the event. With the film arriving worldwide on August 26, the conviction behind Yash’s ambitious vision is now set to meet the audience. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ 'NBK111'. కాకినాడ పోర్ట్ షూటింగ్‌లో బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమై దసరా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు బాలయ్య షూటింగ్ కి రెడీ అవుతుండటంతో.. కొత్త రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ, బాలకృష్ణ మోకాలికి సర్జరీ జరగడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే, గాయం నుంచి కోలుకుంటున్న బాలయ్య సెప్టెంబర్ నుంచే మళ్ళీ ఫుల్ ఫిట్‌నెస్‌తో లొకేషన్‌లోకి అడుగుపెట్టబోతున్నారట. గోపీచంద్ మలినేని ఆల్రెడీ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసి, మిగిలిన బ్యాలెన్స్ పార్ట్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దసరా రేసు నుంచి తప్పుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి మేకర్స్ ఒక పర్ఫెక్ట్ డేట్‌ను సెట్ చేశారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ హాలిడే సీజన్, ఇయర్ ఎండ్ వీకెండ్ అడ్వాంటేజ్ తోడైతే బాలయ్య బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ ఒక కీలకమైన పాత్రలో మెరవనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర టైటిల్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.         NBK111 Release Date, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj
Ravi Teja’s latest outing Irumudi is turning into a major box office success, with the film collecting more than Rs. 75 crore+ gross worldwide within just three days of its release. The film has also achieved a significant milestone in the overseas market by becoming Ravi Teja’s first film to cross the US$1 million mark. The response from family audiences has particularly surprised trade circles. The strong turnout and continuous demand for tickets have made the film’s eventual lifetime collections difficult to predict, with trade observers expecting exceptionally strong profit margins for the buyers and other parties involved. Irumudi reportedly achieved its breakeven target within two days of release, while the Monday advance bookings have remained strong. The film is selling around 15,000 tickets per hour on BookMyShow, an impressive trend for a weekday that indicates the movie could maintain substantial momentum beyond the opening weekend. Director Shiva Nirvana is receiving appreciation for presenting an intense narrative while incorporating an important social message. The integration of Ayyappa Deeksha and the devotional element has also connected strongly with audiences. Ravi Teja’s performance has emerged as one of the film’s major strengths, with Baby Nakshatra and Priya Bhavani Shankar also earning praise. GV Prakash Kumar’s music and the film’s technical execution have added to the overall impact. Produced by Mythri Movie Makers, Irumudi is now looking at a strong weekday run and could potentially set new benchmarks if its current momentum continues. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. తండ్రి-కూతుళ్ళ ఎమోషన్, అయ్యప్ప భక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా చోట్లా టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. షోలు పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుత జోరు చూస్తుంటే రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని.. అన్నీ కలిసొస్తే ఆ నెంబర్ రూ.200-300 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ‘ఇరుముడి’ సినిమాకి అతిపెద్ద సవాల్‌ ఎదురుకాబోతుంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ఆగష్టు 26న థియేటర్లలోకి వస్తోంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ‘టాక్సిక్’ రిలీజ్ అవుతుండటంతో.. ‘ఇరుముడి’ థియేటర్ల కౌంట్, కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. 'కేజీఎఫ్' తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, ఈ మూవీ తెలుగు రైట్స్ ను దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల మాట. ఆ మొత్తం రాబట్టుకోవడానికి తెలుగునాట భారీ విడుదల ఉంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఫస్ట్ డే దాదాపు 80 శాతం సింగిల్ స్క్రీన్స్ 'టాక్సిక్' వెళ్లనున్నాయి అంటున్నారు.  ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘ఇరుముడి’ సునామీ కనిపిస్తోంది. చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని, ఇంకా చూడని వాళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వారం కూడా పూర్తి కాకుండానే.. కావాల్సినన్ని థియేటర్లు లేకపోవడం అనేది పెద్ద దెబ్బ అనే చెప్పాలి.  అయితే ఇక్కడ ‘ఇరుముడి’కి కలిసొచ్చే కొన్ని అంశాలు ఉన్నాయి. టాక్సిక్ అనేది మితిమీరిన వయలెన్స్ తో కూడిన బోల్డ్ మూవీ. దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే పరిస్థితి దాదాపు ఉండదు. పైగా ఇప్పుడు తెలుగునాట 'టాక్సిక్' నిలబడాలంటే.. ఇరుముడిని మించిన గొప్ప టాక్ రావాలి. అప్పుడే యూత్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘టాక్సిక్’కి ఓ రేంజ్ టాక్ రాకపోయినా, జనరల్ ఆడియన్స్ సపోర్ట్ లేకపోయినా నిలబడటం కష్టమే. ఒకవేళ అదే జరిగి, ఆడియన్స్ రాకపోతే.. రెండు రోజు నుంచే థియేటర్లు తగ్గుతూ, ఆటోమేటిక్ గా ఇరుముడికి వస్తాయి. అదే జరిగితే ఇరుముడి ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మరి తెలుగు ఆడియన్స్ 'టాక్సిక్' రూపంలో ఎదురుకానున్న సవాల్ ను ఎదుర్కొని, ‘ఇరుముడి’ని పల్లకిలా భుజాన మోస్తారేమో చూడాలి.         Irumudi vs Toxic, Irumudi Collections, Ravi Teja, Irumudi Movie, Toxic Movie  
ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత అమూల్యమైన వరాలలో కొబ్బరి చెట్టు ఒకటి. దీనిని మన పెద్దలు కల్పవృక్షం అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం అనగా లేత కొబ్బరి నీళ్లు, కొబ్బరి గుజ్జు, కొబ్బరి పాలు మరియు స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిత్య యవ్వనాన్ని అందిస్తాయి. నేటి ఉరుకులు పరుగుల ఆధునిక జీవనశైలిలో సహజసిద్ధమైన పోషకాలను కోల్పోతున్న మన శరీరానికి కొబ్బరి ఒక అద్భుతమైన అమృతంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ మన ఆహారంలో లేదా దినచర్యలో కొబ్బరిని ఏదో ఒక రూపంలో భాగం చేసుకోవడం ద్వారా ఊహించని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద మరియు పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొదటగా, కొబ్బరి నీళ్ల గురించి చెప్పుకోవాలంటే ఇవి కేవలం దాహార్తిని తీర్చే సాధారణ పానీయం మాత్రమే కావు. ఒక కప్పు అనగా సుమారు 240 మి.లీ తాజా కొబ్బరి నీళ్లలో దాదాపు 600 మి.గ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం తక్షణ శక్తిని పుంజుకుంటుంది. అంతేకాకుండా, ఇందులో కెలొరీలు చాలా తక్కువగా అనగా కేవలం 45 నుంచి 60 కెలొరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ డ్రింక్. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక కొబ్బరి కాయ లోపల ఉండే తెల్లని గుజ్జులో శరీరానికి అవసరమైన డైటరీ ఫైబర్, కాపర్, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, చర్మం మరియు జుట్టు కాంతివంతంగా మారడంలో కొబ్బరి గుజ్జు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.       Coconut water and oil nutrition guide, health benefits of coconut from water to oil.
  నేటి ఆధునిక వేగవంతమైన జీవనశైలిలో ఉదయాన్నే ఒక వేడి కప్పు కాఫీ లేదా టీతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటుగా మారింది. అలసటను తరిమికొట్టి, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి కెఫిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, పరిమితికి మించిన కెఫిన్ వినియోగం ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి, వారి హార్మోన్ల సమతుల్యతకు తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిరాన్ వంటి అత్యంత కీలకమైన హార్మోన్ల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కేవలం తాత్కాలిక అసౌకర్యంతో ఆగకుండా, దీర్ఘకాలికంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల శరీరంలో కెఫిన్ ప్రవేశించినప్పుడు అది ప్రాథమికంగా స్ట్రెస్ హార్మోన్ అయిన కోర్టిసాల్ స్థాయిలను దాదాపు 30% నుండి 40% వరకు పెంచుతుంది. శరీరంలో కోర్టిసాల్ విపరీతంగా పెరగడం వల్ల మనస్సు నిరంతరం తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంది. ఈ అధిక కోర్టిసాల్ ప్రభావం నేరుగా అడ్రినల్ గ్రంధులపై పడి, లైంగిక మరియు సంతానోత్పత్తి హార్మోన్ల ఉత్పత్తిని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఫలితంగా, రుతుక్రమ చక్రంలో తీవ్రమైన అసమతుల్యతలు తలెత్తుతాయి. రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే మహిళల్లో సుమారు 25% మంది పీరియడ్స్ ఆలస్యం కావడం, అధిక రక్తస్రావం కావడం లేదా తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అధిక కెఫిన్ వినియోగం ఈస్ట్రోజెన్ డామినెన్స్‌కు కారణమవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు అవసరమైన దానికంటే ఎక్కువగా పెరిగినప్పుడు, థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, జీవక్రియల రేటును గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల చాలామంది మహిళల్లో ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గకపోవడం, నిరంతరం నీరసంగా అనిపించడం, మరియు తీవ్రమైన జుట్టు రాలడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పిసిఒడి (PCOD), పిసిఒఎస్ (PCOS) మరియు ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలు కెఫిన్ వినియోగాన్ని తగ్గించుకోకపోతే, వారి శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మరింత పెరిగి వ్యాధి తీవ్రత 50% వరకు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.       How caffeine affects estrogen and pcos,caffeine and period problems in women.
స్త్రీలలో వచ్చే గైనకాలజిక్ క్యాన్సర్లు నేటి వైద్య ప్రపంచంలో అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారాయి. గర్భాశయ, అండాశయ, మరియు సర్వికల్ క్యాన్సర్ల బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతుండటం వైద్య రంగాన్ని తీవ్ర ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. అయితే ఈ వ్యాధుల తీవ్రత కంటే కూడా, వీటిని సకాలంలో గుర్తించకపోవడమే రోగుల ప్రాణాలకు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. అంతర్జాతీయంగా వెలువడుతున్న పలు ఆరోగ్య పరిశోధనల ప్రకారం, గైనకాలజిక్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో దాదాపు 60% కంటే ఎక్కువ మంది చివరి దశల్లో లేదా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో మాత్రమే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించకపోవడం వల్ల చికిత్స విధానాలు ఎంతో సంక్లిష్టంగా మారడమే కాకుండా, బాధితుల ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పడిపోతున్నాయి. మహిళల్లో ఈ వ్యాధుల నిర్ధారణ ఇంతగా ఆలస్యం కావడానికి అనేక సామాజిక, ఆర్థిక మరియు మానసిక కారణాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది మహిళల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాల పట్ల ప్రాథమిక అవగాహన లోపించడం అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. అసాధారణ రక్తస్రావం, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పులు, లేదా శరీర బరువులో ఆకస్మిక మార్పులు కనిపించినప్పుడు కూడా, వాటిని సాధారణ రుతుక్రమ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధితులలో దాదాపు 45% మంది మహిళలు ప్రారంభ లక్షణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమో లేదా ఇతరులతో చెప్పుకోవడానికి సంకోచించడమో చేస్తున్నారని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. వైద్య నిపుణుల వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకునే అలవాటు కేవలం 15% లోపు మహిళల్లో మాత్రమే ఉండటం అత్యంత విషాదకరం. పరిశోధనల డేటా ప్రకారం, అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) కేసులలో 70% కంటే ఎక్కువ కేసులు మూడవ లేదా నాల్గవ దశకు చేరుకున్న తర్వాతే బయటపడుతున్నాయి. మొదటి దశలోనే వ్యాధిని గుర్తిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90% వరకు ఉంటుంది. కానీ చివరి దశలో నిర్ధారణ కావడం వల్ల ఐదేళ్ల సర్వైవల్ రేటు కేవలం 30% కి పడిపోతోంది. అలాగే గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఆధునిక గైనకాలజిక్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు స్పెషలిస్ట్ వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల వ్యాధి తీవ్రత మరింత పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు మరియు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల దాదాపు 35% మంది పేద రోగులు అవసరమైన రోగనిర్ధారణ పరీక్షలను పూర్తి చేయలేకపోతున్నారు.       Ovarian cancer early detection importance,women gynecologic cancer screening guide.
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు. “తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని  వాడేవాళ్ళు  కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తేదీ ఎందుకు వేస్తారు? ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు.  ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది. “Best Before” అంటే ఏమిటి? Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం  మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై..  ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం. తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా? సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్ క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే  Best Before అనేది ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు. “Use By” అంటే ఏమిటి? Use By అనేది ఆహారం  భద్రతకు సంబంధించిన గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు: కొన్ని తాజా పాల ఉత్పత్తులు,  తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు.  అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. Best Before తేదీ దాటితే ఏం చేయాలి? ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా? కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో  దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని  నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు. ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా? కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు. వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి. TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.