LATEST NEWS
కాశ్మీరాన్ని భారత దేశంతో కలపాలనే శతాబ్దాల కల సాకారమైంది. చీనాబ్ వంతెన నిర్మాణం పూర్తయింది. ఎప్పుడో 132 ఏళ్లకు  పూర్వం ఆనాటి, రాజరిక పాలకులు కన్న కలను, ఈ నాటి ప్రజాస్వామ్య ప్రభుత్వం  సాకారం చేసింది.  జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనను  ఇటీవలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందిన  చీనాబ్ వంతెన, ఒక సాకేతిక అద్భుతం. భారత రైల్వే చరిత్రలో ఇదొక మైలురాయి. అంతే కాదు, ప్రపంచం ఎదుట మనం భారతీయులం తలెత్తుకుని  నిలిచేలా చేసిన మరో సాంకేతిక అద్భుతం  చీనాబ్ వంతెన నిర్మాణం.   అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్  పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. వంతెన అంటే వంతెన కాదు.. అదొక ఇంగినీరింగ్ అద్భుతం.. చీనాబ్ నదీగర్భం నుండి 359 మీటర్లు ఎత్తులో నిర్మించిన చీనాబ్ వంతెన, ప్రపంచ పర్యాటక వింతల్లో ఒకటిగా పేర్కొనే  పారిస్‌లోని ఐఫిల్ టవర్ తల దించుకునేలా చేసిన మహాద్భుతం. అవును ఐఫిల్ టవర్  కంటే 35 మీటర్ల ఎత్తులో చీనాబ్ వంతెన నిర్మాణం అయింది.  ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేనన్ని వింతలు, విశేషాల సమాహారం చీనాబ్ బ్రిడ్జి. ఆలోచన సాకారం కావడానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. 1,315 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ఇంతకాలం పట్టిందంటే.. అది ఎంతటి కష్ట సాధ్యమైన కార్యమో వేరే చెప్పనక్కర లేదు. అంతే కాదు, ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగల సామర్ధ్యం మనకుందని ప్రపంచానికి చాటి చెప్పిన మహాద్భుతం.  నిజానికి..  ఇది ఈనాటి ఆలోచన కాదు. దేశ విభజనకు ముందు అప్పటి కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం తొలి అడుగు వేస్తే..  స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ పాలకుల కాలంలో.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల వరకు, రాజా హరిసింగ్ కలను సాకారం చేసేందుకు  అనేక ప్రయత్నాలు జరిగాయి. ఒకప్పుడు,, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రూ.50 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి ప్రణాళికను సిద్దం చేశారు. కానీ, అది అమలు కాలేదు. ఇప్పుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.43,800 కోట్ల వ్యయంతో రాజా హరిసింగ్ కలను సాకారం చేసింది. ఆరోజున..  ఆ మార్గంలో స్టీమ్ ఇంజిన్ రైలు చాలని అనుకుంటే, ఈ రోజున అదే మార్గంలో వందే భారత్ రైలు పరుగులు తీస్తోంది.  ఈ రోజున..  ప్రదాని నరేంద్ర మోదీ మొదలు మన దాకా, మనందరం సగౌరవంగా తలెత్తుకుని నిలిచామంటే, అసాధ్యాలను సుసాధ్యం చేసి.. ఇంతటి మహాద్భుతాన్ని మన ముందు నిలబెట్టిన మహా నీయులు ఎందరో ఉన్నారు. సాకేతిక సాంకేతిక విజ్ఞానాన్ని వడపోసిన మేథా యోధుల మొదలు, రాళ్లెత్తిన కూలీల వరకు, ఎందరో ఎందరెందరో ఉన్నారు. అలాంటి, వారిలో, జి. మాధవీ లత ఒకరు.  ఎవరీ మాధవీ లత? అంటే..  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న, రాక్ ఇంజనీరింగ్‌ నిపుణురాలు. జి. మాధవి లత ఈ ప్రాజెక్టుపై జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా 17 సంవత్సరాలు పనిచేశారు.  నిర్మాణం సవాళ్లతో నిండిపోయింది, అయినా ఆమె, తమ బృందంతో కలిసి వీచే ఎదురు గాలులను సవాలుగా తీసుకుని ఎదురు నిలిచి, 'డిజైన్-యాజ్-యు-గో' విధానంలో,ప్రపంచాన్ని అబ్బురపరిచే, ఇంజనీరింగ్ అదుతాన్ని సృష్టించారు.     చీనాబ్ వంతెన ప్రణాళిక 2005 లో ప్రారంభమైంది, 2022 లో ట్రయల్ రన్‌  పూర్తయింది. నిజానికి, ఈ ప్రాజెక్ట్ పుర్తయిందంటే, అందుకు, ప్రధాన కారణం మాధవీ లత. కొండలు గుట్టలను పిండి చేస్తూ.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. అధ్బుత నిర్మాణాలతో ముందుకు సాగిన మాధవీలత.. 17 ఏళ్ల  చారిత్రక చీనాబ్ నిర్మాణ ప్రయణాన్ని  మాటల్లో వర్ణించడం సామాన్యులకు సాధ్యం కాదు.  అందుకే.. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..  చీనాబ్ వంతెన వంటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణం, ప్రణాళిక రూపకల్పనతో మొదలైన తొలి అడుగు నుంచే  సవాళ్ళను ఎదుర్కొంది. ప్రతి అడుగులోనూ అవరోధాలు ఎదురయ్యాయి. ముదుకు సాగే కొద్దీ, భౌగోళిక పరిస్థితిలో వస్తున్నమార్పులు, ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను ముందుంచాయి. నిరంతరం మారుతున్న భౌగోళిక, భూసాంకేతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ఆధారంగా, ముందుగా నిర్ణయించిన పరిష్కారాలతో బలమైన  డిజైన్ రూపొందించడం అసాధ్యంగా మారిందని ఆమె ఇటీవల  ఒక పత్రికలో రాసిన వ్యాసంలో, వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అందుకే, డిజైన్-యాజ్-యు-గో విధానం ఎంచుకుని ముందుకు సాగినట్లు చెప్పారు. డిజైన్-యాజ్-యు-గో విధానం అవలబించడం  వల్లనే నిర్మాణం పూర్తయిందని వివరించారు.  నిటారుగా నిలిచిన ఎత్తైన రాతి కొండులు, ఏటవాలుగా నేలకు వాలిన పర్వతాలు శ్రేణులను అనుసంధానం చేస్తూ నిర్మాణ పనులను సాగించడం, ముఖ్యంగా స్థంభాల పునాదులు నిర్మించడం ఒక ప్రధాన సవాలుగా మారిందని చెప్పారు. అయితే.. దృఢ చిత్తంతో ముందుకుసాగి అసాధ్యాలను సుసాధ్యం చేశామని మాధవీ లత చెప్పారు.   నిజానికి, చీనాబ్ వంతెన సాకారం చేయడంలో, మెయిన్ పిల్లర్ పాత్రను పోషించిన  మాధవీలతతో పాటుగా  మరెందరో చేసిన కృషి అసాధారణం, అత్యద్భుతం. అందుకే.. ప్రదాని మోదీ.. ఈ అద్భుత సృష్టిలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున అభినందించారు. ముఖ్యంగా..  ప్రధాని మోదీ, చీనాబ్ వంతెనను ప్రారంభించిన వెంటనే మాధవీ లతను ప్రత్యేకంగా  ప్రశంసిస్తూ, చీనాబ్ వంతెన నిర్మాణంలో మాధవి లత, ఆమె  బృందం చేసిన కృషికి దేశం మొత్తం, గర్విస్తోందని అన్నారు. అలాగే.. ఇంకా ఎందరో.. కాగా, ప్రధాని సహా పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న మాధవీలత అనేక పురస్కారాలను అందుకున్నారు.  మాధవీలత ప్రస్తుతం సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్  చైర్‌పర్సన్‌గ ఉన్నారు.  ఆమెకు సహజంగానే, దేశం సెల్యూట్ చేస్తోంది. 
  బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి  అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులర్పించారు. అంతకుముందు జరిగిన అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు  పాడె మోశారు. పోలీసులు మాగంటి భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది.  మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. .బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు అధికార లాంచనాలతో పూర్తి అయ్యాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఈ నెల 5న ఆయన ఏఐజీలో చేరారు. ఈ నెల 5న ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దాంతో వెంటనే కుటుంబీకులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.  
  నెల్లూరు రామలింగాపురం సర్కిల్‌లో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.  సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతు  సింహపురి ఉక్కుమనిషి, ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, ఆనం వంశ రాజసానికి ప్రతీక ఆనం వెంకటరెడ్డి ఆయన సేవలను కొనియాడారు.  నెల్లూరు రాజకీయాల్లో, అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి,  కాకర్ల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, పాశం సునీల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గోన్నారు.  
  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ బయోగ్రఫీ పుస్తకం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్‌ వరకు ఎదిగారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.  పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. ఆయన శైలి, విధానాల నుంచి నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే వారు నేర్చుకోవాలి. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్‌, దత్తాత్రేయ. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్‌ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారు. మా నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుంది’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.  
  ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ,ఎన్నికల మానిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధ పాలన సాధ్యం అవుతుందని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 8వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై జరిగిన చర్చా గోష్టికి ముఖ్యఅతిథిగా హాజరై ఏబి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. నేడు జైళ్ళలో మగ్గుతున్న లక్షలాది మందిలో 85 శాతం పైగా విచారణ ఖైదీలుగా పేద వర్గాలే ఉన్నారని తెలిపారు.  న్యాయస్థానాలను రెట్టింపు చేయడం ద్వారా  న్యాయాన్ని అందరికీ అందించగలమని తద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే, నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చునన్నారు. పోలీసులలో నైపుణ్యాలను పెంచి ఆధునిక సాంకేతిక పరిణామాన్ని అందించడం, నేర పరిశోధనను, నేర విచారణ నుండి వేరుచేస్తేనే సత్వర న్యాయం సాధ్యమన్నారు. మనతోపాటు బ్రిటన్ నుండి విముక్తి పొందిన సింగపూర్ న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థల్లో అగ్ర భాగాన ఉందని, ఇది రాజకీయ సంకల్పం ద్వారానే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని రకాల దుర్మార్గాలపై న్యాయ విచారణ జరిపి, సంబంధిత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇటీవల తెనాలిలో ముగ్గురు యువకులను ప్రజల మద్య బహిరంగంగా చావ బాది ,ఆ వీడియోను ఉద్దేశ్య పూర్వకంగా ప్రజల ముందు ఉంచి, ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ప్రయత్నించడం అమానుషమని పేర్కొని, సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతమున్న సిబ్బంది, వనరులతోనే 75 శాతం మేర సంస్కరణలు తీసుకొని రావచ్చన్నారు. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఒకవైపు ఉంటే, మరోవైపు పోలీస్ వ్యవస్థలో మార్పుల కోసం, పేదలకు సత్వర న్యాయం కల్పించడానికి అదనంగా కనీసం 1000 కోట్ల వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం శోచనీయమన్నారు.  సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి  ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ ఆర్మీగా మారిందన్నారు. అధికార పార్టీ నేతల కను సన్నలలో క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీని వలన చట్టబద్ధ పాలనకు భంగం వాటిల్లుతుందన్నారు. తెనాలి సంఘటనతో బాధ్యులైన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. మాజీ శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారి సమస్యలను వివ రించడానికి భయపడే వాతావరణం నేడు ఉందని, ఫ్రెండ్లీ పోలీస్ రావాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త ప్రో. డి. ఏ. ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడితే కేవలం వందల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ లుగా విజయం సాధిస్తున్నారని, వీళ్లు కూడా అధికార పార్టీకి దాసోహం కావడం వలన ప్రజాస్వామ్యం ఎలా వికసిస్తుందని ప్రశ్నించారు.
ALSO ON TELUGUONE N E W S
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'ది రాజా సాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా రూపొందుతోన్న 'రాజా సాబ్'ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ జూన్ 16న విడుదల కానుంది. (The Raja Saab)   ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. పైగా ఇందులో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని.. కామెడీ, సాంగ్స్ అదిరిపోతాయని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ 'రాజా సాబ్' కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మారుతి ఒకే ఒక్క మాటతో ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళాడు.   రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ మారుతి, 'రాజా సాబ్' మూవీ గురించి మాట్లాడుతూ.. "అభిమానులు ఏం ఆశిస్తున్నారో దానికంటే ఒక శాతం ఎక్కువే రాజా సాబ్ ఉంటుంది. ప్రభాస్ పై నా ప్రేమ ఏంటో ఈ సినిమాలో చూస్తారు." అని అన్నాడు.   మారుతి మాటలను బట్టి చూస్తే.. 'రాజా సాబ్' సినిమా పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థమవుతోంది. జూన్ 16న విడుదల కానున్న టీజర్ తో అసలు 'రాజా సాబ్' చిత్రం ఏ విధంగా ఉండబోతుందో కాస్త క్లారిటీ వచ్చే అవకాశముంది.  
  కొందరు నటులు వయసుతో సంబంధం లేకుండా సినిమా కోసం సాహసాలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అలాంటి సాహసమే చేశారు. 70 ఏళ్ళ వయసున్న ఆయన.. ఓ షూటింగ్ లొకేషన్ లోకి వెళ్ళడం కోసం గోడ దూకారు.    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం షూట్ జరుగుతోంది. ఈ లొకేషన్ లోకి ఎంటరవ్వడం కోసమే అనుపమ్ ఖేర్ ఓ విన్యాసం చేశారు.   ఫౌజిలో అనుపమ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూట్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. అయితే లొకేషన్ కి కారులో వెళ్ళిన ఆయనకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సరైన దారిలో వెళ్ళకపోవడంతో.. చివరికి గోడ దూకాల్సి వచ్చింది.      దీనికి సంబంధించిన వీడియోను అనుపమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో నేను నా షూటింగ్ లొకేషన్లలోకి వివిధ మార్గాల ద్వారా ప్రవేశించాను. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది. ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా డ్రైవర్ సాహసోపేతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మేము ఒక అడవి లాంటి ప్రదేశంలోకి ప్రవేశించి, ఆపై ఒక డెడ్ ఎండ్‌ కు చేరుకున్నాము. కారును రివర్స్ చేయలేకపోయాము. తరువాత ఏమి జరిగిందో చూడండి." అని రాసుకొచ్చిన అనుపమ్.. నిచ్చెన సాయంతో గోడ ఎక్కి దూకిన వీడియోను పంచుకున్నారు.    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో 70 ఏళ్ళ వయసులో అనుపమ్ డెడికేషన్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.  
  God of masses Nandamuri Balakrishna is riding high with consecutive blockbusters. Ahead of his birthday (June 10), Balakrishna’s 111th film was announced officially. The movie NBK111 will be helmed by blockbuster maker Gopichand Malineni, and this marks their second collaboration, after the smashing hit Veera Simha Reddy. Venkata Satish Kilaru who is presently making a Pan India film like Peddi will be bankrolling the new project on a massive scale with a high budget on Vriddhi Cinemas Banner.   The announcement poster features the fierce image of a raging lion. Half of its face armored with a metallic shield, while the other half remains open and wild. The striking image is symbolic of the intense duality and raw power of the character that Balakrishna is set to portray in this film.     Director Gopichand Malineni, known for his expertise in mass and commercial entertainers, will be delving into historical territory for the very first time. He is crafting a never-seen-before avatar for Balakrishna, with an epic story that promises to blend grandeur, history, and high-octane action. The script, described as both powerful and unique, is currently in the final stages of pre-production.   While the lead star and director have been officially confirmed, the rest of the cast and technical crew will be announced later.  
  God of the Masses Nandamuri Balakrishna, and blockbuster Maker Boyapati Sreenu’s fourth film together is titled Akhanda 2: Thandavam. This high-octane sequel promises to surpass its predecessor, Akhanda, in every aspect, such as story, scale, production, and technical brilliance. The highly-anticipated film is being mounted on a grand scale under the prestigious 14 Reels Plus banner, with producers Raam Achanta and Gopichand Achanta at the helm. It is proudly presented by M. Tejaswini Nandamuri.   Meanwhile, the makers came up with double updates. Akhanda 2’s first look and teaser will be unveiled on June 9th, a day before Balakrishna’s birthday. A trident with a Nandi and a damarukam can be seen in the poster, with cosmic compass in the background. So, it will be a double treat for NBK’s birthday. Before that, this poster stirs up curiosity.     The shoot of the movie is progressing as per the schedule. Tollywood’s lucky charm Samyuktha plays the female lead in the movie. Sharing the screen is the dynamic Aadhi Pinisetty, who takes on a compelling and intense role that is expected to leave a strong impact.   Backed by an elite technical team, the film boasts a powerful lineup with S Thaman scoring the music, while celebrated cinematographer C Ramprasad captures the visuals. Editor Tammiraju ensures a gripping narrative flow, and renowned art director AS Prakash is crafting the film’s rich visual world.   Akhanda 2 is gearing up for a massive Pan India release on September 25 for Dussehra.  
  టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన అందరితో సరదాగా ఉంటారు. రిలేషన్ షిప్, ఫ్రెండ్ షిప్ కి వాల్యూ ఇస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.   "నాకు నందమూరి కుటుంబంతో మంచి అనుబంధముంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేయనప్పటికీ.. తను నాకు బాగా పరిచయం. ఎందుకంటే ఎన్టీఆర్ వాళ్ళ బాబాయ్(పిన్ని భర్త) ఆర్టిస్ట్ రాజా, నేను బాగా క్లోజ్. రాజా వైఫ్, ఎన్టీఆర్ మదర్ సిస్టర్స్ అవుతారు. రాజా బాగా క్లోజ్ కావడంతో.. అలా ఎన్టీఆర్ కూడా నాకు చిన్నప్పటి నుండి తెలుసు.  రాజా చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు. ఆయన ఇద్దరి కూతుళ్ళకు తారక్ పెళ్లి చేశాడు." అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.  
  మలయాళ చిత్రాలలో మోస్ట్ వయలెంట్ ఫిల్మ్ గా  'మార్కో' పేరు పొందింది. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. గతేడాది డిసెంబర్ లో విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో వయలెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హనీఫ్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ లో నందమూరి బాలకృష్ణ నటించే అవకాశముందని తెలుస్తోంది.    బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' చేస్తున్నారు. నెక్స్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, బాబీ కొల్లి వంటి దర్శకులతో సినిమాలు చేసే అవకాశముంది. ఈ క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా 'మార్కో' డైరెక్టర్ హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది.    హనీఫ్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసిన మూవీలో బాలయ్య నటించబోతున్నారట. ఇదొక కాప్ యాక్షన్ డ్రామా అని, ఇందులో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం.    బాలయ్య యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అందునా పోలీస్ యూనిఫామ్ వేస్తే మరింత విజృంభిస్తారు. అలాంటిది ఇప్పుడు ఆయనకు వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ తోడవ్వడంతో.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనే ఆసక్తి కలుగుతోంది.  
  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ (Trivikram) ఒకరు. ఆయనతో సినిమా చేయడానికి బిగ్ స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తారు. అలాంటి త్రివిక్రమ్.. ఏడాదిన్నర అవుతున్నా తన కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్రివిక్రమ్ గత చిత్రం 'గుంటూరు కారం' 2024 జనవరిలో విడుదలైంది. ఇప్పుడు 2025 జూన్ వచ్చింది. అయినా ఆయన నెక్స్ట్ మూవీ మొదలుకాలేదు. అయితే ఈ గ్యాప్ ని కవర్ చేసేలా త్రివిక్రమ్ ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.   నిజానికి 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది త్రివిక్రమ్. కానీ, అట్లీ ప్రాజెక్ట్ తో బన్నీ బిజీ కావడంతో.. మాటల మాంత్రికుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. వెంకటేష్, రామ్ చరణ్, శివకార్తికేయన్, రామ్ వంటి హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. ఒక ప్రాజెక్ట్ కాదు, ఏకంగా ప్రాజెక్ట్ లను త్రివిక్రమ్ లైన్ లో పెడుతున్నారని అంటున్నారు.   త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్ట్ లలో.. ఒక దానిలో వెంకటేష్, మరో దానిలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారట. మూడో ప్రాజెక్ట్ కోసం ఏ హీరోని రంగంలోకి దింపుతారో చూడాలి. ఇప్పటికే ఈ మూడు సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లు పారలల్ గా జరుగుతున్నాయట. వేగంగా పూర్తి చేసి.. రాబోయే రెండు మూడేళ్ళలో ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి గ్యాప్ ని కవర్ చేసేలా త్రివిక్రమ్ జెట్ స్పీడ్ లో మూడు ప్రాజెక్ట్ లను చేయడానికి సిద్ధమైనట్లు వినికిడి.  
  జూన్ 10న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పుట్టినరోజు. స్టార్స్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్లు రావడం సహజం. బాలయ్య పుట్టినరోజు కానుకగా అభిమానులకు ముందుగానే సర్ ప్రైజ్ లు వచ్చాయి. అఖండ-2 టీజర్ అప్డేట్ తో పాటు, కొత్త సినిమా ప్రకటన వచ్చింది.   బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'అఖండ-2'. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికితోడు అఖండ సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. రేపు(జూన్ 9) సాయంత్రం 6:03 కి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. (Akhanda 2 Teaser)     ఇక బాలయ్య నెక్స్ట్ మూవీ ప్రకటన కూడా వచ్చింది. 'వీరసింహారెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. చారిత్రక నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. (NBK 111)    
మహేష్(Mahesh Babu)రాజమౌళి(Ss Rajamouli)కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ, ఇప్పటికే తన మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ని  జరుపుకోనుంది. 'ssmb 29 'అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే  అడ్వెంచర్ థ్రిలర్ గా ఉండనుంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తుండగా, సలార్ ఫేమ్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీ సుకుమారన్ పై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఇప్పుడు ఈ మూవీలో 'మాధవన్' ఒక ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో జరగబోయే సెకండ్ షెడ్యూల్ లో మాధవన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని, వీటన్నిటిపై త్వరలోనే అధికార  ప్రకటన రానుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సఖి, చెలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మాధవన్, సుదీర్ఘ కాలం నుంచి బహుభాషా నటుడుగా రాణిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు చిత్రాలతో పాటు, వెబ్ సిరీస్ లలో కూడా చేస్తు బిజీగా ఉన్నాడు. ssmb 29 లో పలువురు విదేశీ నటులు కూడా నటించనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, మాధవన్ క్యారక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. బాహుబలి, ఆర్ఆర్ ఆర్ ఫేమ్ విజయేంద్రప్రసాద్ కథని అందిస్తుండగా, దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ కనివిని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కీరవాణి(Keeravani)సంగీత దర్శకుడు కాగా షూటింగ్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.      
Deepika Padukone and director Sandeep Reddy Vanga had a very ugly fallout with PR fights in media about casting her in Spirit. Many people tried to state that Deepika's open fallout could have affected her relations with Prabhas. As he is the leading man of Spirit, many thought she could be replaced from Kalki 2 as well.  The actress has officially joined AA22 X A6 film, starring Allu Arjun in the direction of Atlee. She is playing a warrior and her character introduction glimpses from the on-boarding video have been highly intriguing. The movie shoot will start soon and the makers are promising huge Pan-World sensation.  Putting an end to the rumors of her relations with Prabhas being also affected due to Spirit fallout in media, producers of Kalki - Priyanka Dutt and Swapna Dutt have confirmed that they have no plans to replace her. They stated that Deepika is part of Kalki 2 and 30-35% shoot for the second part has already been completed.  They did not confirm any deadline for start of the shoot but stated that Kalki 2 pre-production is happening. They have confirmed that they will give an official update when the shoot starts. Amitabh Bachchan, Kamal Haasan will also be integral part of the film. 
జీవితంలో మనకు కావలసిన వాటికోసం, అవసరమైన వాటి కోసం , ప్రయత్నాలు చేయడం సహజం. అయితే వాటిని సాధించుకునే తీరులో తేడాలు ఉంటాయి. మనిషిలో రెండు వ్యతిరేక స్వభావం కలిగిన అంశాలు ఉంటాయి. అవే ఆశయం, అత్యాశ. చాలామంది ఆశయానికి అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోలేరు. ఫలితంగా అత్యాశ ద్వారా ఏదైనా సాధించుకుంటే దాన్ని ఆశయంతో సాధించుకున్నట్టు ఫీలైపోతారు.  "ఆశయం అంటే కష్టపడి సాధించుకోవడం అత్యాశ అంటే ఒకరి నుండి లాగేసుకోవడం" ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఎదుగుతున్న వారికి ఈ ఆశయం, అత్యాశ మధ్య ఉన్న తేడా ఏంటి?? దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవాలి. ఆశయం!! ఆశయం మనిషిని మానసికంగా, సామాజికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అంశం. ఆశయంలో లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రణాళిక ఉంటుంది, సాధించాలి అనుకున్న విషయం మంచా, చెడా అనే విచక్షణ కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, గెలుపు, ఓటమి మొదలైనవాటిని తీసుకునే తీరు ఇవన్నీ ఆశయంలో అంతర్భాగంగా ఉంటాయి.  ఒక ఆశయంలో ప్రయోజనం అనేది ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తికా లేక కుటుంబంకా, సమాజనికా అనేది ఆశయంలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి ఆశయం అనేది ఒకరికి లేక కొందరికి ప్రయోజనం చేకూర్చే అంశం. దానివల్ల మనిషిలో ఉన్నత విలువలు పెంపొందుతాయి.  ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉండాలి. అదే ఆ మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. అతని ఎదుగుదలే ఓ కుటుంబాన్ని అన్ని కోణాల్లోనూ ఓ మెట్టు పైకి చేర్చుతుంది.  ఆశయాలు చిన్నవైనా, పెద్దవైనా, జీవితకాల నిర్ణయాలు అయినా వాటితో మనిషి భవిష్యత్తు మెరుగుపడుతుంది.  ఇదీ ఆశయంలో ఉన్న సారం. అత్యాశ!! కావలసింది, అవసరమైనది సాధించుకోవడం ఆశయమైతే, ఆశయంలో ఓటమిని ఎదుర్కోలేక తనకే కావాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం అత్యాశ అవుతుంది. అత్యాశ అనేది మనిషికి ఉండకూడని లక్షణాలతో ఒకటి.  కావలసిన దాన్ని నిజాయితీగా, కష్టపడి సాధించుకుంటే దానిలో అర్థముంటుంది. అదే వక్రమార్గంలో దాన్ని సాధించుకుంటే?? అటువైపు దానికోసం కష్టపడుతున్న వారిని మోసం చేసినట్టు, వారి నుండి దాన్ని లాక్కున్నట్టు, వారికి దక్కాల్సినది దక్కకుండా చేసినట్టు అవుతుంది.  ద్వేషం, అసూయ, మూర్ఖత్వం, మొండితనం, ఓర్పు లేకపోవడం ఇవన్నీ అత్యాశలో నిండిపోయి ఉంటాయి. వీటి వల్ల జరిగేది ఏంటి?? ఇతరులు సంతోషపడితే చూడలేకపోవడం, దానికోసం వారికి దక్కాల్సినవి దక్కకుండా చేయడం, వారు బాధపడుతుంటే చూడటం కోసం వారు నష్టపోయేలా చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా తనకు అవసరం లేకపోయినా తనకే దక్కాలి అనే అహంకారం అత్యాశతో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవిధమైన లక్షణం మనిషిని క్రమంగా మృగత్వం వైపుకు లాక్కెళ్తుంది. అత్యాశ నిత్యనాశనం అంటారు. అదెప్పుడూ మనిషిలో మానసిక ప్రశాంతతను లాగేస్తుంది. కాబట్టి అత్యాశ అనేది కేవలం ఇతరులను ఇబ్బందిపెట్టే గుణమే కాదు. అది ఉన్న మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయదు. ఆశయానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే అప్పుడు మనిషి తన జీవితంలో సాధించుకోవలసింది ఏంటి?? వదిలేసుకోవలసింది ఏంటి?? అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతాడు.  లక్ష్యాలు ఏర్పరుచుకుని, శక్తి సామర్త్యాలు ఉపయోగించి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేది ఆశయం.  ఇతరుల సంతోషం నీరుగార్చడం కోసం తనకు అవసరం లేకపోయినా దాన్ని దక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం అత్యాశ.  ఈ రెండింటిని తెలుసుకుని ముందుకు సాగితే జీవితానికి ఓ మంచి అర్థముంటుంది.                                      ◆నిశ్శబ్ద.
ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం.  కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక.  ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి.   భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు.   ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!                                     ◆నిశ్శబ్ద.
ఆశనిరాశల్ని..... విజయవైఫల్యాల్ని మైలురాళ్ళుగా మిగిల్చి మరో సంవత్సరం మన కళ్ళముందు నుంచి కనుమరుగయింది. సరికొత్త సవాళ్ళతో మనం ఎంత సాహసి కులమో తేల్చేందుకు కొత్త సంవత్సరం స్వాగతించింది. నిజానికి కాలానికి తరతమ భేదాలుండవు. అందరికీ మంచినే పంచాలనుకుంటుంది. కాని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఆ యా ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆశావహులకు బృందావనమైతే... నిరాశావాదులకు అదే కాలం కాటేసే కాలనాగవుతుంది.  గతాన్ని గతంలోనే పూడ్చిపెట్టి... సరికొత్త ఆశలతో ముందుకు సాగిపోవాలి. అందుకోసం అందరూ పాటించాల్సిన కొన్ని విషయాలివి. అస్పష్టం... అనాలోచితం ప్రస్తుతం చాలా సందర్భాల్లో విఫలమవడానికి కారణం మన పరిధిని, మన సామర్ధ్యాన్ని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోవడం. ఫలితంగా చాలా మంది జీవితాలు అస్పష్టంగా, అనాలోచితంగా సాగిపోతున్నాయి. ఆంగ్ల విద్యావేత్త బ్రెండన్ 'once we accept our limits, we go beyond them' అంటారు. ముందు మన పరిమితుల్ని, వనరుల్ని తెలుసుకోగలగాలి. కాని దురదృష్టవశాత్తూ మనలో చాలామంది వయసు మించిపోతున్నా వారి వారి సామర్ధ్యాల్ని గుర్తించి మసలుకోలేకపోతున్నారు. పరుగులయితే పెడుతున్నాం... కానీ ఎక్కడికో చెప్పలేకపోతున్నాం. అలసిపోతున్నాం.  కాని అసలు ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ముందు ఈ కొత్త ఏడాది లోనైనా మన గమ్యం పట్ల పూర్తి స్పష్టతను ఏర్పరచుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మన గమనాన్ని నిర్దేశించుకావాలి.  ఆధునిక బలహీనతలు.. అష్టకష్టాలు.. సహజంగా మనలో ఉండే బలహీనతలకు తోడు నేడు ఆధునికమైనవి కూడా వచ్చి తోడయ్యాయి. అసలే కోతి, ఆపై పిచ్చి, కల్లు తాగి, నిప్పులు తొక్కి.... అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన మనఃస్థితి. యుక్తవయసులో అసలే కుదురుగా ఉండని మనస్సును సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మరింత ఇరకాటంలో పడేశాయి. ఆధునిక మానవుడికి సెల్ఫోన్ రూపంలో మరో శరీరభాగం వచ్చి చేరినట్లయింది. విలాసాల్ని అవసరాలుగా భ్రమించడం వల్లనే ఈ ప్రమాదమంతా.   ఇవి మానసికంగా, శారీరకంగా ఎంత బలహీనుల్ని చేస్తున్నాయో యువతీయువకులు గమనించడం లేదు. ముఖ్యంగా జీవితానికి పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవలసిన విలువైన ప్రాయంలో ఇవి  ఏకాగ్రతను ఛిన్నాభిన్నం చేస్తాయి. 'simple living high thinking'  ను  జీవనశైలికి మలచుకోవాలి. అలా చేస్తే ఈ ఆధునిక బలహీనతల నుండి బయటపడవచ్చు. ఆహారాలు... ఆహార్యాలు... భగవద్గీతను చదవడం కన్నా ముందు ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢం చేసుకోండి.  మానసికంగా, శారీరకంగా బలహీనపరిచే దేనినయినా విషంలా తిరస్కరించండి అనే వారు స్వామి వివేకానంద. బాణం గురి చేరాలంటే ముందు ధనుస్సు బలంగా ఉండాలి. ధనుస్సే బలహీనంగా ఉంటే, ఇక బాణం గురించి చెప్పేదేముంటుంది. ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన ఆహార, ఆహార్యాల వెంట పరుగులు తీస్తున్నాం. అందుకే మనలో చాలామంది ముఖాల్లో కృత్రిమ కాంతులు.... అద్దకపు అందాలు. వీటన్నింటికీ కారణం మన జీవనంలో సహజత్వం లోపించడం. పసిబిడ్డ ఉగ్గుపాల నుంచి పండ్లరసాల వరకు అన్నింటినీ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. భారతీయ జీవనవిధానానికి సరిపోలని సంస్కృతుల్ని దిగుమతి చేసుకొని మనకు మనమే కృతకంగా బ్రతుకులీడుస్తున్నాం. ఆహార, ఆహార్యాలనేవి వారి వారి భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒకరు ఇంకొకరి ఆహార, ఆహార్య, ఆచారాలను గుడ్డిగా అనుకరించడం వలన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోతుంది. అందుకే భౌతికంగా, బౌద్ధికంగా మనల్ని ధీరోదాత్తులను చేసే జీవనశైలిని అలవరచుకుంటే కొత్త ఏడాదిలో జీవితం విజయానికి చేరువ అవుతుంది.                                              *నిశ్శబ్ద.
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా  ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోనూ, వైద్యంలోనూ మంచి ఔషదంగా కూడా పరిగణిస్తారు. అయితే  చాలామంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం. శనగలు, పెసలు, బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు. అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.  ఈ లాభాలేంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన పెసలు  బరువు తగ్గించడంలో  సహాయపడుతాయి.  రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఇది మాత్రమే కాదు.. మొలకెత్తిన పెసలలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు పెరగనీయవు. ఇక మొలకెత్తిన పెసలు  కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ 'A' ఉంటుంది. ఇది కాకుండా  ఉబ్బరం,  కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలలో  కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో  మొలకెత్తిన పెసలు  సహాయపడుతాయి.  అధిక గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరంతో బాధపడేవారు మొలకెత్తిన  పెసలను  తినవచ్చు. ఇది  బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.  మొలకెత్తిన పెసలను  తీసుకోవడం వల్ల రోజంతా  శక్తివంతంగా ఉండచ్చు.  దీన్ని తినడం వల్ల సోమరితనం లేదా బద్దకం దరిచేరదు. మరీ ముఖ్యంగా మొలకెత్తిన పెసలు  శరీరానికి చలువ చేస్తాయి. దీని కారణంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.                                                  *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.                                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...